Translate

Sunday, September 26, 2021

Sankaraacharya -శంకరాచార్యులు:శంకరం - లోక శంకరం :వాస్తవిక

శంకరం - లోక శంకరం :వాస్తవిక 


.....ఈ‌ వ్యావహారిక‌‌ శకానికి పూర్వం (Before Common Era) 509లో శంకరులు పుట్టారని, 
అని ప్రధానమైన శంకరమఠాల గురు పరంపర ద్వారానూ, శంకరాచార్యులు స్థాపించిన పీఠాల చరిత్ర ద్వారానూ తెలియవస్తోంది.  వారి కాలంలో  సనాతన ధర్మానికీ, భారతప్రదేశానికీ హిందూ పదం ఆపాదించబడలేదు. 
అందుకే వారి రచనలలో ఎక్కడా 
హిందూ అన్న పదం మనకు కనిపించదు.‌ 
మనం చదివినట్లుగా వారి జననం వ్యావహారిక(Common Era ) శకం 788 అయి ఉంటే అప్పటికి హిందూ పదం చలామణిలోకి వచ్చింది, కాబట్టి వారి రచనల్లో ఎక్కడైనా హిందూ పదం కనిపించి ఉందేది. 6వ శతాబ్దికి చెందిన న్యాయ‌ సిద్ధాంత తాత్త్వికుడు ఉద్యోతకార శంకరులు ఈయన ప్రసక్తి  చెయ్యలేదు. 5వ శతాబ్దికి చెందిన  ప్రముఖ బౌద్ధ‌ పండితుడు దిజ్ఞాగుడు.  దిజ్ఞాగుని ప్రసక్తి కూడా శంకరులు చెయ్యలేదు. అంటే శంకరుల కాలం వీళ్లకు పూర్వంది. వ్యావహారిక శకం 700 -750 కాలం నాటి సంస్కృత నాటకకర్త భవభూతి శంకరుల  వివర్త వాద ప్రసక్తి చేశాడు. అంటే అప్పటికి శంకరులు చాలా పూర్వం వారని తెలుస్తోంది. వ్యావహరిక శకానికి పూర్వం 5వ శతాబ్దికి చెందిన గౌతమ‌బుద్ధుడి ప్రసక్తి కూడా ఎక్కడా శంకరులు‌ చెయ్యలేదు. శంకరుల కాలానికి ఉన్న వివిధ‌ స్వదేశీ‌ మతాల్లో బౌద్ధమతం‌ లేదు. అంటే శంకరులు బుద్ధుడి కన్నా పూర్వం వారు అన్నది కూడా స్పష్టమౌతున్నది.

 ఆది శంకరాచార్య భారతావనిపై పుట్టి జీవించింది 32 సంవత్సరాలే! శంకరులు వైశాఖ శుక్ల పంచమినాడు కాలడి‌ (ప్రస్తుత కేరళ రాష్ట్రం) గ్రామంలో శివగురువు,‌ ఆర్యాంబ దంపతులకు జన్మించారు. శంకరులు బాల్యం నుంచే అపూర్వ, అద్వితీయ వ్యక్తిత్వంతో, ధీ శక్తితో ఎదిగారు. అనితరసాధ్యమైన మేధతో 16 ఏళ్లకే తమ ఇతర‌ రచనలతో పాటు ప్రస్థానత్రయమైన దశోపనిషత్తులూ, బ్రహ్మసూత్రాలూ, భగవద్గీతలకు భాష్యాలు వ్రాసారు. నిజానికి భగవద్గీతకు అంతకు ముందే భాష్యాలు ఉన్నా శంకరుల భాష్యం తరువాతే భగవద్గీత వ్యాప్తికి వచ్చింది. ప్రస్థాన త్రయాన్ని శంకరులు తమ భాష్యాలతో జనబాహుళ్యంలోకి‌‌ తీసుకువచ్చారు. ఆది శంకారాచార్య వేఱు, వేఱు దేవతలపై 64 స్తోత్రాలూ, 37 ప్రకరణ గ్రంథాలూ వ్రాసి మనకందించారు. 

...వక్రపు వ్యాఖ్యానాలతోనూ, వక్రపు ధోరణులతోనూ, దోష సంప్రదాయాలతోనూ సనాతన ధర్మం‌‌ అస్తవ్యస్తమైన కాలంలో ఆది శంకరాచార్యులు  వేద ప్రతిపాదిత సత్యాన్ని సంస్థాపించడానికి పూనుకుని ఉద్యమించారు.  కృతకృత్యులూ అయ్యారు. తాత్త్విక, సామాజిక, ఆధ్యాత్మిక చింతనలతో  విశేషంగా కృషిచేశారు వారు.  ఆది శంకరాచార్యులు తమ అసమాన బహుముఖ ప్రజ్ఞతో, విప్లవాత్మక ధోరణితో ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న  సామాజిక,‌ సైద్ధాంతిక, మత మౌఢ్యంపై తిరుగుబాటు చేసి విజయం‌ సాధించారు. వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతాన్ని మళ్లీ ప్రసరింపజేశారు,‌ ప్రవహింపజేశారు. 

ఒక విస్మయకరమైన మేధావి, ఒక జ్ఞాని, ఒక పూజనీయమైన ఆచార్యుడు, ఒక భక్తుడు, ఒక కర్మ యోగి, ఒక వివేకి, ఒక పండితుడు,‌ ఒక దార్శనికుడు, ఒక సంస్కర్త‍‍, ఒక ఆధ్యాత్మిక యోగి, ఒక సిద్ధుడు‍, ఒక‌ మహాకవి. ఒక ముముక్షువు, ఒక మార్మికుడు,‌ ఒక తత్త్వవేత్త, ఒక తార్కికుడు, ఒక‌ అద్వైతి, ఒక భాష్యకారుడు, ఒక ఉద్యమ కారుడు, ఒక విప్లవశీలి, ఒక సనాతన ధర్మనిర్మాత ఆది శంకరాచార్య. 

ఆది శంకరుల నుడి‌ తత్త్వానికి బడి, ఆపై సత్యానికి గుడి. మనందఱికీ వారే ఒరవడి. శంకరత్వాన్ని సరిగ్గా‌‌ స్మరించుకుందాం‌‌ ఇదిగో ఇలా ...

"ఏవమాత్మా రణౌ ధ్యానమథనే సతతం‌‌ కృతే / ఉదితాన గతి ర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్" (ఆత్మబోధ 42వ శ్లోకం) అంటే ఆత్మే ఒక ఆరణి (నిప్పును రగిలించేందుకు ఉపయోగించే జమ్మి చెట్టు‌ కఱ్ఱ)కాగా, నిరంతర ధ్యానమే మథనం కాగా ఆందులోంచి పుట్టిన జ్వాలలో మొత్తం అజ్ఞానం అనే ఇంధనం దహించుకుపోతుంది అని అర్థం.‌ ఎంత అద్భుతంగా చెప్పారు శంకరులు!

 "సత్యాపి భేదాపగ్మే నాథ్ తవాహం న మామ్ కీనస్త్వమ్ / సాముద్రో హి తరంగః క్వచన్ సముద్రో న తారంగః" (విష్ణుష్టపదీ శ్లోకం 3) అంటే నేను భిన్నత్వానికి లోబడినా నాథా,  నేను నీవాణ్ణి. కానీ నువ్వు నా వాడివి కాదు అన్నది‌ నిజం‌. కెరటాలు సముద్రానికి చెందినవి కావచ్చు‌. కానీ సముద్రం కెరటాలకు సంబంధించినది కాదు అని అర్థం. ఇక్కడ శంకరులు ఒక మహోన్నతమైన విషయ వివరణ చేశారు. "స్వప్నో జాగరణేఽలీకః స్వప్నేఽపి నహి జాగరః / ద్వయమేవ లయే నాస్తి లయోఽపి హ్యు భయోర్న చ"(అపరోక్షానుభూతి- శ్లోకం 57) అంటే మెలకువలో కల లేదు. కలలో  మెలకువ లేదు. ఈ‌‌ రెండూ మరణం‌(లయ)లో‌ లేవు. ఈ మరణం మెలకువలోనూ, కలలోనూ లేదు అని అర్థం.‌  అత్యున్నతమైన విషయాన్ని అసదృశంగా చెప్పారు శంకరులు!

"జ్ఞానం‌ లేకపోతే స్వేచ్ఛ లేదు. అగ్ని లేకపోతే వంట లేనట్లుగా" (ఆత్మబోధ‌- శ్లోకం 2). "విద్య అవిద్యను పోగొడుతుంది‌‌. తేజస్సు మాత్రమే అంధకారాన్ని పోగొట్టగలిగినట్లు". (ఆత్మబోధ- శ్లోకం 3) "నీళ్లలో బుడగలు పుడతాయి. కాసేపు నీళ్లపై  ఆడతాయి. ఆ తరువాత నీళ్లలోనే కలిసిపోతాయి". (ఆత్మబోధ- శ్లోకం 8) ఈ విధమైన రచనలు మనకు కవులు రూమీలోనూ, ఖలీల్ జిబ్రాన్ లోనూ కనిపిస్తుంది. "పైన ఉన్న ఊకను తీసేస్తే బియ్యపు గింజ చక్కగా తెలుస్తుంది". (ఆత్మబోధ - శ్లోకం16) ఈ చెప్పడం ఎంత సహజంగా ఉందో? ఈ ఉపమానంలో జీవనం కనిపిస్తోంది కదూ?
"దీపానికి ఇంకో దీపం అక్కర్లేదు  తనే ప్రకాశిస్తుంది కాబట్టి".(ఆత్మ‌బోధ . శ్లోకం 29) ఈ ధోరణి మనకు కవి రూమీలో కూడా కనిపిస్తుంది‌. "రోగాన్ని ఔషధం ఏ విధంగా పోగొడుతుందో ఆవిధంగా". (ఆత్మబోధ- శ్లోకం 37)  సహజమైన ఉపమ‌‌ ఇది!  ఇలాంటివి కవి లావ్ ట్సూ లోనూ  కనిపిస్తాయి. "నీళ్లలో నీళ్లు లాగా, ఆకాశంలో‌ ఆకాశం లాగా, తేజస్సులో తేజస్సులాగా" (ఆత్మబోధ- శ్లోకం 53)
ఈ అనడం ఎంత గొప్పగా ఉందో కదా?‌ రూమీ, ఖలీల్ జిబ్రాన్, లావ్ ట్సూ వంటి కవుల్లో ఈ ధోరణి ఉన్నది. "పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది" (ఆత్మబోధ- శ్లోకం 59) ఇక్కడ
"పచ్చిపాలలోన వెన్న పరమాత్ముడు" అని అన్నమయ్య అన్నదానికి మూలం ఇదే..
"అగ్నిలో కాలుతున్న ఇనుము అగ్నిలాగానే ప్రకాశించినట్లు" (ఆత్మబోధ-‌శ్లోకం 62) ఈ చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది! ఈ స్థాయి‌‌ మాటలు‌ శంకరులు ఎన్నో అన్నారు.

"ఎవరు నీ భార్య? ఎవరు నీ కొడుకు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నువ్వెవరివి? ఎక్కణ్ణుంచి వచ్చావు? తమ్ముడూ, ఆ విషయం గుఱించి‌ ఇప్పుడు ఆలోచించు. ( 8 వ శ్లోకం మోహముద్గర లేదా  భజగోవిందం‌ శ్లోకాలు) కవి‌ ఖలీల్ జిబ్రాన్  "your children are not your chidren" అని అనడానికి వందల ఏళ్ల క్రితమే శంకరులు ఈ మాటలు అన్నారు.
"నీ ధనం, నీ పరివారం, నీ యవ్వనం వీటితో గర్వించకు. అవి నిమిషంలో నశిస్తాయి. అవి మాయ. అది తెలుసుకుని బ్రహ్మ‌ పథంలోకి ప్రవేశించు.‌ (11వ శ్లోకం భజగోవింద‌ం‌ శ్లోకాలు) ఇలా అంటూ శంకరులు మనల్ని కదిలిస్తారు.

"ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృ కుక్షౌ స్థితం మాం
విణ్మూత్ర మేధ్య మధ్యేక్కథ యతి‌ నితరాం జాఠరో జాతవేదాః
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం".(శివాపరాథ క్షమాపణ స్తోత్రం.‌‌ శ్లోకం 1)  అంటే మొదట్లో కర్మ అవసరం వల్ల (లేదా కర్మ విస్తరణ వల్ల) కలుషితమై‌న తల్లి కడుపులో ఉండేవాణ్ని నేను. మలమూత్రాలు, కడుపులోని వేడి, ఇతరమైనవి ఏవైతే ఉన్నాయో వాటివల్ల కలిగిన దుఃఖం, వ్యథల్ని ఇతరులు చెప్పడం ఎలా సాధ్యమౌతుంది? అని అర్థం. "గర్భంలోని శిశువు దుఃఖాన్ని , వ్యథను ఎవరు‌ చెప్పగలరు?"‌ ఈ భావన చేసిన‌‌ తొలి కవి, తాత్త్వికులు ఆది‌శంకరాచార్యులే. లావ్ ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్ , షేక్స్పియర్ వంటి కవులెవ్వరూ ఇలాంటి‌ లేదా ఈ‌ స్థాయి చింతన,‌ భావన చెయ్యలేదు. ఇలాంటి రచన, చింతన ఇది ఒక్కటే!

"దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరల తరంగే" (గంగా స్తోత్రం - శ్లోకం 1) ఆది‌శంకరులు తమ‌ గంగా స్తోత్రంలో గంగా‌‌ నదిని "తరల‌ తరంగే‌" ‌అన్నారు. "తరలం" అంటే కదిలేది, ప్రకాశించేది,‌ అనురాగం ఉన్నది, హారం మధ్యలో ఉండే ప్రధాన రత్నం, వజ్రం అని అర్థాలు. ఒక్క మాటతో గంగా నది గుఱించి చెప్పేశారు. ఇలా ఒక్క మాటతో వస్తువుపై సరైన అవగాహన కలిగించడం ఒక మహాకవి లక్షణం. ఆ గంగా‌ నదిని (వసుధాహారం) "భూమికి‌ హారం" అన్నారు. ఇది శంకరుల భవ్య‌మైన భావుకత.

ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన‌ జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి.‌ ఆలకించండి ... 

ఏది అన్నిటికన్నా  ప్రయోజనకరమైనది?

జవాబు: ధర్మం 

ఏది వాంఛింపదగినది?

జవాబు: స్వ, పర హితం.
 
శత్రువు ఎవరు?

జవాబు: సోమరితనం.

ఏది దుఃఖం?

జవాబు: ఉత్సాహం‌ లేకపోవడం.

ఏది‌ జాడ్యం?
జవాబు:‌ నేర్చుకున్నది ఆచరించకపోవడం.

ఏది వెలలేనిది?
జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది.

ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది?
జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత.

 ఏది దానం?
జవాబు: ఆకాంక్ష లేనిది.

ఎవరు స్నేహితులు?
జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు‌.

ఏది పాతకం?
జవాబు:‌ హింస.

ఎవరు ఎదుగుతారు?
జవాబు: వినయం ఉన్నవాళ్లు. 

ఎవరు ప్రత్యక్ష దేవత?
జవాబు: అమ్మ.

వేటిని మనుషులు సంపాదించాలి?
జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం.

వేటిని కాపాడుకోవాలి?
జవాబు:‌ కీర్తి , పతివ్రత, బుద్ధి
 
ఎవరు శూరులు?
జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు.

ఆది శంకరాచార్యులు తమ సౌందర్యలహరి 75వ శ్లోకంలో తమను తాము "ద్రావిడ శిశు" అని‌ ప్రకటించుకున్నారు. ఆ శ్లోకం: "తవ స్తన్యం మన్యే తుహినగిరి కన్యే హృదయతః/పయఃపారావారః పరివహతి సారస్వత మివ / దయావత్యా దత్తం ద్రవిడశిశు‌రాస్వాద్య తవ యత్ / కవీనాం ప్రౌఢానా నుజని‌ కమనీయః కవయితా".  శంకరులు సామాజిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అంటే వారు ఆర్యులు అయుండాలి కదా? పైగా సంస్కృతంలో వ్రాశారు. సంస్కృతం ద్రావిడుల భాష కాదని కదా మనం‌‌ చదువుకున్నది?. ఇక్కడ ఆర్యులైన శంకరులు  సంస్కృతంలో తమను తాము‌ ద్రావిడ శిశు‌‌ అని ప్రకటించుకుంటున్నారు! అదేంటి?‌  నిజమేమిటంటే,  "శంకరుల కాలానికి మన దేశంలో ఆర్య‌ ద్రావిడులు అన్నది లేదు". నిజానికి ఆర్య అన్న జాతి ఎప్పుడూ లేదు. ద్రావిడ అంటే దక్షిణ భూభాగానికి సంబంధించిన అని అర్థం. ద్రావిడ అనే పదం భాషల విభజనకు చెందిన పదం కావచ్చు. ద్రావిడ అన్నది ప్రదేశాన్ని సూచించేది. ద్రావిడ అన్నది జాతిని సూచించేది కాదు. ఆర్య అన్నది జాతిని సూచించేది కాదు. ఆర్య అన్నది శ్రేష్ఠులను సంబోధించే పదం.  అయ్యా , మహాశయా అన్నట్లుగా.... శంకరుల ఈ శ్లోకం వల్ల ఆర్య ద్రావిడ జాతులు అన్నవి నిజం కాని అభూత కల్పనలు అని‌ తెలియవస్తున్నది.‌ ("Aryan invasion is an abandoned theory"  అని Oxford Reference Dictionary కొన్నేళ్ల క్రితం తేల్చి చెప్పింది) ఈ శ్లోకానికి‌ అర్థం : హిమగిరి పుత్రికా (పార్వతీ), నీ స్తన్యం హృదయం నుంచి పుట్టినదైన పాల కడలి.   సారస్వతం (సరస్వతికి‌ సంబంధించినది) దాని నుంచే ప్రవహిస్తోందని తలుస్తున్నాను (అనుకుంటున్నాను).‌ఆ స్తన్యాన్ని ఈ ద్రవిడ శిశువు తాగి ప్రౌఢ కవులలో కమనీయమైన కవిగా పుట్టాడేమో? అద్భుతమైన భావుకతనూ, రచనా‌ సంవిధానాన్నీ‌ చూపారు ఇక్కడ శంకరులు‌. ఇవాళ ప్రపంచంలో గొప్ప కవిత్వాన్నిచ్చిన కవులుగా ఎక్కువగా చదవబడుతున్న లావ్‌ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్పియర్‌ల రచనా సంవిధానం పుష్కలంగా శంకరులలో తొణికిసలాడుతూంటుంది. నిజానికి‌ వీళ్లే కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీశ్రీ , వంటి కవులు కూడా శంకరుల కవితా రచనా‌‌ పరిధిలోని వాళ్లే!

వివేక చూడామణి....ఆది‌ శంకరాచార్య కృతులలో ఈ వివేకచూడామణి అత్యున్నతమైనది. ఈ విషయకంగా దీనికి సరిపోలగల రచన విశ్వంలో మఱొకటి లేదు. ప్రస్థానత్రయం తరువాత మన భూమిలో పుట్టిన మహోన్నతమైన రచన ఇది. ఆ‌‌ వివేక చూడామణి (శ్లోకం‌ 63)లో ‌"అజ్ఞాన సర్ప‌దష్టుడైన (శ్రీశ్రీ‌ బాధాసర్ప దష్టులారా,‌ అనడానికి శంకరుల‌‌ ఈ ప్రయోగమే మూలం) వాడికి బ్రహ్మజ్ఞాన ఔషధం తప్పితే వేదాల వల్ల ఏం ప్రయోజనం?, శాస్త్రాలవల్ల ఏం ప్రయోజనం?, మందుల వల్ల ఏం ప్రయోజనం?‌‌ అనీ, (శ్లోకం‌ 64లో)
"మందుల పేర్లవల్ల కాదు వాటిని‌ సేవిస్తే తప్ప వ్యాధి పోదు‌‌. స్వానుభవం‌ (అపరోక్షానుభవం) తప్పితే బ్రహ్మం, పేరు (శబ్దం) వల్ల నివృత్తి కాదు" అనీ తెలియజెప్పప్పడం వారి ప్రత్యేకతనూ,‌ ఔన్నత్యాన్నీ , దార్శనికతనూ తెలియజేస్తోంది.

ఆది శంకరాచార్య ఒక సర్వజ్ఞ. "మీకు చెప్పులు కుట్టడం వచ్చా"  అని అడిగినప్పుడు శంకరులు చెప్పును రెండుపాదాల మధ్యలో పెట్టకుని సూదిని‌ ముక్కు‌ పక్కభాగంలో రుద్దుకుని చెప్పు కుట్టారట‌. ఇలా సూదిని ముక్కు పక్కన రుద్దడం‌ వృత్తిగా చెప్పులు కుట్టే వాళ్లు చేస్తారు. శంకరులు మడికట్టుకుని కూర్చోలేదు. వీధిలోకి‌ వచ్చి ఉద్యమించారు. వారిని చంపాలని ప్రయత్నాలూ జరిగాయి. అయినా‌ భయపడకుండా సత్యం కోసం‌ పయనించారు, పని చేశారు. 

"ఆది శంకరాచార్యుల వారికి సాటిరాగల మానవ మూర్తిమత్వం ఈ విశ్వంలో మఱొకటి లేనేలేదు"

అటువంటి ఆ మహాశక్తికి,‌ ఆ సనాతన అభివ్యక్తికి; ఆ ఆధ్యాత్మిక సూర్యుడికి, ఆ తాత్త్విక కాంతికి; ఆ‌ విశ్వ మహాకవికి, ఆ భవ్య సాహిత్యానికి; ఆ విశేష నైజానికి, ఆ విశిష్ట వైప్లవ్యానికి; ఆ ధర్మజ్ఞతకు, ఆ దార్శనికతకు;  ఈ మట్టి మనుషులంగా మనసా, వాచా ప్రణామం చేద్దాం. 

"శంకరత్వం ఒక‌ సుజ్ఞాన సత్వం.
సదా అనుగమించాల్సిన తత్త్వం"🙏🙏🙏

Wednesday, September 15, 2021

Understanding consciousness- చైతన్యాన్ని అర్థం చేసుకోవడం

 🌹🌹🌹జాగ్రత్త.. స్వప్న  సుషుప్తి🙏🌹🌹🌹


జాగృదావస్త కన్నా స్వప్నావస్త మిన్న, 

దానికి కన్నా సుషుప్తావస్థ ఇంకాస్త మిన్న, 

దానికన్నా తురియావస్త అద్భుతః. 

అన్నిటికన్నా తురియాతీతవస్త అత్యంత అద్భుతః. 


ఎందుకంటే ఇందులో పరమాత్మ ఉంటారు కనక. కానీ మన ఖర్మ ఏంటి అంటే,  

మన జీవితంలో అధిక భాగం జాగృదావస్త లో, ఆ తరువాత మిగిలినదానిలో ఆదిక శాతము స్వప్నావస్త లో ఉంటాము. 

సుషుప్తి అవస్థలో చాలా తక్కువగా ఉంటాము. తురియా అవస్థలో అస్సలు ఉండము. 


ఇంక తుర్యాతీత అవస్థ ఎక్కడనుండి వస్తుంది మనకి.

ఏమంటారు అంటే..ఏమనరు లెండి, ఏంటో వీడి గోల ప్రొద్దునే అనుకుంటారు.


ఇంతకీ అవస్తాపంచకం ఆంటే వివరంగా కావాలా? అవస్థాపంచకము


పరమేశ్వరిని స్తుతిచేసేటప్పుడు జాగ్రస్వప్న సుషుప్తి నాం సాక్షిభూత్ర్యైనమో నమః అన్నారు. అంటే జాగ్రస్వప్న సుషుమ్నలనబడే మూడు అవస్థలకు ఆ పరమేశ్వరి సాక్షి కాని

అవస్థలు ఐదు.

1. జాగ్రదవస్థ 

2. స్వప్నావస్థ 

3. సుషుప్తి 

4. తురీయావస్థ 

5. తురీయాతీతము

1. జాగ్రదవస్థ : ఇది మేలుకొని ఉన్నటువంటి స్థితి. ఈ స్థితి ననుభవించేది స్థూలదేహము. ఈ స్థితిలో ఉండే పురుషుణ్ణి వైశ్వానరుడు అంటారు. విశ్వములోని

నరులకందరికీ ప్రతీక అయినవాడు. భోగాలు అనుభవించటానికి ఈ దేహమే ఆధారము. జీవి ఈ శరీరంతోనే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. స్థూలశరీరం ఎప్పుడూ జాగ్రదావస్థలోనే అనుభవం పొందుతుంది. అటువంటి స్థూలదేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. జాగ్రదావస్థ ఇతని సంచారస్థానము. ఇతడికి ఏడు అంగములు, పంథానిమిదినోళ్ళు ఉంటాయని

మాండూక్యోపనిషత్తు చెబుతోంది.


