Translate

Wednesday, August 31, 2022

ఏడు చేపల కథ | Telugu seven fishes story |- tatvam

 



అనగనగా విక్రమశ అనే రాజు గారు ఉండేవారు. ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు. ఒకరోజు రాజకుమారులు

వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండబెట్టారు. వాటిలో ఒకటి ఎండలేదు.

చేపా ! చేపా ! ఎందుకెండలేదంటే, గడ్డిమోపు అడ్డమైందని చెప్పింది.

గడ్డిమోపా ! గడ్డిమోపా ! ఎందుకడ్డమొచ్చావంటే, ఆవు నన్ను మేయలేదంటుంది.

ఆవా ! ఆవా ! ఎందుకు మేయలేదంటే, పాలేరు మేపలేదంటుంది.

పాలేరా ! పాలేరా ! ఎందుకు మేపలేదంటే, అవ్వ బువ్వ పెట్టలేదంటాడు.

అవ్వా ! అవ్వా ! ఎందుకు బువ్వ పెట్టలేదంటే, పిల్లవాడు ఏదుస్తున్నాడంటుంది.

పిల్లవాడా ! పిల్లవాడా ! ఎందుకు ఏడుస్తున్నావంటే, చీమ కుట్టిందంటాడు.

చీమా ! చీమా ! ఎందుకు కుట్టావని అడిగితే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటుంది.[1]

 

తత్వ చింతన

 

అవథాని శ్రీ గరికపాటి నరసింహారావుగారు 2005లో అమెరికాలోని ఆంథ్రులకు శ్రీమద్రామాయణంలోని థర్మసూక్ష్మాలను వివరిస్తూ ఇచ్చిన ప్రసంగంలో "అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు." అన్న కథలోని తత్వచింతనా కోణాన్ని అవిష్కరించారు. మామూలు కథగా ఆలోచిస్తే ఎదో పిచ్చి కథ అనిపిస్తుంది. ఇది కచ్చితంగా మన జీవితానికి ఎదో సందేశాన్ని ఇస్తుంది. అసలు రాజుగారి కొడుకులు వేటకు వెళ్ళి చేపలు తేవటమేమిటి.. అందులో ఒక చేపే ఎండక పోవటమేమిటి? కారణము గడ్డిమేటు అడ్డంరావటమేమి? అంటే కథలో ఎదో దోషమైనా ఉండాలి, లేదా అవగాహనైనా తేడా ఉండాలి.[2]

వివరణ[మార్చు]

ఈ కథలోని రాజుగారు అంటే మనిషి. ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త థాతువులు. వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట. ఏడు చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు అవి

·         కామము,

·         వేట,

·         జూదము,

·         మద్యపానము,

·         వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం),

·         దండపారుష్యము (కఠినముగా దండించుట),

·         అర్థదూషణము (థనమును దూబారాగా ఖర్చుచేయుట)).

ఈ వ్యసనాలు ఎండగట్టాటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది.  ఎండపెట్టటము అంటే వ్యసనాల్ని జయించుట. సాథన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు.

కథలోని తాత్విక చింతన[మార్చు]

ఒకచేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలినవాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినది.
కామాన్ని (కోరికలను) జయించటం చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది అయిననూ అదికూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని.
కోరిక ఎండితే కానీ మోక్షము రాదు.
కోరిక లేక బంధము తోలగుటయే కదా మోక్షము.
చేప ఎండకపోవటానికి కారణము గడ్డిమేటు.
గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక. మన అజ్ఞానము ఎంత అంటే గడ్డిమేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు.
సమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నానన్న భావన) తొలగుట కష్టము. కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చినారు.

గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము. వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. ఆవులచే మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. "జ్ఞానగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది.

ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది. "కృష్ణం వందే జగద్గురుం". జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది.

గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని, తీసుకొని వెళ్ళి ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞలేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెను. ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము. దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము.

అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరు. జగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత. అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము. [2]

పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. చీమ అంటే సంసారము. సంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదు. మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార, ఈతి భాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము. చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట. చివరకు అనురక్తి తొలగి సంసార బాథలనుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును. [4]

కథ సారాంశము[మార్చు]

సప్తథాతువులతో కూడిన మనిషి సాథన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించిననూ 7వది అయిన కామముకు జయించుట కష్టము.
అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు.
జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును.
జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడు.
అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడు. సంసారమున చిక్కి బాథపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడు.
దైవముచేత పంపబడినవాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును చేర్చును. కనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది.[2]


Friday, August 26, 2022

కుండలినీ తంత్రం:-(Kundalini Tantra Notes in telugu)

 




కుండలినీ తంత్రం:-

 

సృష్టి ఆది కాలం నుంచి తాంత్రీకులు, యోగులు మానవుని భౌతిక శరీరం లో, సారగర్భితమైన అంతర్నిహిత శక్తి, ఒకటి ఉంది అని భావన చేశారు. అదే కుండలినీ శక్తి. కుండలినీ నివాసం మేరుదండం క్రింద మూలాధార చక్రము వద్ద గల చిన్న గ్రంథిలో ఉంది ‌. ప్రాకృత శక్తుల వికాస కారణంగా ఈ గ్రంథి ఓ బిందువు పై చేరింది. దీనిని విస్పోటనం ద్వారా చేదించవచ్చు. కాలం సంస్కృతి సంప్రదాయాల అనుసరించి ఋషులు, యోగులు, సిద్దులు విభిన్న సాధనా పద్ధతుల ద్వారా ఈ శక్తిని మేల్కొలిపారు. కుండలినీ యోగసాధన విధి తాంత్రిక గ్రంథాల్లో గుప్తంగా ఉంది.

 

గురువు నుంచి యోగ్యులైన శిష్యులకు ఈ రహస్య విద్య ఒక తరం నుంచి మరో తరానికి అందించబడుతూ వచ్చింది. కుండలినీ సాధన ఆత్మగత క్రమశిక్షణతో, తాంత్రిక క్రియా యోగముతోనూ రూపొందించబడింది. ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా ప్రాచీన యోగుల అన్వేషణలు సరైనవే అని ప్రామాణికంగా నిరూపణ అయింది.

 

కుండలినీ జ్ఞానం :-

 

కుండలినీ మానవ దేహం లో వెన్నెముక అట్టడుగు భాగమున నిద్రావస్థలో ఉన్న ఒక మహోన్నత గుప్త శక్తి. యోగులు దీనిని మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉన్న సర్పంగా దర్శించారు. వాస్తవానికి మూడున్నర చుట్టలుగా సర్పం మన శరీరంలో లేకున్నా మానవ మస్తిష్కాన్ని విడిగా తీసి పరిశీలిస్తే, చుట్టలు చుట్టుకుని ఉన్న సర్పంగా ఉంటుంది. యోగుల అభిప్రాయం లో కుండలినీ మేరు దండంలో ఉన్న అతీంద్రియ మార్గం. సుషుమ్నలో ఉన్న ప్రాణ ప్రవాహం. మూలాధారం వద్ద ఉన్న ఈ గుప్త శక్తి పురుషులకు పెనీరియమ్ లోను, స్త్రీలకు సర్విక్స్ లోను ఉంటుంది. "ఓం" కారములోని మూడు మాత్రలు ( అ, , మ) లానే సర్పంలోని మూడు చుట్టలు భూత భవిష్యత్ వర్తమానాలకు, తమో, రజో, సత్త్వ గుణాలకు, జాగృత్, స్వప్న, సుషుప్తి లకు అర్థ కుండలినీ పైన చెప్పిన ఏ తత్త్వానికి చెందని అతీత స్థితికి ప్రతీక.

 

ఇలా మూడున్నర చుట్టలుగా ఉన్న కుండలినీ శక్తి విశ్వంలోని సమస్త అనుభవాలను సూచిస్తుంది. ఈ శక్తి జాగరణ వలన సంపూర్ణ శరీరంలో కాయకల్ప ప్రక్రియ ప్రారంభం అవుతుంది. స్వరంలోను, శరీర వాసనలోను మార్పు వస్తుంది. హార్మోన్ల స్థానంలో పరివర్తన, మస్తిష్కం లోని కోశికల రుపాంతరణ వేగం అవుతుంది. సాధకుడు ఉన్నత ప్రాణశక్తి నింపుకుని దివ్య దేహాన్ని పొందిన మహాత్ముని స్వరూపం అవుతాడు.

