Translate

Friday, September 23, 2022

🌹శ్రీ ఆంజనేయుడు. 🌹

🌹శ్రీ ఆంజనేయుడు. 🌹




'వాయు'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ'మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శనమనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమోపేతుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ ఆంజనేయుడు. 


పంచముఖాంజనేయ స్వరూపం - పంచభూతముల సమన్వయతకు సూచనం 

వానరరూపం - వాయుతత్త్వం. 

గరుడరూపం - ఆకాశతత్త్వం. 

నరసింహరూపం - అగ్నితత్త్వం. 

వరాహరూపం - భూమితత్త్వం. 

హయగ్రీవరూపం - జలతత్త్వం. 


ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు 

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.  


యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ / 

ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //


సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). 


నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'. తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'. 


సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదానారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు. 


అఖిలలోకోపకారి ఆంజనేయుడు 


యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు. 


{అష్టసిద్ధులు - వివరణ :-


అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము'. 

పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజోవాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతములయందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మతత్వములయందును, వాని స్థితులయందును, ఇంద్రియములయందును, వానికర్మలయందును, అంతఃకరణములయందును, తత్ప్రకాశరూపములైన వృత్తులయందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.  


అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,

ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమా"సిద్ధి.  

అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి.  

పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి.  

ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి.  

లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి. 

భూతములన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం". 

అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితిలయములకు కారణభూతుడగుట "ఈశత్వం"} 

లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా / 

ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //


తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?

ఆధ్యాత్మిక కోణంలో - ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి. 


గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు -

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //

భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. 


అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించుచుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును). దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగి.

Wednesday, September 21, 2022

భ్రమర,మార్జాల,మర్కట న్యాయం


*భ్రమర కీటక న్యాయం*
*మార్జాల కిశోర న్యాయం*
*మర్కట కిశోర న్యాయం* 
*ఒక విశ్లేషణ*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

🌈 *భ్రమర కీటక న్యాయం-*

💫 భ్రమరం (తుమ్మెద) కీటకాన్ని (ఒక రకమైన పురుగు) తనతో తెచ్చుకొని దానిచుట్టూ ఝుంకారం చేసుకుంటూ పదే పదే తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు మొదట భయంగా, తర్వాత ఏకాగ్రతగా, అటుపై తనను తానే పూర్తిగా మరచిపోతుంది కీటకం. ఆ మైమరపులో కొద్దిరోజుల తర్వాత తానే భ్రమరంగా మారిపోతుంది కీటకం. *ఇదే భ్రమర కీటక న్యాయం!* 

💫 అదే భావనతో భక్తుడు కూడా భగవంతుని మైమరచి తలుస్తూ, భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడని వేదాంతపరంగా చెబుతారు!
భక్తి మార్గంలో ఉన్నవారు లేక భక్తి మార్గాన్ని అనుసరించాలనుకునే వారు రెండు విధాలైన మార్గాలను ఎన్నుకుంటారు!

🌈 *మార్జాల కిశోర న్యాయం*

💫 మార్జాలం అంటే పిల్లి,
కిశోరం అంటే పిల్ల (baby),
న్యాయం అంటే ఒక గుర్తింపు పొందిన పధ్ధతి!

💫 కొంతమంది భక్తులు, భగవంతుడు తమను ఉంచిన ప్రదేశంలోనే, ఉంచిన స్థితిలోనే ఎలా ఉంచాడో అలానే ఉండటానికి ఇష్టపడతారు.

💫 పిల్లి తన పిల్లలను నోటితో గట్టిగా పట్టుకొని పలు ప్రదేశాలు వెతికి, ఆఖరికి తన పిల్లలు ఎక్కడుంటే క్షేమంగా ఉంటాయని తలుస్తుందో వాటిని అక్కడే క్షేమంగా ఉంచుతుంది. ఇక్కడ పిల్లల బాధ్యత అంతా తల్లి అయిన పిల్లే భరిస్తుంది. పిల్లి పిల్లలు తమ క్షేమాన్ని తల్లి చూసుకుంటుందనే గట్టి నమ్మకంతో ఉంటాయి. వాటికి మరే ఏవిధమైన ఆలోచనలు, ఆందోళనలు ఉండవు. 

💫 ఈ మార్గాన్ని ఎన్నుకునే వారు, నమ్మిన వారు అంతా భగవంతుని మీదే భారం వేస్తారు.  

💫 ఈ మార్గంలో ఉన్నవారు భక్తియోగంలో ఉన్నత స్థితికి చేరుకున్నవారని వేదాంతులు అంటుంటారు! దీనినే శరణాగతి పధ్ధతి అని కూడా అంటారు.

🌈 *మర్కట కిశోర న్యాయం* 

💫 మర్కటం అంటే కోతి. మిగిలిన వాటికి అర్ధాలు పైన చెప్పినవే. కొంతమంది భక్తులు భగవంతుని అంటిపెట్టుకొని ఉండాలని భావిస్తారు. 

💫 కోతిని దాని పిల్ల గట్టిగా కావలించుకొని / పట్టుకొని ఉంటుంది. పిల్ల కిందపడితే తల్లి బాద్యత ఉండదు ఇక్కడ. అంటిపెట్టుకునే బాధ్యత అంతా పిల్ల మీదే ఉంటుంది! (ఇక్కడ చెప్పింది పైన చెప్పిన న్యాయానికి పూర్తిగా భిన్నమైనది.) 

💫 తల్లిని అంటిపెట్టుకున్నంతసేపూ పిల్ల క్షేమంగానే ఉంటుంది. తల్లిని పొరపాటుగానైన వదిలేస్తే పిల్ల బాధపడక, ఆపదలోపడక తప్పదు. 

💫 తల్లి ఒక చెట్టు మీదనుంచి మరొక చెట్టు మీదకు దూకే ప్రయత్నంలో కూడా పిల్ల తల్లిని గట్టిగా పట్టుకునే ఉంటుంది. 

💫 అలానే, కొందరు భక్తులు తాము ఎన్ని కష్టాలు ఎదుర్కున్నప్పటికీ భగవంతుని పాదాలు వదలరు. ఇటువంటి భక్తులు భగవంతుని గాఢంగా విశ్వసిస్తారు. ఇది కూడా భక్తియోగంలో ఉన్నతమైన మార్గమే! 

💫 *మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయాలలో ఏది మంచిదనే చర్చ అనవసరం.*

*రెండు మార్గాలూ సృష్టి ధర్మాన్ని అనుసరించినవే! అన్నిటికన్నా విశ్వాసం ముఖ్యం, ఏ మార్గమైనా ఒకటే!*

✅👉 *మొదటి దాంట్లో భారం అంతా* *భగవంతుని మీద వేస్తారు.* 

✅👉 *రెండవ దానిలో భగవంతుని ధ్యానిస్తూ ఫలితాన్ని ఆశించకుండా భారాన్ని తామే వహిస్తారు!!*



🙏శివోహం 🙏

Saturday, September 17, 2022

గురుపూర్ణిమ- గురువు- వేదవ్యాసుడు(Guru and Guru Pournima- Veda Vyasa -Telugu Notes)

 గురువు-గురుపూర్ణిమ

 

 గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.




గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం.

 గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో  గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ  బిడ్డల కన్నా మిన్నగా  ప్రేమించే వారు.

గురువు అంటే  ఆధ్యాత్మిక  జ్ఞానాన్ని బోధించేవాడు.  హిందూ మతంలో గురువును  భగవంతునికి ,భక్తునికి మధ్య

అను సంధాన కర్తగా  భావిస్తుంటారు.

 

గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక: అజ్ఞాన గ్రాసకం  బ్రహ్మ గురురేవ న సంశయ: //

 ''గు అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే  చీకట్లను  అంటే అజ్ఞానాన్ని పారద్రోలేవారు.

 తమసోమాజ్యోతిర్గమయ ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ  అజ్ఞానం పోదు. అందుకు ఒక సూచన గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్దిచేత దానిని గ్రహిస్తాడు, తరిస్తాడు.

 గురువు అనగా  ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం.

 గురువు అంటే  తన సాధన ద్వారా  మానసికం గా  ఒక ఉన్నత స్థానాన్ని పొందినవాడు.

 ఉపాధ్యాయుడు/ టీచర్ అంటే లౌకిక విద్యలు బోధించేవారు. ఈ జన్మ కు సరిపడా  విద్యనిచ్చేది వీరైతే, జన్మ జన్మలకు సరిపడా జ్ఞానాన్ని అందించేవాడు, జన్మే లేకుండా చేసేవాడే అసలు గురువు. *తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జన్మరాహిత్యాన్ని ఇస్తాడు.

 గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.  ఆషాఢ  పౌర్ణమి  దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది.

 వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋక్, యజుర్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడని  ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.

 యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి.ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది.

ఆదిగురువైన పరమశివుడు తాండవం చేసే సమయంలో, ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు (శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని  ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశించాడు . శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.

 

ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి.

అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించ బడింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం  కాలేదు. గురువుల  ద్వారా  విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు).

 మొదట్లో వేదం ఒక రాశి గానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుష్షు ను(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరు గాంచారు. ఈయనే మొట్టమొదటి సారిగా వేదాన్ని  గ్రంధస్థం చేశారు.

  వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ | | వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 🙏🙏*

 శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు.

 వేదవ్యాసుడు, మత్స్యగంధి పరాశరమహర్షి కి జన్మించాడు. మత్స్యగంధి దాశరాజు పెంపుడు కుమార్తె. చేపల కంపు వల్ల ఆమెకు మత్స్య గంధి అనే  పేరు వచ్చింది. ఆమె అసలు  పేరు సత్యవతి.  పరాశర మహర్షి ఆమెను చేరి, దుర్గంధమును పోగొట్టి వ్యాస మహర్షి జన్మకు కారకుడవుతాడు. వేదవ్యాసుని అసలు నామము కృష్ణ  ద్వైపాయనుడు .

 వ్యాసుడు పుట్టిన వెంటనే పన్నెండేళ్ళ ప్రాయమునకు ఎదిగి తల్లికి నమస్కరించి, తనను స్మరించి నపుడు వచ్చి తల్లిని దర్శించు కుంటానని మాట ఇచ్చి వెళ్ళి పోతాడు. సత్యవతి తర్వాత కురువంశ మూల పురషుడైన శంతనుని వివాహం  చేసుకుంటుంది(ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. వివాహానికి పూర్వము భర్త కాని వ్యక్తితో సంతానాన్ని కని, మరల వేరొక వ్యక్తిని వివాహం చేసుకోవచ్చునా  ) అంటే యుగాన్ని బట్టి యుగధర్మం మారుతుంది.