సప్తాంగాలు 

1. స్వరము - శిరస్సు

2. సూర్యుడు _ కన్ను

3. వాయువు - ప్రాణం

4, ఆకాశం - శరీరం

5. జలం - మూత్రస్థానం

6. భూమి పాదాలు

7.ఆహవనీయాగ్ని = నోరు


ఇతనికి ముఖాలు పంథొనిమిది. ఇక్కడ ముఖము అంటే శిరస్సు కాదు. అనుభవించే సాధనం అవి.


జ్ఞానేంద్రియాలు - 5

కర్మేంద్రియాలు - 5

ప్రాణాలు - 5

అంతఃకరణచతుష్టయం  -4

(మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము) 19


 

2. స్వప్నావస్థ : ఆత్మ యొక్క రెండవపాదం తైజసుడు. స్వప్నావస్థ ఇతని సంచారస్థానము. స్వప్నంలో ఇంద్రియాలన్నీ మనసులో లయం అయిపోతాయి. అప్పుడు మనసు అనేక విషయాలను అనుభవిస్తుంది. స్వప్నంలో లేనివన్నీ తనకుతానే సృష్టించుకుని

తనవితీరా అనుభవిస్తుంది.


స్వప్నం చూసే వాడికి అది నిజంగా జరుగుతోంది అనిపిస్తుంది. రకరకాల వస్తు సముదాయాన్ని పొందుతాడు. ఎనలేని ఆనందం అనుభవిస్తాడు. కొన్నిసార్లు భయపడతాడు. దుఃఖిస్తాడు. ఈ రకంగా జాగ్రదావస్థలో కలిగే అనుభవాలన్నీ స్వప్నావస్థలో కలుగుతాయి. ఇక్కడ తైజసుడు సూక్ష్మశరీరుడు. ఇతడికి కూడా వైశ్వానరుడుకి మల్లేనే ఏడు అంగాలు,

పంధొనిమిది ముఖాలు ఉన్నాయి.


౩. సుషుప్తి: నిద్రించినపుడు ఏ కోరికలులేని స్థితి. గాఢనిద్ర ఇక్కడ సంచారం చేసేవాడు ప్రాజ్ఞుడు. ఇక్కడ అనుభవాలన్నీ ఏకమైపోతాయి. అంటే జాగ్రస్వప్నవస్థలలోని అనుభవాలన్నీ కరిగిపోతాయి. అంతేగాని నశించవు. ఆ అనుభవాలకు ప్రత్యేకత ఏమీలేదు. చేతనాశక్తి - అంటే గ్రహణశక్తి అస్పష్టంగా నిలిచిపోతుంది. గతించిన అనుభవాలు ఎక్కడో లోపల నిలిచిపోతాయి. అసలు అతను బ్రతికి ఉన్నాడా ? లేదా ? అనిపిస్తుంది. ఆ స్థితిలో ఆనందమయుడై ఆనందం అనుభవిస్తాడు. ఈ ఆనందం స్తబ్దమైనది. తమోగుణ ప్రధానమైనది. ఈ ఆనందంలో 

1. అజ్ఞానము 

2. అహంభావము 

3. సుఖము ఉంటాయి.

ఈ ఆనందము, బ్రహ్మానందము ఒకటి కాదు.


4. తురీయావస్థ : యోగసాధనలో కుండలినీ శక్తిని సహస్రారానికి చేర్చిన అవస్థ. ఇక్కడ మనసు కూడా పనిచెయ్యదు. ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైనది.


5. తురీయాతీతము : ఈ నాలుగు స్థితులకు అతీతమైనది. సాధకుడు తురీయాన్ని దాటితే అన్నింటినీ వదలివేస్తాడు. ఇది వ్యష్టి సమిష్ట్యాత్మకమైన స్థితి. ఈ స్థితి పొందినవాడు సాక్షాత్తూ పరమేశ్వరుడు. ఇక్కడ అన్ని కాలములయందు ఆనందమే ఉంటుంది.


ఈ అవస్థలలో ఆ పరమేశ్వరి సాక్షీభూతమై ఉంటుంది. అంటూ 256 నామం దగ్గరనుంచి 268 నామం దాకా అవస్థా పంచకాన్ని వివరిస్తున్నారు.


 విశ్వరూపా


సృష్టి ఏరకంగా జరిగిందో ముందు చూద్దాం. సృష్టి క్రమంలో ముందుగా ఆవిర్భవించింది తమస్సు. ఆ తరువాత మహసృష్టి జరిగింది. ఆ తరువాతనే అహంకారము వచ్చింది. దాని నుండి పరంచతన్మాత్రలు వచ్చినాయి. అవే శబ్దస్పర్శరూప రసగంధాలు.


ఇవి సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిలో ఐదు జ్ఞానశక్తులు, ఐదుక్రియాశక్తులు ఉన్నాయి. వీటిలో ఉన్న జ్ఞానశక్తులు జ్ఞానేంద్రియాలను ఏర్పరుస్తున్నాయి. అవి


శబ్దము - చెవి

స్పర్శ - చర్మము

రూపము - కన్ను

రసము - నాలుక

గంధము - నాసిక


సమిష్టిగా అంతఃకరణ ఏర్పడుతున్నది. ఆ తరువాత క్రియాశక్తులవల్ల కర్మేంద్రియాలు ఆవిర్భవిస్తున్నాయి. ఇవి సమిష్టిగా ప్రాణాలను పుట్టిస్తున్నాయి. తన్మాత్రలు పంచభూతాలను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు పంచభూతాలు, తన్మాత్రలు, కారణ ఉపాధులతో కూడిన చైతన్యము క్రమంగా విశ్వతైజసప్రాజ్ఞ అనబడుతున్నది. వాటితో కూడిన సమిష్టితత్వము వైశ్వానర, హిరణ్యగర్భ ఈశ్వరులవుతున్నారు. అంతఃకరణకు కారణమైన పరమాత్మే హిరణ్యగర్భుడు.

ప్రాణాకారంతో కూడినవాడు సూత్రాత్మ. వేరుగాని, విడిపోనటువంటి ఈ రెండు కారణాలను అనుసరించి కూడినటువంటివాడు అంతరాత్మ అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ మూడు అంటే 1. పరమాత్మ 2. సూత్రాత్మ 2. అంతరాత్మలే బ్రహ్మ విష్ణు రుద్రులు. వ్యష్టిగా విశ్వతైజసప్రాజ్ఞులకు, సమిష్టిగా వైశ్వానర, హిరణ్యగర్భసూత్రాత్మలకు భేదము

ఉపనిషత్తులననుసరించి చెప్పబడింది. ఉపనిషణ్మతములో జీవాత్మ, వపరమాత్మలకు

ప్రత్యేకంగా ఐదువిభాగాలు ఏర్పడుతున్నాయి. అవి సృష్టి స్థితి లయ జీవాత్మ పరమాత్మలు. కొంతమంది ఈ జగత్తుకు మూడే కారణాలు అంటారు. అవే సృష్టి స్థితి లయాలు. వీరిద్దరికీ తేడా లేదు. ఎందుచేతనంటే స్థూలకారణాలు మూడు. కాగా సూక్ష్మకారణాలు

ఐదు. వీటన్నింటినీ మాండూక్యోపనిషత్తులో వివరించారు.


సర్వంహ్యేతద్‌ బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, సో౭ యమాత్మా చతుప్పాత్‌


ఈ చరాచరజగత్తంతా బ్రహ్మమయమే. ఆత్మ కూడా పరబ్రహ్మమే. ఆత్మకు నాలుగుపాదాలున్నాయి.


జాగరితస్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ వికోనవింశతి


ముఖః స్థూలభుగ్‌ వైశ్వానరః ప్రథమపాదః

 

విశ్వములోని జీవులన్నింటి స్వరూపుడు అయినవాడు వైశ్వానరుడు. జాగ్రదవస్థ ఇతని సంచారస్థానం. అలాగే రెండవవాడు తైజసుడు. స్వప్నమే ఇతని సంచారస్థానం.

మూడవవాడు ప్రాజ్ఞుడు. సుషుప్తి అవస్థ ఇతని సంచారస్థానము. ఈ రకంగా ఉపనిషత్తు చెబుతుంది.


సుషుప్తిలో ప్రాజ్ఞుడికి బ్రహ్మభావం కలుగుతుంది. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకు సుషుప్తిని గురించి వివరిస్తాడు.


కుమారా ! గాఢనిద్రలో ఉన్నప్పుడు అతడు సుషుప్తిలో ఉన్నాడు అంటారు. ఆ స్థితిలో జీవుడు పరమసత్తను పొందుతాడు. అంటే తన నిజస్వరూపాన్ని పొందుతాడు. తన ఆత్మను తాను పొందుతాడు. కాబట్టి అతన్ని గురించి చెప్పేటప్పుడు అతను నిద్రిస్తున్నాడు అంటారు.


అద్దంలో చూసినప్పుడు మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. కాని అద్దం తియ్యగానే అది మాయమైపోతుంది. మన నిజరూపం మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా సుషుప్తావస్తలో మనస్సు ఇంద్రియాలు పనిచెయ్యటం మానేస్తాయి. అప్పుడు

మిగిలేది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ నిజరూపంలో మిగులుతుంది. ప్రతిబింబంలాంటి జీవభావంపోయి ఆత్మభావం మిగులుతుంది. ఆ స్థితిలో ఆత్మను 'స్వపితి” అంటారు. తన ఆత్మ తనలోనే ఉన్నాడని, నిద్రిస్తున్నాడని అంటారు. ఇంద్రియాలన్నీ అలసట చెంది

ఒక్కొక్కటి మనసులో లీనమైపోతాయి. మనసు ప్రాణంలో లీనమైపోతుంది. అంటే సుషుప్తావస్తలో ప్రాణం ఒక్కటే మేల్కొని ఉంటుంది. ఆ ప్రాణమే ఇంద్రియాల యొక్క మనసు యొక్క అలసటను తీరుస్తుంది. మనసుకు బంధనస్థానమైన ప్రాణమే పరదేవత.


బృహదారణ్యకోపనిషత్తులో అజాతశత్రువు అనే రాజు బాలాకి అనే బ్రాహ్మణబాలుడికి సుషుప్తి గురించి వివరిస్తాడు.


సుషుప్తిలో జీవికి బ్రహ్మభావం కలుగుతుంది. అప్పుడు అతణ్ణి ప్రాజ్ఞుడు అంటారు. కాని జీవుడు అవిద్యతో కలిసి ఉంటాడు. అందుచేత అతడు పరమాత్మకాడు. అందుకని సుషుప్తి పొందిన జీవుణ్ణి కారణశరీరమని, తురీయావస్థ పొందిన జీవుణ్ణి మహాకారణ శరీరము అని అంటారు. తురీయావస్థ పైన ఉండేది తురీయాతీతము. ఇది ఐదవ అవస్థ. ఈ స్థితిలో జీవి శివతుల్యుడు అవుతాడు. ముండకోపనిషత్తులో “నిరంజనుడు

అంతకన్న పరమసామ్యము పొందుతాడు” అని చెబుతోంది. పరమసామ్యము అంటే - ఐక్యము. ఈ స్థితిలో పూర్ణజీవత్వము పూర్ణశివత్వాలు వేరుగా లేవు.

 

ఐదువిధాలయిన జీవోపాధులు పంచకోశాలుగా వ్యవహరించబడుతున్నాయి. పరమాత్మకు తిరోధానము అనుగ్రహము అనబడే బంధమోక్షాలు ఉపాధులు కావటం చేత బహిరున్మేషుడు (ప్రత్యక్షము అయ్యేవాడు - శివుడు) అవుతున్నాడు. సదాశివుడు నిమేషాంతుడు. అంటే - కొంత ప్రత్యక్షము, కొంత అప్రత్యక్షము. కాబట్టి తిరోదాన అనుగ్రహముల స్థితులు రుద్రుని కన్న వేరైనవి.


విశ్వ అంటే - జాగరిదావస్థ. స్థూలరూపం గల చైతన్యము గల జీవులు. ఆ జీవుల సమష్టిరూపమే వైశ్వానరుడు.


పరమేశ్వరి ధర్మాధర్మవివర్జితా అని చెప్పబడింది. కాబట్టి జగత్తుకు, దేవికి భేదం లేదు. అందుచేత పరమేశ్వరి రూపము విశ్వరూపము అవుతున్నది. ఈ విశ్వానికి ఆధారము ఆ దేవి. అందుచేత ధర్మిభూతమైన ఇంకొక శరీరము ఆమెకు లేదు.


