Translate

Showing posts with label Strotram. Show all posts
Showing posts with label Strotram. Show all posts

Friday, December 10, 2021

కుండలిని శక్తి (kundalini telugu) Notes- Part- 4 (రాజయోగం)

 



 * *కుండలిని శక్తి  రాజయోగం  జన్మరాహిత్యం* *


1 ( మంత్రయోగం పూర్తి వివరణ )

అనేక జన్మల సంస్కారము వలన గాని వైరాగ్య భావం కలగదు అట్టి వైరాగ్యముతో  ఏర్పడిన విషయ వాంఛా విముఖ్యత్వం వలన ఙ్ఞాన చిహ్నము లుత్పన్నము కాగలవు అలాంటి సమయమునందే అష్టాంగ యోగం అభ్యసించి క్రమ క్రమముగ ఈశ్వర ప్రణిదాన  మను స్థితినందవలేను.

ఈ స్థితిలో సాధకుడు పద్మసనం నందు కుర్చోని దృష్టిని మూక్కుకోన యందుఉంచి కనులుముసుకోని దేవత రూప వర్న గుణంములను భావన చేయుచు గాయత్రి  పంచక్షరి అష్టాక్షరి మొదలగు తనకు ఇష్టం ఉన్న మంత్రంలను జపిస్తు అ మంత్ర ఫలంను బ్రహ్మర్పణం చేసి ఉండుటయే మంత్రయోగం అందురు

ఈ యోగ సిద్దివలన కర్మ త్రయోపార్జితము లైనట్టి కాయక వాచిక మానసిక కృతపాపములన్ని నశించి సాధకుడు నిర్మలినుడు కాగలడు ఇట్టి మంత్రయోగి సిద్ద సాధువులకన్న ఉత్తమం  యోగిశ్వరుల కన్న అధమము.


2   (  లయ యోగం  ) పూర్తి వివరణ


,ముక్కు యోక్క దిగువభాగం నందు తన చూపునిల్పి

వ్రేళ్లచేత ముక్కురంద్రంలను మూసిఉంచి మనోబుద్దులను

బిందు నాధ కళత్మకమైన ప్రణవం అందేస్థితిని కల్గించిన

ఒక గోప్పనాధం సంభవించి సముద్ర ఘోషవలే ధ్వనింపగలదు .

అ ధ్వనులను వినుచున్న యేడల కోంతసమయంనకు అ నాదం చిరుగంట మ్రోతవలేను అటుతర్వత  అతిగోప్ప ఘాంటనాదం వలే కమముగా సమయం గడిచినకోలది శంఖ వీణ తాళ  వేణు మృదంగ భేరీ నాదముల వలే వినిపించగలదు  అటుపిమ్మట పదియవ దగు మేఘ నాధం వినిపించును ఈ నాదమే 

అ కార. ఉ కార. మ కారాత్మకమైన  ప్రణవ నాదము

ఈ మహ నాదం అనహత చక్రంనందు పుట్టి  అటుపిమ్మట ప్రజ్వరిల్లి కపాళ కుహురం వరకు వ్యాపించి గోప్పధ్వని గావింపుచుండగలదు ఈ ధ్వని బ్రహ్మ సాక్షత్కారమునకు చిహ్నము  ఈ మేఘ ధ్వని సాదింపగల్గుటయే

 లయ యోగం


3  హఠ యోగం పూర్తి వివరణ

.

ఎడమ కాలి మడిమను మూలాధర స్థానంనందు అదిమి పట్టి గడ్డంను రోమ్ముకు అనించి రేండు చేతుల బోటనవ్రేళ్లతో రేండుచేవి రంద్రంలు మూసి నడిమి వ్రేళ్లతో రేండు కళ్లను మూసి ఉంగరపు వ్రేళ్లతో ముక్కురంద్రంలను మూసి రేచక పూరక కుంభకములాది వాయు గతులను సాదించి మూల బంద. ఉద్యాన బంద. జలందర బందంలను చేదించి షట్ చక్రంలను అదిగమించి రుద్రగ్రంథికి ఆఙ్ఞాచక్రంనకు గలసందులయందు ప్రాణవాయువును కుంభించిట చేసిన హఠ యోగం కాగలదు.

.

దీనివల్ల సంకాల్పంలు నేరవేరును. అష్ట సిద్దులు కల్గును త్రికాల ఙ్ఞానం కల్గును

గ్రహణశక్తి లభించును జర మరణంలకు దూరం అగుదురు.

.

,

4  (  రాజయోగం పూర్తి వివరణ ) అష్టాంగ యోగమార్గం


1, ( యమములు )

,

1  అహింస.  జీవ హింస చేయరాదు

2  సత్యం.  ఆంతరాత్మకు తేలిసి లోబడే ఉండాలి

3  బ్రహ్మచర్యం.  అడావారి మీద ఎ అలోచన చేయరాదు

4  ఆస్తేయం.  దోంగతనం చేయరాదు

5  అపరి గ్రహం.  ఏ దానాం ముట్టరాదు,

,

2, ( నియామలు )

,

6  శౌచం.  శుబ్రంగా ఉండాలి

7  సంతోషం. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి

8  తపస్సు.  ఒకే పనిమీదనే దీక్ష ఉండాలి

9  స్వాద్యాయం.  గ్రంద పఠణంలు చేయలి

10  ఈశ్వర ప్రాణిదానం.  మీరు ఏది సంపాదించిన అది ఆంత ఈశ్వర అర్పితం చేయలి.

.

3, ( అసనంలు )

సుఖ

పధ్మ

బుద్ద

యోగ ముద్ర

పాదహస్త

విపరిత కరణి

సర్వాంగ

శీర్షా.


4  ( ప్రాణయమం )

పూరక

రేచక

కుంభకం

.

5,( ప్రత్యాహరం )

,

ఈ శరీరం నందలి ఙ్ఞానింద్రియంలు కర్మేంద్రియంలు వాటియోక్క స్వభావ సిద్దమైన పనులను మానివేసి చిత్తం మనస్సు యందు లయించునట్లు చేయడం.

,

6, ( ధారణ )

మనస్సును భాహ్య  అంతరములలో  మీరు అనుకున్న చోట ఒక స్తానం నందు నిలిపి ఉంచుటయే ధారణ.

,

7, ( ధ్యానం )

చిత్తంను  ఒకనోక ప్రదేశంనందు స్థిరంగానిలిపి ధారన సిద్ది అందిన తరవాత  దేని యందు చిత్తం నిలుప బడునో  అ ప్రదేశం నందు ఎక్కువ కాలం చేదరకుండ ఉండుటయే ధ్యానం.

,

8 ( సమాధి )

ధ్యానం నందు పరిపూర్ణత పోందిన సాధకుడు అంతర్గత ధ్యాన ప్రదేశ ఙ్ఞానములను పధార్థ రూప భావాలను నశింప చేసుకోని నిశ్చలత్వం నందు ఉండుటయో సమాధి ఉంటారు.

.

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి . ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి

సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.

శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితి శక్తి (Potential Energy), రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy). శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ, లోభ , మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి (purification of body), నాడీ శుద్ధి (purification of nadis/nervous system), మనో శుద్ధి (purification of mind), బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి. నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.

చక్రాలు

వెన్నెముక లో ఉండే చక్రాలు

ప్రధాన వ్యాసము: సప్తచక్రాలు

షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.

మూలాధార చక్రము (Mooladhara) : గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే

కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం లం . మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) : లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం వం .

మణిపూరక చక్రము (Manipura) : నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.

అనాహత చక్రము (Anahatha) : హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం

యం .

విశుద్ధి చక్రము (Vishuddha) : కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం హం.

ఆజ్ఞా చక్రము (Ajna) : భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం .

సహస్రార చక్రము (Sahasrara) : బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

.

.

1.  (  మూలాధార చక్రము )

పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రము న గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలి నీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ “స” కార సంబంధముగా ఉంటాయి. 514 నుండి 519 వరకూ గల నామములు “సాకిన్యంబ”ను వర్ణిస్తాయి. నామములు - మూలాధారామ్భుజారూఢ, పంచవక్తాృయ, ఆస్ధిసంసితాయ, అంకుశాది ప్రహరణాయ, వరదాది నిషేవితాయ, ముద్గౌదనాసక్తాయ.

మూలాధారస్ధపద్మే, శృతి దళలసితే, పంచవక్త్రాం త్రినేత్రాం,

ధూమ్రాభా, మస్ది సంస్దాం సృణి మపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం

బిభ్రాణం బాహుదండైస్సులలిత వరదా పూర్వ శక్త్యన్వితాoతం

ముద్గాన్నాసక్త చిత్తాం మధుమదముదితాం సాకినీ భావయామి:

మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము . ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేస్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.

సాకిన్యాంబ వరదాది దేవతలు : 1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరాల) దేవతలచే కోలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.

.