 మహర్షులు కొందరు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు కానీ, కొందరు కుటుంబ బంధనాలలో ఉండటానికి ఇష్టపడరు. వారు సదా పరమాత్మ ధ్యానంలో ఉంటూ విశ్వ శ్రేయస్సుకు పాటుపడుతూ ఉంటారు. ఆ కోవ లోకే పరాశర మహర్షి వస్తారు.  అయితే విశ్వ శ్రేయస్సు కోసం వారి ద్వారా సంతానం రావలసి ఉన్నది. ఎంతో తేజస్సు కలిగిన వారి వీర్యాన్ని భరించటానికి కావలసిన సుక్షేత్రం, మత్స్యగంధిగా  తన దివ్య దృష్టి ద్వారా  తెలుసుకొని, ఆమె ద్వారా మాత్రమే కారణ జన్ముడు జన్మించగలడని, ఆవిడ కన్యత్వం చెడకుండా  పుత్రుని( వ్యాసుని) ప్రసాదించాడు.

 ఈయన వల్లే కురువంశం  అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై అంబాలికకు ధృతరాష్ట్రుని అంబిక కు, పాండు రాజుని, దాసికి విదురుని ప్రసాదించినాడు.

 అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే!భాగవతాన్ని రచించింది ఈయనే. కనుక  మనం ఏ పురాణం చదివిన వ్యాస వుచ్చిష్టమే.( వ్యాసుని ఎంగిలే. అంటే వ్యాసుని నోటి నుండి వెలువడినవే).

 వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని  ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందెదము గాక! వేదవ్యాసుడు మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు. కాబట్టి ఆయన్ను మానవాళి కంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

 ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.  తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

  కనుక ఈరోజున హిందువులు గురువులను పూజించి, సత్కరించి తమ భక్తిని చాటుకుంటారు...

.

#ఆషాఢమాసం_పౌర్ణమి

#గురుపౌర్ణమి

 ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ, #వ్యాసపూర్ణిమ గా జరుపుకుంటాం. భారతీయ సమాజం వ్యాసమహర్షిని గురువుగా స్వీకరించింది. అంతకు ముందు ఎంతో మంది గురుశ్రేష్ఠులుండగా ఆయననే గురువుగా ఎందుకు స్వీకరించారనే అనుమానం కలగక మానదు. ఋక్కులు, యజస్సులను కలిపి యజుస్సంహితగా, సామాలన్ని కలిపి సామసంహితగా, అధర్వణ మంత్రాలన్ని కలిపి అధర్వ సంహితగా సంకలనం చేశారు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి అధ్యయనం సులభతరం చేసినవాడిగా వేదవ్యాసుడిగా కీర్తింపబడ్డాడు. సామాన్యులకు అర్థమయ్యేలా అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారత, భాగవతాలను రచించిన వ్యాసుడిని గురువుగా స్వీకరించింది ఈ సమాజం.

 #వ్యాసపూర్ణిమ #గురుపూర్ణిమ

 వేదాలను, పంచమ వేదమైన మహాభారతాన్ని మనకందించిన వ్యాసమహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాస పూర్ణిమగా చెప్పబడింది. వ్యాసుడు జగద్గురువు కనుక ఆయన జయంతిని గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం.

 

🍁🌺🍁 వేద వ్యాసుని జన్మ వృత్తాంతం 🍁🌺🍁

 కృతయుగ ప్రారంభ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి ధర్ముడు పుట్టాడు. ఆ ధర్ముడికి నరుడు, నారాయణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహా తపస్సంపన్నులైన వారిద్దరూ అవసరమైన సమయంలో ధనుర్ధారులై రాక్షస సంహారం చేస్తారు. మిగిలిన సమయమంతా బదరికాశ్రమంలో తపస్సులో ఉంటారు.

 భూలోకానికి పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము అనే అయిదు లోకాలు దాటిన తర్వాత సత్యలోకానికి కిందుగా తపోలోకము ఉంది. ఆ లోకములో తపస్వులు, సిద్ధులు ఉంటారు. వారు తమ ఇచ్ఛ మేరకు కింద లోకాలలో జన్మనెత్తడం, తిరిగి వెళ్లిపోవడం అనేది యుగ యుగాలుగా జరుగుతుంది. అటువంటి తపస్వులలో ఒకరైన అపాంతరముడనే మహర్షి ఒకరోజు బదరికాశ్రమానికి వచ్చాడు.

 ఆ మహర్షిని నర, నారాయణులిద్దరూ భక్తితో పూజించారు. దానికి సంతోషించిన మహర్షి వారితో ఇలా అన్నాడు. "నర, నారాయణులారా... మీకు గుర్తున్నదా, సహస్ర కవచుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి విచిత్రమైన వరం కోరుకున్నాడు. వేయ్యేళ్లు తపస్సు చేసినవాడు, తనతో వేయ్యేళ్లు యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచం కావాలన్నాడు. అటువంటి వేయి కవచాలు అతను వరంగా పొందాడు. ఆ రోజుల్లో మీరు వాడితో ఒకరు యుద్ధం, ఒకరు తపస్సు చొప్పున నిర్వహిస్తూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను పోగొట్టారు. చివరిగా నరుడి వంతు వచ్చింది. మిగిలిపోయిన ఆ ఒక్క కవచంతో సహస్ర కవచుడు ఇప్పుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసున్ని వధించటం అప్పట్లో సాధ్యం కాలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ ఆ రాక్షసుణ్ణి సూర్యుడు నేలమీదకు పంపబోతున్నాడు. వాడిని వధించాల్సిన బాధ్యత నర మహర్షీ నీదే."

 "అలాగే మహర్షీ. వాడు నేల మీదకు వచ్చిన తర్వాత కదా" అని నరుడు బదులిచ్చాడు.

 "అంతే. కానీ వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలెత్తాలని బ్రహ్మ ఆదేశం. ఇప్పటికే ద్వాపర యుగం పూర్తి కావస్తున్నది. రాక్షసుల వల్ల ధర్మం కల్లోలితమవుతున్నది. కృత యుగం నాటి జీవులు మీరు. ఇప్పుడున్నవారంతా అల్ప ప్రాణులు. మీ మహా దేహాలతో నేటివారిని నిర్జించటం చాలా సులువు, కానీ ధర్మం అందుకు అంగీకరించదు. అందువల్ల మీరు జన్మ తీసుకోక తప్పదు. కంస చాణూరులను, ఇంకా అనేక రాక్షసులను సంహరించి ధరాభారం తగ్గించటానికి నారాయణ మహర్షి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మించాలి. కర్ణ వధ కోసం నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడిగా అవతరించాలి." అన్నాడు అపాంతరముడు.

 "సరే స్వామి" అన్నారు నర నారాయణులిద్దరూ.

 అక్కడినుండి అంతర్థానమైన అపాంతరముడు యమునా తీరంలో మత్స్యగంధికి సద్యో గర్భాన ఆషాఢ పూర్ణిమ రోజు ఉదయించాడు. సద్యోగర్భమంటే గర్భధారణ, నెలలు నిండటం, శిశువు పుట్టి పెరిగి పెద్దవాడవటం వంటి దశలన్నీ లేకుండా పోవటమే. పరాశర మహర్షి అనుగ్రహించిన వెంటనే యోజనగంధికి కృష్ణ ద్వైపాయనునిగా పుట్టగానే తరుణ వయస్కుడయ్యాడు. తలచుకున్న వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతానని తల్లికి మాటిచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు.

 హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసి అపారంగా ఉన్న వేదరాశిని విభజించి వేద వ్యాసుడయ్యాడు. శిష్యులకు వేదబోధ చేస్తూ అరణ్యకాలుగా, బ్రాహ్మణాలుగా, ఉపనిషత్తుల ఆవిర్భావానికి ప్రేరకుడయ్యాడు. కురు వంశాన్ని కాపాడటానికి దృతరాష్ట్ర, పాండురాజు మరియు విదురుల జన్మకు కారకుడయ్యాడు. ఇప్పటికీ వేదవ్యాసుడు బదరికాశ్రమంలో సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తారు.

 మహా భారతంలో

 శ్రీమన్నారాయణుడు ప్రజాసృష్టి చేయటానికి సంకల్పించిన వెంటనే అతని నాభికమలం నుండి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు ప్రసరించాయి. వాటికి మేలు చేయటానికి సంకల్పించిన బ్రహ్మ ఒక అపార జ్ఞానిని పుత్రునిగా పొందాడు. ఆయనే అపాంతరముడు. ఆయన వేదాలన్నింటినీ అధ్యయనం చేసి క్రమబద్ధం చేసాడు. అందుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు అన్ని మన్వంతరాలలో మిక్కిలి ఆనందం పొందుతావని వరమిచ్చాడని మహాభారతంలో శాంతి పర్వం చెబుతుంది.......

Friday, September 16, 2022

దివ్యదృష్టి గురించి విశేషాలు


🌹*దివ్యదృష్టి గురించి విశేషాలు*🙏
*శివోహం శివోహం శివోహం*
మంత్ర తంత్ర యోగసాధనల్లో ఏ సాధన చేసినా సిద్దిని పొందే దశలో సాధకుడికి లభించేది దివ్యదృష్టి. భౌతికంగా చర్మచక్షువులతో చూడలేని విషయాలు చూడగలగటం దీంట్లో జరుగుతుంది. సాధనకు మొదట్లో తీవ్రమైన ఏకాగ్రత చేత తన ధ్యేయమూర్తిని మాత్రమే చూడగలుగుతాడు. అది కరచరణాది సహితమైన ఆకారం కావచ్చు, రేఖాసమన్వితమైన యంత్రాకారం కావచ్చు ‌ . లేకపోతే ఒట్టి తేజఃపుంజమే కావచ్చు. అది క్రమ క్రమంగా దేవతానుగ్రహం వలన తాను కోరిన వాటిని కూడా చూడగలిగే శక్తి సాధకుడికి వస్తుంది. కొందరు అమ్మవారి విగ్రహాన్ని చూస్థూనే ఆన్ని విషయాలు చూడగలరు. దర్శించగలరు. ఏ దేవతా మంత్రం అయినా ఈ స్థితికి తప్పకి దారి తీయాలి. ఆజ్ఞా చక్ర స్థానం అయిన భ్రూమధ్యంలో మూడవ కన్ను అదృశ్యరూపంగా యోగికి ఉదయిస్తుంది అన్నమాట. శివుడు ఫాలాక్షుడు అనడంలోని తాంత్రిక రహస్యం ఇక్కడ గుర్తించాలి. 