 

కుండలినీ తంత్ర :-

 

కుండలినీ యోగం తంత్ర - యోగముల అన్వేషణా ఫలితం. జాగృతం అయిన కుండలినీ శక్తిని నియంత్రించ లేకపోతే వచ్చే పరిణామాన్ని తంత్ర లో కాళీ గా చిత్రీకరించారు. కాళీ ధూమ్రవర్ణంతో నగ్నంగా 108 మానవ కఫాలములు గల మాల ధరించి, రక్తం ఓడుతున్న నాలుకను చాపి ఓ చేతితో కత్తి, మరో చేత్తో నరికిన శిరస్సు ధరించి, విధ్వంసానికి సూచనగా దర్శనం ఇస్తుంది. సాధకుడు బ్రహ్మాండీయ శక్తిని, గతి శీలతకు ప్రతినిధి అయిన స్త్రీ రూపంలో ఉపాసన చేస్తాడు. ఆ శక్తి తత్త్వం నుంచి క్రియాశీలమైన పురుషుడు, క్రింద పడుకున్న శివుని స్థిరత్వముతో సాక్షీ మాత్రంగా ఉంటాడు. శివుని చాతిపై కాళిక నిలబడటం, శక్తి జాగరణ తో సాధకులు ఆత్మ పై సంపూర్ణ నియంత్రణ సాధించారు అనే దానికి సూచన.

 

ఆ మహోగ్ర శక్తి యొక్క ఉదృతి తనకు తానే శాంతించాలి. వాస్తవానికి ప్రాణానికి రూపం లేనట్లే, కుండలినీ శక్తికి ఓ రూపం లేదు. అనంతమైన శక్తిని తమ అదుపులో ఉంచారని చెప్పేందుకు పురాణాలు, విష్ణువు, శివుడు, కాళి మొదలైన దేవీ, దేవతల చెంత, సర్పాలను చిత్రీకరించారు. గురువు నేతృత్వంలో కుండలినీ జాగృతి పొందిన శక్తికి ప్రతీక దుర్గా. సింహంపై కూర్చుని ఉన్న ఈ అందమైన దేవీ రూపం ఎనిమిది భుజాలు, 52 శిరస్సులు గల మాల ధరించి ఉంటుంది. 52 సంఖ్య నాదరూప బ్రహ్మను వ్యక్త పరిచే సంస్కృత వర్ణమాలకు ప్రతీక. అంతేకాదు ఆమె ధీర ప్రశాంత రూపం, సాధనలోని ప్రతికూలతను తొలగించే శక్తిని శాంతిని ఇస్తుంది అని సూచన.

 

కుండలినీ జాగృతం -

 

కుండలినీ యోగం సిద్ది పొందాలి అంటే ఆత్మ దర్శనం, కుండలినీ జాగృతి పొందిన గురువు సంరక్షణ లో, సాధకుడు సాధన చేయాలి. మహాశక్తి సంపన్నమైన ఈ అతీంద్రియ శక్తి యొక్క వేగాన్ని తట్టుకోగల యోగ్యతను సాధించాలి అంటే, గురువు అనేక గుప్త ప్రక్రియల ద్వారా సాధకుని మనో శరీరాలను సిద్దం చేయాలి ‌ . లేకపోతే సాధకుని శరీరం హైవోల్టేజ్ కరెంట్ వచ్చిన కరెంట్ బల్బులా  మారుతుంది. శరీరాన్ని నీడ అనుసరించినట్లు , గురువు సమక్షంలో సాధకుడు ఉండాలి. సాధకుడు దలియా, పలచని పప్పు, ఆవిరిపై ఉడికించిన పప్పు దినుసులు, పచ్చి కూరగాయలు వంటి తేలికపాటి ఆహారం తగిన విధంగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు, డ్రింక్స్, పాన్ పరాక్ లు, మొదలైన మత్తు పదార్థాల జోలికి పోకుండా ఉండాలి. శరీరం, మనసు పై నియంత్రణ వస్తున్న సమయంలో మందులు, ఓషధుల జోలికి పోకుండా ఉండాలి. లేకపోతే సూక్ష్మ శరీరం లో తెరుచుకుంటున్న అతీంద్రియ మార్గాలు మూసుకొని పోతాయి.

 

కుండలినీ జాగృతి ఉపాయాలు :-

 

కుండలినీ జాగృతి కోసం ఎంతో మంది సాధకులు, కొన్ని వందల సంవత్సరాల నుండి, అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సాధనకు కాల పరిమితి లేదు. కొంత మందికి కొన్ని సంవత్సరాల కాలం పట్టవచ్చు. లేక 12 సంవత్సరాల కాలం పట్టవచ్చు...జన్మలు కూడా కావచ్చు. గత జన్మలో సాధన చేసిన వారికి, కుండలినీ జాగృతి జన్మ మూలంగా సిద్ధిస్తుంది. మంత్ర జపం వలన, గుప్త విద్య ద్వారా, తపస్సు ద్వారా, ప్రాణాయామం, క్రియా యోగం ద్వారా, హఠయోగ ద్వారా, వన మూలికలు, సోమలత, భస్మాల ప్రయోగం ద్వారా, గుప్తంగా ఉన్న తాంత్రిక ధీక్ష ద్వారా, గురువులు, మహాత్ములు ప్రసాదించే శక్తి పాతం ద్వారా ( శక్తిపాతం అనేది విద్య కాదు) ఎటువంటి తీవ్రమైన సాధనల జోలికి పోకుండా పరమాత్మను ఆత్మ సమర్పణ చేయడం ద్వారా, సాధకులు కుండలినీ జాగృతి ప్రయత్నం చేస్తారు. కుండలినీ జాగృతి చాలా ప్రమాదకరమైనది అని, ఏ చిన్న పొరపాటు జరిగినా సాధకుడు పిచ్చి వాళ్ళు అవుతారు అనే ప్రచారం ఈంది లోకంలో. ప్రమాదం ఎక్కడ లేదు? జీవితం అంతా ప్రమాద భరితమే ! కాదా!? గర్భిణీ స్త్రీ , బిడ్డకు జన్మ ఇవ్వడం ప్రమాదం అని భావిస్తుందా!! ఉన్నత సాధనా మార్గమైన కుండలినీ జాగృతి కోసం ప్రయత్నం చేయకుండా ఏ సాధకుడైనా ఉండగలడా!? కృష్ణుడు, బుద్దుడు, మహావీరుడు, వంటి మొదలైన అనేక మంది మహాత్ములు అంతా కుండలినీ జాగృతి జరిగి జ్ఞాన నేత్రం తెరుచుకున్న మానవులే!

 

కుండలినీ మస్తిష్కం :-

 

మానవ మస్తిష్కంలో పది భాగాలు ఉన్నాయి. వాటిలో 9 భాగాలు నిష్ర్కియావస్థలోను, పదో భాగం క్రియాశీలంగా ఉంది. సహస్రారం పరమ చైతన్య శివస్థానం. దీనిని వేదం, తంత్ర హిరణ్య గర్భుడు అంటుంది. ఇది మెదడు లోని పిట్యూటరీ గ్రంథితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ పరమ చైతన్య కేంద్రానికి దిగువన, మనోశక్తి కేంద్రం అయిన మూడవ నేత్రం ఆజ్ఞా చక్రము లో ఉంది. దీని సంబంధం పీనియల్ గ్రంథితో ఉంది. ఈ అంతర్ జ్ఞాన క్షేత్రాలు రెండు, అతీంద్రియ మార్గమైన సుషుమ్నతో కలిసి ఉన్నాయి. కుండలినీ లోని ఊర్ద్వ శక్తి, సుషుమ్న ద్వారా స్థూల శరీరం తో కలిసిన, మెదడులోని నిద్రాణావస్థలో ఉన్న, కేశికలు క్రయాశీలమై , సాధకునిలో కాయా కల్ప జరుగుతుంది.