2. (  స్వాధిష్ఠాన చక్రము. )

.

లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.

మణిపూరక చక్రము

నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము.

లాకిన్యంబాస్వరూపిణి: - (503) (6 నామాములు) (3 వ చక్రము) (495) నుండి (502) వరకూ నామములు : మణిపూరాబ్జనిలయ, వదనత్రయసంయుతా, వజ్రాధికాయుధోపేతాయ, డామర్యాదిభిరావృతాయ, రక్తవర్ణాయ, మాంసనిష్టాయ, గుడాన్నప్రీతాయ, సమస్తభక్త సుఖదాయ.

దిక్పత్రే, నాభిపద్మే, త్రివదన విలస ద్దంష్ట్రిణీం, రక్తవర్ణాం,

శక్తిం దంభోళి దండావ భయమపి భుజైర్దారయంతీo మహోగ్రాం

డామర్యాద్త్యై: పరీతాం పశుజన భయదాం మాంసధాత్వేక నిష్టాం

గౌడన్నసక్త చిత్తాం సకల సుఖకరీం లాకినీమ్ భావయామి:

నాభిస్తానము వద్ద గల మణిపూరచక్రమున వసించునది. పది దళముల పద్మము, బీజాక్షరాలు సంస్కృతములోని “డ” నుండి “ఫ” వరకు గల అక్షరాలు. గర్భస్తశిశువు మూడవ మాసములో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగును. మూడు ముఖములు కలది. గర్భస్ధ శిశువుకి నోరు, ముక్కు, కళ్ళు ఏర్పడతాయి. నాలుగు చేతులు కలది. వజ్రం, శక్తి, దండము, అభయ ముద్రలు ధరించింది. డామరము ఆది దేవతలచే పరివేష్టించబడింది. ఈ సమయములోనే శిశువు శబ్దాలకి ప్రతిస్పందన చూపిస్తాడు. ఎరుపు వర్ణము కలది. మాంస ధాతువుని ఆశ్రయించేది. బెల్లంతో చేసిన పాయసం, చక్రపొంగలి లాటి వానిపై ఇష్టం కలది. అన్నిరకముల భక్తులకీ సుఖసంతోషములు కలిగించేది ఈ లాకిన్యాంబ రూపిణి.

.

3  (  మణిపూరక చక్రం. )

మంత్రం : ‘ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః”

మణిపూరకచక్రం :- ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొట్టేలు. 'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి.

బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాధులుకు కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు,

అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి.

ఈ చక్ర మానసిక స్వభావం - మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు. తన గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం. తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు. ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.

లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.

మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవడం? ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ...) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. అలాగే ఈ చక్రానికి అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వాన్ని అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.

శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలది.

తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా

స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్

తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్

నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం

మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారాన్ని పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును

..

4  ( అనాహత చక్రము )

హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము.

రాకిన్యాంబస్వరూపిణి

- (494) (9 నామములు) (4 వ చక్రము)

అనాహతాబ్జనిలయ, శ్యామాభాయ, వదనద్వయ, దంష్ట్రోజ్జ్వలాయ, అక్షమాలాదిధరాయ, రుధిరసంస్దితాయ, కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయ, స్నిగ్ధౌదనప్రియాయ, మహావీరేంద్రవరదాయ. (485 నుండి 493 వరకూ గల నామములు)

హృత్పద్మే, భానుపత్రే, ద్వివదన లసితాం, దంష్ట్రిణీం, శ్యామవర్ణామ్

చక్రం, శూలం, కపాలం, డమరుపి – భుజైర్ధారయంతీ త్రినేత్రాం

రక్తస్దాం కాళరాత్రి ప్రభ్రుతి పరివృతాం, స్ధిగ్న భక్తైక సక్తాం

శ్రీమద్వీరేంద్ర వంద్యా మభిమత ఫలదాం, రాకినీ, భావయామః

ఈమె నలుపురంగులో ఉన్నది, రెండు వదనములు ఉన్నాయి. ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది. శిశువు 2 వ మాసములో రెండవ రంధ్రము ఏర్పడుతుంది. రెండు కోరలతో ప్రకాశించునది. ‘అ’ కారాది, ‘క్ష’ కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది. నాలుగు చేతులలో అక్షమాలా, శూలము, కపాలము, డమరుకము, దరించునది. అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఆమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. అనాహతమునకు 12 దళములు. వీటిని ‘క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలచే కొలవబడింది. కాళరాత్రి మొదలగు దేవతలు. నేతితో తడిసిన అన్నము అనిన ప్రీతి కలది. మహావీరుల కోరికలు తీర్చేది. రాకిణీ దేవత సంబంది బీజాక్షరములు, కీలక, న్యాస మంత్రములు అన్నీ ‘ర’ కారము సంబంధమైనవి.

క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలు "ద్వాదశ శక్తులు". అవి 1. కాళరాత్రి 2. ఖాతీత, 3. గాయత్రి 4. ఘంటాధారిణి 5. జామిని 6. చంద్రా 7. ఛాయా 8. జయా 9. ఝుంకారి 10. జ్ఞానరూప 11. టంకహస్తా 12. ఠంకారిణి

.

5  (  విశుద్ధి చక్రము  )

కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము.

డాకినేశ్వరి: - (484) : (5 వ చక్రము) విశుద్ధి చక్ర అధిష్టానదేవత “డాకిని”. (475 నుండి 483 వరకూ డాకిని దేవత లక్షణాలు వర్ణించబడినవి.) ఆరక్తవర్ణాయ, త్రిలోచనాయ,ఖట్వాంగాది ప్రహరణాయ, వదనైకసమన్వితాయ, పాయసాన్నప్రియాయ, త్వక్ స్ధాయ,పశులోకభయంకరాయ, అమృతాధి మహాశక్తిసంవృతాయ. (8 నామములు)

గ్రీవాకూపే, విశుద్దే, నృపదళకమలే, శ్వేతరక్తాం, త్రినేత్రాం

హస్తే : - ఖట్వాంగ, ఖడ్గౌ, త్రిశిఖమపి, మహాచర్మ సంధారయంతీమ్

వక్త్రేణేకేనయుక్తాం, పశుజనభయదాం, పాయసాన్యైక సక్తాం

త్వక్ద్సా వందేహమృతాద్యై: పరివృతవపుషాం, డాకినీo, వీరవంద్యామ్.

డాకినీ దేవత బీజాక్షరాలు, కీలక, న్యాస మంత్రాలు ఆన్నీ “డ” కార సంభంధమైనవి. డాకినీ వర్ణము ఎఱుపు. ఈమె ఎఱ్ఱని ఎఱుపు కాదు. తెలుపు కలసిన ఎరుపు. జీవి పిండ దశలో ‘శుక్త + రక్త “ సమ్మేళనంతో బిందురూపముగా ఉండును. పదిహేను రోజుల పిదప బుడగ రూపము చెంది, నెలాఖరుకి గట్టిపడి, 45 రోజులకి పిండాకృతి పొందుతుంది. ఈ పిండ స్థితి డాకినీ స్థితి. ఈమె త్రిలోచన – భూత, భవిష్యత్, వర్తమానాలు చూడగలది. ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము ఆయుధములుగా గల దేవత. బీజాక్షరములు = ఖ, ఛ, ఠ, ధ, ఫ -- ఘ, ఝ, ఢ, ధ, భ.

హాకినీరూపధారిణి (527):- ( 6 నామములు) (6 వ చక్రము) 521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి. ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా, మజ్జాసంస్దాయ, హంసవతీ ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక.

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే, శుక్లవర్ణాం, కరాబ్జైమ్

విభ్రాణాo జ్ఞానముద్రాం, డమరుకమలా, మక్షమాలాం, కపాలం

షట్చక్రాధారమధ్యామ్, త్రినయన లసితాం, హంస వత్యాది యుక్తాం,

హరిద్రాన్త్యైక సక్తాం, సకలశుభకరీం, హాకినీం భావయామః

ఆజ్ఞా చక్రము భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని. ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. ఇది రెండు దళముల పద్మము. బీజాక్షరములు ‘హ’ ‘క్ష’ . హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మముని ఆశ్రయించారు. పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.

.

6   (  ఆజ్ఞా చక్రము. )

భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము.

హాకినీరూపధారిణి (527):- ( 6 నామములు) (6 వ చక్రము)

521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి. ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా, మజ్జాసంస్దాయ, హంసవతీ ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక.

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే, శుక్లవర్ణాం, కరాబ్జైమ్

విభ్రాణాo జ్ఞానముద్రాం, డమరుకమలా, మక్షమాలాం, కపాలం

షట్చక్రాధారమధ్యామ్, త్రినయన లసితాం, హంస వత్యాది యుక్తాం,

హరిద్రాన్త్యైక సక్తాం, సకలశుభకరీం, హాకినీం భావయామః

ఆజ్ఞా చక్రము భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని. ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. ఇది రెండు దళముల పద్మము. బీజాక్షరములు ‘హ’ ‘క్ష’ . హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మముని ఆశ్రయించారు. పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.