విష్ణుపురాణంలో “అరటిచెట్టు ఆకులకన్న వేరుగా కనిపించినట్లుగానే, ఓ పరమేశ్వరీ! ఈ విశ్వమంతా నీ యందే ఉన్నది. విశ్వము నీకన్నవేరైనదికాదు” అని చెప్పబడింది. దేవీభాగవతంలో ఆ పరమేశ్వరి శ్రీ మహావిష్ణువుతో “ఈ సమస్తమునేనే. నాకన్న

సనాతనమైనది వేరేలేదు” అంటుంది.


విశ్వరూపము అని గ్రహించిన బ్రహ్మ యొక్క జీవభావము మిక్కిలి నీచ రూపము. అటువంటి నీచ రూపము ఎవరి మహిమవల్ల నాశనమవుతుందో ఆమె విశ్వరూప. ఆమె అనుగ్రహము వలననే నీచమైన సేవ వంటి అనుగ్రహము లభించును.


ఆ పరమేశ్వరి పదహారు కళల స్వరూపము. దర్శ నుండి పూర్ణిమ వరకు 15 కళలు కాగా 16వ కళ సచ్చిదానందరూపిణి అయి ఉన్నది. తిథేలే నిత్యాదేవతలు. నిత్యలే కళలు. ఈ నిత్యాదేవతలను 15వ నామం “అష్టమీచంద్రభిభ్రాజదలిక స్థలశోభితా”లో

వివరించటం జరిగింది. ఈ 15 తిథుల స్వరూవమే శ్రీవిద్య. 16వ కళయే మహాత్రిపురసుందరి. ఈ రకంగా తిథులే పంచదశీమంత్రము అని చెప్పటంవల్ల తిథులు,

పంచదశిమంత్రము, చంద్రమండలము, ఆ పరమేశ్వరి అంతా ఒకటే అవుతున్నారు. అందుకే ఆమె విశ్వరూపా.


తైత్తిరీయ బ్రాహ్మణంలో శుక్లపక్ష కృష్ణపక్ష తిథులను వివరించటం జరిగింది.


వీటిలో మళ్ళీ పగటి తిథులు వేరు రాత్రి తిథులు వేరు. ఆ వివరాలను ఇక్కడ ఇవ్వటం జరుగుతోంది. శుక్లపక్షపగటి పేర్లు.

 


సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతాత్‌

సంకల్పమానం ప్రసంకల్ప మానం ఉపకల్పమానము పక్షప్తం

క్షప్తం శ్రేయోవశీయ ఆయస్సంభూతం భూతం.


శుక్లపక్షరాత్రుల పేర్లు


దర్శాదృష్టా దర్శితా విశ్వరూపా సుదర్శనా


ఆప్యాయమానా ప్యాయమానా ప్యాయా సూనృతా ఇరా

అపూర్వమాణా పూర్వమాణా పూరయంతీ పూర్ణాపూర్ణమాసి


 

సంఖ్య తిది నిత్యతిది పగటి తిధి రాత్రి తిధి


1. పాడ్యమి కామేశ్వరి సంజ్ఞానం దర్శ


2. విదియ భగమాలిని విజ్ఞానం దృష్టా


3. తదియ నిత్యక్లిన్నా ప్రజ్ఞానం దర్శతా


4.చవితి భేరుండా జానత్‌ విశ్వరూపా


5. పంచమి వహ్నివాసిని అభిజానత్‌ సుదర్శనా


6. షష్టి మహావజ్రేశ్వరి సంకల్పమానం ఆప్యాయమానా


7. సప్తమి శివదూతి ప్రకల్పమానం ఆప్యాయమానా


8. అష్టమి త్వరిత ఉపకల్పమానం ఆప్యాయా


9. నవమి కులసుందరి ఉపక్షప్తం సూనృతా


10. దశమి నిత్యా క్షప్తం ఇరా


11. ఏకాదశి నీలపతాక శ్రేయః అపూర్వమాణా


12. ద్వాదశి విజయా వశీయః పూర్వమాణా

13. త్రయోదశి | సర్వమంగళా | ఆయత్‌ పూరయంతే


14. చతుర్దశి జ్వాలామాలిని | సంభూతం పూర్ణా


15. పూర్ణిమ చిత్రా భూతం పూర్ణమాసీ


కృష్ణ పక్ష పగటి తిధులు పట్టిక లో చూడండి


ప్రష్టుతం విష్ణుతగిం సంస్తుతం కల్యాణం విశ్వరూపం

శుక్ర మమృతం తేజస్వి తేజ స్సమిద్ధం

అరుణం భాను త్మరీచీ మదభితపస్తపస్విదితి


  


పంచదశీ మహామంత్రము మూడుఖండములు గల మంత్రము మొదటిఖండంలో 5, రెండవఖండంలో 6, మూడవఖండంలో 4 బీజాక్షరాలుంటాయి. తిథులను కూడా మూడుభాగాలుగా చేయటం జరిగింది.


మొదటి భాగంలో 5, రెండవభాగంలో దశమి, ఏకాదశి రెండూ ఒకటిగానే పరిగణస్తారు కాబట్టి 6. మూడవభాగంలో ద్వాదశి నుంచి 4 తిథులుంటాయి. అయితే

 

ఇంకొక మతం ప్రకారము మూడు ఖండాలలోను ఐదు చొప్పున 15 తిథులు ఉంటాయి. ఈ తిథులే పంచదశి మంత్రంలోని బీజాక్షరాలు.


ఈ రకంగాచూస్తే శుక్లపక్షపు నాల్గవనాటిరాత్రి పేరు విశ్వరూపా. ఇది వాగ్భావకూటమిలోని నాల్గవఅక్షరము, పరమేశ్వరిని విశ్వరూపా అనటం ఈ రాత్రిపేరున చెప్పటముకాక వేరుకాదు.


దేవీభాగవతంలోని సప్తమస్కంధంలోని 81వ అధ్యాయంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా ఆ పరమేశ్వరిని ప్రార్ధిస్తారు. అప్పుడు ఆమె వారికి సాక్షాత్కరించింది. హిమవంతుడు. “తల్లీ ! నీ విశ్వరూపం చూడాలని కోరికగా ఉన్నది. దేవతలంతా కూడా ఇదే కోరుతున్నారు. ఒకసారి మాకు చూపవలసినది. అని అడుగుతాడు. అప్పుడు ఆ

పరమేశ్వరి తన విరాడ్రూపం వారికి చూపింది.


ద్యౌ ర్మస్తకం భవే ద్యస్య చంద్రసూర్యౌ చ చక్షుషీ


దిశః శ్రోత్రో వచో వేదాః ప్రాణోవాయుః ప్రకీర్తితాః


విశ్వం హృదయమిత్యాహుః పృథివీజఘనం స్మృతమ్‌ 1


నభస్తలం నాభిసరో జ్యోతిశ్చక్ర మురః స్థలమ్‌


మహర్లోకస్తు (గ్రీవాస్యా జ్ఞనోలోకో ముఖంస్కృతమ్‌ ॥


తపోలోకో లలాటస్తు సత్యలోకాదధః స్థితః


ఇంద్రాదయో బాహవః స్యు శబ్ధః శోత్రం మహేశితుః ॥


నాసత్య దస్రా నాసేస్తో గంధో ఘ్రాణం స్మృతోబుదైః


ముఖమగ్నిః సమాఖ్యాతో దివారాత్రీ చ పక్ష్మణీ ॥


బ్రహ్మస్థానం భ్రూవిజృంభోల ప్యాపస్తాలుః ప్రకీర్తితా


రసోజిహ్వాసమాఖ్యాతా యమోదంప్రాః ప్రకీర్తితా ॥


దంతాః స్నేహకలా యస్య హాసోమాయా ప్రకీర్తితా


సర్గ స్త్వపాంగమోక్షః స్యాద్రీడోర్ట్వోష్థా మబేశితుః ॥


లోభః స్యాదధరోష్టోల_ స్యా ధర్మమార్గ స్తు పృష్టభూః


ప్రజాపతి శ్చ మేడ్రం స్యాదః స్రష్టా జగతీతలే ॥


కుక్షిః సముద్రా గిరయోల_ స్టీని దేవ్యా మహేశితుః

నద్యోనాడ్యః సమాఖ్యాతా వృక్షౌః కేశాః ప్రకీర్తితాః ॥


అంటూ దేవి విశ్వరూపాన్ని వర్ణిస్తారు.

 

 

అనేక బాహువులు, వేలతలలు, నానారకాల ఆయుధాలు ధరించి కోట్లకొలది సూర్యులకాంతితో ప్రకాశిస్తున్నది ఆ పరమేశ్వరి.


శ్రీమద్భాగవతంలోకూడా శ్రీ మహా విష్ణువును ఈ రకంగానే వర్ణించటం జరిగింది.


బ్రహ్మావాచ

వాచాం వషే ర్ముఖం క్షేత్రం ఛందసాం సప్తధాతవః !

హవ్యకవ్యామృతాన్నానాంజిహ్వా సర్వరసస్య చ ॥

సర్వాసూనాంచ వాయోశ్చ తన్నాసే పరమాయనే ॥

అశ్వినోరోషధీనాంచ కఘ్రాణోమోద ప్రమోదయోః ॥

రూపాణాం తేజసాం చక్షుర్దివః సూర్యస్య చాక్షిణీ |

కర్ణౌదిశాంచతీర్థానాం శ్రోత్రమాకాశ శబ్దయోః ॥

తద్గాత్రం వస్తు సారాణాం సౌభగ్యస్య చ భాజనం ॥

త్వగస్య స్పర్శవాయోశ్చ సర్వమేధస్య చైవ హి!

రోమాణ్యు ద్భి జ్ఞజాతీనాం యైర్వాయజ్ఞస్తు సంభృతః ॥

కేశ శ్మశ్రు నఖాన్యస్య శిలా లోహాథ్రవిద్యుతామ్‌ ।

బాహవో లోకపాలానాం ప్రాయశః క్షేమకర్మణాం ॥

విక్రమో భూర్భువః స్వశ్చక్షేమస్య శరణస్య చ।

సర్వకామ వరస్యాపి హరేశ్చరణ ఆస్పదమ్‌ ॥

అపాం వీర్యస్య సర్గస్య పర్జన్యస్య ప్రజాపతేః ।

పుంసః శిశ్చ ఉపస్థస్తు ప్రజాత్వానంద నిర్వృతేః 1

పాయుర్యమస్య మిత్రస్య పరిమోక్షస్య నారద ।

హింసాయా నిర్రుతేర్మ ఛఎత్యోర్నిరయస్య గుదః స్మృతః ॥

పరాభూతేరధర్మస్య తమసశ్చాపి పశ్చిమః ।

నాడ్యోనదనదీనాం తు గోత్రాణామాస్థి సంహతిః ॥

అవ్యక్త రస సింధూనాం భూతానాం నిధనస్యచ ।

ఉదరం విదితం పుంసో హృదయం మనసః పదమ్‌ ॥

ధర్మస్య మమ తుభ్యం చ కుమారాణాం భవస్యచ ।

విజ్ఞానస్యచ సత్త్వస్య పరస్యాత్మా పరాయణమ్‌ ॥

అహం భవాన్‌ భవశ్చెవ త ఇమే మునయోల గ్రజాః !