 

కుండలినీ ఆరోహణ అవరోహణ :-

 

కుండలినీ జాగృతి అయి, మస్తిష్కంలో ఉన్న సహస్రార లోని శివునితో కలిస్తే, ఆ శక్తి మొత్తం మస్తిష్కాన్ని క్రియాశీలం చేస్తుంది. కుండలినీ యోగం దీనిని 6 భాగాలుగా గుర్తించింది. ప్రాచీన గ్రంథాలు, కుండలినీ జాగరణ మూలాధార చక్రంలో జరుగుతుంది అని చెప్పడం వలన, అదే వాస్తవం అని ఎంతో కాలంగా భావించారు. వాస్తవానికి కుండలినీ నివాస స్థానం సహస్రార చక్రములో. జాగరణ ఏ చక్రం లో అయినా కుండలినీ జాగృతి జరగవచ్చు. కుండలినీ జాగృతి ఏ చక్రంలో జరిగినా, ఆ శక్తి ప్రభావం సహస్రార చక్రము చేరుతుంది. కానీ ఆ జాగరణ స్థాయి స్థిరంగా ఉండదు. మస్తిష్కంలో జాగృత కేంద్రాలు అన్ని మళ్ళీ సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతాయి. కుండలినీ మూలాధారం చేరుతుంది. అందుకే ప్రాచీన గ్రంథాలు, కుండలినీ నివాసం మూలాధారం అని చెప్పబడింది.

 

కొంత మంది యోగులు మూలాధారం, స్వాధిష్ఠాన చక్రాలను పట్టించుకోరు. తంత్ర సాధకులు మణిపురానికి విశేష ప్రాధాన్యం ఇస్తారు. సిద్ధుల కోసం ప్రయత్నం చేసే సాధకులు లక్ష్య సిద్ధి కావాల్సిన చక్రాన్ని ఉపాసన చేస్తారు. స్వాధిష్ఠానం ఆనంద ప్రాప్తికి, మణిపూరక చక్రం ఆత్మవిశ్వాస వృద్ధి, అనాహతం విశ్వ ప్రేమ వృద్ధి, విశుద్ధ చక్రము వివేకం, జ్ఞాన ప్రాప్తికి, ఆజ్ఞా చక్రము అంతర జ్ఞానం, అతీంద్రియ శక్తుల వృద్ధి కోసం అనుష్టానం చేస్తారు. కుండలినీ జాగృతి ఆరోహణ క్రమం రెండు దశల్లో ఉంటుంది. అధో కుండలినీ మూలాధారం నుంచి, సుషుమ్న ద్వారా ఆజ్ఞా చక్రము వరకు చేరుతుంది. దీని వల్ల ఊర్ద్వ కుండలినీ ఈ చైతన్య శక్తిని బ్రహ్మ నాడి ద్వారా సహస్రార చక్రానికి చేరుస్తుంది. దీని వల్ల సాధకునికి సుదూర ప్రాంతాల దర్శనం, దూర శ్రవణం, భూత భవిష్యత్ వర్తమాన కాలాల దర్శనం మొదలైన శక్తులు లభిస్తాయి.

 

 

కుండలి నీజాగరణ ప్రక్రియ :-

 

కుండలినీ ద్వారా పొందే అనుభవాలు మనో శారీరక ఘటనలు. దీని కేంద్రం మేరు దండం వద్ద ఉంది. దీనిలో ఉన్న ద్రవము ఉద్దీపన చెందితే, అది మేరు దండం ద్వారా పైకి చేరి, సాధకుని చైతన్య స్థితిలో మార్పు తెస్తుంది. సాధకుడు ప్రథమ స్థాయిలో, ఇడ - పింగళ నాడులను నియంత్రించడం, రెండో దశలో, చక్రములు జాగరణ చెందే ప్రక్రియలను సాధన చేయడం, అంతిమంగా సుషుమ్నా నాడి జాగరణను సాధించడం, దీని వలన కుండలినీ ఊర్థ్వ గమన, ఆరోహణ సుగమం అవుతుంది.

 

సుషుమ్న తమోశక్తికి, వజ్రిణి రజోశక్తికి, చిత్రిణి సత్వశక్తికి ప్రతీకలు. కుండలినీ లో ఉత్పన్నమైన మహోన్నత చైతన్యం, బ్రహ్మ నాడి ద్వారా ప్రవహించి సహస్రారాన్ని చేరి శక్తి శివునితో సంయోగం పొందుతుంది. మస్తిష్కంలోని నిష్క్రియ భాగాలు చైతన్యవంతమైన సాధకుడు సమాధి స్థితిని అనుభవిస్తాడు. జపాన్ లోని హిరోషి మోటోయామా కుండలినీ జాగరణ వలన ఉత్పన్నం అయ్యే తరంగాలు, శక్తి ప్రవాహాన్ని గుర్తించి ఆ వివరాలను వివరించే యంత్రాన్ని కనిపెట్టడం జరిగింది.

 

సమాధిలో అద్వైత అనుభవం :-

 

సమాధిలో ఉన్నతమైన అనుభవం తర్వాత శివ శక్తుల కలయికలోని ఉదృతి తగ్గిన పిదప, సంపూర్ణ బ్రహ్మండ మూల తత్త్వం అయిన బిందువు అవతరిస్తుంది. వారి కలయికతో ఏర్పడిన బిందువులోనే, మానవుడి బుద్ది, సృష్టి సంరచన నిండి ఉంది. మళ్ళీ బిందువు రెండు భాగాలై శివ శక్తులుగా మారుతాయి. ఆరోహణ శక్తే ఊర్థ్వ గమనం చెందింది. అవరోహణ జరిగినప్పుడు శివ శక్తులు భౌతిక స్థితిలో ఉంటాయి. వాటి అస్థిత్వం వేరుగా ఉంటుంది.

 

ఆధ్యాత్మిక జాగరణ కేంద్రం సహస్రారం :-

 

వేదాలు, ఉపనిషత్తులు, గీత, యోగ శాస్త్రాలు సహస్రారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో "ఊర్ధ్వ మూల మథః శాఖ మశ్వథం ప్రాహరవ్యయమ్" ద్వారా మహోన్నత సత్యాన్ని అందించారు. ఈ రహస్యాత్మక వృక్షం, వేళ్ళు, మొదలు పైన, కొమ్ములు, ఆకులు క్రింద ఉంటాయి. సాధకుని ఆలోచనలు, వ్యాకులత, సాంసారిక భావనలు మొదలైనవి కొమ్ములు, ఆకులు. మెదడు లోని భాగాలు వేళ్ళు, మొదలు మేరు దండం. సాధకుడు ఊర్థ్వ ముఖ సాధన ద్వారా, సహస్రారాన్ని చేరి, వాసనలు సంస్కారాలు అనే వేళ్ళను సమూలంగా నాశనం చేస్తే, తన స్వస్వరూపమైన బ్రహ్మమును చేరుకోలడు. నిమ్న స్థాయి సాధనల ద్వారా, కోరికలు, ఆలోచనలు అనే కొమ్ములు ఆకులు తెంపుతున్నా అవి మళ్ళీ చిగురిస్తూనే ఉంటాయి. ఈ అలౌకిక సత్యజ్ఞానం అన్ని ఆధ్యాత్మిక జాగరణలకు కేంద్రం సహస్రారం అని తెలుపుతుంది.

 

కుండలినీ జాగరణ అనుభవాలు :-

 

కుండలినీ జాగృతి అనే విస్పోటం తర్వాత సాధకుని జీవన గతి మారిపోతుంది. సామాన్య చైతన్యం నుంచి ఆధ్యాత్మిక మార్గంలోని అనుభవాతీత, అత్యున్నత చైతన్యం లో ప్రవేశిస్తాడు. ఎలా అర్థం చేసుకోవాలో తెలియని రకరకాల అనుభూతులు కలుగుతాయి. వెన్నెముక క్రింది భాగంలో శక్తి విడుదలైనట్లు ఆ శక్తి కరెంట్ తీగ ద్వారా ప్రవహిస్తున్నట్లు గా మూలాధారం లో వేడి పుట్టి, సుషుమ్న లో ఆ శక్తి పైకి క్రింద కు ప్రవహిస్తున్నట్లు శక్తి ప్రవాహం వస్తూ పోతున్నట్టు, వెన్నెముక ట్యూబ్ లైట్ లా వెలుగుతున్న అనుభవాలు, శరీరం లోపల అతి అద్భుతమైన ప్రకాశాలు కనిపించడం ఇలా ఎన్నో అనుభవాలు జరుగుతాయి. మరి కొంత మంది లో మాత్రం అంత వరకూ అణిచి పెట్టిన ఆలోచనలు, క్రోధం, కోరికలు విజృంభిస్తాయి.