.

7.  (  సహస్రార చక్రము. )

బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

యాకిన్యంబస్వరూపిణి:- (534) (6 నామములు) (7 వ చక్రము)

528 నుండి 533 వరకూ నామములు ఈమెను తెలెయ చేస్తాయి. (సహస్త్రదళ పద్మస్ద, స్వర్ణవర్ణోపశోభిత, సర్వాయుధధర, శుక్లసంస్దితా, సర్వతోముఖ, సర్వోదనపీతిచిత్తాయ)

ముండవ్యోమస్ధ పద్మే దశశతదళకే కర్ణికా చంద్రసంస్దామ్

రేతో నిష్టాం, సమస్తాయుధ కలితకరాం, సర్వతోవక్త్రపద్మాం

ఆది క్షాన్తార్ణశక్తి ప్రకట పరివృతామ్ స్వర్ణవర్ణాం భవానీం

సర్వాన్నాసక్తచిత్తామ్, పరశివరసికాం యాకినీ భావయామః

శిరస్సు మధ్యభాగములో సహస్త్రాకార చక్రము ఉంటుంది. ఇది వేయి దళములు కలది. యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత. ఈ 7వ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల వర్ణములు, రంగులు, అక్షరములు, విద్యలు, ధ్వనులు, బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది. ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది. ఈమె సర్వతోముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది.

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి.

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే.

రజస్సు వలన శరీరం లోని వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే, భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.

సహస్రారచక్రం

-

సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి.

మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు. ఈ చక్ర మానసిక స్వభావం - ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు. ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు ఆనంద నందనవనములు అవుతాయి.

ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం. కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్థించాలి. {ప్రార్థన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్థన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో స్థూలంనుండి ప్రజ్ఞామయం వరకు పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి.

Thursday, December 2, 2021

కుండలిని శక్తి (kundalini telugu) Notes- Part- 3


కుండలిని శక్తి- Kundalini Shakthi -2 (Telugu)




 ◆ జాగ్రతమైన కుండలిని శక్తి సాధుకుడిని శుభపరుస్తుంది  సాధకుడి పురోగతికి అవరోధంగా ఉన్న పురాతన సంస్కారాలనూ , ములదోషాలనూ నాశనం చేస్తుంది . ఈ శక్తి  మూలాధార పద్మ గర్భంలో తామరతూడును పోలి ఉంటుంది . గుండ్రముగా చుట్టుకుని ఉంటుంది . బంగారపు  వన్నె కలిగి మెరుస్తూ ఉంటుంది .


◆ కుండలిని శక్తి మూలాధారంలో వర్తులాకారంలో చుట్టుకొని ఉంటుంది . మన శరీరం నిర్వహించే పనులన్నిటినీ క్రమబద్ధం చేస్తుంది . శరీరాన్నంతటినీ చుట్టూ ఉన్న పరిసరాలనూ ఎదుగుదలకు తగిన విధంగా వికాసంప చేస్తుంది . 


◆ నిద్రవచ్చేది విశుద్ధ చక్రమైన కంఠ స్థానంలోనే . శ్రమ అంతా కంఠస్థానంలో నివారణ అవుతుంది . 


◆ మానవుడి లోపల ఉన్న శక్తి వికసించినప్పుడు , మహశక్తి కుండలినీ యొక్క ప్రేమ ప్రవాహం సర్వాంగాలకు 2,72,000 నాడులకు వ్యాపిస్తుంది . ఇది ప్రతి రక్తకణంలోకి ప్రవేశించడంతో నీకు నీ శరీరం అంతటా ఆనందానుభూతి కలుగుతుంది . అప్పుడు , మానవ శరీర స్పర్శ కోసం నువ్వు పడిన తపన తీరుతుంది . 


◆ ధ్యాన సమాధి లోకి ప్రవేశించిన తర్వాత మొదట నిద్ర , సోమరితనం వస్తాయి . సాధన సక్రమంగా జరుగుతుంది అని తెలుసుకోడానికి మంచి నిద్ర పట్టడం ఒక సూచన .


◆ ధ్యానం చేసుకోడానికి ఒకే స్థానంలో కూర్చోవడం మంచిది . ధ్యానం చేసే ప్రదేశంలో కుండలని శక్తి యొక్క కిరణాలు వ్యాపించి ఉంటాయి . అందుచేత ముందు ముందు ధ్యానం బాగుంటుంది . 


◆ 2,72,000 నాడులు , 6 చక్రాలు , 9 ద్వారాలు , 7 ధాతువులతో మన శరీరం ఉంటుంది . 2,72,000 నాడుల్లో 100 ముఖ్యమైనవి . వీటిలో 10 శ్రేష్ఠమైనవి. ఈ 10 లో 3 అతి ముఖ్యమైనవి . ఈ 3 లో మధ్యలో ఉన్న సుషుమ్న  నాడి , అత్యంత మహిమాన్వితమైనది .


◆ మానవ జీవితానికి సంబంధించిన అన్ని పనులు , సుషుమ్న నాడి ద్వారా జరుగుతాయి . సుషుమ్న నాడి సహస్రారం నుంచి , కుండలనీ , స్థానమైన మూలాధారం వరకు అఖండ రూపంలో వ్యాపించి ఉంటుంది . 


◆ ప్రాణమే కుండలిని , ప్రకృతి మూలాధారమైన విశ్వచైతన్యమే ప్రాణ రూపంగా మార్పు చెందుతుంది.


◆ శరీరం సక్రమంగా ఉండేలా చేయడానికి ప్రాణం 5 రూపాలను ధరిస్తుంది . 


● 1) ప్రాణం(ఆన):-  ఆహారం లోపలికి వెళ్ళడానికి కారణమైన శక్తి . 

● 2) అపాన:-  మలమూత్ర విసర్జనను చేసే శక్తి.

● 3) సమాన (వ్యాపన):-  ఆహారం యొక్క రసాన్ని శరీరంలోని అన్ని భాగాలకు అందిస్తుంది . 

● 4) వ్యాన-  ఆహారపు శక్తిని నాడులలో , నరాలలో నింపుతుంది . 

● 5)ఉదాన:-  మరణాంతరం మనిషి కర్మలను బట్టి అతనికి అర్హత గల లోకాలకు తీసుకువెళ్తుంది . ఈ శక్తి సుషుమ్నలో ఉంటుంది . 


◆ ఈ పంచ ప్రాణాలు ఒకే ప్రాణం , ఒకే శక్తి. అన్ని పనులను సక్రమంగా జరిగేలా చూడడానికి గాను , పిండాండ బ్రహ్మండమంతటా ఈ 5 రూపాలలో వ్యాపించి ఉంటుంది. ప్రాణం హృదయంలో పనిచేస్తుంది .


◆ జాగృతమైన కుండలినీ మహాశక్తి , పంచప్రాణాల ఆధారంగా 2,72,000 నాడుల్లోకి ప్రవేశించి అన్ని అంగాలలోనూ వ్యాపిస్తుంది . ఈ శక్తి , సప్త దాతువుల్లో , రక్తకణాల్లో, ద్రవ పదార్థాలలో వ్యాపించి , శరీరాన్ని పరిశుభ్రంగా , సౌష్టవంగా , నిర్మలంగా , అందంగా రూపొందిస్తుంది .

Monday, November 29, 2021

Aura Sheath- ఆరా - దాని 7 పొరలు - విశ్లేషణ- (Aura Sheath and it's 7 layers)

 

ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ

(Aura Sheath and it's 7 layers)



 మానవ శరీరం చుట్టూ ఉండే జీవ-విద్యుదయస్కాంత క్షేత్రమే "ఆరా"(aura). ఈ ఆరా లేదా కాంతి వలయం తల వద్ద హెచ్చుగా ఉండి, పాదాల వద్దకు వచ్చేసరికి పలుచగా ఉంటుంది. ఈ ఆరా , మనతో నిత్యమూ ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం నిరంతరం సంకోచ-వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం 7 పొరలుగా ఉంటుందని....ఈ పొరలు ఒక దానికొకటి ఓత-ప్రోతాలులా అల్లుకొని ఉంటాయని , అధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ప్రతీ ఆరా పొర, మన సూక్ష్మ శరీరంలోగల ఏడు చక్రాలకు సంబంధం కలిగియుంటుంది.