కాళిదాసు కుమారసంభవం లో శివతపోభంగానికి మన్మధుడు వస్తున్న సందర్భంగా ఆ దక్షిణామూర్తిని త్రయంభకునిగా వర్ణించాడు. మారుడు పుష్పాస్త్రాలను విడిచిన తర్వాత కొద్ది పాటి మనస్సంచలనం కలిగినా నిగ్రహించుకొని పరమేశ్వరుడు ధ్యాన దృష్టితో విషయాన్ని గ్రహించి మూడవ కన్నులో నుంచి అగ్నిని పుట్టించి మన్మధుడిని భస్మం చేశాడు. రుద్రుడు మూడవ కన్ను తెరిస్తే అగ్నిజ్వాల మాత్రమే ఉదయిస్తుంది అని చాలాచోట్ల వర్ణించబడింది. కానీ హరవిలాసంలో శ్రీనాథసార్వభౌముడు దారుకావనవిహారంలో శివుడు రంబావక్షోజ సౌందర్యాన్ని మూడు కన్నులతో చూసి ఆనందిచినట్లు వర్ణించాడు. దీనిని బట్టి మూడవ కన్ను కేవలం దహనానికి మాత్రమే కాదు మామూలుగా చూడటానికి కూడా ఉపయోగించవచ్చు అని కవిరాజు చెప్పినట్లు అయింది. 

మనుషుల్లో ఈ మూడవ కన్ను వికసించుకోమే ఉపనయనం, బ్రహ్మోపదేశము అనే ప్రక్రియను ప్రాచీన ఋషులు నిర్మించారు. ఉపనయనం అంటే అధికమైన కన్ను అని అర్థం. భ్రూమధ్యంలో ఈ కన్ను తెరుచుకుని అదృశ్య దేవలోకములను దర్శించడానికి ఈ ఉపనయనం ఉద్దేశించబడింది. టిబెట్ లో లామాలకు ఈ విశేషం బాగా తెలుసు. పాశ్చాత్య దేశాలలో నెప్ట్యూన్ ఫాలబాగమున కన్నుగల దేవతగా వర్ణన చేయబడినది. ఈజిప్టు రాజులు అయి ఫారోల భ్రూమద్యమునందు కనిపించే సర్వదర్శక స్పర్పచిహ్నం దివ్య దర్శనానికి ఒక సంకేతము అని పండితులు భావిస్తున్నారు.

పురాణాలలో చాలా చోట్ల మహనీయులైన ఋషులు తమ దివ్య దృష్టి ప్రభావం చేత త్రికాలములలోని ( భూత భవిష్యత్ వర్తమాన) విషయాలను తెలుసుకోగలినట్లు చెప్పబడింది. ఉదాహరణకు రఘువంశంలో దిలీపమహరాజుకు చాలా కాలం సంతానం లేదు. ఎంత కాలమో వేచి అనేక వ్రతాలు చేసినా ఫలితం కనబడక చివరికి కులగురువైన వశిష్టుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదపద్మములను ఆశ్రయించారు. ఆ మహర్షి ధ్యాన సమాధి లో గత కాలలో జరిగిన దిలీపుని దోషగాధను, దాని వలన అతడు తెలియకుండానే కామధేనువు చేత పొందిన శాపాన్ని వివరించి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి మార్గం కూడా ఉపదేశించాడు. ప్రతీ పురాణంలోనూ ఇటువంటి విశేషాలు అడుగడుగునా కనబడుతూ ఉంటాయి. 

ఈ మధ్య కాలంలో కూడా సిద్ద వ్యక్తులు అయిన వారు ఈ దివ్యదృష్టిని సాధించినవారే. మహానుభావులు రామకృష్ణ పరమహంస దర్శనానుభవాలను పరిశీలిస్తే ఎన్నెన్నో విచిత్ర విశేషాలు కనిపిస్తాయి. ఈ జన్మకు రాకముందు ఊద్థ్వలోకాల నుంచి ఒక దివ్య శిశువు గా క్రిందికి దిగి వస్తూ మధ్య దారిలో కనబడిన ఒక మహర్షిని తనతోపాటు మానవజన్మ ఎత్తి , తనకు సహకరించడానికి రమ్మని కోరినట్లు గా పరమహంస ఒకచోట అన్నారు. ఆ ఋషి పేరు వివేకానందుడు అని కూడా వివరించారు. తనకు శిష్యులు కావాలని కోరివచ్చిన వారి యోగ్యతలను తెలుసుకోవడానికి వారి యొక్క పూర్వ జన్మలు వాటి సంస్కారాలు మొదలైన వాటిని తన అంతరంగ దృష్టితో చూసి తగిన వాళ్ళు అని అనిపిస్తే కానీ ఆయన స్వీకరించేడట. ఆ తర్వాత కాలంలో వివేకానంద స్వామికి కూడా ఈ శక్తి వికసించినట్లు ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది.

అరుణాచలవాసి ప్రసిద్ధుడైన రమణ మహర్షి దృష్టి మహత్వాన్ని గురించి ఎన్నో కథలు వ్యాపించి ఉన్నాయి. ఒకే ఒక్క చూపులోనే అవతలి వ్యక్తి లోని విశేషాన్ని గుర్తించి తన ప్రబావం చేత వాళ్ళ జీవితాలనే ఆయన మార్చగలిగేవారు. గుడిపాటి వెంకటాచలం వంటివారు మారింది ఆ దృష్టి ప్రభావం వల్లనే రమణ మహర్షిని గురించి అంతో ఇంతో వ్రాసి ప్రచురించిన పాల్ బ్రంటన్ ఈజిప్టు లో జరిపిన అన్వేషణ ఫలితంగా అక్కడి కొందరు సిద్ద వ్యక్తుల పరిచయాన్ని పొంది, దాని వలన అతడి మనోనేత్రం వికసించగా, పూర్వ జన్మలో తాను ఒక ఈజీప్ట్ దేశపు దేవాలయ అర్చకుడు అని చూసి తెలుసుకోగలిగాడు. 

మంత్ర సిద్దుడు , మహకవి అయిన కావ్యకంఠ గణపతి ముని తన పూర్వ జన్మ విశేషాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఎందరో వ్యక్తుల విశేషాలను చూడగానే చెప్పగలిగేవారు.

రమణ మహర్షి అప్రఖ్యాతుడై అరుణాచలంలో తపస్సు చేసుకుంటూ ఉండే తరుణంలో ఒక రోజు ఆయనను తనకు కలిగిన అనుభూతిని కావ్యకంఠ గణపతి ముని ఇలా పలికాడు.

"" పశ్యామిదేవదత్తేన జ్ఞానేత్వాం ముహుర్ముహుః బ్రహ్మణ్యానాం పరంబ్రహ్మన్ సుబ్రహ్మణ్యం నరాకృతిం"" 

" పురాకుమారిలోనామ భూత్వాబ్రాహ్మణస్తత్తమః ధర్మం వేదోదితం నాధత్వం సంస్థాపితవానసి ""

" జైనైర్వాకులితే ధర్మే భగవాన్ ద్రవిడేషుచ భూత్వాత్వం జ్ఞాన సంబంధః భక్తిం స్దాపితవానసి ""

"అదునాత్వం మహభాగ బ్రహ్మజ్ఞానస్య గుప్తయే శాస్త్రజ్ఞానేన సంతృపైః నిరుద్దస్యాగతోధరాం " 

దేవతలు నాకు ప్రసాదించిన జ్ఞానంతో బ్రహ్మణ్యులలో శ్రేష్ఠునిగా నరరూపం ధరించిన సుబ్రహ్మణ్యునిగా నిన్ను చూస్తున్నాను. పూర్వం కుమారిలభట్టనే బ్రాహ్మణోత్తమునిగా పుట్టి వేదోదితమైన ధర్మమును నువ్వు స్థాపించావు. దేశంలో వేద ధర్మం జైనుల చేత వ్యాకులపాటు చెందగా నువ్వు ద్రవిడులలో జ్ఞానసంబందర్ అనే పేరుతో ఉదయించి భక్తిని స్థాపించావు. ఈ రోజు శాస్త్రజ్ఞానం చేత సంతృప్తి చెందిన వారి చేత నిరోధించబడిన బ్రహ్మ జ్ఞానాన్ని గోపనం చేయడానికి నువ్వు ( రమణ మహర్షి గా ) భూమికి వచ్చావు. 

కుమార స్వామి భూలోకంలో మూడు జన్మలు ఎత్తుతాడు అని రమణ మహర్షి ది మూడవది, చివరిది అయిన జన్మ అని గణపతి ముని పలికారు. జీవించి ఉండగా కఫాలభేదన సిద్ది పొందిన మహా తపస్విగా ఖ్యాతిగాంచిన వారి మాటలు అర్షవిజ్ఞానపు మూటలు. 

ఒక్క పూర్వ జన్మకు సంబంధించిన వివేషాలే కాదు, ఇహ పర జన్మలోని కష్టసుఖాలు అన్నింటికి మూలమైన అంశాలు అన్ని దివ్య దృష్టి తో తెలుసుకుంటారు తపస్వులు. దాని వలన ఎంతో లోకోపకారం జరుగుతుంది. 

ఇంక ఈ మూడవ కన్ను లేక మనోనేత్రం , దివ్య దృష్టి తెరుచుకునే మార్గం ఏమిటి!? 

|| శ్లో||  ఆకుంచ్యవాయు మవిజిత్యచ వైరిషట్కం ఆలోక్యనిశ్చలధియానిజ నాసికాగ్రం "

గాలిని కుంభించి, అరిషడ్వర్గాలను జయించి నిశ్చల మనసుతో నాసాగ్రంను చూస్తూ ఉండాలి. అని యోగ శాస్త్రం చెబుతోంది. 

తిక్కన మహాభారతం లో హరిహరనాదుడ్ని నాసాగ్రనివాస రసికునిగా వర్ణించాడు. భ్రూమధ్యంలో ఆజ్ఞా చక్ర స్థానం. లలితా సహస్ర నామాలలో ఆజ్ఞాచక్రాంతరాళస్థారుద్ర గ్రంథి విభేదిని" అని ఉంది. పరమేశ్వరీ ప్రదాన స్థానాలలో అది ఒకటి. 