 

కొంత మంది లో కామ కోరికలు ఎంతలా చెలరేగుతాయి అంటే మైథునం తప్ప మరో ధ్యాస ఉంఢదు. భయం ఎంతగా వేస్తుంది అంటే నిద్ర కూడా పట్టదు. ఒక్కో సారి తిండి పై ఎంత కోరిక పుడుతుంది అంటే ఎంత తిన్నా తృప్తి ఉండదు. మరి కొంత మందికి ఆకలి నశిస్తుంది. విపరీతమైన తల నొప్పి, నిద్ర పట్టక పోవడం, నిర్లిప్తత, నిరాశ ప్రపంచ పరిస్థితులపై విరక్తి ఉంటుంది. కొందరిలో అతీంద్రియ శక్తులు మేల్కొంటాయి. దేవ దూతలు, దివ్య ఆత్మల దర్శనం అవుతుంది. కొందరికి దివ్య సంగీతం, శరీరం తేలికగా తేలిపోతున్నట్టు, భూమి రెండుగా చీలినట్లు, వర్షంలో తడుస్తూ ఉన్నట్లు, ఉరుములు, మెరుపులు మొదలైన ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు అనుభూతులు కలుగుతాయి.

త్రివిధ జాగరణ :-

 సాధకుడు నిరంతరం చేసేటటువంటి ఆసన, ముద్ర, ప్రాణాయామ యోగ క్రియల ద్వారా, కుండలినీ జాగృతికి ముందు, నాడీ జాగృతి ఆ తర్వాత చక్రాల జాగృతి జరుగుతుంది. అనేక అనుభవాలు కలుగుతాయి. అయితే వీటిలో ఆనందానుభూతి తప్ప తీవ్ర అనుభవాలు ఉండవు. సుషుమ్నా జాగరణ జరిగినప్పుడు కలిగే అనుభూతులు, కుండలినీ జాగృతి లోని అనుభవాల వలనే ఉంటాయి. సాధకులు దీనినే కుండలినీ జాగృతి అంటారు. అంతే కాక సాధకుని చిత్తం, చైతన్యం రెండూ వికాస ప్రక్రియలో ఉంటాయి. ఒక్కో సారి మేరు దండంలోని ద్రవ ఉద్దిపనల వలన ఇంద్రియ గతి విధులు ఆగిపోతాయి. చిత్తములో స్వతంత్ర అనుభవాలు ఒక్కో సారి కల్పనతో కూడిన అనుభవాలు కూడా కలుగుతాయి. మహ ప్రకాశాన్ని చూడటం మొత్తం భూమి కంపించడం, శరీరం దూది పింజంలా మారడం, ఇవన్నీ గౌణ మస్తిష్కం, మేరు ద్రవం యొక్క ప్రతిక్రియ స్వరూపాలు! వీటినే సాధకులు కుండలినీ జాగరణ గా భ్రమ పడుతుంటారు. ఈ అనుభవాలు కేవలం తాత్కాలికం. 

 

వామమార్గ కుండలినీ జాగరణ :-

 

తంత్ర యోగులు త్రినేత్ర భేధనకు శల్య క్రియను ప్రయోగించినట్లే కుండలినీ జాగృతి కోసం శివ శక్తుల ప్రతికలుగా సహయోగి - సహజోలి మైథున క్రియ ద్వారా దీనిని సాధించే క్రియను చేపట్టారు. తాంత్రిక వామ మార్గంలో ధనాత్మక ఋణాత్మక శక్తుల ప్రతినిధులు అయిన పురుషుడు, స్త్రీల మధ్య జరుగు యవ్వన క్రియల ద్వారా కుండలినీ జాగృతి సాధ్యం అని వీరు భావిస్తారు. శివ శక్తుల ప్రతీకగా ఈ స్త్రీ పురుష సంయోగం ఉంటుంది. తంత్ర మార్గ సంభోగం లో బిందు స్కలనం జరుగరాదు ? 

 

స్ఖలనాన్ని ఆపే దిశగా, పురుష సహయోగి వజ్రోలి ముద్ర, మూల బంధ, ఉఢ్యాణ బంధాల్లో దక్షిత సాధిస్తారు. స్త్రీ శరీరంలో, ఏకాగ్రత బిందువు, గర్భాశయానికి వెనుక, మూలాధారం వద్ద, విశిష్ట అనుభూతులతో ఉంది. తంత్రం లో దీన్ని జాగరణ అంటారు. సంభోగ చరమ స్థాయిలో ఈ అనుభవం కొంత సమయం ఆపకుండా కొనసాగాలంటే బిందువు మీద శక్తిని కేంద్రీకృతం చేయాలి. సాధారణంగా సంభోగ క్రియ వలన శక్తి విభిన్న భాగాలకు పంచబడే కారణంగా శక్తి జాగరణ కాక సుఖ ప్రాప్తి ఉంటుంది. ఈ స్థితిని కాపాడుకోవాలి అంటే స్త్రీ ఆ బిందువు పై మనసును కేంద్రీకరించే క్షమత కలిగి ఉండాలి. బిందువు పై ఏకాగ్రతే సహజోలి క్రియ. ఇది చాలా కఠినం. సహజోలి సాధన ద్వారా యోని గర్భాశయాల కండరాలు, సంకోచించే సాధన చాలా సమయం చేయాలి. కొంత కాలం బహిర్, ఉడ్యాణ బంధ సాధన చేస్తే ఆ సమయంలో సహజంగా జలంధర, మూల బంధాలపై పట్టు సాధించి ఆమె సహజోలి ప్రక్రియ లో నైపుణ్యం సాధిస్తుంది. 

 

స్త్రీ యొక్క సంకల్పం, శక్తి కారణంగానే ఈ సంభోగం సంభవం అవుతుంది. ఎంతో సమయం పాటు జరిగే ఈ సంభోగం లో భోగంపై ఏ కోరికా లేకుండా యోగ మార్గంలో సాగే పవిత్ర యజ్ఞ కార్యంగా అనుభవాన్ని ఆపితే శక్తి ప్రవాహాం మారుతుంది. నాడీ వ్యవస్థ లోని రక్త ప్రసరణ ఊర్థ్వ ముఖంగా వెళ్ళడం జరుగుతుంది. ఈ స్థితిలో స్త్రీ లోని చైతన్యం మారి ప్రకాశ దర్శనం అవుతుంది. పురుష సంభోగ పరాకాష్ట సమయంలో శక్తి విస్ఫోటనం జరుగుతుంది. వామ మార్గ ఆధ్యాత్మిక అనుభవాలు అన్నీ ఈ ఫలితం పైనే ఆధారపడి ఉంటాయి. 

 

 

ఏ అదృశ్య శక్తి ఈ విశ్వమంతా వ్యాపించి బ్రహ్మాండంలోని గ్రహాలను, అనంతకోటి నక్షత్ర మండలాన్ని నియమబద్ధంగా నడిపిస్తోంది? జిజ్ఞాసువుల మస్తిష్కంలో మెదిలే ఈ ప్రశ్నకు వైదిక సాహిత్యంలో బదులు ఇచ్చింది. 'నియతి అనే మహాశక్తి,నియంతగా ఈ విశ్వాన్ని నడిపిస్తోంది ' ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల క్రితమే మనకి వివరించారు.

 

సృష్టి లో నిర్జీవ పదార్థాలయిన పర్వతాలు, ఖనిజాలు, లోహలు మొదలైన పదార్థాలకు భిన్నంగా చైతన్యం గల ప్రాణం మనలో ఎలా ఏర్పడింది? ఈ సృష్టి అంతా పదార్థ జన్యమే కదా! ఆ జడ పదార్థం నుంచి ప్రాణశక్తి ఉద్భవించే ఆస్కారం ఉందా? విశ్వబ్రహ్మండాన్ని చైతన్యం చేసి నియమబద్ధంగా నడిపిస్తున్న, మహోన్నత శక్తికి మూలం ఏది? 