సురాసురనరా నాగాః ఖగా మృగ సరీసృపాః ॥

 

గంధర్వాప్సరసో యక్షా రక్షోభూతగణోరగాః ।


పశవః పితరః సిద్ధా విద్యాథ్రా శ్చారణా ద్రుమాః ॥


అన్యేచ వివిధా జీవా జలస్థలనభౌకసః ॥


గ్రహరకేతవస్తారా స్తడితః స్తనయిత్చవః ॥


సర్వం పురుష ఏ వేదం భూతం భవ్యం భవశ్చయత్‌ ।

తేవేదమావృతం విశ్వం వితస్తిమధి తిష్టతి ॥


స్వధిష్ట్యం ప్రతపన్‌ ప్రాణో బహిశ్చ ప్రతపత్యసౌ


ఏవం విరాజం ప్రతపంస్తపత్యన్తర్భహిః పుమాన్‌ ॥


సోల మృ తస్యాభ యస్యే శో మర్త్యమన్నం యదత్యగాత్‌ ।

మహిమైష తతోబ్రహ్మన్‌ పురుషస్య దురత్యయః ॥


పాదేషు సర్వభూతాని పుంసః స్థితిపదోవిదుః ॥


అమృతం క్షేమమభయం త్రిమూర్శోోలి. ధాయి మూర్ధసు 

పాదాస్త్రయో బహిశ్చాసన్న ప్రజానాం య ఆశ్రమాః ।


అంత స్రిలోక్యాస్త్వ స్త౧పరో గృహమేధోవ ౨ బృహద్ర్వతః (

సృతీ విచక్రమే విప్ప్వజ సాశనానశనే ఉభౌ ।


యదవిద్యా చ విద్యాచ పురుష స్తూభయాశ్రయః ॥

యస్మాదండం విరాడ్‌ జజ్లే భూతేంద్రియ గుణాత్మకః ।

తద్‌ ద్రవ్యమత్యగాద్‌ విశ్వం గోభిః సూర్యయివాతపన్‌ ॥

 

 నీలకంధరునకు, నీకు నాకు సనత్కు

మారముఖ్య సుతసమాజమునకు

ధర్మసత్వబుద్ధి తత్త్వములకు నీశ్వ

రాత్మవినుము పరమమైన నెలవు ॥


నరసురాసుర పితృనాగకుంజర మృగ, గంధర్వ యక్షరాక్షస మహీజ

సిద్ధ విద్యాధర జీమూతచారణ గ్రహ తారకాప్సరోగణ విహంగ

భూతతటిద్వసు పుంజంబులును, నీవు ముక్కుంటియును, మహామునులు, 

సలిలనభస్థ్థలచరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల

విష్ణుమూర్తిమయము పుత్ర | వేయేల, బ్రహ్మాండ


మతని జేనలోన నడగియుండు

బుద్ధినెరుగరాదు; భూతభవద్భవ్య

లోకమెల్ల విష్ణులోన నుండు ॥

మండలములోన భాస్కరుం 

డుండి జంగబులకు దీప్తి నొసంగెడి క్రియ బ్ర

హ్యాండములోపల నచ్యుతుం

డుండుచు బహిరంతరముల నొగి వెలింగించున్‌

 

భగవద్గీతలోని 11వ అధ్యాయంలో 15 నుంచి 28 వరకు శ్లోకాలలో శ్రీకృష్ణుని


విశ్వరూపాన్ని వర్ణించాడు అర్జునుడు.


పశ్యామి దేవాన్‌ తవ దేవ ! దేహే

సర్వాన్‌ తథా భూతవిశేష సంఘాన్‌ ।

బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం

బుషీన్‌ చ సర్వానురగాన్‌ చ దివ్యాన్‌ 11


శ్రీకృష్ణా ! నీ శరీరమునందు సకల దేవతలను, సమస్త ప్రాణి సమూహములను,


చతుర్ముఖ బ్రహ్మను, బ్రహ్మ ఆజ్ఞానువర్తియగు రుద్రుని, సకల బుషిపుంగవులను, ప్రకాశించు వాసుకి మొదలగు సర్పరాజములను చూచుచున్నాను.


అనేక బాహూదర వక్రనేత్రం

పశ్యామిత్వాం సర్వతోల_ నంతరూపం ।

నాంతం న మధ్యం న పునస్తవాదిం

పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ! ॥


ప్రపంచమునకు నాథుడవగు ఓ విశ్వరూపధరా ! నిన్ననేక భుజములు, కడుపులు, ముఖములు, కన్నులు కలిగి ఇంతింతనరాని యాకారములు కలవానినిగా నంతటను చూచుచున్నాను. పైగా నీయాది మధ్యాంతములు నాకు గోచరించుటలేదు.


కిరీటినం గదినం చక్రిణం చ

తేజోరాశిం సర్వతో దీప్తిమంతం ॥

పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్‌

దీప్తానలార్మద్యుతిం అప్రమేయమ్‌ ॥


కాంతిపుంజమై యంతటను నిండిన కాంతివలన చూడశక్యముగాక మండుచున్న నిప్పు, సూర్యుల కాంతివంటి కాంతి గలిగి యముంతయని హద్దుగా చెప్పదగని నిన్ను కిరీటాది భూషణములను చక్రగదాద్యాయుధములను ధరించియున్నట్లు దర్శించుచున్నాను.


త్వమక్షరం పరమం వేదితవ్యం

త్వమస్య విశ్వస్య పరం నిధానం !

త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా

సనాతనస్త్వం పురుషో మతో మే ॥

 

ముండకాది ఉపనిషత్తులలో తెలియదగినదిగా నిర్దేశింపబడిన పరమైన అక్షరము

నీవే. ఈ జగత్తునకు సర్వోత్కృష్టమైన ఆధారము నీవే, స్వరూపాదుల యందెల్లప్పుడు

నొక్క రూపముతో నుండువాడవు నీవే. నిత్యమైన ధర్మములను కాపాడువాడవు నీవే,

పురాణపురుషుడవు నీవే యని నాకిప్పుడు తెలిసినది.


అనాది మధ్యాంతం అనంతవీర్యం

అనంతబాహుం శశిసూర్యనేత్రం ॥

పశ్యామి త్వాం దీప్రహుతాశవక్రం

స్వతేజసా విశ్వమిదం తపంతమ్‌ ॥


ఆది మధ్యాంతములు లేనట్టియు, అపరిమిత పరాక్రమము కలిగి యునృట్టియు,

లెక్కలేనన్ని చేతులు కలిగియున్చట్టియు, చంద్రునివలె చల్లగను, సూర్యునివలె తీవ్రముగా

నుండు కండ్లు కలిగినట్టియు, కాలాగ్సివలె మండుచున్న ముఖము కలిగినట్టి నీ తేజస్సుచేత

ఈ ప్రపంచమును తపింపజేయుచున్న నిన్ను జూచుచున్నాను.ద్యావాపృథివ్యోః ఇదమంతరం హి


వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |

దృష్ట్వా ద్భుతం రూపముగ్రం తవేదం

లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్‌ ! ॥

భూమి ఆకాశముల మధ్యభాగమంతయును అన్ని దిక్కులను నీవే వ్యాపించి

యున్నావు. మహాత్మా! బ్రహ్మాది దేవతావర్ణములో అనుకూలురు - ప్రతికూలురు మధ్యస్థులు

అనెడు మూడు విధముల వారును అత్యద్భుతమై అతి భయంకరమైయుండు నీ రూపమును

జూచి భయపడుచున్నారు. (అర్జునునకు తన ఐశ్వర్యమును జూపుటకై భగవానుడు

వీరందరికిని దివ్యదృష్టి నొసంగెను.)


అమీ హిత్వాం సురసంఘా విశంతి

కేచిత్‌ భీతాః ప్రాంజలయో గృణంతి ॥

స్వస్తీ త్యుక్వా మహర్షి సిద్ధసంఘాః

స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ॥

 ఈ గొప్ప దేవతా సమూహము నీ సమీపమునకు వచ్చుచున్నది. కొందరు భయపడి చేతులు జోడించి స్తోత్రము చేయుచున్నారు. భృగువు మొదలగు మహర్షులు, సనకాది సిద్ధులును నీకు మంగళాశాసనమును గావించి నీకు తగిన సంపూర్ణస్తోత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.


రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః

విశ్వేల శ్వినౌ మరుతశ్చ ఊప్మపాశ్చ ॥

గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః

వీక్షంతే త్వాం విస్మితాశ్రైవ సర్వే 1!


ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సకల సాధ్యులును,

విశ్వేదేవతలును, ఇద్దరశ్వినీదేవతలును, సప్తమరుత్తులును, పితృదేవతలును, గంధర్వ యక్ష

రాక్షస సిద్ధసమూహములున్ను, అందరును ఆశ్చర్యమును పొంది నిన్ను చూచుచున్నారు.


రూపం మహత్తే బహువక్రనేత్రం

మహాబాహో ! బహుబాహూరుపాదం ॥

బహూదరం బహుదం ప్రాకరాళం

దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాల హమ్‌ ॥॥


శ్రీకృష్ణా ! అనేక ముఖములను, లెఖ్ఖలేని కన్నులును పరిమితిలేని భుజములును, పెక్కుతొడలును, బహుపాదములును, అనేకములగు కడుపులును, పెక్కు కోరలచేత అతిభయంకరమగు నీ యిట్టి గొప్ప ఆకారమును జూచి జనులందరును అతిభయముతో

వణుకుచున్నారు, అట్లే నేనును భయపడుచున్నాను.


వేదంలోని పురుషసూక్తంలో


సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌ .....

పద్భ్యాంభూమిః దిశశ్రోత్రాత్‌ తథా లోకాగ్‌ం అకల్పయన్‌ అని చెప్పబడింది.

ఈ రకంగా విశ్వమంతా ఆమెలో నిండి ఉన్నది కాబట్టే విశ్వరూపా అనబడింది.

అలాగే “విశ్వరూపం” అనేది కృష్ణపక్షంలో పంచపమితిథి పగటిపేరు. అంటే తిధులస్వరూపం గలది ఆ దేవి. ఈ రకంగా కృష్ణపక్షంలో పగటితిథులు, రాత్రి తిథులు

కూడా ఆ దేవతాస్వరూపమే. 


సమయ మతస్తులు శుక్లపక్ష రాత్రులందు చివరిభాగంలో మాత్రమే ఉపాసన చేస్తారు గౌడపాదులవారు తమ సుభగోదయస్తుతిలోని 31వ శ్లోకంలో

అతః శుక్లేపక్షే ప్రతిదిన మిహ త్వాం భగవతీం

నిశాయాంసేవంతే నిశి చరమభాగే సమయినః

అన్నారు. శుక్లపక్షరాత్రులందు మాత్రమే కుండలినీ ప్రబోధం జరుగుతుంది.


శంకరభగవత్పాదులవారు కూడా తమ సౌందర్య లహరిలోని 87వ శ్లోకంలో ఇ మాటను చెప్పారు.

హిమానీ హన్తవ్యం హిమగిరి నివాసైక చతురౌ

నిశాయాం నిద్రాణాం నిశి చరమభాగే చ విశదౌ


కాబట్టి శుక్లపక్ష తిథులన్నీ పరమేశ్వరి స్వరూపమే. ఈ రకంగా తిథులు, కాలమానమ అంతా పరమేశ్వరి స్వరూపమే కాబట్టి ఆ దేవిని “విశ్వరూపా” అన్నారు.


శుక్లపక్షరాత్రులు మధుకృతులు. పగళ్ళు మధువృషులు అని వేదం చెబుతోందిఈ విషయాన్ని తెలుసుకున్నవాడి శరీరంలో 'బ్రహ్మరంధ్రము నుంచి మధువు వర్శిస్తుంది

అతనికి ఇష్టా పూర్తి కలిగిస్తుంది. ఈ విషయం తెలియని వాడికి మధువు స్రవించదు అతని కర్మలు సఫలంకావు.


విశ్వము అంటే ప్రపంచం. పరమేశ్వరి ప్రపంచమంతా ఆవరించి ఉన్నది కాబట్టి విశ్వరూపా అనబడుతోంది.


బ్రహ్మాండము-విరాడ్రూపము. పిండాండము-జీవుని శరీరము. ఈ రెండింటికీ తేడా ఏమీలేదు. ఇక్కడ విశ్వరూపా అంటే పరమేశ్వరికి ఈ జగత్తుకూ భేదము లేదని భావము


ఈ కారణాలచేత పరమేశ్వరి విశ్వరూపా అనబడుతోంది.


 జాగరిణీ


జాగ్రదవస్థ అందరికీ ప్రసిద్ధమైనది. సర్వేంద్రియ గోచరమైనది. ప్రభోధాత్మకమైన సర్వేంద్రియజ్ఞానము గల విశ్వుడు అనే జీవుని అవస్థ జాగరము. అటువంటి జాగ్రదావస్థ గలది ఆ పరమేశ్వరి.

 జాగ్రదవస్థలో స్థూలశరీరాభిమాని అయిన దేవి విశ్వునిరూపంలో ఉంటుంది. అందుచేత జాగరిణీ అనబడుతోంది. మాండూక్యోపనిషత్తులో

సోయమాత్మాచతుప్పాత్‌ ఆత్మకు నాలుగుపాదాలు ఉన్నాయి. అందులో మొదటిది

జాగరితస్థానో బహిః  ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి

ముఖః ! స్థూల భుగ్‌ వైశ్వానరో ప్రథమపాదః ॥

ఆత్మ యొక్క మొదటిపాదం వైశ్వానరుడు. ఇతడు విశ్వంలోని నరులందరికీ ప్రతినిధి. స్థూల శరీరమున్నవారందరికీ ప్రతినిధి. భోగాలు అనుభవించటానికి ఈ దేహమే ఆధారం. జీవి ఈ శరీరంతోనే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు.


గృహస్తుకు గృహంలాగా జీవికి దేహం ఆధారమై ఉన్నది. జగత్తులో ఇటువంటి దేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. జాగ్రదవస్థ ఇతని సంచారస్థానము. ఆ రూపంలో ఉన్నది కాబట్టే పరమేశ్వరి జాగరిణీ అనబడుతోంది.