సిద్దుడైన మంత్రవిదుని చేత ఉపదేశం పొంది భ్రూమధ్యం యందు దేవతను నిలుపుకొని కళ్ళు మూసుకుని జపం సాధన ఏకాగ్రత గా చేస్తే తప్పకుండా మూడవ కన్ను అంతరలోచనం వికసిస్తుంది. స్వతంత్రంగా ఎటువంటి శిక్షణ లేకుండా గాలిని కుంభించడం చేయకూడదు. 

ఈ చూసే దృష్టి సాధనలో ఇంకా కొన్ని సాధనలు కూడా ఉన్నాయి. అంతర్లక్ష్యం, బహిర్ దృష్టి , పౌర్ణమి దృష్టి, కలిగింది శాంభవి ముద్ర. కొందరు ఊరికే కళ్ళు తెరిచి ఉంటారు. బయట వస్తువును దేనిని కూడా చూడరు. అది లక్ష్యరహితమైన చూపులా కనిపిస్తుంది. కానీ అది శాంభవీ ముద్ర సాధన యొక్క విశేషం. ఇంకొంత మంది దీప సాధన చేస్తారు. దీప దుర్గ వంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా 13 రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ దీపపు వెలుగులో వారి జీవిత రహస్యాలు చూస్తారు.

ఆ మార్గంలన్నింటిలోకి అంజన విద్య మరొకటి. కొన్ని రకాల మూలికలతో కాటుక తయారు చేసి తమలాపాకు పైన లేక భొటన వ్రేలి గోరుపైననో దానిని రాసి సాధకుడు దానిని చూడటమో లేక ఇతరుల చేత చూపించడమో ఇందులో జరుగుతుంది. కావాల్సిన విశేషాలు ఆ అంజనంలో దృశ్యాలుగా కనిపిస్తూ ఉంటాయి. 

వీటిలో దేనికైనా ఏకాగ్రత, మనోశ్చలత, మంత్రసిద్ది చాలా ముఖ్యం. లోపం ఉండకూడదు. ........

...

....

.....

ఏదైనా అందరికి, చాలా తేలికగా ఉండే పద్దతి సర్వసాధకులకు "ధ్యానం" ద్వారా దివ్య దృష్టి పొందడం అత్యంత ప్రధానమైన దశ. 

నుదుటిపై ధరించే సిందూరం లేక గంధం గుర్తుల గురించి మాట్లాడే ముందు రెండు సంఘటనల గురించి వివరించాలి. దాని వలన ఇది అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. రెండూ చారిత్రాత్మక సంఘటనలే. 

1888 లో , దక్షిణ భారతదేశంలో రామానుజం అనే ఒక వ్యక్తి భీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతను  పేరుమోసిన గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు. అతను ఎక్కువ చదువుకోలేకపోయాడు. కానీ గణితంలో అతని ప్రతిభ సాటిలేనిది. బాగా చదువుకున్న చాలా మంది గణత శాస్త్రజ్ఞులు , సంవత్సరాల తరబడి తీసుకున్న శిక్షణ వలన , ఇతరుల మార్గదర్శకత్వం వలన పేరు తెచ్చుకున్నారు. కానీ రామానుజం విశ్వవిద్యాలయ ప్రవేశార్హత కూడా లేనివాడు. అంతే కాకుండా అతడు ఎవరి నుంచి శిక్షణ కానీ, మార్గదర్శకత్వం కానీ పొందలేదు.  అందుకే , గణిత శాస్త్రం తెలిసినవారు రామానుజాన్ని మించిన గణిత శాస్త్ర ప్రావీణ్యత ఉన్నవారు ఎప్పుడూ లేరు అంటారు. 

అతడు చాలా కష్టం మీద గుమాస్తా ఉద్యోగం సంపాదించుకున్నాడు. కానీ అతి త్వరలోనే అతడికి గణిత శాస్త్రం లో అద్భుతమైన ప్రతిభ ఉంది అన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ రోజుల్లో , కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో ఎంతో ప్రసిద్ధి గాంచిన ప్రొఫెసర్ హర్డీకి ఒక జాబు వ్రాయమని ఎవరో అతనికి సలహ ఇచ్చారు. అతడు జాబు వ్రాయలేదు, కానీ రెండు రేఖాగణిత సంబంధించిన సిద్దాంత సమస్యలకు సమాధానం కొనుక్కొని హార్డీకి పంపాడు. వాటిని అందుకొని హర్డి చాలా ఆశ్చర్యపడ్డాడు, అంత చిన్న వయసులోనే ఆ సిద్ధాంతాలకు , ప్రతిపాదనలు, సమాధానాలు వ్రాయగలిగాడంటే నమ్మలేకపోయాడు. రామానుజానికి వెంటనే జాబు వ్రాసి ఇంగ్లాండుకి రమ్మని ఆహ్వానించాడు. రామానుజాన్ని మొదటి సారి కలిసినప్పుడు, గణిత శాస్త్రం లో అతడి ముందు తానొక చిన్నపిల్లాడి లాంటి వాడినని హర్డీకి అనిపించింది. రామానుజం ప్రతిభా సామర్థ్యాలు అతడి మానసిక సామర్థ్యం వలన కాదు ఎందుకంటే మేధస్సు చాలా నిదానం గా పనిచేస్తుంది, ఆలోచించడానికి సమయం తీసుకుంటుంది. కానీ హార్డీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రామారావు సమయం తీసుకోలేదు. సమస్య బోర్డు మీద వ్రాసి వ్రాయకముందే లేదా నోటిమాటలతో చెప్పగానే, ఆలోచించడానికి వ్యవది తీసుకోకుండా రామానుజం సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేవారు. అంత గొప్ప గణిత శాస్త్రజ్ఞుడికి అది ఎలా సాధ్యం అయిందో అర్థం చేసుకోవడం కష్టమైంది. సమస్యని పరిష్కరించడానికి ఒక ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు ఆరుగంటల పాటు తీసుకుని, అందులోనూ నిస్సందేహంగా అదే నిర్దిష్టమైన సమాధానం అని చెప్పలేని స్థితిలో ఉంటే రామానుజం వెంటనే, ఏ విధమైన తప్పు లేకుండా దాన్ని పరిష్కారం చేశాడు. 

రామానుజం మానసికంగా సమాధానాలు ఇవ్వడం లేదని ఋజువైంది. అతడు బాగా చదువుకున్నవాడు కాదు.. అతడు మెట్రుక్యులేషన్ పరీక్షలో తప్పాడు .. అతడి మేధా సామర్థ్యం గురించిన సూచనలు వేరే ఏం లేవు, కానీ గణిత శాస్త్ర సంబంధం గా అతడు మానవాతీతుడు. మానవ మస్తిష్కం అర్థం చేసుకోలేనిది ఏదో జరుగుతోంది. 

36 సంవత్సరాల వయస్సు లో అతడు క్షయరోగంతో మరణించారు. అతడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు గణిత శాస్త్రజ్ఞులైన ఇద్దరు, ముగ్గురు స్నేహితులతో హార్డీ అతడిని చూడటానికి వెళ్ళాడు. అతడు తన కారుని ఒక చోట నిలిపాడు. రామానుజానికి ఆ కారు నెంబర్ ప్లేట్ కనిపించింది.హర్డీ  గదిలోకి రాగానే, రామానుజం అతఢి కారు నెంబర్ ప్లేట్ విశిష్టంగా ఉంది అని అన్నారు: దానికి నాలుగు ప్రత్యేక దృక్పథాలు ఉన్నాయి అని అన్నారు. ఆ తర్వాత , రామానుజం మరణించారు. రామానుజం చెప్పింది అర్థం చేసుకోవడానికి హర్డీకి ఆరు నెలలు పట్టింది, కానీ అతడు నాలుగింటిలో మూడు విశిష్టతలని మాత్రమే తెలుసుకోగలిగాఢు. అతడు చనిపోయేటప్పుడు వీలు నామాలో నాలుగో దృక్పథాన్ని కనుక్కోవడానికి ఆ సంఖ్య గురించిన పరిశోధన కొనసాగించాలని కోరాడు. రామానుజం నాలుగు అన్నారు, కనుక  నాలుగొ దృక్పథం తప్పనిసరిగా ఉంటుంది . హార్డీ చనిపోయిన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత, ఆ నాల్గవ దాన్ని కనిపెట్టారు. రామానుజం చెప్పింది నిజమే. 

అతడు ఏదైనా గణిత శాస్త్ర సమస్యను పరిష్కరించడానికి కూర్చున్నప్పుడల్లా అతడి కనుబొమ్మల మధ్య భాగంలో ఏదో జరగడం మొదలు పెట్టేది. ఆ నిర్దిష్ట స్థలం కేంద్రంగా, అతడి కనుగుడ్లు రెండూ పైకి తిరిగేవి! యోగాలో , ఆ స్థలాన్ని మూడవ నేత్రపు స్థానం అని వర్ణిస్తారు. దీనిని మూడవ నేత్రం అని ఎందుకు అంటారు అంటే , ఈ కన్ను ఉత్తేజం అయితే వివిధ జగత్తులకు ( లోకాలకు) సంబంధించిన కొన్ని సంఘటనలని, దృశ్యాలను సంపూర్ణంగా చూడవచ్చు. అది మీ ఇంటి ద్వారం లో ఉన్న ఒక చిన్న రంద్రంలో నుంచి బయటి ప్రపంచాన్ని చూడటం లాంటిది, ఆకస్మికంగా తలుపు తెరుచుకుంటే , నువ్వు ఆకాశం అంతా చూస్తావు. అక్కడ ఆ రెండు కను బొమ్మల మద్య ఓ స్థలం ఉంది, అక్కడే ఒక చిన్న రంధ్రం ఉంది. రామానుజం విషయం లో అది ఒక్కొక్క సారి తెరుచుకుంటుంది. సమస్యను పరిష్కరించడానికి అతడి కళ్ళు మూడవ కన్ను వైపు తిరిగేవి. సమీప భవిష్యత్తులో హర్డీ కానీ, పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కానీ ఈ ప్రక్రియను అర్థం చేసుకోలేకపోయారు.

నేను మీకు సింధూరం ధరించడానికి సంబంధించిన మరొక సంఘటన చెబుతాను, మూడవ నేత్రానికి దానికి ఉన్న సంబంధం అప్పుడు అర్ధం అవుతుంది.