 

ఉచ్ఛ్వాస నిశ్వాసములు, హృదయ స్పందన, రక్త ప్రసరణ, ఆకలి, మల మూత్ర విసర్జన, జనన మరణాలు మొదలైన జీవన క్రియలు మనలో ఎవరు నడిపిస్తున్నారు. ? మానవ మనుగడకు మూలం అయిన ఈ విశ్వ రహస్యాలను, మన ప్రాచీనులు యోగ శాస్త్రం ద్వారా, అనేక గ్రంథాల్లో వివరించారు. వాటి సారాంశం ఏమిటంటే 'విశ్వాన్ని నియమబద్ధంగా నడిపిస్తున్న అద్వితీయ శక్తే, మనలో నేనుగా, జీవాత్మగా, ప్రాణంగా, మనసుగా ప్రాణ కర్మలను నిర్వహిస్తోంది! విశ్వబ్రహ్మండం, మానవ పిండం ఒకేరకమైన తత్త్వముతో ఏర్పడతాయి " 

 

మానవ శరీరం పాంచభౌతికం, ప్రాణధర్మంతోనే మానవ జన్మ సార్ధకం అయింది. ఈ ప్రాణం తప్పుకుంటే మృత్యువు మనల్ని కబళిస్తుంది, అన్న భావనలో ఉంటాం. భౌతిక జీవనం కోసం చేసే పోరాటం,ప్రాణమయ జీవనం కోసం ఎందుకు చేయలేక పోతున్నామని, ఏనాడైనా ఆలోచించారా? మనలోని ప్రాణాన్ని నిలకడ చేసుకోగలిగితే అనారోగ్యం, లావెక్కడాలు, బరువు అవడాలు ఉండవు.

 

యోగ సాధన ద్వారా మనలోని ప్రాణాన్ని సరి చేసుకొంటే అన్నీ బాగుంటాయి. అన్నింటికీ మూలం ప్రాణమే. దేన్న చూసి అభివృద్ధి అని మురిసిపోతున్నామో, అదే మన మూలాన్ని మరిచేలా చేస్తుంది. దేహ భావనలో ఉన్నప్పుడు "ఒంట్లో బాగాలేదని"అంటాడు. ఇంగ్లీష్ చదువుల వాడు "హెల్త్ బాగోలేదు" అంటారు, ఏ చదువులూ చదవక పోయినా సనాతన సంప్రదాయి "ప్రాణం సరిగా లేదు" అంటారు. ప్రాణాన్ని సరిచేసుకుంటే ఏ అనారోగ్యం మన దగ్గరకు దరిచేరదు అని మన ప్రాచీనులకు బాగా తెలుసు



Thursday, August 18, 2022

యోగ వాశిష్ట సారం (Yoga Vasishta Saaram)

యోగ వాశిష్ట  సారం
1. నాకు బంధం ఉంది, ముక్తి పొందాలి
అని తలచేవాడే ఈ వాశిష్ఠం చదవడానికి అధికారి.
జ్ఞానికిగాని, అజ్ఞానికిగాని అధికారం లేదు.

2. దేని నుండి ఈ సమస్తమూ పుట్టి, ఉండి, చివరికి అందులోనే లయం అయిపోతోందో ఆ పరబ్రహ్మకు నమస్కారము.

3.ఏ మహానంద సాగరం నుండి పుట్టిన విషయానందమనే బిందువులు సమస్త జీవులలో ప్రకాశించుచున్నదో, ఏది సమస్త జీవులకు జీవనమో,
ఆ బ్రహ్మానందస్వరూపుడైన పరబ్రహ్మకు నమస్కారము.

4. పక్షి ఆకాశంలో ఎగరడానికి రెండు రెక్కలూ అవసరమైనట్లు, ముక్తి పొందడానికి కర్మ-జ్ఞానములు రెండూ అవసరమే.

5. ఆత్మ సృజింపబడలేదు.
ఆత్మ దేనినీ సృజించలేదు.

6. జీవుడన్నది నామమాత్రమే.
ఉన్నది బ్రహ్మమే. 

7. భగవంతుడు సర్వశక్తిమంతుడు.
కనుక ఆయన ఆలోచనారూపములు మూర్తిమంతములగును. 

8.లెక్కింప సాధ్యముగాని ఈ నామరూపములన్నియు
సమస్తమూ చైతన్యమే.

9. జీవుడు, మనస్సు మొదలయినవి అన్నియు చైతన్యమునందలి స్పందనలే.

10. మనము కలవరపాటుకు అతీతులము.

11. మార్పులు లేనిదానిలో మార్పులు చూడడమే అజ్ఞానము.

12. కలలోని వస్తువులు ఘనంగా కనబడ్డా వాటిలో భౌతికత్వం లేనట్లు, ప్రపంచం భౌతికంగా కనబడ్డా నిజంగా ఇది శుద్ధచైతన్యమే.

13. నిజానికి ప్రపంచము, బ్రహ్మము, ఆత్మ అను పదముల అర్థములలో భేదమే లేదు.

14. సృష్టికర్తయగు బ్రహ్మ నుండి గడ్డిపోచ వఱకు
ఈ సమస్తమూ ఆత్మయే తప్ప వేరేదియు గాదు.

15.జల్లెడను ఎన్నటికీ నీటితో నింపజాలము.
వ్యక్తి ప్రాపంచిక వస్తువులను ఎంతగా సమకూర్చుకొన్నప్పటికి మనస్సు ఎప్పటికి కృతార్థము కాజాలదు.

16. శకమునకు క్షణమునకు మధ్య తాత్త్వికంగా ఎట్టి భేదము లేదు.

17. ఆసక్తి లేని వ్యక్తియే నిజమైన జీవన్ముక్తుడు.

18. స్రష్టలోని స్పందనమే సృష్టి.

19. వైరాగ్యం అనేది విసుగు వలన కలిగేది కాదు.
వివేకం వలన కలిగేది నిజమైన వైరాగ్యం.

20. ఈ ప్రపంచమొక క్రీడారంగము.

21. దారుణమైన ఈ సంసారసాగరమును దాటుటకై
మానవుడు శాశ్వతము, అవ్యయమునయిన దానిని ఆశ్రయింపవలెను.

22. అవిచ్ఛినమైన ఆత్మవిచారణ వల్లనే
ఆత్మసాక్షాత్కారం కలుగును.

23. ఆత్మవిచారము అంటే తనలోకి తాను సూటిగా చూడడమే.

24. మనస్సు అనంతమైన ఆత్మకంటె భిన్నమూ కాదు, 
దానికి స్వతంత్రమైన అస్తిత్వము లేదు.

25. ద్రష్టలోనిదే దృశ్యము.

26. స్రష్టకు భౌతిక దేహం లేదు.
సృష్టి కూడా భౌతికత్వము లేని 
భావనా స్వభావము కలదే.

27. స్రష్ట ఆత్మరూపుడు, అదేవిధముగా ఆయన సృష్టి కూడ నిజముగా తాత్త్వికముగా ఆత్మమయమే.

28. భావన మనస్సులో అంతర్గతముగా ఉండును.
దృశ్యవిషయము ద్రష్టలో అంతర్గతముగా ఉండును.

29. బాహ్యముగా సామాన్యజీవితమును గడుపుచు ప్రపంచమంతయు శూన్యమని అనుభవగోచరము గావించుకొన్న వ్యక్తి జీవన్ముక్తుడు. ఆయన జాగ్రదవస్థలో ఉన్నప్పటికీ గాఢనిద్రా ప్రశాంతిని అనుభవించును. కష్ట-సుఖములు కొంచెముగా గూడ అతనిపై తమ ప్రభావము చూపవు.

30. శిలలో చెక్కని ప్రతిమ సర్వదా ఉన్నట్లే
ప్రపంచము కూడా అఖండతత్త్వములో అంతర్గతముగా ఉన్నది.

31. ఏక కాలంలో సమత్వము-స్పందనము పరమాత్మయందున్నవి.