స్వపంతీ


నిద్రావస్థాయామంతః ప్రజ్ఞామాత్రేణ ప్రపంచానుభవో వాసనారూపేణ సః స్వప్నః


నిద్రావస్థయందలి మానసికమగు ప్రపంచానుభవము స్వప్నము అని తెలియబడును. స్వప్నమనేది సూక్ష్మశరీర సంబంధమైన వ్యవహారము. జాగ్రదవస్థలో ప్రపంచానుభవాలన్నీ బీజం రూపంలో ఉండి, స్వప్నకాలంలో మనసుకు కనిపిస్తాయి. ఇవి అన్నీ ఈ జన్మలోని అనుబంధాలే అవనవసరంలేదు. ఆ అనుభూతులు గతజన్మలకు సంబంధించినవి కూడా

కావచ్చు. ఈ దశలో శరీరంలోని ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. మనస్సు మేల్కొని ఉంటుంది. ఈ మనస్సే ఇంద్రియధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది.

జాగ్రదవస్థలో ఇంద్రియజ్ఞానము స్థిరము. స్వప్నావస్థలో ఇంద్రియజ్ఞానము స్థిరము కాదు. మనసే ఇంద్రియాల పనులన్నీ చేస్తుంటుంది. స్వప్నమనేది కేవలము మానసిక సంబంధము. నిద్రాసమయంలో విషయాలు తెలుస్తాయి. మెలకువరాగానే అవన్నీ

మాయమవుతాయి. ఈ రకంగా సూక్ష్మశరీరంతో మానవుడు పొందే అనుభూతికి ఆ పరమేశ్వరియే సాక్షీభూతంగా ఉన్నది. అందుకే ఆమె స్వపంతీ అనబడుతుంది.

 

 తైజసాత్మికా

స్వప్నస్థానము పొందిన సూక్ష్మదేహాభిమాని అయిన జీవుల సమిష్టిరూపుడైన తైజసుడను హిరణ్యగర్భుని యొక్క ఆత్మ గలది.


స్వప్నము సూక్ష్మదేహము యొక్క వ్యవహారము. ఈ స్థితిలో వ్యష్టిదేహాభిమాని తైజసుడు. సమిష్టిగా అతడు హిరణ్యగర్భుడు. సూక్ష్మదేహంతో చేసే కర్మలన్నింటికీ సాక్షి ఆ పరమేశ్వరి. ఆమె తైజసుని రూపంలో ఉంటుంది. కాబట్టి తైజసాత్మికా అనబడుతున్నది.

మాండుక్యోపనిషత్తులో స్వప్నస్థానాన్ని వివరిస్తూ


స్వప్నస్థానోల. ౦తః ప్రజ్ఞః ! సప్తాంగ ఏకోనవింశతిముఖః


ప్రవివిక్త భుక్‌ తైజసో ద్వితీయ పాదః ॥


ఆత్మ యొక్క రెండవపాదము తైజసుడు. అదే మానసికస్థితి. ఈ మానసికస్థితికి హిరణ్యగర్భుడని పేరు. ఇతడు అంతర్ముఖమైన చేతన కలవాడు. స్వప్నంలో జరిగే విషయాలను మాత్రమే గ్రహించగలడు.


ఆ తైజసుని ఆత్మ గల పరమేశ్వరి తైజసాత్మికా అనబడుతుంది.


సుప్తా

సుప్తా అంటే ఇంద్రియవ్యాపారము నశించిన నిద్రావస్థ. శివసూత్రాలలో ఇది మాయ, అజ్ఞానము సౌషుప్తము అని ఉన్నది. బాహ్య వస్తువులను గురించిన జ్ఞానము ఏ

మాత్రము ఉండదు. అందుకే నేను సుఖంగా నిద్రపోయాను నాకేం తెలియదు అంటాడు. ఇలా చెప్పటంవల్ల అవిద్యావృత్తులు మూడు ప్రస్ఫుటమవుతున్నాయి. 1. అజ్ఞానము 2. అహంభావము 3. సుఖము. ఈ మూడు వృత్తులు కలది సుషుప్తావస్థ. ఈ అవస్థకు అభిమాని ప్రాజ్ఞుడు.


నిర్వికార స్వరూపస్థితినే సుషుప్తి అంటారు. ఈ అవస్థను సంప్రసాదావస్థ అని కూడా అంటారు. మనస్సు, బుద్ధి కూడా హృదయంలో లీనమయ్యే స్థితి అది.


ఈ స్థితిలో ఇంద్రియాలు, బుద్ధి ముఖ్య ప్రాణంలో కలిసిపోతాయి. ఈ రకంగా మనసు, బుద్ధి కూడా లయమయినప్పటికీ, మెలకువరాగానే తాను సుఖంగా నిద్రించాను అని తెలుస్తోంది. అంటే జ్ఞానము మాత్రము ఉన్నది. ఇక్కడ ఆనందాన్ని పొందుతుంది. కాబట్టి పరమేశ్వరి సుప్తా అనబడింది.


ప్రాజ్ఞాత్మికా

సుషుప్తిలో ఆనందము పొందిన జీవులయొక్క సమిష్టిరూపము కలది ఆ పరమేశ్వరి. ఈ స్థితిలో జీవుడు వ్యష్టిగా ప్రాజ్ఞుడు, సమిష్టిగా ఈశ్వరుడు. ప్రాజ్ఞుడిరూపంలో ఉన్నది కాబట్టి ఆ దేవి ప్రాజ్ఞాత్మికా అనబడుతుంది. మాండూక్యోపనిషత్తులో


నిద్రించినపుడు ఏ కోరికలు, కలలు లేని స్థితి సుషుప్తి. గాఢనిద్ర. ప్రాజ్ఞుడు సుషుప్తిలో సంచారం చేస్తాడు. ఇక్కడ అతని అనుభవాలన్నీ ఏకమైపోతాయి. చేతనాశక్తి అంటే గ్రహణశక్తి అస్పష్టంగా నిలచిపోతుంది. అసలు అతను చేతనుడా ? కాదా ? అని కూడా అనిపిస్తుంది. అటువంటి ప్రాజ్ఞుని ఆత్మగా కలది కాబట్టి ప్రాజ్ఞాత్మికా అనబడుతుంది ఆ పరమేశ్వరి.

 

తుర్యా


ఇది యోగంలో సాధించే స్థితి. మనస్సు, బుద్ధి రెండూ బ్రహ్మరంధ్రం చేరినప్పుడు కలిగే స్థితి, ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైనది. మనస్సు, బుద్దుల

యొక్క మార్పులను బట్టి అవస్థలు మారతాయి.


మనసు బుద్ధి కళ్ళను ఆశ్రయిస్తే - జాగ్రదవస్థ

మనసు బుద్ది మనోగతమైతే -  స్వప్నావస్థ

అవి హృదయగతమైతే - సుషుప్తావస్థ

అవి సహస్రారం చేరితే - తురీయావస్థ


సాధకుడు యోగసాధనలో తురీయస్థితి చేరటము గతంలో వివరించటం జరిగింది. ఈ రకంగా మూడు అవస్థలలోనూ ఉంటూ అన్నింటికీ సాక్షీభూతమైనది కాబట్టే ఆ పరమేశ్వరి తుర్యా అనబడింది.


అందుకే లలితా అష్టోత్తరంలో జాగ్రస్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యైనమోనమః అని చెప్పబడింది.

          

సర్వావస్థావివర్జితా


జాగ్రస్వప్న సుషుప్తులు మూడు అవస్థలు నాల్గవది తురీయావస్థ. ఇక ఐదవ అవస్థ తురీయాతీతము. తురీయాన్ని దాటిన తరువాత సాధకుడు అన్నింటినీ వదలివేస్తాడు.

వివర్జిత - వర్జించినది. విడిచినది. ఒక దాని నుంచి వేరొక దానికి రాలేనిది. పునరావృత్తి లేనిది. ఈ అవస్థ వ్యష్టి సమష్ట్యాత్మకమైనది. తురీయాన్ని గనక గట్టిగాసాధిస్తే,

తురీయాతీతము లభిస్తుంది. ఇదే పరమపదము. తుర్యాతీతము పొందినవాడు శివునితో సమానమగును. ఏ మాత్రము ద్వైతభావము లేనిస్థితి. ఇక్కడ కాలభేదముండదు. అన్ని కాలాలయందు ఆనందమే స్వరూపము. ఇటువంటి సాధకుడు జీవన్యుక్తుడు. దేహేంద్రియాలు ఉన్నప్పటికీ అతడు కర్మలు చెయ్యడు. మాడిపోయి మొలకెత్తటానికి

పనికిరాని విత్తనము వంటివాడు.


అతడు జీవించి ఉన్నప్పటికీ కర్మలు చేయడు. లోకంతో అతనికి సంబంధం లేదు. అతడు పరమేశ్వర స్వరూపుడు.

ఈ రకంగా జీవి యొక్క ఐదు అవస్థలను వివరించటం జరిగింది.

Saturday, September 11, 2021

*🍁దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు?*🍁

*🍁దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు?*🍁
🙏 ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో…, అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు…

– మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.

– మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.

– మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.
ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.
మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.

– కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.

– మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.
‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.
మరి *మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా?* అన్నదే ఈనాటి మన ప్రశ్న.
పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….

– *ఆకాశానికి* ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.

– *వాయువు* కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.

– *అగ్ని* కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.

– *జలము* కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.

– *భూమి* కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

– *జలము*…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

– *అగ్ని*…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

– *వాయువు*…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

– *ఆకాశం*…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. *‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే.* అదే దైవ సాక్షాత్కారం అంటే.🙏

Friday, September 10, 2021

*🌚మహాలయ పక్షం - పురాణ గాధ*

*🌚మహాలయ పక్షం -  పురాణ గాధ*

*ఎప్పటి  నుండి మహాలయ పక్షం ప్రారంభం,మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?*
🟧🟠🔶🟧🟠🔶🟧🟠🔶🟧🟠
🟧🔶🟠🟧🔶🟠🟧🔶🟠🟧🔶
👉🏿 మహాలయ పక్షం 20 సెప్టెంబర్నుంచి ప్రారంభమైఅక్టోబర్ 6  మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించి , వారికి నమస్కారము చేస్తూ ,  *నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి , మీ దీవెనలు అందచేయండి’* అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. 

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య  నైనా చేసి తీరాలి. 

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. 

ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి , తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా *‘‘కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’* అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. 

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా , ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. 

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
 *_మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి ?_*

🕉🕉🕉🕉🕉🕉
మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

20 సెప్టెంబర్నుంచి ప్రారంభమైఅక్టోబర్ 6 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

*పితృదేవతలకు.... ఆకలా...?*

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*

*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వా

రి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... 

పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది.  పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.

*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి  సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.
 _*ఈరోజునుండి మహాలయ పక్షం ప్రారంభం (ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఏమి లభిస్తుంది)*_

🕉🕉🕉🕉🕉🕉
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షం
ఈ పక్షములో పితరులు అన్నాన్ని , ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున , మహాలయ పక్షములలో పితృతర్పణములు , యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే , పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు , తమ వంశాభివృద్ధి జరుగును . వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు , నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.

భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము , కృష్ణపక్షం పితృపదము , అదే మహాలయ పక్షము. మహాలయమంటే - *మహాన్ అలయః , మహాన్‌లయః మహల్ అలం యాతీతివా* అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము , పితృదేవతల యందు మనస్సు లీనమగుట , పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట , అని అర్థములు. అమావాస్య అంతరార్థం: *‘‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం.* చంద్రుడు , సూర్యుడిలో చేరి , సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు. 

భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.

మహాలయ పక్ష ప్రారంభం /ఈరోజు నుండి పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవ

తలు పూజలకు ఉద్దేశించినవి. 
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. 
జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. 

భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర , పౌత్రుల దగ్గరకు వస్తారు 
ప్రతి మాసంలోను అమావాస్య , పితరుల పుణ్య తిథి గా భావించబడినా , మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. 
ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు , విద్య , ధనం , సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది , కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. 
మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా తెలుసుకోన్నది.

1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

2. విధియ లో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.

3. తదియ లో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.

4. చవితి రోజు శ్రార్ధము పెడితే పగ వారు(శత్రువులు)లేకుండా చేయును.

5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగచేయును.

6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనియులుగా చేయును.

7. సప్తమి రోజు పరలోకంలో ఓక దేవగోష్టికి నాయకునిగా చేయును.

8. అష్టమీ రోజు మంచి మేధస్సును చేకూర్చును.

9. నవమి మంచి భార్యను సమ కూర్చిను. గయ్యాళియైన భార్య కూడా బుధ్దిమంతు రాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.

10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.