ఎడ్గార్ కైస్ 1945 లో మరణించాడు. దానికి నలభై సంవత్సరాలకు ముందు, అంటే 1905 లో అతడు జబ్బుపడి , మూడు రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వైద్యులు ఆశలు వదులుకున్నారు, అతడిని చైతన్య స్థితికి తీసుకురాగల మార్గమే కనిపించలేదు అన్నారు. అతడు చాలా గాఢమైన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని, దానిలో నుంచి బహుశా అతడు ఎప్పటికీ బయటపడలేడనీ వారు భావించారు. ఎన్నో రకాల ముందులు వాడారు, కానీ అతడు స్పృహలోకి వచ్చే సూచనలు ఏమీ కనిపించలేదు. 

మూడవ రోజు సాయంత్రం వైద్యులు తాము ఇంక ఏమీ చేయలేం అని, అతడు నాలుగు లేక ఆరు గంటలలో మరణించవచ్చు అనీ, ఒక వేళ అతడు బ్రతికినా , అతడి మెదడు దెబ్బతింటుంది అనీ, అది చావు కంటే హీనం అని, ఎందుకు అంటే కాలం గడిచేకొద్దీ సున్నితమైన రక్తనాళాలు, మెదడులోని కణాలు విడిపోతాయి అని ప్రకటించారు. కానీ కైస్ అపస్మారక స్థితిలో ఉండి కూడా అకస్మాత్తుగా మాట్లాడటం మొదలు పెట్టాడు. వైద్యులు దీనిని నమ్మలేకపోయారు:అతడి శరీరం అపస్మారక స్థితిలో ఉంది, కానీ అతడు మాట్లాడుతూ ఉన్నాడు. తను చెట్టు మీద నుంచి పడిపోయానని, వెన్నెముక దెబ్బతింది అనీ, అందుకే అపస్మారక స్థితిలో ఉన్నాను అని చెప్పాడు. తనకి ఆరుగంటల లోపు చికిత్స జరగకపోతే తన మెదడు దెబ్బతింటుంది అనీ, తాను చనిపోతాను అనీ కూడా చెప్పాడు. అతను త్రాగటానికి ఒక ఔషదానికి సంబంధించిన మందు ఇవ్వాలి అని, అప్పుడు పన్నెండు గంటలలో తను కోలుకుంటానని కూడా చెప్పాడు.

తనకు కావాలని కోరిన ఔషదాల పేర్లు ఎడ్గార్ కైస్ కి తెలిసే అవకాశం లేదు, అతడి మెదడు దెబ్బతినడం వలన అలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు ముందు అనుకున్నారు. ఎందుకు అంటే అతడు సూచించిన జౌషదాలు ఏవీ ఇలాంటి జబ్బును తగ్గించినట్లు వినలేదు. కానీ కైస్ ప్రత్యేకంగా వాటిని సూచించాడు కనుక వాటిని ప్రయత్నించి చూద్దాం అనుకున్నారు. అవి తెప్పించి కైస్ కి ఇచ్చారు: అతడు పన్నెండు గంటలలో కోలుకోవడం జరిగింది. 

అతడికి తెలివి వచ్చాక జరిగిన సంఘటన అతడికి చెప్పినప్పుడు, కైస్ కి మందు గురించి తాను అలా చెప్పినట్లు గుర్తు రాలేదు, ఆ మందుల పేర్లు తెలియడం కానీ, వాటిని గుర్తించడం కానీ చేయలేకపోయాడు. కానీ ఎడ్గార్ కైస్ జీవితంలోని ఈ సంఘటన అరుదైనవి సంభవించడానికి ఆరంభం. అతను బాగు చేయడానికి వీలులేని జబ్బులకు మందులను సూచించడంలో నిపుణుడు అయ్యాడు; అతడి జీవిత కాలం లో అతను ముప్పై వేల మందికి జబ్బు నయం చేశాడు. అతడు ఏ జౌషదాన్ని సూచించినా అది సరైనదే అయ్యేది, ఏ మినహాయింపు లేకుండా, అతను చెప్పిన మందు వాడిన ప్రతీ రోగి బాగుపడ్డాడు. కానీ కైస్ దాని గురించి వివరించలేకపోయేవాడు. చికిత్స కోసం అతడు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా అతడి కళ్ళు కనుబొమ్మల మధ్యస్థానం వైపుకి, ఏవో లాగుతున్నట్లు తిరిగేవని మాత్రమే చెప్పేవాడు. అతడి కళ్ళు అక్కడ నిలిచేవి, మిగతావన్నీ అతను పూర్తిగా మర్చిపోయేవాడు, ఒక నిర్దిష్ట స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే పరిసరాలను మర్చిపోయేవాడని, ఆ స్థితికి వచ్చే వరకు చికిత్స విధానం అతడికి తెలిసేది కాదని మాత్రమే గుర్తుండేది. అతడు అద్భుతమైన రోగచికిత్సలు సూచించేవాడు. అందులో అర్థం చేసుకోవాల్సినవి రెండు ఉన్నాయి. 

అమెరికా లో రోత్ చిల్డ్స్ అనే ధనిక కుటుంబం ఉంది. ఆ కుటుంబం లోని ఒక స్త్రీ చాలా కాలం జబ్బపడింది, ఏ చికిత్సా పనిచేయలేదు. ఆమెని ఎడ్గార్ కైస్ దగ్గరకు తీసుకొని వచ్చారు, అచేతన స్థితిలో అతడు ఓ నిర్దిష్ట మందును సూచించాడు. అచేతన స్థితిలో ఉన్నాడని మనం అంటాం, కానీ ఆ రహస్య ప్రక్రియ గురించి తెలిసిన వారు ఆ సమయంలో అతడు పూర్తి చైతన్యంలో ఉన్నాడు అంటారు. నిజానికి, మూడవ కన్ను గురించి తెలిసే స్థితికి ఎదిగేవరకు ఆ అచేయనత్వం కొనసాగుతూనే ఉంటుంది. 

రోత్ చిల్డ్స్ కోటిశ్వరుడు, అందువలన మందుల కోసం అమెరికా అంతా వెతికించాడు, కానీ అవి అతడికి దొరకలేదు. ఆ మందు నిజంగా ఉందో లేదో ఎవ్వరూ చేప్పలేకపోయారు. అంతర్జాతీయ పత్రికలలో ఆ మందు గురించి సమాచారం తెలియజేయవల్సిందిగా ప్రకటనలు ఇచ్చారు. మూడు వారాల తర్వాత ఆ పేరు గల మందు లేదని, ఇరవై సంవత్సరాల క్రితం ఆ పేరు గల మందు పై తన తండ్రికి హక్కు ఉండేది అని, కానీ దాన్ని ఎప్పుడూ తయారు చేయలేదు అని స్వీడన్ నుంచి ఒక వ్యక్తి వ్రాశాడు. తన తండ్రి చనిపోయాడు అని, ఆ ఔషద సూత్రం పంపగలను అని వ్రాశాడు. అప్పుడు ఆ మందు తయారు చేయించి ఆమెకు ఇవ్వడంతో, ఆమె తేరుకుంది. మార్కెట్ లో కూడా లేని మందు గురించి కైస్ కి ఎలా తెలుసుకోగలిగాడు !? 

ఇంకో సందర్భంలో , ఒకరికి ఒక ప్రత్యేకమైన మందు సూచించాడు . దాని కోసం వెతికారు కానీ అది దొరకలేదు. ఒక సంవత్సరం తర్వాత ఆ మందు అందుబాటులో ఉందని పత్రికా ముఖంగా ప్రకటించారు. గతించిన సంవత్సరం లో ఆ మందు పరిశోదనశాలలో శోధింపబడే ప్రక్రియ లో ఉంది. దానికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. కానీ కైస్ కి  దాని గురించి తెలుసు. అప్పుడు ఆ రోగికి ఆ మందు ఇచ్చారు ,అతడు ఆరోగ్యాన్ని పొందాడు.  ...

మనం మంచి నిద్ర లో ఉన్నప్పుడు మన కళ్ళు పైకి లాగబడి ఉంటాయి. అది మనం ఎంత గాఢంగా నిద్రపోతున్నాం అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనస్తత్వ శాస్త్రవేత్తలు నిద్రపై ప్రయోగాలు జరుపుతున్నారు. నిద్ర ఎంత గాఢంగా ఉంటే, కళ్ళు అంత పైకి లాగబడి ఉంటాయి. కళ్ళు ఎంత కిందకి ఉంటే, అంత కదలికలు ఉంటాయి. కనురెప్పల చాటున కళ్ళు ఎంత వేగంగా కదులుతూ ఉంటే అంత ఎక్కువ సంఘటనలతో కూడిన కల నీకు వస్తుంది అన్నమాట. ప్రయోగాల ద్వారా ఇప్పుడు ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. కంటి కదలికలు తర్వాత కదులుతున్న కలని సూచిస్తాయి. కళ్ళు కిందికి ఉంటే కళ్ళ కదలిక ఎక్కువ వేగంగా ఉంటుంది. కళ్ళు పైకి వెళుతుంటే కళ్ళ కదలిక వేగం తగ్గుతుంది. కళ్ళ కదలికే లేనప్పుడు మంచి నిద్ర లో ఉన్నట్లు. ఆ స్థితిలో కనుబొమ్మల మధ్య స్థానం లో కళ్ళు కదలకుండా నిలిచి ఉంటాయి.

సమాధిలో, గాడ ధ్యానం లో మనం ఏ స్థితికైతే చేరుకుంటామో గాఢనిద్రలో కూడా అదే స్థితికి చేరుకుంటామని యోగా చెబుతుంది. గాఢమైన నిద్రలోనూ, సమాధి స్థితిలోనూ కళ్ళు నిలిచి ఉండేది ఒకే స్థానంలో.

ఈ రెండు చారిత్రాత్మక సంఘటనల గురించి ఎందుకు చెప్పాను అంటే ( రామానుజం, ఎడ్గర్ కైస్) కనుబొమ్మల మధ్య స్థానం లో ప్రాపంచిక జీవితం ఆగిపోయి పరలోక జీవితం మొదలు అవుతుంది అని సూచించడానికే. ఆ ద్వారానికి ఇటువైపు ప్రపంచం వర్థిల్లుంటే, అటువైపు తెలియని, మానవాతీతమైన అద్భుతమైన ప్రపంచం ఉంది. 