32. ఏదియు ఎప్పుడును సృజింపబడి యుండలేదు.

33. కారణము-కార్యము అనునవి కేవలము శబ్దములేగాని సత్యములు కావు.

34. సదా ఆత్మ విషయమై ఆసక్తితో ఉండుటయే అభ్యాసము.

35. చైతన్యము యొక్క స్వభావము వలన ఈ లోకములన్నియు మాటిమాటికి ఆవిర్భవించుచునే యుండును. మరియు తిరిగి తమ సంకల్పశక్తి వలన ప్రశాంతస్థితికి తిరిగి వచ్చును. ఇది బాలుని యాదృచ్ఛిక క్రీడ వంటిది.

36. నీ చైతన్యమే తపస్సుగా లేక దేవతగా అయి స్వతంత్రముగా ఫలమునిచ్చును.

37. ఒక్క అనంతచైతన్యము తప్ప ఏదియు ఎప్పుడు ఆవిర్భవించి ఉండలేదు. దీనిని దృఢముగా విశ్వసింపుము.

38. జ్ఞాని దేహము దృశ్యమైనదిగా కనిపించినప్పటికి, నిజముగా అది అదృశ్యము, ఆకాశమయము.

39. కంకణమునకు బంగారమునకు మధ్య 
తరంగములకు జలమునకు మధ్య 
విభాగము లేనట్లే 
ప్రపంచమునకు అనంతచైతన్యమునకు మధ్య భేదము లేదు.

40. ఈ నియతికి రెండు దశలున్నవి-
మానుషము,అతిమానుషము.

41. జ్ఞాని సంపర్కము వలన చుట్టూ ఉన్న గాలి, ధూళికణములు సైతం మోక్షమును పొందును.

42. ఆత్మ నూరుప్రయత్నములతో పొందదగినది.
అయినను అది పొందబడినను ఏదియు పొందబడినట్లు కాదు(అనగా అది ముందే ఉన్నది).

43.తండ్రి లేకుండా కొడుకు ఉండనట్లే
ద్రష్ట లేకుండా దృశ్యము లేదు.

44. దేవా! విశ్వసృష్టి నిశ్చితముగా నీకు ఉద్దేశరహితమైన వినోదము.

45. మనస్సే దేహమునకు బీజము.

46. ఇది అంతయు బ్రహ్మమే కనుక
జడము కూడ శుద్ధచైతన్యమే.

47. సమస్తము అవిభక్త స్థితిలోనున్నది.

48. వ్యక్తిగతమైన చైతన్యమే మనస్సు.
జ్ఞాని మనస్సు అఖండబ్రహ్మము.

49.ఆత్మలో విభాగము లేదు.
ఏలనగా ఇది అంతయు అఖండబ్రహ్మమే.

50. "ఒకడే" ఉన్నప్పుడు ఎవడు దేనిని ఎట్లు చేయును?

51. అపరిచ్ఛిన్నమగు ఆత్మలో స్రష్ట లేడు, సృష్టి లేదు, లోకములు లేవు, స్వర్గము లేదు, మానవులు లేరు, రాక్షసులు లేరు, దేహములు లేవు, భూతములు లేవు, కాలము లేదు, స్థితి లేదు, సంహారము లేదు.

52. ద్రష్ట-దర్శనం-దృశ్యం అను వాని మధ్య గల విభాగమును విసర్జించినప్పుడు పరబ్రహ్మ మొక్కటే ఉండును.

53. కుండ పగిలినప్పుడు దానిలోని ఆకాశం పగులదు.
వ్యక్తి మరణించినప్పుడు వానిలోని ఆత్మ నశించదు.

54. ప్రపంచ-బ్రహ్మముల మధ్య కార్య-కారణ సంబంధముండునని ఊహించుట వట్టి మూర్ఖత్వము. బ్రహ్మము మాత్రమే ఉన్నదనియు, ప్రపంచముగా కనుపించునది ఆ బ్రహ్మమే అనియు అన్నది సత్యము.

55. దృశ్యము జ్ఞానికి బ్రహ్మముగాను, అజ్ఞానికి ప్రపంచముగాను అగుపించును.

56. భోజనం భుజించు వ్యక్తిని పొందును.

57. ప్రపంచము పరమేశ్వరుని అనంతశక్తుల యొక్క ఆవిర్భావమే.

58. ఆత్మ ఒక్కటే సర్వకాలములయందుండును. ఆత్మయే ప్రపంచము, ఆత్మయే కాలము, పరిణామక్రమము కూడా.

59. ఏమియు లేనివానికి ఈ ఆత్మజ్ఞానమొక్కటి ఉన్నచో సమస్తము ఉన్నట్లే.

60. ఈ ఆత్మ మాత్రమే కోరదగినది, ఆరాధింపదగినది, ధ్యానింపదగినది.

61. ఆత్మకు వెలుపల ఏదియు లేదు.

62. రామా! నీవు చైతన్యసాగరరూపుడవు.
అందు రాముడను వ్యక్తి ఒక తరంగము.

63. అంతర్గతమయిన శుద్ధ చైతన్యము యొక్క 
ఎడతెగని ఎఱుకయే ఉత్తమ ధ్యానము, ఉత్తమపూజ.

64. ప్రతి జీవాణువునందును ఆత్మాచ్ఛాదన-ఆత్మజ్ఞానములను ఈ నాటకము ఎల్లప్పుడు అభినయింపబడుచుండును.

65. ఆ చైతన్యమే ప్రకృతిలో వస్తువులుగాను
వ్యక్తిలో ఇంద్రియములుగాను అగుపించును.

66. నీవు ఎట్టి సుఖ-దుఃఖములకు గురి అయినను సహింపుము. అవి వచ్చును, పోవును.

67. సృష్టిలో కనిపించు ఖండవిధానము మనస్సు యొక్క స్వీయచిత్రణమే.

68. శుద్ధాకాశములో చర్య(కర్మ) లేక చలనము లేదు.

69. 'చిత్' యొక్క చమత్కారమే ప్రపంచముగా భాసించుచున్నది.

70. వాస్తవముగా దేవతల దర్శనము స్వప్నము కంటె అభిన్నము.

71. ఆ చైతన్యము యొక్క ప్రధమభావనావిర్భావమే జీవుడు.

72. నేను క్రీడార్థము ప్రపంచమున సంచరింతును. ఏల అనగా, ఎవని నుండియు పొందవలసినది ఏదియు నాకు లేదు.

73. నిరర్థకమైన ఈ తపస్సులలోను, ఇతర క్రియలలోను నీవు నీ జీవితమును ఎందుకు వ్యర్థము చేయుచున్నావు?
 
మహాత్ముల సాంగత్యమునాశ్రయించుట వలనను నీవాత్మజ్ఞానమును పొందెదవు.

74. ఆచారముల వలన, శాస్త్ర విధుల వలన గాక జ్ఞానుల ఆరాధన వలన మాత్రమే వ్యక్తి జ్ఞానమును పొందును.

75. చిత్తపరిత్యాగమే సర్వపరిత్యాగము.

76. 'నేను' అను సంకల్పమే బంధమును కలిగించును.
'నేను లేను' అను సంకల్పమే మోక్షమును కలిగించును.

77. అనిబద్ధములో(నిబంధన రహితములో) ఉండుము.

78. బ్రహ్మమే ఈ సమస్తముగా ఇక్కడ అభివ్యక్తమయినది. దానికి వేఱుగా ఏదియు లేదు. అందువలన బంధ-మోక్ష భావనలను గూడ పరిత్యజింపుము. 
సహజకార్యనిమగ్నుడవయి శుద్ధమయిన నిరహంకారదశలోనుండుము.

79. నీ సందేహములన్నింటిని వదిలివేయుము.
ధార్మికధైర్యమునాశ్రయింపుము.
మహాకర్తగా, మహాభోక్తగా, మహాత్యాగిగా ఉండుము.

80. ఈశ్వరుడు ఈ ప్రపంచదృశ్యమునందు క్రీడించి పిదప దానిని తనలోనికి ఉపసంహరించును. సృజించి బంధమును కలిగించు శక్తియే సృష్టిని లయింపజేసి మోక్షమును కలిగించు శక్తిగా ఉండును.