11. ఏకాదశి రోజున సకల వేదా , విద్యా పారంగతులను చేయును.

12. ద్వాదశి రోజున స్వర్ణములను , స్వర్ణ ఆభరణములను సమ కూర్చును.

13. త్రయోదశి రోజు న సత్సంతానాన్ని , మేధస్సును , పశు , పుష్టి , సమృద్ధి , దీర్ఘఆయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.

14. చతుర్దశి తిది రోజు న వస్త్రం లేక్ అగ్ని(ప్రస్తుత కాలంలో రైలు , మోటారు వాహనములు వల్ల విపత్తు) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.

15. అమావాస్య రోజున సకలాభిష్టములు  సిద్దించును

16. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరి పూర్ణతను చేకూర్చును.

ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు , అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి , పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు , పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. 

ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. 

ఈ స్తోత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశ్రాద్ధం నాడు, లేదా ప్రతి రోజు ఉదయం, పుట్టినరోజు నాడు తమ తల్లిదండ్రులకు నమస్కరించి పఠిస్తారో, వారికి దుర్లభమైనది అంటూ ఏదీ ఉండదు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.

*🙏బ్రహ్మ ఉవాచ:*

౧. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!

ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.

౨. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!

సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 

౩. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!

సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.

౪. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!

ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.

౫. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 

౬. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము
ఫలశ్రుతి:
ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ 
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా 
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ 
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః 
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ 
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!

Thursday, September 9, 2021

*శ్రీ గణపతి తత్వం అంతరార్థం*

*శ్రీ గణపతి తత్వం అంతరార్థం*

*‘తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్’ ప్రాచీన కాలం నుండీ నేటి వరకు ప్రతి పనికీ వినాయకుడి ననుసరించి ‘ఆదౌ నిర్విఘ్న పరిసమాస్థ్యర్థం గణపతి పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ గణపతిని మొదటగా ఆరాధించడం జరుగుతుంది.*


*వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో భక్తిప్రపత్తులతో కొలవాలేగాని, కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత. గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం. ఓంకార ప్రణవ నాద స్వరూపుడు మహా గణపతి. నామ మంత్రాలకు ముందు ‘ఓం’కారము ఎలా ఉంటుందో అలాగే అన్ని శుభ కార్యాలకి ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది.*


*గణపతి పుట్టుక: జ్యోతిషశాస్త్ర అన్వయం ‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానం. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడు ఆవిర్భవించాడు. భద్రమైన పదం భాద్రపదం. శ్రేయస్కరమైన స్థానం. ఏమిటది? జీవిత గమ్యమైన మోక్షం. శుక్లమైన తేజోరూపం. చతుర్థి అనగా చవితి. జాగ్రత్, స్వప్న, సుషుప్తులనే మూడవస్థలనూ దాటిన తరువాతది నాల్గవది - తురీయావస్థ. నిర్వికల్ప సమాధి. ఆయన నక్షత్రం హస్త. హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు. విజ్ఞానప్రదాత. మేషరాశి మొదటి రాశి. మేషరాశి నుంచి ఆరవ రాశి - కన్యారాశి. ఈ షష్టమ (ఆరవ) భావం, శతృ ఋణ రణ రోగములను తెలియజేస్తుంది.* 


*మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుందీ భావం. ఆ షష్ట్భావంతో (హస్తా నక్షత్రం,కన్యారాశి) చంద్రుడుండగా ఆవిర్భవించిన విఘ్నేశ్వరుడు, చవితి నాడు పుట్టిన వినాయకుడు ఈ నాలుగు రకములయిన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు.*


*కన్యారాశికి సప్తమ రాశి మీనరాశి. మీనరాశి కాలరాశి చక్రంలో పన్నెండవ రాశి. అంటే వ్యయ రాశి. మేష రాశికి వ్యయ రాశి పనె్నండవ భావం వ్యయాన్ని, బంధనాన్ని, అజ్ఞాత శత్రువుల్ని తెలియజేస్తుంది. ఇక్కడ శత్రువులంటే అంతశ్శత్రువులు.* *అరిషడ్వర్గములు - కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు (ఆరు). ఇవి మానవుని ప్రగతికి విఘ్నాలు కలిగించేవి. హస్తా నక్షత్రం, కన్యారాశిలో ఉన్న చంద్రుడు సప్తమ దృష్టితో నేరుగా మీనరాశిని వీక్షిస్తున్నాడు. కనుక వాటిని తొలగించి జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసి,లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చి, మోక్షగతిని ప్రసాదించేవాడు వినాయకుడని జ్యోతిష శాస్త్ర అన్వయం.పత్రిపూజ, ఉండ్రాళ్ల నివేదనలోని ఆంతర్యం వినాయకుని నక్షత్రం ‘హస్త’ అని చెప్పుకున్నాం గదా.* *హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవగ్రహములకు నవధాన్యములు, నవరత్నములు చెప్పబడ్డాయి. చంద్రుని తెల్లనివాడు - వినాయకుడు శుక్లాంబరధరుడు.*


*నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి, ఉండ్రాళ్లు నివేదన చేయటంలోగల ఆంతర్యమిదే. వినాయకునిది కన్యారాశి అని చెప్పుకున్నాం గదా. కన్యారాశికి అధిపతి బుధుడు కదా. బుధునికి నవరత్నములలో ‘పచ్చ’ రాయి- ఎమరాల్డ్ గ్రీన్ అనగా ఆకుపచ్చ రంగు. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని, ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. సంతుష్టు డవుతాడు స్వామి.*


*గరికపూజ ప్రీతిపాత్రం ఎందుకు?వినాయకునికి గరిక పూజ అంటే ప్రీతి అంటారు. వినాయక చవితినాడే గాక, ప్రతిరోజూ విఘ్నేశ్వరాలయాలలో, గరికతో స్వామిని అర్చిస్తారు.పూజాద్రవ్యములలో గరికను కూడా జత చేసి సమర్పిస్తారు భక్తులు. దీనికి జానపదులు చెప్పుకునే కథ ఒకటి ఉంది. పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు.న్యాయ నిర్ణేతగా నందీశ్వరుణ్ణి ఎంపిక చేశారు. ఈశ్వరుడే గెలిచాడని నంది తీర్పు చెప్పాడు.అయితే ఆ తరువాత అమ్మతో నిజం చెప్పాడు. ‘ఈశ్వరుడు నాకు ప్రభువు. ఆయనే నా ప్రాణం. అందుకే ఆయన గెలిచినట్లు చెప్పాను. అయినా ఆయన అర్ధనారీశ్వరుడు గదమ్మా మీరిద్దరూ ఒకటే’ అన్నాడు.*


 *‘నందీ! నీవు నయం కాని వ్యాధితో బాధపడతావు’ అని శపించి, నంది దీనావస్థను చూచి జాలి చెంది, ‘నందీ! నా కుమారుడైన గణనాథుని పుట్టిన రోజున నీకు ఇష్టమైన పదార్థాన్ని అర్పితం చెయ్యి. అతను అనుగ్రహంతో నీకు శాపవిమోచనం కలుగుతుంది’ అని సెలవిచ్చింది, పార్వతీదేవి. నంది తన కిష్టమైన గరికను గణపతికి అర్పించాడు. అతనికి శాపవిముక్తి లభించింది. ఇది వినాయక పూజలో గరిక ప్రాధాన్యత.*


*‘సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ’ సకల కల్మషములను తొలగించే సర్వశ్రేష్ఠమైన ఓషధి. లెక్కకు మించిన కణుపులు, చిగుళ్లు కలగి దుష్ట తలంపుల ప్రభావమును తొలగించు శక్తిగల పరమాత్మ స్వరూపమైన దూర్వాయుగ్మము. మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, అని ‘దూర్వాసూక్తము’ పేర్కొన్నది.*


 *దూర్వాయుగ్మం అంటే గరిక. అందుకే గణపతిని గరికతో అర్చిస్తే సర్వశుభాలను ప్రసాదిస్తాడు.మనోమాలిన్యాలను తొలగిస్తాడు.‘గజ’ శబ్దార్థము  వశ - శివ, హింస - సింహ, పశ్యకః - కశ్యపః అని వర్ణ వ్యత్యాసముతో మార్పు కలుగుతుంది.ఇదొక వ్యాకరణ శాస్త్ర ప్రక్రియ. ఆ విధంగా, జగ - గజ అని మారుతుంది. కనుక గజాననుడంటే ‘జగణాననుడు’ అని అర్థం. జగత్తే ముఖంగా గలవాడు. గ: లయము, జ- జన్మ. కనుక గజమనగా సృష్టి స్థితి లయములు గల జగత్తు అని అర్థము. ‘గ’ అంటే జ్ఞానము ‘జ’ అంటే పుట్టినది. గజమంటే జ్ఞానము వలన పుట్టిన మోక్షమని అర్థము.*


 *‘జ్ఞానదేవతు కైవల్యము’ కనుక గజముఖము, గజాననుని ముఖ దర్శనము శుభప్రదము, జ్ఞానప్రదము, మోక్షప్రదము. సృష్టికి ముందు ‘ఓం’ అని ధ్వని వినవచ్చింది. అది గజాకారముగా పరిణమించింది. కనుక గజమనగా ఓంకార ధ్వని. ఓంకారము గజ నాదము అనగా హస్తినాదము.‘అశ్వపూర్వాం రథమధ్వాం సస్తినాద ప్రబోధినమ్’ ఇంద్రియములనే గుర్రములచే పూన్చబడిన దేహము అనే రథము మధ్యలోనున్న చైతన్యమూర్తి. చిచ్ఛక్తి - పరదేవత నిరంతరము హస్తినాదముచే అనగా గజ నాదముచే -ఓంకార నాదముచే మేలుకొలువబడుచున్నది. ఇది ‘గజ’ శబ్దానికి శ్రీసూక్త మంత్రానికి సమన్వయం. అదే వినాయక చవితికి స్ఫూర్తి.‘ఆననము’ అనగా ప్రాణనము అనగా జీవకము అని అర్థము.* 


*గజమంటే జగత్తు కనుక, జగత్తుకే ప్రాణము గజాననుడు. గజాననుడనగా సృష్టి, స్థితి, లయ కారకుడని అర్థం. అందుకే మొదటిగా గజాననుని పూజ విధింపబడింది. సకల ప్రపంచమునకు ప్రాణదేవత - గజాననుడు.ప్రాణనాథుడే గణనాథుడు, నిఖిల ప్రాణి గణనాథుడు - గుణగణములు కలవాడు - గుణగణ నాథుడు.గణపతి - లలితా పరమేశ్వరి ‘శాంతిః స్వస్తిమతీ కాంతిః నందినీ విఘ్ననాశినీ’ అన్నది లలితా సహస్ర నామం. లలితాదేవి విఘ్నములను, అవిద్యను నశింపజేస్తుంది. కనుక ‘విఘ్ననాశినీ’ అని పేరు గల్గింది. మరి గణపతి కదా విఘ్నములను లేకుండా చేసేవాడు? దీనినిబట్టి, లలితాదేవి గణపతి స్వరూపిణి, గణపతి లలితా స్వరూపుడు అని తెలుస్తుంది. లలితా గణపతులకు అభేదం. విష్ణు సహస్ర నామములలో గణపతి: ఏకదంతుడు ఏకదం - అంతా ఒక్కటే. రెండవది లేదు అని ఏకత్వ బుద్ధిని అనుగ్రహించు ఆ ఏకదంతుని ఉపాసించాలి ‘అనేకదం’ - ఉపాసకులకు భక్తులకు అనేకములనిచ్చు,తం- గణేశుని, అనేక దంతం- ప్రళయ కాలంలో అనేకములను హరించు గణపతిని ఉపాసించాలి అని అర్థములున్నాయి. ‘ఏకః నైకః నవః కః కిం’ విష్ణు సహస్ర నామముల భావమే ఏకదః అనేకదః’ అని చెప్పారు.*


*గజాననుని రూపం: ఆధ్యాత్మికత మోక్ష సిద్ధికి వక్రమైన ఆటంకములను అరిషడ్వర్గములను (కామక్రోధములు) నశింపజేసి,చితె్తైకాగ్రత నొసగి, స్వస్వరూప సంధానతతో జీవబ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించేవాడు వక్రతుండుడు.*


 *మూలాధార క్షేత్ర స్థితుడు. మూలాధారి. లంబోదరం - బ్రహ్మాండానికి సంకేతం. విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు - రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది. మొదకం ఆయన కృపాకటాక్షములలో ఆనందం లభిస్తుంది. నాగయజ్ఞోపవీతం - కుండలినీ శక్తికి సంకేతం. మానవుడు క్రోధాన్ని విడిచి, అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు ప్రేమభావనా భక్తిని పెంపొందించుకొని, జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు విఘ్నేశ్వరుడు.*