తిలకం సిందూరం గుర్తు తెలియని ఆ ప్రపంచానికి సంకేతంగా కనిపెట్టబడింది. ఎక్కడ అంటే అక్కడ దాన్ని పెట్టకూడదు, నుదిటిపై చేయిపెట్టి ఆ స్థానాన్ని కనుక్కున్న వ్యక్తి మాత్రమే, తిలకం ఎక్కడ పెట్టవలసినది చెప్పగలడు. తిలకం ఎక్కడంటే అక్కడ పెట్టడం వలన ప్రయోజనం లేదు, ఎందుకు అంటే అందరికీ ఆ స్థానం ఒకేచోట ఉండదు. మూడవ కన్ను అందరికీ ఒకేచోట ఉండదు, చాలా మందికి అది కనుబొమ్మల మద్యపై బాగంలో ఎక్కడో ఉంటుంది. గతజన్మ లో ఎవరైనా ఎక్కువ కాలం ధ్యానం చేసి ఉంటే, అతడికి సమాధి అనుభవం లభించి ఉంటే, అతఢి మూడవ కన్ను కొద్దిగా కింద ఉంటుంది. ధ్యానమే చేసి ఉండకపోతే ఆ స్థానం నుదిటి మీద పై భాగంలో ఉంటుంది. ఆ బిందువు ఉన్న స్థానాన్ని బట్టి గతజన్మ లో నీ ద్యానస్థితిని నిర్ణంచవచ్చు. గతజన్మ లో సమాధి స్థితి అనుభవించావా లేదా అనేది అది సూచిస్తుంది. అది తరచుగా జరిగి ఉంటే ఆ బిందువు క్రిందకి దిగి ఉంటుంది. నీ కళ్ళతో సమానమైన స్థాయిలో అది ఉంటుంది. అది అంతకంటే కిందకి వెళ్ళలేదు. ఆ బిందువు నీ కళ్ళకి సమాంతరంగా ఉంటే, ఒక చిన్న సంఘటనతో ఎవరైనా సమాధిలోకి ప్రవేసించగలరు. నిజానికి, జరిగింది చాలా చిన్నది కావడంతో ప్రాముఖ్యత లేనిదానిలాగా కనిపిస్తుంది. స్పష్టమైన కారణం ఏమీ లేకుండానే ఎవరైనా సమాధిలోకి వెళితే మనం ఆశ్చర్యపోతాం 

సింధూరం లేదా గంధపు గుర్తు సరియైన స్థలంలో పెడితే, అది చాలా విషయాలను సూచిస్తుంది. మొదటిగా, ఒక ప్రత్యేకమైన స్థలంలో తిలకం ధరించమని మీ గురువు చెబితే, అక్కడ నీకు ఏదో అనుభవం మొదలవుతుంది. దాన్ని గురించి నువ్వు ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎవరైనా రెండు కళ్ళ మధ్య దగ్గరగా వేలు పెడితే, ఎవరో నీ వైపు వేలుపెట్టి చూపిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. మూడవ కన్ను గ్రహణ శక్తి అదే.

తిలకం నీ మూడవ కన్ను నేత్రపు పరిణామం అంత ఉండి సరియైన స్థలంలో పెడితే, నువ్వు ఆ స్థలాన్ని 24 గంటలూ గుర్తుంచుకుంటావు, మిగిలిన శరీరాన్ని మర్చిపోతావు. దీని వలన తిలకం పట్ల ఎరుక పెరుగుతుంది మరియు శరీరం పట్ల ఎరుక తగ్గుతుంది. అప్పుడు తిలకం తప్ప శరీరం గురించి ఏ విధమైన గుర్తు లేని క్షణం వస్తుంది. అది జరిగినప్పుడు నీ మూడవ నేత్రాన్ని తెరుచుకోగలవు. ఈ సాధన లో , నువ్వు పూర్తిగా నీ శరీరాన్ని మర్చిపోయి, తిలకాన్ని మాత్రమే గుర్తుంచుకునే ప్రయోగంలో నీ చైతన్యం మొత్తం స్పటికం గా మారి, మూడవ నేత్రంపై కేంద్రీకరిస్తుంది. మూడవ నేత్రాన్ని తెరిచే తాళం చెవి కేంద్రీకరించబడిన చైతన్యమే. ఒక భూతద్దం సహాయంతో సూర్య కిరణాలను ఒక కాగితపు ముక్క మీద కేంద్రీకరిస్తే, ఆ కాగితాన్ని మండించడానికి సరిపోయినంత వేడిని సృష్టిస్తావు. ఆ కిరణాలు కేంద్రీకరించినప్పుడు మంట ఉత్పత్తి అవుతుంది. శరీరం అంతా చైతన్యం వ్యాపించి ఉన్నప్పుడు అది నీ జీవితాన్ని నిర్వహించడం అనే పని చేస్తూ ఉంటుంది. కానీ అది పూర్తిగా మూడవ నేత్రంపై కేంద్రీకరిస్తే , మూడవ నేత్రంతో చూడటానికి అడ్డంగా ఉన్నది తగలబడుతుంది. , అప్పుడు నీకు అంతర్గత ఆకాశాన్ని చూడనిచ్చే తలుపు తెరుచుకుంటుంది. 

తిలకం యొక్క మొదటి ఉపయోగం ఏమిటి అంటే తిలకాన్ని 24 గంటలూ గుర్థుంచుకోవడం కోసం శరీరంలో నీకు సరియైన చోటుని చూపించడం. తిలకం యొక్క రెండవ ఉపయోగం ఏమిటి అంటే గురువు నీ నుదుటిపై చేయి పెట్టకుండా నీ ప్రగతిని గమనించడాన్ని అది సుగమం చేస్తుంది.. ఎందుకు అంటే ఆ బిందువు కిందకి జరిగే కొద్దీ తిలకం కొంచెం కిందకి పెడతావు. ప్రతీ రోజూ ఆ స్థలాన్ని గమనించి మూడవ నేత్రం ఎక్కడైతే ఉందని అనుకుంటావో అక్కడ తిలకాన్ని పెట్టాలి

🙏🌹🙏🌹🙏

Wednesday, September 14, 2022

యోగ తత్త్వ ఉపనిషత్తు (Yoga Tatva Upanishad Telugu Notes)

 

యోగ తత్త్వ ఉపనిషత్తు



 

విషయ పట్టిక 


1 పరిచయం

2 యోగ తత్త్వం

3 రాజయోగ వివరణ

4 బంధాలు మరియు ముద్రలు

5 రాజయోగ సిద్ధి

6 వస్తువుల పట్ల వివక్ష మరియు ఉదాసీనత

7 ప్రణవ ఆరాధన


పరిచయం

యోగ తత్త్వ ఉపనిషత్తు యోగ తత్వశాస్త్రం యొక్క ఉపనిషత్తు. ఇది 108 ఉపనిషత్తులలో నలభై ఒకటవ ఉపనిషత్తు మరియు కృష్ణ యజుర్వేదంలో భాగమైనది. యోగ తత్త్వ ఉపనిషత్తులో 142 శ్లోకాలు ఉన్నాయి.

యోగ తత్త్వ ఉపనిషద్ అనే పదం మూడు సంస్కృత పదాల కలయిక: యోగ, తత్త్వ మరియు ఉపనిషద్. తత్త్వం అంటే తత్వశాస్త్రం. అందుకే యోగ తత్త్వ ఉపనిషద్ అంటే యోగ తత్వశాస్త్రం యొక్క ఉపనిషద్.

యోగ తత్త్వ ఉపనిషత్తు అనేది మొదటి శతాబ్దానికి లేదా అంతకు ముందు కాలానికి చెందిన పురాతన ఉపనిషత్తులలో ఒకటి.

చాలా ఉపనిషత్తులు గురువు మరియు శిష్యుల మధ్య సంభాషణ. యోగ తత్త్వ ఉపనిషత్తు కూడా బ్రహ్మన్ మరియు విష్ణువు మధ్య సంభాషణ రూపంలో ఉంటుంది.

యోగ తత్త్వం

నేను (యోగ తత్త్వ ఉపనిషత్ రచయిత) యోగుల ప్రయోజనం కోసం యోగా (యోగ తత్త్వం) యొక్క తత్వశాస్త్రాన్ని దీని ద్వారా అందిస్తున్నాను. ఈ యోగమును విని నేర్చుకొనుట వలన యోగి సర్వపాపములను పోగొట్టును.

విష్ణువు అనే పేరుగల గొప్ప యోగి, ఆధ్యాత్మిక తపస్సు యొక్క పరమాత్మ, యోగ తత్వ మార్గంలో కాంతి రేఖగా నిలుస్తాడు. పితామహ  ( పితామహ అంటే తాత. ఇక్కడ  భగవంతుడు బ్రహ్మను సూచిస్తుంది, ఇది భగవంతుడు)  జగన్నాథుని  (విష్ణువు యొక్క మరొక పేరు.  జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు) వద్దకు వెళ్లి అతనికి నివాళులు అర్పించి, అష్టాంగ యోగ తత్వశాస్త్రాన్ని వివరించమని అడిగాడు. (ఎనిమిది అవయవాలు లేదా దశల యోగా).

సంసారం

"నేను తత్వశాస్త్రాన్ని వివరిస్తాను" అని  హృషికేశ భగవానుడు చెప్పాడు . ( హృషికేశ ది అనేది విష్ణువు యొక్క మరొక పేరు. దీని అర్థం ఇంద్రియాల ప్రభువు). భ్రమ ప్రజలందరినీ ప్రాపంచిక బాధలు మరియు ఆనందాల ఉచ్చులో చిక్కుకుంటుంది. వారికి ఉన్న ఏకైక మార్గం భ్రమ అనే ఉచ్చులో చిక్కుకోవడం. ముక్తి అనేది వృద్ధాప్యం, వ్యాధి, మరణం మరియు దుర్మార్గపు జీవిత చక్రాన్ని నాశనం చేసే అత్యున్నత నివాసం. తత్త్వవేత్తలు కూడా గ్రంధాల జ్ఞానంతో భ్రమలో ఉన్నారు.

ఆత్మ మరియు పరమాత్మ

స్వయం ప్రకాశించే ఆత్మను ఖగోళ వస్తువులు కూడా సరిగ్గా వర్ణించలేకపోయాయి. లేఖనాలు ఎలా వివరించగలవు? దాని గత కర్మ ప్రకారం, అవిభాజ్య-ఏక-సారాంశం ( పరమాత్మ ), ఇది నిర్మలమైనది మరియు మలినాలను మరియు క్షయం లేకుండా ఉంటుంది, ఇది జీవ (ఆత్మన్) గా వ్యక్తమవుతుంది.

పరమాత్మ , అన్నింటినీ మించిన శాశ్వతమైన ఉనికి  జీవుడిగా ఎలా  వ్యక్తమవుతుంది ? జ్ఞాన స్వరూపుడైన మరియు ఎలాంటి అనుబంధాలు లేని  పరమాత్మ జీవుడు ఎలా అవుతాడు ?