మొదటి పొరను "ఎథిరిక్" లేదా లింగ శరీరం అంటారు. ఈ ఎథిరిక్ , మూలాధార చక్రంతో సంబంధం కలిగియుంటుంది. ఈ ఎథిరిక్, మన భౌతిక శరీరానికి అతి సమీపములో ఉన్న పొర. ఈ పొర స్థలంలో ఒక రకమైన భౌతిక ఆకృతిని కలిగి యుంటుంది. ఈ పొర దాదాపు 5 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఎథిరిక్ పొరలో "నాడులనే" ప్రాణ శక్తి వాహకాలుంటాయి. ఈ ఎథిరిక్ శరీరము, బహిరంగ(భౌతిక వాతావరణ,జీవన విధాన పరిస్థితులు) మరియూ అంతర్గత (భావాలు,ఆలోచనలు) పరిస్థితులను కలిగి ఉంటుంది.


ఈ ఆరిక్ షీత్ లో రెండవ పొర "emotional body" (భావాత్మక శరీరము). ఇది స్వాధిష్ఠాన చక్రముతో సంబంధం కలిగియుంటుంది. మనలో నిత్యం కలిగే భావాత్మక సంచలనాలకు ....ఈ ఆరిక్ షీత్ యొక్క రెండవ పొర ప్రతిబింబంగా ఉంటుంది. ఇది , మన శరీరం నుండి 7 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది.


 ఈ పొర , ఎథిరిక్ మరియూ భౌతిక శరీరాలలోకి చొచ్చుకొనిపోయి ఉంటుంది. ఈ పొర మన మనస్సుకు, భౌతిక శరీరానికి మధ్య వారధిగా పని చేస్తుంది కూడా. మనలను అఖండ చైతన్యం వైపు నడిపించే, చోదకునిలా కూడా ఉంటుంది.


మూడవది. మానసిక శరీరం. అంటే మనస్సే. మనస్సు మరల అనేక సూక్ష్మావస్థలలో కలదు. అది తరువాత. ఈ మనోమయ శరీరం గూచ్చి చెప్పుకుందాం. ఈ మానసిక శరీరం, మన సూక్ష్మ శరీరంలో గల "మణిపూరక చక్రంతో" సంబంధం కలిగి ఉంటుంది. ఈ mental body,  7 నుండి 20 సెంటీ మీటర్ల వరకు....విస్తరించి ఉంటుంది. అయితే ఈ శరీరం, మన మానసిక ఆలోచనా క్షేత్ర తీవ్రతలను బట్టి, సంకోచ-వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ మానసిక శరీరంలో, ఆలోచనా రూపాలు....మనకు కనిపిస్తాయి. మరియూ ఆ రూపాలు , భిన్న రంగులతో ఒక స్పందనను కలుగ జేస్తాయి.


ఇక 4వ శరీరము. యాష్ట్రల్ శరీరము (ashtral body).

 ఈ "ఆష్ట్రల్ శరీరము , 4వ చక్రమైన "అనాహత చక్రంతో" సంబంధం కలిగి యుంటుంది. భౌతిక - అభౌతిక శరీరాల మధ్య వారధిలా పని చేస్తుంది. భావాత్మక శరీరం లాగానే, ఈ శరీరం కూడా భిన్న వర్ణాలతో కూడి యుంటుంది. ఈ నాల్గవ శరీరము...15 సెంటీ మీటర్ల నుండి 30 సెంటీ మీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క భౌతిక శరీర ఆరోగ్య స్థితిని బట్టి, ఆధ్యాత్మ ఆరోగ్య స్థితి బట్టి కూడా ఆధార పడియుంటుంది.


ఇక 5వ పొర. "Etheric template body". ఇది 5 వ చక్రమైన "విశుద్ధ చక్రానికి" అనుసంధానించి ఉంటుంది.


6 వ పొర " Celestial body" . ఇది నేరుగా "ఆజ్ఞాచక్రంతో " సంబంధం కలిగియుంటుంది. మూడవ నేత్రం ద్వారా లోపల బయట గల "భగవత్ కాంతి" ని ఈ శరీరం చూసే ప్రయత్నం చేస్తుంది. పరిధులు లేని,అవధులు లేని ప్రేమను...ఈ పొర ప్రతిబింబిస్తుంది. అది ఈ భౌతిక శరీరంపై పడుతుంది.


ఇక 7వది అయిన "Casual Body" .  ఈ 7వ పొర , ఈ జన్మలో...ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రయాణంతో సంబంధం కలిగియుంటుంది. ఆరాలో గల ఈ ఏడవ పొరలో, గత జన్మల వివరాలుంటాయి. ఈ పొర మన అధ్యాత్మిక అభివృద్ధిని కూడా సూచిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, ఈ ఏడు పొరల ఆరా ఎలా వ్యక్తీకరించబడి ఉన్నదో....వాటన్నిటినీ ఈ ఒక్క పొర ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి "ఆరా" చూసి మనం అతడు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నాడా లేక పశువులా ప్రవర్తిస్తున్నాడా? అన్న విషయం చెప్పవచ్చు. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా లేక జబ్బులతో బాధ పడుతున్నాడా....అన్న విషయం కూడా చెప్పవచ్చు. కాకపోతే , ఆరా చూసే వ్యక్తి "సిద్ధుడు" అయితేనే ఇది సాధ్యం. ఆ సిద్ధత్వం మరీ అంత కష్టం ఏమీ కాదు. కాకపోతే...సతత అభ్యాసం...కనీసం 12 సంవత్సరాలు (పుష్కర కాలం) కావాలి. 


మన ప్రతి సంకల్పము, మన ఆరాలోని రంగుల్లో స్పష్టంగా, రూపు దిద్దుకొని ఉంటుంది. ఒక మనిషి చావు-బ్రతుకుల్లో ఉంటే, అతని ఆరా దాదాపు లుప్తంగా ఉంటుంది, మినుకు మినుకుగా.......


సందర్భాన్ని బట్టి ఇంకో విషయం కూడా చెప్పుకుందాం. శరీరానికి వెంటనే ప్రాణం పోదు. అతని ఆరా, ఆ మృత శరీరం దగ్గరే మెల్లగా తచ్చాడుతూ ఉంటుంది. ఆ ఆరాని చూడగలిగే యోగి, అతని మరణ కారణాన్ని తెలుసుకోగలడు.


     కొన్ని సార్లు ఈ "ఆరా" ఏడడుగుల ఎత్తు, నాలుగడుగుల వెడల్పు కలిగి (ఉన్నత వ్యక్తులకైతే), శిరస్సు వద్ద లావు గానూ, కాళ్ళ వద్దకు వచ్చేసరికి సన్నంగానూ ఉంటుంది.


    మానవ శరీరం యొక్క "ఆరా క్షేత్రం", మనిషి యొక్క భౌతిక శరీరము చుట్టూ, అండాకారంగా, ఒక గుడ్డు ఆకారంలో....శక్తి రూపంలో చుట్టుకొని ఉంటుంది. దివ్య దృష్టితో ఈ ఆరాను చూస్తే, వివిధ ప్రదేశాలలో...వివిధ గుణాలతో భాసిల్లుతూ ఉంటుంది. ఈ ఆరా ఎంతవరకైతే...వ్యాపించి ఉంటుందో, ఆ వ్యాపనం యొక్క హద్దుల వరకు చూడవచ్చు.


సాధన ద్వారా, కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని....మనం పెంచుకోగలిగితే,  మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న "ఆరా" స్పష్టంగా కనిపిస్తుంది.

- Bhattacharya's notes 

   మనం ఈ ఆరాను చూస్తే, ఆరా రంగులు, ఆరా యొక్క కాంతి క్షేత్రం, ఆరా యొక్క చీకటి క్షేత్రం, ఆరా ఆకారం, ఆరా సాంద్రత....ఇవన్నీ అవగాహనకు వస్తాయి. ఈ ఆరాను మనం వినవచ్చు కూడా. శబ్ద, సంగీత, తరచుదనం, స్పందన....వినవచ్చు. కాకపోతే నిధి ధ్యాసనము, సతత ధ్యానము, సతత మంత్రానుష్ఠానము ఉండాలి. ఇవి లేకుండా ఆరాను చూడాలంటే....కుదరదు. కొంతమందికి చాలా చిన్న వయస్సు నుండే, ప్రత్యేక సాధనలేవీ లేకుండా ఆరాను చూస్తూంటారు. వారు కారణ జన్ములు. వారి జన్మలు ధన్యం. ఆరా శక్తిని కూడా, మనం బయో-టెలిమెట్రీ ద్వారా గ్రహించవచ్చు.


   ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగానూ, ఆత్మ విశ్వాస పూరితులు గానూ, శాంత చిత్తులు గానూ ఉంటారో....మీ ఆరా (శరీర కాంతి వలయం), పరిశుభ్రంగానూ,ఆరోగ్యంగానూ ఉంటుంది. ఒక ఆరోగ్య వంతమైన ఆరా "Cocoon of Energy" గా విస్తరించుకొని ఉంటుంది.