81. అంతర్గతముగా సమస్తమును పరిత్యజింపుము. బాహ్యముగా యుక్త కార్యములో నిమగ్నుడవగుము.

82. నిర్మలమయిన అంతర్దృష్టియే జ్ఞానలక్షణం.

83. సగము మేల్కొన్న పసిబిడ్డవలె ఆత్మలో నెలకొని యుండుము.

84.ఉన్నది నశింపజాలదు.
లేనిది ఉండజాలదు.

85. నేను సమాధానము చెప్పజాలక మౌనం వహింపలేదు,
మౌనము మాత్రమే సమాధానము కనుక మౌనము వహించితిని.

86. వ్యక్తి సజీవుడుగా నున్నప్పటికి మృతని వలె ప్రవర్తించుదానిని సర్వోత్తమదశ అందురు.

87. విషయం 'విషయి' లోనిదే.
దృశ్యం 'ద్రష్టలోనిదే.

88. వందల కొలది ప్రతిబింబములున్నను అద్దము నిర్వికారముగా నుండునట్లు ఎన్నో లోకములు తనలో ఆవిర్భవించుచున్నను పరమాత్మ నిర్వికారముగా ప్రశాంతముగానుండును.

89. సహజమైన నీ అన్ని కర్మాలతోను, అనుభవములతోను, నీ జ్ఞానముతో గూడ పరమేశ్వరుడగు ఆత్మను ఆరాధింపుము.

90. సమాధిలో నెలకొన్న వ్యక్తి మానవరూపంలోనున్న బ్రహ్మమే.

91. ఈ విశ్వము, నీవు, నీ స్వప్నంలో జూచునదంతయు గూడ బ్రహ్మమే అనునదే సత్యము.

92. ప్రపంచము పరమాత్మ యొక్క స్వప్నము.

93. అపరిచ్ఛిన్న చైతన్యము ఎక్కడ ఏ రూపమున అగుపించవలెనని సంకల్పించుకొనునో అది ఆ విధముగా తన నిజస్వభావమును ఆ రూపములో తనకిష్టమయినంత కాలము అనుభవించును.

94. ఈ అపరిచ్ఛిన్న చైతన్యము ఎప్పుడును తన యధార్థస్థితిని విడువకుండా 'నేను జీవుడను' అని తలంచుట నిజముగా గొప్ప అద్భుతము.

95. మనస్సే సృష్టికర్తయగు బ్రహ్మ.

96. తత్త్వవేత్త వ్యవహార నిమగ్నుడయినను మౌనమునాశ్రయించి ఆకాశము వలె అసంగుడయి మూగవానివలెనుండును.

97. స్వప్నములలో నిర్దిష్టమైన క్రమముగానీ, వ్యవస్థగానీ, కార్యకారణ సంబంధముగానీ లేనట్లే, ఈ ప్రపంచదృశ్యములో గూడ నిర్దిష్టమయిన కార్యకారణ భావము లేక క్రమము ఉన్నట్లు అగుపించినను అట్టిదేదియులేదు.

98. ఆ పురుషుడు స్రష్ట అనియు, విశ్వము సృష్టింపబడినది అనియు భావించుట అసంగతము. ఒక దీపము మరియొక దీపముతో వెలిగింపబడినప్పుడు వాని మధ్య స్రష్ట-సృష్టి అను సంబంధము లేదు. అగ్ని ఏకమే.

99. ఈ భ్రాంతి ఏ కారణము వలన వచ్చినది? 
అను ప్రశ్న ఇక్కడ సముచితం కాదు. ఏల అనగా ఉన్నదానిని విచారించుట వలన లాభము కల్గునుగానీ లేనిదానిని విచారించుటవలన లాభము కలుగదు. భ్రాంతికి మూలమయిన లేని అజ్ఞానమును విచారించుట వ్యర్థమని సారాంశము.

100.ఆకాశము ఆకాశముగా ఆకాశములో నుండునట్లే
బ్రహ్మము బ్రహ్మముగా బ్రహ్మములో నుండును.

101. ఈ సృష్టి అనునది అవిభాజ్యమగు బ్రహ్మమే.

102. ధనార్జనకై వంటచెరకును సేకరించుటలో నిమగ్నుడయిన వానికి చింతామణి లభించినట్లు 
తమ అవసరములను నెరవేర్చుకొనుటకై గురువును, శాస్త్రములను ఆశ్రయింతురు. అయినను కాలక్రమమున గురు, శాస్త్రముల ఉపదేశములను అనుష్ఠించుటవలన వారు ఎక్కువ విలువగల ఒకానొక విషయమును(మోక్షమును) సాధింతురు.

103. బ్రహ్మము సర్వశక్తి సంపన్నము.

104. ఈ బ్రహ్మము యొక్క అభివ్యక్తికి హద్దు ఏదియు లేదు.

105. ఈ అఖండబ్రహ్మము సర్వశక్తిసంపన్నుడగుట వలన అపరిచ్ఛిన్న శక్తులు ఈ దృశ్యప్రపంచముగా అగుపించును.

106. ఉన్నదేదో అదే ఉన్నది.

107. సమస్తమూ నీ స్వాత్మయే.

108. ఆత్మనిష్ఠయే పరమ శ్రేయము.
ఆత్మనిష్ఠయే మోక్షము.....
.
.
.
.యోగా వశిష్ట నుండి యాదృచ్ఛిక కోట్స్
 

సరస్సు ఒడ్డున ఉన్న చెట్లు ప్రతిబింబించినట్లే
నీటిలో, అలాగే ఈ వైవిధ్యమైన వస్తువులన్నీ
మన స్పృహ యొక్క విస్తారమైన అద్దంలో ప్రతిబింబిస్తాయి.

బంధం నిజంగా ఉనికిలో లేనప్పటికీ, అది
ప్రాపంచిక ఆనందాల కోరిక ద్వారా బలంగా మారుతుంది;

ఈ కోరిక తగ్గినప్పుడు బంధం బలహీనమవుతుంది.
సముద్రం నుండి అలలు పైకి
లేచినట్లు అస్థిరమైన మనస్సు పరమాత్మ యొక్క విస్తారమైన మరియు స్థిరమైన విస్తీర్ణం నుండి పైకి లేస్తుంది.

ఈ ప్రపంచం, అవాస్తవమైనప్పటికీ, ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తుంది
మరియు ఒక బాలుడికి (ఉనికి లేని) దెయ్యం (భయానికి కారణం) వలె, అజ్ఞాన వ్యక్తికి జీవితకాల బాధలకు కారణం .

బంగారం అనే ఆలోచన లేనివాడు కంకణం మాత్రమే చూస్తాడు.
అది కేవలం బంగారం అనే ఆలోచన అతనికి అస్సలు లేదు.
అజ్ఞానికి లోకం దుఃఖంతో
నిండి ఉంటుంది, జ్ఞానవంతుడికి ఆనందంతో నిండి ఉంటుంది
అంధుడికి ప్రపంచం చీకటిగా ఉంటుంది
మరియు కళ్ళు ఉన్నవారికి ప్రకాశవంతంగా ఉంటుంది.
సంసారాన్ని తిరస్కరించిన మరియు అన్ని మానసిక భావనలను విస్మరించిన విచక్షణ కలిగిన వ్యక్తి యొక్క ఆనందం
నిరంతరం పెరుగుతుంది.

స్పష్టమైన ఆకాశంలో అకస్మాత్తుగా కనిపించే మేఘాల వలె
మరియు అకస్మాత్తుగా కరిగిపోయినట్లుగా, మొత్తం విశ్వం (కనిపిస్తుంది)
స్వీయ మరియు (దానిలో కరిగిపోతుంది).

బట్ట, పరిశోధించినప్పుడు,
దారం తప్ప మరేమీ కానట్లు కనిపించినట్లే, ఈ ప్రపంచం కూడా, విచారించినప్పుడు
, కేవలం నేనే.

నురుగు, కెరటాలు, మంచు మరియు బుడగలు నీటికి భిన్నమైనవి కావు, అలాగే ఆత్మ నుండి వచ్చిన ఈ ప్రపంచం ఆత్మ నుండి భిన్నంగా లేదు.
.
.
.