మొదట, నీరు వంటి ఒక విషయం యొక్క అభివ్యక్తి ఉంది. అప్పుడు  అహంకార (ఆత్మ స్పృహ) వ్యక్తమవుతుంది. అప్పుడు ఐదు సూక్ష్మ అంశాలు తర్వాత ఐదు స్థూల అంశాలు, మానిఫెస్ట్. అది బాధలు మరియు ఆనందాలతో తనను తాను అనుబంధించినప్పుడు, అది  జీవ అని పిలువబడుతుంది . అంతటా వ్యాపించిన పరమాత్మకు జీవ  నామం ఎలా  వర్తిస్తుంది  .

మోహము, క్రోధము, భయము, దుఃఖము, సంతోషము, సోమరితనం, మాయ, మోహము, జననము, మరణము, ఆకలి మరియు దాహము లేని జీవుడు పరమాత్మ మాత్రమే. ఈ దోషాలు కర్మ ఫలితాలు . నేను కర్మను నాశనం చేసే మార్గాలను వివరిస్తాను  .

జ్ఞాన

జ్ఞానము  (జ్ఞానము) మోక్షమును ప్రసాదించును. యోగం లేకుండా కేవలం జ్ఞానమే అభిలాషికి ఎలా ఉపయోగపడుతుంది ? లేదా జ్ఞానము లేకుండా యోగా మాత్రమే  ఫలితాన్ని  ఎలా ఇస్తుంది? అందువల్ల మోక్షాన్ని కోరుకునే వ్యక్తి  జ్ఞాన  మరియు  యోగా రెండింటినీ ఆశ్రయించాలి.

అజ్ఞానం (అజ్ఞానం ) ప్రాపంచిక భ్రాంతికి మరియు దాని సంబంధిత బాధలకు మరియు ఆనందాలకు కారణం  . జ్ఞానం  మాత్రమే మోక్షానికి దారి తీస్తుంది. మొదట,   జ్ఞానం మోక్షానికి దారితీసే మార్గం గురించి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది ఎప్పటికీ ఆనందకరమైన అవిభాజ్య-ఒకే-సారాంశం యొక్క జ్ఞానాన్ని ఇస్తుంది.

యోగా

నేను ఇప్పుడు యోగా వివరాలను వివరిస్తాను.

యోగా రకాలు

యోగా ఒకటి అయినప్పటికీ, దాని ఉపయోగం మరియు అభ్యాసం ప్రకారం మనం దానిని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. యోగా యొక్క నాలుగు ప్రాథమిక రకాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. మంత్ర యోగా
  2. లయ యోగము
  3. హఠ యోగా
  4. యోగా రాజు.

యోగా యొక్క దశలు

యోగాలో నాలుగు దశలు ( అవాస్తా ) ఉన్నాయి, ఇవి ఏ రకమైన యోగాకైనా సాధారణం. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  1. ఆరంబుల అవస్తా (ప్రాథమిక దశ)
  2. Ghata Avasta (Stage of effort)
  3. పరిచయ అవస్త
  4. నిష్ఫటి ఆవిష్కరణ

మంత్ర యోగా

నేను (విష్ణువు అంటాడు) సంగ్రహ రూపాన్ని యోగాన్ని ఇస్తాను. పన్నెండేళ్లపాటు వర్ణమాల మంత్రాన్ని జపించేవాడు క్రమంగా జ్ఞానాన్ని, విశేష శక్తులను పొందుతాడు. మందబుద్ధి గలవారు ఈ యోగాన్ని ఆశ్రయించాలి. ( మాతృక మంత్ర జపము అనేది సంస్కృతంలోని 51 వర్ణమాలలను నిర్దేశించిన పద్ధతిలో జపించడం. ఈ ఉపనిషత్తు [యోగ తత్త్వ ఉపనిషత్తు] ప్రకారం, ఈ జపమే శ్రేష్ఠమైన జపము.

లయ యోగము

లయ యోగం అంటే మనస్సును కరిగించడం. ఒక వ్యక్తి దానిని అనేక విధాలుగా పొందవచ్చు. సాధకుడు నిలబడి, నడవడం, కూర్చోవడం మరియు నిద్రించడం వంటి అన్ని రోజువారీ కార్యకలాపాలను చేస్తూ అవిభాజ్య-ఏక-సారాంశమైన భగవంతుడిని ధ్యానించాలి. ఏ కార్యకలాపాలతో సంబంధం లేకుండా మనస్సు పూర్తిగా ఒక విషయంలో నిమగ్నమై ఉండాలి లేదా లీనమై ఉండాలి. ఇది లయ యోగము.

యోగా రాజు

రాజయోగంలోని ఎనిమిది అంగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  1. యమ
  2. నియమా
  3. ఆసనం
  4. ప్రాణాయామం
  5. ప్రత్యాహార
  6. ధారణ
  7. భగవంతుడు హరి ధ్యానం
  8. సమాధి

హఠ యోగా

హఠ యోగా కింది పన్నెండు అభ్యాసాలను కలిగి ఉంటుంది.

  1. మహా ముద్ర
  2. మహా బంధ
  3. మహా వేధ
  4. కేచారి ముద్ర
  5. జలంధర్ బంధ
  6. ఉద్దీయన బంధ
  7. అందుకే నిధి
  8. Dirgha Pranava Sandhana
  9. Siddhantha Sravana
  10. వజ్రోలి ముద్ర
  11. అమరోలి ముద్ర
  12. సహజోలి ముద్ర

గమనిక: యోగ తత్త్వ ఉపనిషత్తు హఠయోగాన్ని రాజయోగం నుండి స్పష్టంగా వేరు చేయలేదు. ఈ ఉపనిషత్తు ప్రకారం, యోగి హఠయోగం ద్వారా రాజయోగ లక్ష్యాన్ని సాధిస్తాడు. అలాగే, రాజయోగం అనేది హఠయోగాన్ని కలిగి ఉన్న ఒక గొడుగు పదం.

రాజయోగం యొక్క వివరణ

మితకార  (సమశీతోష్ణ ఆహారం) ఇతర యమల కంటే ముఖ్యమైన  యమ  .  ఇతర N iyama -s కంటే అహింస ( అహింస ) చాలా ముఖ్యమైన N iyama . అసంఖ్యాకమైన భంగిమలలో, వాటిలో ఎనభై ముఖ్యమైనవి. వాటిలో నాలుగు యోగా భంగిమలు చాలా ముఖ్యమైనవి. అవి సిద్ధాసనం , పద్మాసనం , సింహాసనం , భద్రాసనం .

యోగా యొక్క అవరోధాలు

ప్రారంభ దశలలో యోగాభ్యాసం చేస్తున్నప్పుడు, ఆశపడే వ్యక్తి బద్ధకం, అహంకారం, చెడు సహవాసం, కామం, దుర్మార్గం మరియు రసవాదం వంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు. ఆశించేవాడు తన సద్గుణాలు మరియు జ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించాలి.

యోగా ప్రదేశం

యోగా చేయడానికి ద్వారం లేని చిన్న ద్వారం ఉన్న మఠాన్ని ఎంచుకోవాలి. ఆ ప్రదేశాన్ని ఆవు-పేడ నీటితో లేదా సున్నంతో కడిగి బాగా శుభ్రం చేయాలి. ఇది దోషాలు, పేనులు మరియు దోమలు లేకుండా ఉండాలి. రోజూ చీపురుతో తుడిచి తీపి వాసనతో పరిమళించాలి. సీటు చాలా ఎత్తుగా లేదా తక్కువ ఎత్తులో ఉండకూడదు మరియు ఒక గుడ్డ, జింక చర్మం లేదా గడ్డితో ఒకదానిపై ఒకటి విస్తరించి ఉండాలి. పద్మాసనంలో కూర్చుని, యోగి ప్రాణాయామం ప్రారంభించాలి .

ప్రాణాయామం

ముందుగా, యోగి తన శరీరాన్ని నిటారుగా ఉంచి,  అంజలి ముద్రలో అరచేతులను మూసి ఉంచి నమస్కరించాలి .

బొటనవేలు  పింగళ నాడిని  (కుడి ముక్కు) అడ్డుకోవడంతో, అతను నెమ్మదిగా ఇడా నాడి  (ఎడమ ముక్కు) ద్వారా  గాలిని (పూరక) నింపాలి మరియు తన సామర్థ్యం మేరకు గాలిని ( కుంభక ) నిలుపుకుని, నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి ( రేచక ) అదే నాసికా రంధ్రం ద్వారా. మళ్ళీ నెమ్మదిగా కుడి ముక్కు రంధ్రము ద్వారా గాలిని లాగి, కుంభకుడిని  తన ఉత్తమ సామర్థ్యానికి చేర్చి, అతను ఇతర నాసికా రంధ్రం ద్వారా ఊపిరి పీల్చుకోవాలి. అప్పుడు ఊపిరి పీల్చుకున్న నాసికా రంధ్రం ద్వారా పీల్చడం, అతను ప్రక్రియను పునరావృతం చేయాలి.

అరచేతి మోకాలిని చుట్టుముట్టడానికి మరియు వేళ్లను నెమ్మదిగా లేదా త్వరగా పట్టుకోవడానికి పట్టే సమయం ఒక M అట్రా .

పూరకకు పట్టే సమయం   పదహారు మాత్రా-లు ఉండాలి. కుంభక సమయం అరవై నాలుగు మాత్రా-లు ఉండాలి. రేచక సమయం ముప్పై రెండు మాత్రా-లు ఉండాలి. ప్రాణాయామం యొక్క ఈ సమయ అంశం ముందుగా పేర్కొన్న అభ్యాసానికి వర్తిస్తుంది. యోగి ప్రతిరోజూ పగలు, మధ్యాహ్నం, సూర్యాస్తమయం మరియు అర్ధరాత్రి నాలుగు సార్లు, ఎనభై కుంభకాల వరకు సాధన చేయాలి.

నాడి శుద్ధి

ఇలా మూడు నెలలపాటు ఆచరించడం వల్ల నాడి శుద్ధి (శరీరంలోని అన్ని నాడుల శుభ్రత) లభిస్తుంది. నాడి శుద్ధి పొందినప్పుడు, శరీరం యొక్క తేలిక మరియు సన్నగా ఉండటం, మెరుపు మరియు మంచి ఛాయ, అశాంతి లేకపోవడం, జీర్ణ శక్తి పెరుగుదల వంటి బాహ్య లక్షణాలు వ్యక్తమవుతాయి.