     ఈ  ధనాత్మక - రక్షణాత్మక శక్తి క్షేత్రం....అనేక రంగులతో, శక్తి వంతమైన స్పందనలతో.....పూర్తిగా అండాకారపు హద్దుతో ఉంటుంది. ఏ వ్యక్తి తీవ్ర తపములో ఉంటాడో, ఏ వ్యక్తి ధ్యానము నుండి సమాధి స్థాయికి వెళతాడో, ఏ వ్యక్తి మంత్రోచ్ఛారణ నుండి మహా భావ సమాధికి వెళతాడో, ఏ వ్యక్తి యొక్క కుండలినీ శక్తి పరిపూర్ణంగా వికాసమై ఉంటుందో, అట్టి యోగి "ఆరా" (aura)...అనగా శరీరాన్నావరించిన కాంతి వలయం పూర్తిగా వికసితమై ఉంటుంది. అలాంటి పూర్ణ యోగుల ఆరా "బంగారు వర్ణం" లో ఉంటుంది.



[Rare] Maha Kalbhairav - Yam Yam Yam Yaksha Roopam (lyrics)

ఓంకారం సకలకళా శ్రీకారం- Omkaaram Sakala saakram telugu song lyrics(Sankaracharya, Telugu )

 





ఓంకారం సకలకళా శ్రీకారం

చతుర్వేద సాకారం

చైతన్య సుధాపూరం

జ్ఞాన కమల కాసారం

 

ధ్యాన పరిమళాసారం

మధుర భక్తి సింధూరం

మహా భక్త మందారం

భవ భేరీ భాండారం

 

హృదయ శంఖ హుంకారం

ధర్మ ధనుష్టంకారం

జగత్ విజయ ఝంకారం

అద్వైత ప్రాకారం భజేహం

 

అండాకారాండ పిండ భాస్వత్

బ్రహ్మాండ భాండ నాదలయత్

బ్రహ్మ్యాత్మక నవ్య జీవనాధారం

వర్ణ రహిత వర్గమధిత

 

లలిత లలిత భావ లులిత భాగ్య

రజిత భోగ్య మహిత వసుధైక కుటిరం

కామితార్ధ బందురం

కళ్యాణ కందరం

సద్గుణైక మందిరం

సకలలోక సుందరం

పుణ్య వర్ణ పుష్కరం

దురిత కర్మ దుష్కరం


శుభకరం సుధాకరం

సురుచిరం సుదీపరం

భవకరం భవాకరం

త్రిఅక్షరం అక్షరం భజేహం

 

మాధవ మాయా మయ బహు

కఠిన వికట కంటక పద సంసార

కానన సుఖ యాన శకట విహారం

 

అష్టాక్షరీ ప్రహృష్ట పంచాక్షరీ విశిష్ట

మహా మంత్ర యంత్ర తంత్ర

మహిమాలయ గోపురం

ఘనగంభీరాంబరం

జంబూ భూభంబరం

నిర్మల యుగ నిర్గరం

నిరుపమాన నిర్జరం

మధుర భోగి కుంజరం

పరమ యోగి భంజరం

ఉత్తరం నిరుత్తరం మనుత్తరం

మహత్తరం మహాకరం మహాంకురం

తత్త్వమసీ తత్పరం

తధితరాత్త మోహరం

మృత్యోర్మమృతత్వకరం

అజరం అమరం

 

'' కారం '' కారం '' కారం

ఓం కారం అద్వైత ప్రాకారం

Tuesday, November 23, 2021

నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....- Naa gurudu nannika - Telugu Lyrics

 యోగి తత్వం



నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....

నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక త్యాగి గమ్మనెనే....త్యాగి గమ్మనెనే.... జ్ఞాని గమ్మనెనే..

మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే...
మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే...పుట్టుగిట్టులులేని బట్టాబయలయెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

మూలామించుక లేని కీలెరుగు మనెనే...
మూలామించుక లేని కీలెరుగు మనెనే...కాలకాలములెల్ల కల్లా జగమనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....త్యాగి గమ్మనెనే...

మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....
మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....మరుగునెరుగితే నీవు తిరిగిరావనెనే..
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..
ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..సున్నా జేసియు దాని యెన్నాగవలెననే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట మహదేవుపేట మలికిదాసనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.... త్యాగి గమ్మనె.... జ్ఞాని గమ్మనెనే...

Satkarmabhisha Song - సత్కర్మభీశ్చ సత్ఫలితం


సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ
ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచి
కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఏ కన్నూ చూడదనా
నీ విచ్చలవిడి మిడిసిపాటు
ఏ చెయ్యి ఆపదనా
తప్పటడుగే నీ అలవాటు
అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి
ఎంత బతుకు నీదెంత బతుకు
ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా
ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా
కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
దాన్ని విడిపించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే

Sunday, November 7, 2021

మంత్రం అంటే ఏమిటి? What is Mantra ? Telugu

మంత్రం అంటే ఏమిటి?




మంత్రానికి ఉన్న అర్థమేమిటి?

మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. అలాంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన రుషులు అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలుగా రూపాంతరం చెందాయ్‌. మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయ్.
ఓం, ఐం, శ్రీం, హ్రీం, క్లీం. ఇవే బీజాక్షరాలా? ఈ బీజాక్షరాలను ఎలా పలకాలి? బీజాక్షరాలు చాలానే ఉన్నా... ఉపాసాన పద్ధతిలో చేయాల్సినవి మాత్రం వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. ఆయా దేవతల పేర్లతో కలిపి బీజాక్షరాలను జపించడం వల్ల కలిగే ఫలితం అనంతం. మాన్యుల నుంచి సామాన్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కటంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ మంత్రసాధనే. అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రాలుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపిస్తుంది. మంత్రాల అసలు లక్ష్యం. మన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడం. అలా మూడు విధాలుగా విభజించి... ఉచ్ఛరించిన మంత్రాలకు మహాశక్తి ఉంటుంది. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు... యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక మంత్రాలుగా కాలక్రమంలో ఆవిర్భవించాయ్.
అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. అదెవ్వరికైనా అనితర సాధ్యం కాని పనికాదు. ఇలా ఎందుకు పలికాలి? ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణ వాయువు లేని జీవం లాంటిది. ఈ ఓంకారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారంగా రూపాంతరం చెందింది. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయ్. రుగ్వేదం నుంచి ఆకారం, యజుర్వేదం నుంచి ఊకారం, సామవేదం నుంచి మాకారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నది రుషివాక్కు. అందుకే ఓంకారాన్ని బీజాక్షరంతో ముడిపెట్టారు మన పెద్దలు.
అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి?.. భాషలోని అక్షరాలే బీజాలా?..ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా?..ఈ బీజాక్షరాల ఏకీకరణమే మంత్ర నిర్మాణమా?.. మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?.. కళ్లకు కనిపించనివి.. కొలతకూ, తూకానికీ దొరకనివే బీజాక్షారాలా?