*‘యుక్తాహార విహారస్య’ అన్నారు గీతాచార్యుడు. ఆహార నిద్రాదులు అన్నమయ కోశమునకు సంబంధించినవి. తమోగుణానికి నిదర్శనము. ‘బ్రతుకుట ఆహారం కోసమే’ అనుకునే తిండిపోతులు తమోగుణాన్ని చంపుకోలేరు.* *అటువంటి వారి గూర్చి ఇతరులు జాలి పడటం, మనసులోనైనా పరిహసించటం సహజం. యోగి అయిన వాడు యుక్తాహార విహారాదులతో, తమోగుణాన్ని జయించి తత్వ గుణ సంపన్నుడై, త్రిగుణాతీతుడై, కుండలినీ యోగసిద్ధుడై ఆనందమయ స్థితిని పొంది చరితార్థుడు కావాలని తన శరీరాకృతి, నాగయజ్ఞోపవీతంతో తెలియజేసి, హెచ్చరించేవాడు - బొజ్జ గణపయ్య.*


*మూషిక వాహనం: అంతరార్థం మూషికం (ఎలుక) వాసనామయ జంతువు.తినుబండారాల వాసననుబట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు - వినాయకుడు.అంతేకాదు అహంకారానికి చిహ్నం - ఎలుక (మూషికం) అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది.*


*బుద్ధిపతి అయిన మహాగణపతి దీనిని మలిచి జయించి సద్వినియగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు.వినాయక చవితి పండుగనాడు ఉదయానే్న మంగళ స్నానములు (తలంటు) ఆచరించి, మట్టి విఘ్నేశ్వరుని పత్రి పుష్పములతో పూజించి, తమ పాఠ్యపుస్తకాలన్నిటినీ వినాయకుని ముందు పెట్టి, శ్రద్ధ్భాక్తులతో అర్చించి, సద్బుద్ధి, విజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తారు విద్యార్థులు. లక్ష్మీదేవి మూలాధార నిలయం. గణపతి కూడా మూలాధార నిలయుడు. తొలుతగా లక్ష్మీ పత్రార్చన సర్వకార్య సిద్ధిప్రదము. సకల ఐశ్వర్యప్రదం. కనుకనే తన సంగీత రూపకమునకు ఆదిలో శ్రీగణపతిని ‘శ్రీ గణపతిని సేవింపరారే శ్రీత మానవులారా’ అని ప్రార్థనా రూపమైన మంగళమును పలికాడు నాద ముని శ్రీ త్యాగరాజస్వామి.*


*ముత్తుస్వామి దీక్షితులు: మహా గణపతి కీర్తనలు వినాయక చవితి రోజున ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితుల వారి ముఖ్యమైన కీర్తన, విశేష ప్రాచుర్యం పొందినది, హంసధ్వని రాగ కీర్తన ‘వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం. వీతరాగిణం, వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం...’ తప్పక జ్ఞప్తి చేసికొని పాడుకోవాలి. కనీసం చదువుకోవాలి.*


 *గణపతి పూజలో ఇది ఒక భాగం అవ్వాలి. ఆ మహనీయుడు కీర్తనలు అందించాడు. మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వాసుదేవాం నందిత’ నాటరాగ కీర్తన, గజాననము తం గణేశ్వరం భజాను సతతం సురేశ్వరం ఇత్యాదులు వినాయక చవితికి స్ఫూర్తినిచ్చే ఆణిముత్యాలు.*


*‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజము...’ శుక్లమైన అంబరం అంటే పరిశుద్ధ జ్ఞానం. అది అంబరం లాగా సర్వవ్యాపకం. దానినే ఒక వస్త్రంలాగా ధరించాడాయన. దాన్ని మనకు ప్రసాదించాలంటే శశివర్ణుడౌతాడు. శశి అంటే చంద్రుడు.*


*చంద్రుడంటే మనస్సు. మనోభూమికకు దిగి వచ్చి బోధిస్తాడు మనకు ఆచార్యుడు. బోధించే స్థోమత ఎలా వచ్చిందాయనకు. చతుర్భుజం. ధర్మ, జ్ఞాన, వైరాగ్వైశ్వర్యాలనే సిద్ధి చతుష్టయ ముందాయనకు. వాటిని నిత్యమూ అనుభవించే మహనీయుడు కనుకనే ప్రసన్న వదనం. తనకు ప్రసన్నమైన శివశక్తి సామరస్య రూపమైన ఏ జ్ఞానముందో, దాన్ని మనకు ‘వదనం’ అంటే బోధించగలడు. ఆ బోధనందుకుంటే అదే మనకు సర్వవిఘ్నాప శాంతయే. సకల విఘ్నాలను సాధన మార్గంలో కలగకుండా తొలగజేస్తుంది.*


*అహంకారమును దరికి రానీయక, భూతదయ గాలికి, స్వార్థరహితంగా త్యాగబుద్ధితో, అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాతతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించే వారి విఘ్నాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు మహాగణపతి.*


*గణపతి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపం.*

*గణం అంటే సమూహం. గణాలతో నిండి వున్న ఈ సమస్త విశ్వానికి అధిపతి గణపతి. అలాగే, అహంకారానికి ప్రతీక అయిన ‘ఎలుక‘ను శాసించి వాహనంగా చేసుకున్న గణపతిని, మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజిస్తారు.*


 *‘గణపతి అథర్వ శీర్శం’ ఆయన్ని పరబ్రహ్మగా చెపుతుంది. ‘నమస్తే గణపతయే... నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను. హే గణపతీ! ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యాలు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైందో ‘అది‘ నీవే అయి ఉన్నావు. అన్నింటికీ కర్తవు, ధరించే వానివి, లయం చేసుకునే వానివి నీవే. నీవే బ్రహ్మమూ, సత్యానివీ. నీకు నమస్కరిస్తున్నాను. సకల వాక్సంబంధిత శక్తివి, జ్ఞానమూర్తివి, ఆనంద మయునివి నీవే. పరబ్రహ్మం, శాశ్వతమైన వానివి నీవే. ప్రత్యక్ష పరబ్రహ్మవూ నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి’ అంటున్నది ‘గణపతి అథర్వ శీర్శోపనిషత్తు’.*


*మంత్రశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధారచక్ర అధిష్ఠాన దేవత అని అంటారు. మూలాధారంలో సుషుమ్న నాడి మూడుచుట్టలు చుట్టుకొని పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగ ఉంటుంది. యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేలు కొల్పగలిగితే, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనే షట్‌ చక్రాల ద్వారా ఆత్మను బ్రహ్మరంధ్రం చేర్చి బ్రహ్మ కపాల వి స్ఫోటనంతో ప్రకృతిని దాటి పరమాత్మను చేరే యోగ ప్రక్రియ జరుగుతుంది.*


*సుషుమ్న నాడి పక్కన ఇడ, పిం గళ అని రెండు నాడులు అనుసరించుకుంటూ ఉంటాయి. నిరంతరం సుషుమ్న వీటితో కలిసే పయనిస్తుంది. ఇడ అంటే జ్ఞానము, పింగళ అంటే కార్యసిద్ధి అలాగే ఇడ అంటే సిద్ధి, పింగళ అంటే బుద్ధి. మూలాధారం గణపతి, గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలనడంలోని అంతరార్థం ఇదే.* 


*అనగా గణపతి అంటే అష్టచక్ర గణములకు అధిపతి. గణపతి అంటే పదకొండు ఇంద్రియ గణములకు అధిపతి. పంచ తన్మాత్రలు, పంచ భూతాలు, పంచ విషయాలు, అహంకారం, మహాతత్త్వం, ప్రకృతి అనే 18గణములకు అధిపతి గణపతి.*


 *మన శరీరంలో ఉండే హస్తములు,పాదములు, జాను, జంఘ, ఊరు, కటి, ఉదర, హృదయ, కంఠ, ఆశ్య, ఫాల, శిర అను ద్వాదశ అయవయ గ ణములకు అధిపతి మన గణనాథుడు.*


 *అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించడమే కాక విఘ్నాలకు కారణమైన వాటిని పోగొడతాడు. కార్యసిద్ధి కలిగించి తద్వారా సంతోషాన్ని కలిగించే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పాపాలు తొలిగితే మంచి బుద్ధి కలుగుతుంది. మంచి బుద్ధి అనగా శాశ్వతమైనదాన్ని పొందాలనుకోవడం. అనగా పరమాత్మను కోరుకోవడం. సంసారం, సిరిసంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ అశాశ్వతం.*


*కావున గణపతి శాశ్వతమైన వాటి గురించి జ్ఞానాన్ని, అశ్వాశ్వతమైన వాటి మీద వైరాగ్యాన్ని కలిగించి భక్తిని కలిగిస్తాడు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనగా సుషుమ్న, ఇడ, పింగళ అనగా మూలాధారం గణపతి, సిద్ధి, బుద్ధి. ఇదే గణపతి తత్త్వం.*

🕉🌞🌏🌙🌟🚩

Wednesday, September 8, 2021

మానవుని యందు ప్రజ్ఞలు-Master EK



*మానవుని యందు ప్రజ్ఞలు* 



  'నేను' అను మహాత్మ ప్రజ్ఞకు దిగువ ఏడు ప్రజ్ఞలున్నవి. అందు దిగువ భాగమున భౌతికము, ప్రాణమయము, మనస్సు, తెలివితేటలు మున్నగు ఆరు ప్రజ్ఞ లుండును. వీనికి పైనున్న ప్రజ్ఞ ఏడవది. ఈ ప్రజ్ఞలోనే దిగువ భాగమున బుద్ధి మొదలగు ప్రజ్ఞ లుండును. ఈ ఏడవ ప్రజ్ఞలోని పై భాగమున స్వచ్ఛమైన భాగమున్నది. అది 'బ్రహ్మ ప్రజ్ఞ' యనబడును. దాని యనుభవమే 'బ్రహ్మలోకము'. 

    దానికి క్రింది ఆరు ప్రజ్ఞలలోను జీవునిలో తెలిసి వర్తించుట, తెలియక మరల యజ్ఞానమునబడుట, జ్ఞప్తి కలుగుట, మరపు కలుగుట మొదలగు స్థితులు మారుచుండును. ఒకమారు ధ్యానమున బ్రహ్మలోకము 'ప్రజ్ఞ'ను అనుభవించినవాడు మాత్రము మరల దిగువ ప్రజ్ఞలలోనికి జారిపోడు. మరపు కలుగదు గనుక 'అజ్ఞానము'న పడడు. అట్టివానికే ఎనిమిదవదియగు 'అంతర్యామి ప్రజ్ఞ' యందు స్థాయి చిక్కును. ఎనిమిదవ సంతతిగా కారాగారమున కృష్ణుడు జన్మించెనని చెప్పబడిన కథలోని అంతరార్థ మిదియే! 

   ఈ చెప్పబడిన యేడు ప్రజ్ఞలును మానవునియం దుండును. 

ఒకటి, రెండు ప్రజ్ఞలగు భౌతికము, ప్రాణమయ స్పందనలు అను లోకములలో క్రిమికీటకాదులు, వృక్షాదులు పుట్టి చనిపోవుచుండును. 

మూడవది ఇంద్రియములు మనస్సు పని చేయునట్టి కక్ష్య. 

నాలుగవ కక్ష్యలో మనస్సుతోబాటు తెలివితేటలు పనిచేయును. వీరికి చెప్పిన పని చేయుట కాక, తోచిన పని చేయుట, ఇతరులు చేయవలసిన పనులను ఆజ్ఞాపించుట యను సామర్థ్యము లుండును. తనకు తోచినట్లు చేయుట యుండును. 

ఐదవ కక్ష్యలో ప్రవేశింపగలిగిన నరునకు ఇతరులకేమి కావలయునో తెలియగలుగుట యుండును. 

ఆరవ కక్ష్యలో అందరి యందును పనిచేయు సత్యము గోచరించును. దాని ప్రకారము తన కర్తవ్యము, ఇతరుల కర్తవ్యము తెలియుట, వర్తించుట యుండును. దిగువ కక్ష్యలు కూడా పనిచేసినపుడు ఆరవ కక్ష్య పని చేయదు. 

ఏడవ కక్ష్యలో ప్రవేశించిన వారికి దానియందు మిగిలిన యారు కక్ష్యలు నెట్లిమిడియున్నవో తెలియును. కనుక దిగువ కక్ష్యలోనికి దిగుట యుండదు. అన్ని కక్ష్యలలో ఆచరణ యుండును. 

- Master E.K.