ఆటంక వాసనలు.....

శ్లో || లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహాను వర్తనం |
శాస్త్రాను వర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు ||

ప్రతి...

లోకానువర్తనం త్యక్త్వా=జనులు పోవురీతిని వదిలి; దేహాను వర్తనం త్యక్త్వా=దేహం నేననే భావాన్ని విడిచి; శాస్త్రాను వర్తనం త్యక్త్వా= శాస్త్రాలను అనుసరించటం వదిలి; స్వ అధ్యాస అపనయం కురు= నీ అధ్యాసను పోగొట్టుకో;

వ్యాఖ్య...

ఆత్మగా భావిస్తూ జీవించటంలో ముఖ్యమైన ఆటంకాలు.. 3, అనువర్తనం = గ్రుడ్డిగా సదా అనుసరించటం.

1) లోకానువర్తనం త్యక్త్వా...

జనులంతా ఎలా వెళ్తున్నారో చూచి గ్రుడ్డిగా అలాగే ఆధ్యాత్మికరంగంలో ఉన్న మనమూ వ్యవహరించటం కూడదు. సామాన్యంగా ఈ లోకంలో ప్రతివారూ తామున్న స్థితి నుంచి ఉన్నతస్థితికి ఎగబ్రాకటానికి ప్రయత్నిస్తారు. ధన సంపాదన, వస్తు సంపాదన, పదవీ సంపాదన, భోగ సంపాదన, రాజ్య సంపాదన, ఐశ్వర్య సంపాదన, ఇలా అన్నింటిని సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకొని దానికి తగిన కర్మలు చేస్తారు. వాటివల్ల ఆ జన్మలో కలిగే ఫలితాలకే ప్రాధాన్యత ఇస్తారు. "ఆ తర్వాత ఏమిటి..? అని ఆలోచించరు. ఇదే లోకానువర్తనం". అలాగే భార్యాబిడ్దల పోషణ, బంధుమిత్రాదులతో సంబంధం - ఇవన్నీ బంధాలని భావించకుండానే బంధంలో పడిపోతుంటారు. ముక్తిని కోరే మనం గ్రుడ్డిగా లోకంలోని జనులను అనుసరిస్తే ఈ జన్మ వృధా అయినట్టే. జన్మరాహిత్యానికి ఏ ప్రయత్నమూ జరగనట్టే.

కనుక ఇలా గ్రుడ్డిగా అనుసరించటం కాకుండా జీవితాన్ని ఉన్నత ఆదర్శం వైపు త్రిప్పాలి. ఇప్పటిదాకా కొనసాగిస్తున్న జీవితాన్ని మార్చుకోవాలి. ఒక బాలుడు యవ్వనంలో ప్రవేశించగానే జీవిత విధానాన్ని మార్చుకుంటాడు. ఒక యువకుడు వృద్ధుడు కావటంతోనే జీవిత విధానం మారిపోతుంది. ఒక యువతి పెళ్ళి చేసుకోగానే పరిసరాలు మారిపోతాయి, జీవనవిధానం మారిపోతుంది. అలాగే మనం ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని వైపు ప్రయాణం సాగించాలంటే ఇందులో నిలదొక్కుకోవాలంటే ఇప్పటి వరకు సాధారణ జనుల మార్గంలో నడిచే నీవు నీ జీవన విధానాన్ని మార్చుకోవాలి.

తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, ఇళ్ళువాకిళ్ళను అందరి లాగా పట్టుకొని ప్రాకులాడరాదు. బరువులు, భాద్యతలు అంటూ అన్నీ నెత్తిన వేసుకొని, తనకు లేని, ఎప్పటికీ రాని సుఖాల కోసం పరుగులు తీస్తూ గ్రుడ్డిగా నీ తోటి వారిని అనుసరిస్తూ జీవించే విధానం పశుజీవనమే. అందుకే దీనిని వదలి తెలివిగా, మెలకువగా జీవించాలి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థితిలో ఉన్నవారిని ఆశ్రయించి వారు చూపిన మార్గంలో నీ జీవితాన్ని నడిపించాలి. అయ్యో నలుగురు నడిచే బాటను నడవాలి గదా..! అని దిగులు పడరాదు. లోకాన్ని చూచి భయపడరాదు. అందరూ బురదగుంటలో దిగుతున్నారు గదా..! అని మనమూ దిగరాదు.

2) దేహాను వర్తనం త్యక్త్వా...

దేహం మీద విపరీతమైన ప్రేమను పెంచుకొని ఎప్పుడూ దాని పోషణలోనే దాని అలంకరణలోనే మునిగిపోకూడదు. అది కోరే కోర్కెలను తీర్చే బానిసవు కావద్దు. ఇష్టమైన తిండికోసం, ఆకర్షణీయంగా కనపడటం కోసం, దేహానికి వెట్టిచాకిరీ చేయరాదు. అలాగని సాధకుడు దేహాన్ని పట్టించుకోకుండా ఉండరాదు. అది "సిద్ధుల పని". సాధకుడు ఈ దేహంతోనే సాధనలు సాగించాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసనలకు ఈ దేహమే ఆధారం కనుక తగినంత సాత్విక ఆహారాన్నిస్తూ తగినంత దేహపోషణ చేసుకుంటూ, అనారోగ్యం రాకుండా కాపాడుకుంటూ ఒకవేళ అనారోగ్యం చేస్తే ఔషధాలు వాడుతూ దానిని చక్కగా పోషించుకోవాల్సిందే. అయితే అతికూడదు.

3) శాస్త్రాను వర్తనం త్యక్త్వా...

శాస్త్రాలన్నీ కీకారణ్యాల వంటివి. వాటిపై విపరీత వ్యామోహాన్ని పెంచుకొని, అన్నీ తెలుసుకోవాలని తపనపడితే జీవితమంతా కృషి చేసినా చాలదు. చతుర్వేదాలు, షడంగాలు, షట్ శాస్త్రాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, భగవద్గీత, చరిత్ర, భూగోళం, భూగర్భశాస్త్రం, వైద్యం, న్యాయశాస్త్రం.. ఎన్నో.. ఇవిగాక నాట్య నృత్య శిల్పం, సంగీతం, లలితకళలు, యోగా ఇలా ఎన్నో శాస్త్రాలను తెలుసుకోవాలని అనుకోరాదు. అన్నీ తెలుసుకోవటం సమయం వృధాచేసుకోవటమే. ఆధ్యాత్మికరంగంలో ఉన్నవారు మోక్ష ప్రదాయక గ్రంధాలనే చదవాలి గాని పాండిత్య ప్రతిభకై ప్రాకులాడరాదు ఉత్తేజాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి గదా అని చెత్త నవలలు చదవరాదు. ఈ మూడింటిని లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, వాసనాత్రయం అంటారు. ఈ మూడింటిని వదలాలి. వదలి ఏంచేయాలి..

"స్వ - అధ్యాస - అపనయం - కురు"...

నీ అధ్యాసను తొలగించుకో. ఈ దేహమే నేననే భావనను తొలగించుకో...

1) కనుక మోక్షమార్గంలో నడిచే మహాత్ములను అనుసరించాలి. వారి బోధలను వినాలి. ఆచరించాలి. వారి ఆచరణను జాగ్రత్తగా పరిశీలించాలి.

2) అలాగే దేహాన్ని ఆరోగ్యాంగా ఉంచుకోవాలి.

3) అవసరమైనంత వరకు శాస్త్రాలను అధ్యయనం చెయ్యాలి. వాటి లోతులను గ్రహించాలి. తెలివిగా వాటిని ఆచరించాలి.

ఇలా చేస్తూ గ్రుడ్డిగా అనుసరించటాన్ని వదలి వాసనలను అంతం చేయాలి. నిజంగా ఈ 3 వాసనలను అంతం చేయగలిగితే మిగిలిన వాసనలన్నీ రద్దై పోతాయి. ఎందుకంటే మిగిలిన వాసనలన్నీ దాదాపుగా ఈ మూడింటిలో ఏదో ఒక దానిపై ఆధారపడి ఉన్నాయి.

ఈ 3 వాసనలే ముక్తి మార్గంలో ప్రధాన ఆటంకాలు...

|| ఓం నమః శివాయ ||