ఈ జగత్తు స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు. శరీరం స్థూలమైతే.... మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ. మన శారీరక శక్తికంటే, మానసికశక్తి చాలా గొప్పది. బలవత్తరమైనది కూడా. సూక్ష్మశక్తుల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయగలుగుతాడు. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతశక్తులనే కాదు, ప్రకృతిలో ఆవరించి ఉన్న అనేక అదృశ్య శక్తుల్ని కూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తాయంటారు. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు.
అణువులను కదిలించే శబ్ధ తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయ్. ఇది నిజం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రాలను పలికినప్పుడు చాలా స్పష్టంగా పలకాలి. పర్‌ఫెక్ట్‌ ప్రీక్వెన్సీతో నిర్ణీత స్వరాన్ని అనుసరించి పలకాలి. అలా అయితేనే దాని ఫలితం ఉంటుంది. మనకు కనిపిస్తుంది. జీవులలోని సూక్ష్మశక్తుల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తుల్నీ ప్రేరేపించడానికీ, దైవశక్తిని మనకు అనుసంధాన పరచడానికీ మంత్రశబ్ధలు ఉపకరిస్తాయనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.
ప్రకృతిలోనే కాకుండా, సృష్టిలో కూడా అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు...సరైన ఉచ్ఛరణతో మనకు అందిస్తాయ్. దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం. మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. మనసా, వాచా, కర్మణా శుద్ధి కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. కంప్యూటర్‌ కాలంలో త్రికరణ శుద్ధి పూర్తిగా తగ్గిపోతుంది. క్రమంగా తరిగిపోతుంది. అందుకే మంత్రాల ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. పురాణ కాల మేధావులు మంత్రాలకు చింతకాయలనే కాదు, అవసరమైతే నక్షత్రాలను కూడా రాలగొట్టగలిగే శక్తి కలిగి ఉండేవారని మనం విన్నాం. మనకు ఫలించనంత మాత్రాన మంత్రశక్తిని విమర్శించడం అవివేకం. చేతకాక పోయినా కూడా కనీసం శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకోవడం వివేకం.
అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియ శక్తే మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా. ఎంతో అపురూపమైన మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు. సిద్ధిని, లబ్ధిని, దివ్యానుభూతిని పొందవచ్చు. దీనికి శాస్త్రీయత ఉంది. అసశాస్త్రీయంగా రుజువు అయింది కూడా.!!
మరి మంత్రాలకు, వేదాలకు సంబంధం ఏమిట?. పురాణాల్లో, వేదాల్లోనూ మంత్ర ప్రస్తావన ఉందా?..మంత్రశాస్త్రంలోనూ సైన్స్‌ కనిపిస్తుందా?.. శబ్ధ తరంగాలకు ఉన్న శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? పురాణకాలాన్ని మంత్రయుగమంటే... .ఆధునిక కాలాన్ని యంత్రయుగమని పిలవాలా?.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కొందరు అనుకుంటున్నట్టు మంత్రం సైన్స్‌కి విరుద్ధమా?.. జీవ నాడీ వ్యవస్థపై బీజాక్షరాల ప్రభావం ఎంత?
ఇలా మంత్రాల గురించి, బీజాక్షరాల మర్మం గురించి చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయ్. అంతెందుకు తప్పుగా ఆలోచించే వాళ్లూ లేకపోలేదు. మంత్రాలను వాడాల్సిన విధంగా వాడితే... అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు పండితులు. పురాణాల్లోని సైన్సు విషయాల్ని తెలుసుకునేటప్పుడు మంత్రం అనే అంశంపై కచ్చితమైన అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే పురాణాల్లో అనేక మంత్ర తంత్రాలు కనిపిస్తాయి మనకు. అందుకే మంత్రాలకూ, సైన్సుకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకొని తీరాలి. పురాణకాలంగా మంత్రయుగంగా... ఆధునికకాలం యంత్రయుగంగా మారుతుంది. ఇది నిజమే కావచ్చు కానీ మంత్రం సైన్సుకు ఏమాత్రం విరుద్ధం కాదు. ఇది నిజం కానే కాదు. మంత్రం అనేది నూటికి నూరుపాళ్లు ఒక సైన్సు ప్రక్రియే.
దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించడాన్ని మంత్ర జపం అంటారు. కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడటమే. ఇలా వాడటం వల్ల ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవించిన శక్తి మనకు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మారుతుంది. అది మంత్రానికి ఉన్న పవర్‌. తరుచూగా ఉచ్చరించే శబ్ధ తరంగాలే మంత్రాలు. ఆ మంత్ర శబ్ధ తరంగాలు చాలా శక్తివంతమైనవి కూడా. శబ్ధ తరంగాలు జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తాయ్. ఇది సైన్సు కూడా ఒప్పుకుంటున్న సత్యం.
జీవుల శారీరక, మానసిక స్థితులపై శబ్ధ తరంగాల ప్రభావం ఉంటుంది. కొన్ని రకాల శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, భయం కలగడం, నిరాశ ఆవరించడం చూస్తుంటాం. మరి కొన్ని శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం బాగుపడటం, ఉత్సాహం రావడాన్ని కూడా గమనిస్తుంటాం. అందుకే మంత్రాలంటే శక్తిమంతమైనవి శబ్దతరంగాలే. అందుకే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా, షట్‌ చక్రాలపైనా శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది. మంత్ర శబ్దాలు గ్రంథులకు చలనం కలిగించి జాగృతం చేస్తుంది. పోగొట్టుకున్న శక్తిని అవి మేల్కొలుపుతాయ్. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన శబ్ధ తరంగాలు ముందుగా చెవిని చేరి, తర్వాత మెదడుకు వెళ్తాయి. మెదడు నుంచి మంత్ర శబ్ధ తరంగాల ప్రభావం ప్రతీ అవయవాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఎక్కడ కనిపించని అత్యంత శక్తిమంతమైన ముక్తిప్రదం మన పెద్దలు మనకిచ్చిన మంత్రసాధన. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కాదు. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరా అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి ఆలోచనాశక్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే

జ్ఞానం అంటే ఏమిటి?What is Knowledge? Telugu

 

జ్ఞానం అంటే ఏమిటి?



జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీతలో మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం?
మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు, బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన B.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.
సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.

జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం. దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చుడండి.

1. ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.
2. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.
3. అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్ధతత్వము జూపును.
4. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.
5. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.
6. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది.
7. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.
Source : వేద శాస్త్రం

Sunday, September 26, 2021

Sankaraacharya -శంకరాచార్యులు:శంకరం - లోక శంకరం :వాస్తవిక

శంకరం - లోక శంకరం :వాస్తవిక 


.....ఈ‌ వ్యావహారిక‌‌ శకానికి పూర్వం (Before Common Era) 509లో శంకరులు పుట్టారని, 
అని ప్రధానమైన శంకరమఠాల గురు పరంపర ద్వారానూ, శంకరాచార్యులు స్థాపించిన పీఠాల చరిత్ర ద్వారానూ తెలియవస్తోంది.  వారి కాలంలో  సనాతన ధర్మానికీ, భారతప్రదేశానికీ హిందూ పదం ఆపాదించబడలేదు. 
అందుకే వారి రచనలలో ఎక్కడా 
హిందూ అన్న పదం మనకు కనిపించదు.‌ 
మనం చదివినట్లుగా వారి జననం వ్యావహారిక(Common Era ) శకం 788 అయి ఉంటే అప్పటికి హిందూ పదం చలామణిలోకి వచ్చింది, కాబట్టి వారి రచనల్లో ఎక్కడైనా హిందూ పదం కనిపించి ఉందేది. 6వ శతాబ్దికి చెందిన న్యాయ‌ సిద్ధాంత తాత్త్వికుడు ఉద్యోతకార శంకరులు ఈయన ప్రసక్తి  చెయ్యలేదు. 5వ శతాబ్దికి చెందిన  ప్రముఖ బౌద్ధ‌ పండితుడు దిజ్ఞాగుడు.  దిజ్ఞాగుని ప్రసక్తి కూడా శంకరులు చెయ్యలేదు. అంటే శంకరుల కాలం వీళ్లకు పూర్వంది. వ్యావహారిక శకం 700 -750 కాలం నాటి సంస్కృత నాటకకర్త భవభూతి శంకరుల  వివర్త వాద ప్రసక్తి చేశాడు. అంటే అప్పటికి శంకరులు చాలా పూర్వం వారని తెలుస్తోంది. వ్యావహరిక శకానికి పూర్వం 5వ శతాబ్దికి చెందిన గౌతమ‌బుద్ధుడి ప్రసక్తి కూడా ఎక్కడా శంకరులు‌ చెయ్యలేదు. శంకరుల కాలానికి ఉన్న వివిధ‌ స్వదేశీ‌ మతాల్లో బౌద్ధమతం‌ లేదు. అంటే శంకరులు బుద్ధుడి కన్నా పూర్వం వారు అన్నది కూడా స్పష్టమౌతున్నది.

 ఆది శంకరాచార్య భారతావనిపై పుట్టి జీవించింది 32 సంవత్సరాలే! శంకరులు వైశాఖ శుక్ల పంచమినాడు కాలడి‌ (ప్రస్తుత కేరళ రాష్ట్రం) గ్రామంలో శివగురువు,‌ ఆర్యాంబ దంపతులకు జన్మించారు. శంకరులు బాల్యం నుంచే అపూర్వ, అద్వితీయ వ్యక్తిత్వంతో, ధీ శక్తితో ఎదిగారు. అనితరసాధ్యమైన మేధతో 16 ఏళ్లకే తమ ఇతర‌ రచనలతో పాటు ప్రస్థానత్రయమైన దశోపనిషత్తులూ, బ్రహ్మసూత్రాలూ, భగవద్గీతలకు భాష్యాలు వ్రాసారు. నిజానికి భగవద్గీతకు అంతకు ముందే భాష్యాలు ఉన్నా శంకరుల భాష్యం తరువాతే భగవద్గీత వ్యాప్తికి వచ్చింది. ప్రస్థాన త్రయాన్ని శంకరులు తమ భాష్యాలతో జనబాహుళ్యంలోకి‌‌ తీసుకువచ్చారు. ఆది శంకారాచార్య వేఱు, వేఱు దేవతలపై 64 స్తోత్రాలూ, 37 ప్రకరణ గ్రంథాలూ వ్రాసి మనకందించారు. 

...వక్రపు వ్యాఖ్యానాలతోనూ, వక్రపు ధోరణులతోనూ, దోష సంప్రదాయాలతోనూ సనాతన ధర్మం‌‌ అస్తవ్యస్తమైన కాలంలో ఆది శంకరాచార్యులు  వేద ప్రతిపాదిత సత్యాన్ని సంస్థాపించడానికి పూనుకుని ఉద్యమించారు.  కృతకృత్యులూ అయ్యారు. తాత్త్విక, సామాజిక, ఆధ్యాత్మిక చింతనలతో  విశేషంగా కృషిచేశారు వారు.  ఆది శంకరాచార్యులు తమ అసమాన బహుముఖ ప్రజ్ఞతో, విప్లవాత్మక ధోరణితో ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న  సామాజిక,‌ సైద్ధాంతిక, మత మౌఢ్యంపై తిరుగుబాటు చేసి విజయం‌ సాధించారు. వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతాన్ని మళ్లీ ప్రసరింపజేశారు,‌ ప్రవహింపజేశారు. 

ఒక విస్మయకరమైన మేధావి, ఒక జ్ఞాని, ఒక పూజనీయమైన ఆచార్యుడు, ఒక భక్తుడు, ఒక కర్మ యోగి, ఒక వివేకి, ఒక పండితుడు,‌ ఒక దార్శనికుడు, ఒక సంస్కర్త‍‍, ఒక ఆధ్యాత్మిక యోగి, ఒక సిద్ధుడు‍, ఒక‌ మహాకవి. ఒక ముముక్షువు, ఒక మార్మికుడు,‌ ఒక తత్త్వవేత్త, ఒక తార్కికుడు, ఒక‌ అద్వైతి, ఒక భాష్యకారుడు, ఒక ఉద్యమ కారుడు, ఒక విప్లవశీలి, ఒక సనాతన ధర్మనిర్మాత ఆది శంకరాచార్య. 

ఆది శంకరుల నుడి‌ తత్త్వానికి బడి, ఆపై సత్యానికి గుడి. మనందఱికీ వారే ఒరవడి. శంకరత్వాన్ని సరిగ్గా‌‌ స్మరించుకుందాం‌‌ ఇదిగో ఇలా ...

"ఏవమాత్మా రణౌ ధ్యానమథనే సతతం‌‌ కృతే / ఉదితాన గతి ర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్" (ఆత్మబోధ 42వ శ్లోకం) అంటే ఆత్మే ఒక ఆరణి (నిప్పును రగిలించేందుకు ఉపయోగించే జమ్మి చెట్టు‌ కఱ్ఱ)కాగా, నిరంతర ధ్యానమే మథనం కాగా ఆందులోంచి పుట్టిన జ్వాలలో మొత్తం అజ్ఞానం అనే ఇంధనం దహించుకుపోతుంది అని అర్థం.‌ ఎంత అద్భుతంగా చెప్పారు శంకరులు!

 "సత్యాపి భేదాపగ్మే నాథ్ తవాహం న మామ్ కీనస్త్వమ్ / సాముద్రో హి తరంగః క్వచన్ సముద్రో న తారంగః" (విష్ణుష్టపదీ శ్లోకం 3) అంటే నేను భిన్నత్వానికి లోబడినా నాథా,  నేను నీవాణ్ణి. కానీ నువ్వు నా వాడివి కాదు అన్నది‌ నిజం‌. కెరటాలు సముద్రానికి చెందినవి కావచ్చు‌. కానీ సముద్రం కెరటాలకు సంబంధించినది కాదు అని అర్థం. ఇక్కడ శంకరులు ఒక మహోన్నతమైన విషయ వివరణ చేశారు. "స్వప్నో జాగరణేఽలీకః స్వప్నేఽపి నహి జాగరః / ద్వయమేవ లయే నాస్తి లయోఽపి హ్యు భయోర్న చ"(అపరోక్షానుభూతి- శ్లోకం 57) అంటే మెలకువలో కల లేదు. కలలో  మెలకువ లేదు. ఈ‌‌ రెండూ మరణం‌(లయ)లో‌ లేవు. ఈ మరణం మెలకువలోనూ, కలలోనూ లేదు అని అర్థం.‌  అత్యున్నతమైన విషయాన్ని అసదృశంగా చెప్పారు శంకరులు!

"జ్ఞానం‌ లేకపోతే స్వేచ్ఛ లేదు. అగ్ని లేకపోతే వంట లేనట్లుగా" (ఆత్మబోధ‌- శ్లోకం 2). "విద్య అవిద్యను పోగొడుతుంది‌‌. తేజస్సు మాత్రమే అంధకారాన్ని పోగొట్టగలిగినట్లు". (ఆత్మబోధ- శ్లోకం 3) "నీళ్లలో బుడగలు పుడతాయి. కాసేపు నీళ్లపై  ఆడతాయి. ఆ తరువాత నీళ్లలోనే కలిసిపోతాయి". (ఆత్మబోధ- శ్లోకం 8) ఈ విధమైన రచనలు మనకు కవులు రూమీలోనూ, ఖలీల్ జిబ్రాన్ లోనూ కనిపిస్తుంది. "పైన ఉన్న ఊకను తీసేస్తే బియ్యపు గింజ చక్కగా తెలుస్తుంది". (ఆత్మబోధ - శ్లోకం16) ఈ చెప్పడం ఎంత సహజంగా ఉందో? ఈ ఉపమానంలో జీవనం కనిపిస్తోంది కదూ?
"దీపానికి ఇంకో దీపం అక్కర్లేదు  తనే ప్రకాశిస్తుంది కాబట్టి".(ఆత్మ‌బోధ . శ్లోకం 29) ఈ ధోరణి మనకు కవి రూమీలో కూడా కనిపిస్తుంది‌. "రోగాన్ని ఔషధం ఏ విధంగా పోగొడుతుందో ఆవిధంగా". (ఆత్మబోధ- శ్లోకం 37)  సహజమైన ఉపమ‌‌ ఇది!  ఇలాంటివి కవి లావ్ ట్సూ లోనూ  కనిపిస్తాయి. "నీళ్లలో నీళ్లు లాగా, ఆకాశంలో‌ ఆకాశం లాగా, తేజస్సులో తేజస్సులాగా" (ఆత్మబోధ- శ్లోకం 53)
ఈ అనడం ఎంత గొప్పగా ఉందో కదా?‌ రూమీ, ఖలీల్ జిబ్రాన్, లావ్ ట్సూ వంటి కవుల్లో ఈ ధోరణి ఉన్నది. "పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది" (ఆత్మబోధ- శ్లోకం 59) ఇక్కడ
"పచ్చిపాలలోన వెన్న పరమాత్ముడు" అని అన్నమయ్య అన్నదానికి మూలం ఇదే..
"అగ్నిలో కాలుతున్న ఇనుము అగ్నిలాగానే ప్రకాశించినట్లు" (ఆత్మబోధ-‌శ్లోకం 62) ఈ చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది! ఈ స్థాయి‌‌ మాటలు‌ శంకరులు ఎన్నో అన్నారు.

"ఎవరు నీ భార్య? ఎవరు నీ కొడుకు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నువ్వెవరివి? ఎక్కణ్ణుంచి వచ్చావు? తమ్ముడూ, ఆ విషయం గుఱించి‌ ఇప్పుడు ఆలోచించు. ( 8 వ శ్లోకం మోహముద్గర లేదా  భజగోవిందం‌ శ్లోకాలు) కవి‌ ఖలీల్ జిబ్రాన్  "your children are not your chidren" అని అనడానికి వందల ఏళ్ల క్రితమే శంకరులు ఈ మాటలు అన్నారు.
"నీ ధనం, నీ పరివారం, నీ యవ్వనం వీటితో గర్వించకు. అవి నిమిషంలో నశిస్తాయి. అవి మాయ. అది తెలుసుకుని బ్రహ్మ‌ పథంలోకి ప్రవేశించు.‌ (11వ శ్లోకం భజగోవింద‌ం‌ శ్లోకాలు) ఇలా అంటూ శంకరులు మనల్ని కదిలిస్తారు.

"ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృ కుక్షౌ స్థితం మాం
విణ్మూత్ర మేధ్య మధ్యేక్కథ యతి‌ నితరాం జాఠరో జాతవేదాః
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం".(శివాపరాథ క్షమాపణ స్తోత్రం.‌‌ శ్లోకం 1)  అంటే మొదట్లో కర్మ అవసరం వల్ల (లేదా కర్మ విస్తరణ వల్ల) కలుషితమై‌న తల్లి కడుపులో ఉండేవాణ్ని నేను. మలమూత్రాలు, కడుపులోని వేడి, ఇతరమైనవి ఏవైతే ఉన్నాయో వాటివల్ల కలిగిన దుఃఖం, వ్యథల్ని ఇతరులు చెప్పడం ఎలా సాధ్యమౌతుంది? అని అర్థం. "గర్భంలోని శిశువు దుఃఖాన్ని , వ్యథను ఎవరు‌ చెప్పగలరు?"‌ ఈ భావన చేసిన‌‌ తొలి కవి, తాత్త్వికులు ఆది‌శంకరాచార్యులే. లావ్ ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్ , షేక్స్పియర్ వంటి కవులెవ్వరూ ఇలాంటి‌ లేదా ఈ‌ స్థాయి చింతన,‌ భావన చెయ్యలేదు. ఇలాంటి రచన, చింతన ఇది ఒక్కటే!

"దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరల తరంగే" (గంగా స్తోత్రం - శ్లోకం 1) ఆది‌శంకరులు తమ‌ గంగా స్తోత్రంలో గంగా‌‌ నదిని "తరల‌ తరంగే‌" ‌అన్నారు. "తరలం" అంటే కదిలేది, ప్రకాశించేది,‌ అనురాగం ఉన్నది, హారం మధ్యలో ఉండే ప్రధాన రత్నం, వజ్రం అని అర్థాలు. ఒక్క మాటతో గంగా నది గుఱించి చెప్పేశారు. ఇలా ఒక్క మాటతో వస్తువుపై సరైన అవగాహన కలిగించడం ఒక మహాకవి లక్షణం. ఆ గంగా‌ నదిని (వసుధాహారం) "భూమికి‌ హారం" అన్నారు. ఇది శంకరుల భవ్య‌మైన భావుకత.

ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన‌ జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి.‌ ఆలకించండి ... 

ఏది అన్నిటికన్నా  ప్రయోజనకరమైనది?

జవాబు: ధర్మం 

ఏది వాంఛింపదగినది?

జవాబు: స్వ, పర హితం.
 
శత్రువు ఎవరు?

జవాబు: సోమరితనం.

ఏది దుఃఖం?

జవాబు: ఉత్సాహం‌ లేకపోవడం.

ఏది‌ జాడ్యం?
జవాబు:‌ నేర్చుకున్నది ఆచరించకపోవడం.

ఏది వెలలేనిది?
జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది.

ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది?
జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత.

 ఏది దానం?
జవాబు: ఆకాంక్ష లేనిది.

ఎవరు స్నేహితులు?
జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు‌.

ఏది పాతకం?
జవాబు:‌ హింస.

ఎవరు ఎదుగుతారు?
జవాబు: వినయం ఉన్నవాళ్లు. 

ఎవరు ప్రత్యక్ష దేవత?
జవాబు: అమ్మ.

వేటిని మనుషులు సంపాదించాలి?
జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం.

వేటిని కాపాడుకోవాలి?
జవాబు:‌ కీర్తి , పతివ్రత, బుద్ధి
 
ఎవరు శూరులు?
జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు.

ఆది శంకరాచార్యులు తమ సౌందర్యలహరి 75వ శ్లోకంలో తమను తాము "ద్రావిడ శిశు" అని‌ ప్రకటించుకున్నారు. ఆ శ్లోకం: "తవ స్తన్యం మన్యే తుహినగిరి కన్యే హృదయతః/పయఃపారావారః పరివహతి సారస్వత మివ / దయావత్యా దత్తం ద్రవిడశిశు‌రాస్వాద్య తవ యత్ / కవీనాం ప్రౌఢానా నుజని‌ కమనీయః కవయితా".  శంకరులు సామాజిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అంటే వారు ఆర్యులు అయుండాలి కదా? పైగా సంస్కృతంలో వ్రాశారు. సంస్కృతం ద్రావిడుల భాష కాదని కదా మనం‌‌ చదువుకున్నది?. ఇక్కడ ఆర్యులైన శంకరులు  సంస్కృతంలో తమను తాము‌ ద్రావిడ శిశు‌‌ అని ప్రకటించుకుంటున్నారు! అదేంటి?‌  నిజమేమిటంటే,  "శంకరుల కాలానికి మన దేశంలో ఆర్య‌ ద్రావిడులు అన్నది లేదు". నిజానికి ఆర్య అన్న జాతి ఎప్పుడూ లేదు. ద్రావిడ అంటే దక్షిణ భూభాగానికి సంబంధించిన అని అర్థం. ద్రావిడ అనే పదం భాషల విభజనకు చెందిన పదం కావచ్చు. ద్రావిడ అన్నది ప్రదేశాన్ని సూచించేది. ద్రావిడ అన్నది జాతిని సూచించేది కాదు. ఆర్య అన్నది జాతిని సూచించేది కాదు. ఆర్య అన్నది శ్రేష్ఠులను సంబోధించే పదం.  అయ్యా , మహాశయా అన్నట్లుగా.... శంకరుల ఈ శ్లోకం వల్ల ఆర్య ద్రావిడ జాతులు అన్నవి నిజం కాని అభూత కల్పనలు అని‌ తెలియవస్తున్నది.‌ ("Aryan invasion is an abandoned theory"  అని Oxford Reference Dictionary కొన్నేళ్ల క్రితం తేల్చి చెప్పింది) ఈ శ్లోకానికి‌ అర్థం : హిమగిరి పుత్రికా (పార్వతీ), నీ స్తన్యం హృదయం నుంచి పుట్టినదైన పాల కడలి.   సారస్వతం (సరస్వతికి‌ సంబంధించినది) దాని నుంచే ప్రవహిస్తోందని తలుస్తున్నాను (అనుకుంటున్నాను).‌ఆ స్తన్యాన్ని ఈ ద్రవిడ శిశువు తాగి ప్రౌఢ కవులలో కమనీయమైన కవిగా పుట్టాడేమో? అద్భుతమైన భావుకతనూ, రచనా‌ సంవిధానాన్నీ‌ చూపారు ఇక్కడ శంకరులు‌. ఇవాళ ప్రపంచంలో గొప్ప కవిత్వాన్నిచ్చిన కవులుగా ఎక్కువగా చదవబడుతున్న లావ్‌ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్పియర్‌ల రచనా సంవిధానం పుష్కలంగా శంకరులలో తొణికిసలాడుతూంటుంది. నిజానికి‌ వీళ్లే కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీశ్రీ , వంటి కవులు కూడా శంకరుల కవితా రచనా‌‌ పరిధిలోని వాళ్లే!

వివేక చూడామణి....ఆది‌ శంకరాచార్య కృతులలో ఈ వివేకచూడామణి అత్యున్నతమైనది. ఈ విషయకంగా దీనికి సరిపోలగల రచన విశ్వంలో మఱొకటి లేదు. ప్రస్థానత్రయం తరువాత మన భూమిలో పుట్టిన మహోన్నతమైన రచన ఇది. ఆ‌‌ వివేక చూడామణి (శ్లోకం‌ 63)లో ‌"అజ్ఞాన సర్ప‌దష్టుడైన (శ్రీశ్రీ‌ బాధాసర్ప దష్టులారా,‌ అనడానికి శంకరుల‌‌ ఈ ప్రయోగమే మూలం) వాడికి బ్రహ్మజ్ఞాన ఔషధం తప్పితే వేదాల వల్ల ఏం ప్రయోజనం?, శాస్త్రాలవల్ల ఏం ప్రయోజనం?, మందుల వల్ల ఏం ప్రయోజనం?‌‌ అనీ, (శ్లోకం‌ 64లో)
"మందుల పేర్లవల్ల కాదు వాటిని‌ సేవిస్తే తప్ప వ్యాధి పోదు‌‌. స్వానుభవం‌ (అపరోక్షానుభవం) తప్పితే బ్రహ్మం, పేరు (శబ్దం) వల్ల నివృత్తి కాదు" అనీ తెలియజెప్పప్పడం వారి ప్రత్యేకతనూ,‌ ఔన్నత్యాన్నీ , దార్శనికతనూ తెలియజేస్తోంది.

ఆది శంకరాచార్య ఒక సర్వజ్ఞ. "మీకు చెప్పులు కుట్టడం వచ్చా"  అని అడిగినప్పుడు శంకరులు చెప్పును రెండుపాదాల మధ్యలో పెట్టకుని సూదిని‌ ముక్కు‌ పక్కభాగంలో రుద్దుకుని చెప్పు కుట్టారట‌. ఇలా సూదిని ముక్కు పక్కన రుద్దడం‌ వృత్తిగా చెప్పులు కుట్టే వాళ్లు చేస్తారు. శంకరులు మడికట్టుకుని కూర్చోలేదు. వీధిలోకి‌ వచ్చి ఉద్యమించారు. వారిని చంపాలని ప్రయత్నాలూ జరిగాయి. అయినా‌ భయపడకుండా సత్యం కోసం‌ పయనించారు, పని చేశారు. 

"ఆది శంకరాచార్యుల వారికి సాటిరాగల మానవ మూర్తిమత్వం ఈ విశ్వంలో మఱొకటి లేనేలేదు"

అటువంటి ఆ మహాశక్తికి,‌ ఆ సనాతన అభివ్యక్తికి; ఆ ఆధ్యాత్మిక సూర్యుడికి, ఆ తాత్త్విక కాంతికి; ఆ‌ విశ్వ మహాకవికి, ఆ భవ్య సాహిత్యానికి; ఆ విశేష నైజానికి, ఆ విశిష్ట వైప్లవ్యానికి; ఆ ధర్మజ్ఞతకు, ఆ దార్శనికతకు;  ఈ మట్టి మనుషులంగా మనసా, వాచా ప్రణామం చేద్దాం. 

"శంకరత్వం ఒక‌ సుజ్ఞాన సత్వం.
సదా అనుగమించాల్సిన తత్త్వం"🙏🙏🙏