యోగిక్ డైట్

యోగాకు హాని కలిగించే ఆహారాలకు యోగి దూరంగా ఉండాలి. ఉప్పు, ఆవాలు, అసిఫెటిడా వంటి ఆహారాలు, యాసిడ్, వేడి, ఆస్ట్రింజెంట్ మరియు ఘాటైన వంటకాలు, చేదు కూరగాయలు మొదలైనవి.

అతను అగ్ని, లైంగిక సంపర్కం మరియు ప్రయాణానికి సామీప్యతను నివారించాలి. అతను ఉదయాన్నే స్నానాలు, ఉపవాసం మరియు శారీరక శ్రమతో కూడిన అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. యోగా ప్రారంభ దశలో పాలు మరియు నెయ్యి తగినవి. వండిన అన్నం, గోధుమలు, పచ్చి శెనగలు యోగాకు మేలు చేస్తాయి.

కేవల కుంభక

అప్పుడు యోగి కోరుకున్నంత కాలం శ్వాసను నిలుపుకునే శక్తిని పొందుతాడు. రేచక మరియు పూరక లేని కుంభకము కేవల కుంభకము. యోగి కోరుకున్నంత కాలం శ్వాసను నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు కేవల కుంభకంలో విజయం సాధిస్తాడు. ఒక్కసారి ఈ ఘనతను సాధించినట్లయితే, యోగి సాధించలేనిది మూడు లోకాలలో లేదు.

సిద్ధి లేదా మానసిక శక్తులు

ప్రారంభ దశలో, యోగికి విపరీతమైన చెమట ఉంటుంది. అతను వాటిని తిరిగి శరీరంలోకి మసాజ్ చేయాలి. అప్పుడు యోగికి శరీరంలో వణుకు కలుగుతుంది. పెరిగిన అభ్యాసంతో, అతను పద్మ ఆసనం మరియు ఆసనంలో తన శరీరం మధ్య బోలుగా ఉంటాడు. ఆ లొసుగులో, అతను కొన్ని ఎత్తులు మరియు హద్దులు అనుభవిస్తాడు. పెరిగిన అభ్యాసంతో, పద్మాసనంలో ఉన్న యోగి భూమి నుండి పైకి లేస్తాడు. అంతేకాకుండా, అతను తదుపరి అభ్యాసంతో మానవాతీత విజయాలను సాధిస్తాడు. అతను ఈ ఘనతను బయటి ప్రపంచానికి వెల్లడించకూడదు.

యోగి అల్పమైన స్వభావం యొక్క బాధల నుండి బాధపడడు. మూత్రం మరియు మలం మొత్తం చిన్న పరిమాణంలో ఉంటుంది. అతను తక్కువ సమయం నిద్రపోతాడు. చెమట, నోటి దుర్వాసన, ఉమ్మి, కళ్ల వాతం, కీళ్ల వాత బాధలు ఎప్పుడూ రావు.

అభ్యాసాన్ని మరింత పెంచడం ద్వారా, యోగి  భూ-చార సిద్ధిని పొందుతాడు. ( అది ఇష్టానుసారంగా భూమిపై సంచరించే శక్తి). అతను తన చేతి దెబ్బతో భూమిపై ఉన్న ఏ ప్రాణులనైనా జయించగలడు. అతను అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి అవుతాడు. అందువల్ల చాలా మంది స్త్రీలు అతనితో సంభోగం చేయాలని కోరుకుంటారు. స్త్రీతో సంభోగం చేయడం కేవలం వీర్యం వృధా. అటువంటి వ్యర్థాలను నివారించడానికి, అతను యోగాలో తీవ్రంగా ఉండాలి. వీర్యం ధారణతో యోగి శరీరం నుండి తీపి వాసన వస్తుంది.

ఏకాంత ప్రదేశంలో సీటు పొంది, యోగి ప్రణవ మంత్రాన్ని ఎత్తైన ప్రదేశంలో జపించాలి. దీని వలన సంచిత పాపాలు నశిస్తాయి. అలాగే ఈ  జపం  వల్ల ఆటంకాలు, దోషాలు తొలగిపోతాయి. యోగాలో చివరి దశకు విజయవంతంగా ముందుకు సాగడానికి యోగి ఈ రకమైన జపాన్ని మొదటి మెట్టుగా తీసుకోవాలి.

ఆరంభ అవస్తా మరియు ప్రణవ జపము

ఏకాంత ప్రదేశంలో సీటు పొంది, యోగి ప్రణవ మంత్రాన్ని ఎత్తైన ప్రదేశంలో జపించాలి. దీని వలన సంచిత పాపాలు నశిస్తాయి. అలాగే ఈ  జపం  వల్ల ఆటంకాలు, దోషాలు తొలగిపోతాయి. యోగాలో చివరి దశకు విజయవంతంగా ముందుకు సాగడానికి యోగి ఈ రకమైన జపాన్ని మొదటి మెట్టుగా తీసుకోవాలి.

ఘట అవస్త

ఘట అవస్తా  అనేది యోగ యొక్క తదుపరి దశ, ఇది ఆశించేవారి వైపు నుండి ప్రయత్నం అవసరం. యోగి  ప్రాణ , అపాన, మనస్  (మనస్సు),  బుద్ధి  (బుద్ధి),  ఆత్మ  మరియు  పరమాత్మలను  వారి పరస్పర సంబంధాలకు భంగం కలిగించకుండా ఏకం చేయాలి. ఇది ఘట అవస్తా . నేను లక్షణాలను వివరిస్తాను. ఇక్కడ ముందుగా పేర్కొన్న వ్యవధిలో కేవలం నాలుగింట ఒక వంతు ప్రతిరోజూ కనీసం పగటిపూట లేదా రాత్రిపూట ఒక  యమ  (మూడు గంటలు) వరకు సాధన చేస్తే సరిపోతుంది. కేవల కుంభకాన్ని రోజూ ఒకసారి సాధన చేయాలి.

ప్రత్యాహార

కుంభక ప్రదర్శన ద్వారా జ్ఞానేంద్రియాల నుండి జ్ఞానేంద్రియాలను ఉపసంహరించుకోవడం  ప్రత్యాహారం . యోగి తన కళ్లతో దేనిని చూసినా దానిని ఆత్మగా భావించాలి. అతను తన చెవులతో ఏది విన్నా అది ఆత్మ యొక్క స్వరంలా భావించాలి. తన ముక్కుతో ఏ వాసన వస్తుందో దానిని ఆత్మగా భావించాలి. తన నాలుకతో ఏది రుచి చూసినా ఆత్మగా భావించాలి. అతను తన శరీరంతో దేనిని తాకినా దానిని ఆత్మను పొందాలి. ఇలా చేయడం ద్వారా, అతను ఇంద్రియ అవయవాల కార్యకలాపాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఆత్మపై తనను తాను కలిగి ఉంటాడు.

రోజూ మూడు గంటలపాటు సోమరితనం లేకుండా ఈ సాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా, క్లెయిర్-ఆడియన్స్, క్లైర్‌వాయెన్స్ వంటి కొన్ని అసాధారణ శక్తులు, సమయం లేకుండా దూర ప్రాంతాలకు తనను తాను రవాణా చేయగల సామర్థ్యం, మానసిక వాక్కు శక్తి, తనను తాను ఏ రూపంలోనైనా మార్చుకునే శక్తి, అదృశ్యమయ్యే శక్తి మరియు రూపాంతరం చెందగల శక్తి. అతని విసర్జనతో ఇనుమును అద్ది బంగారంగా మారుస్తుంది. స్థిరమైన అభ్యాసం ద్వారా, లెవిటేషన్ యొక్క శక్తి సాధించబడుతుంది.

యోగి ఈ చిన్న సిద్ధి-లను గొప్ప సిద్ధి, ముక్తి వైపు పురోగతికి ఆటంకాలుగా పరిగణించాలి. జ్ఞానము గలవాడు వాటి జోలికి పోడు. అతను ఎవరికీ తన శక్తిని ప్రదర్శించడు. అతను తన శక్తుల రహస్యాన్ని ఉంచడం ద్వారా మూర్ఖుడు లేదా చెవిటివాడిలా బాహ్య ప్రపంచం నుండి దూరంగా ఉంటాడు.

శిష్యులు, నిస్సందేహంగా, వారి స్వంత ఇంద్రియాల తృప్తి కోసం వారిని అడుగుతారు. వారి అభ్యర్థనను పాటించే ఏ ప్రయత్నమైనా యోగిని అతని పురోగతి నుండి దూరం చేస్తుంది. ప్రాపంచిక విషయాలను పక్కనబెట్టి, తన గురువు చెప్పిన మాటలను మరచిపోకుండా పగలు, రాత్రి సాధన చేయాలి. ఘట అవస్త  ఇలా గడిచిపోతుంది. సాధన చేయడానికి తన వంతు ప్రయత్నం లేకుండా, యోగి ఏమీ సాధించలేడు. అందుకే అతను యోగా సాధన కోసం ఈ ప్రయత్నాలు చేయాలి.

పరిచయ అవస్త

నిరంతర సాధన ద్వారా, అతను పరిచయ అవస్తాను సాధిస్తాడు. అలాగే, యోగి యొక్క ప్రయత్నంతో, ప్రాణం మరియు అగ్ని (అగ్ని: కుండలిని)   అడ్డంకులు లేకుండా సుషుమ్నాలోకి ప్రవేశిస్తాయి. ప్రాణం మరియు అగ్నితో పాటు మనస్సు  సుసుమ్నాలోకి ప్రవేశించినప్పుడు  , అది అత్యున్నతమైన నివాసానికి చేరుకుంటుంది (దీనిని  సహస్రారం అని పిలవండి ).

ధారణ

పృథ్వీ  (భూమి) , అపస్  (నీరు) , అగ్ని  (అగ్ని) , వాయు  (గాలి),  ఆకాశ ( ఈథర్ )  అనేవి  పంచ భూతాలు . పంచ భూతాల  మీద  ఐదు రెట్లు ధారణ ఉంది - సం .

పృథ్వీ ధారణ

పాదం నుండి మోకాలి వరకు  పృథ్వీ ప్రాంతం . పృథ్వీ చతుర్భుజం మరియు పసుపు రంగులో ఉంటాడు. బీజ మంత్రం లాం  .  _ పృథ్వీ   ప్రాంతంలో  ప్రాణాన్ని బలవంతంగా  ఉంచి , బంగారు రంగులో ఉన్న బ్రహ్మను (దేవత)పై  ఐదు  ఘటికాల (2 గంటలు: 5*24 నిమిషాలు) ధ్యానం  చేయడం ద్వారా  పృథ్వీపై పట్టు సాధించాలి . నాలుగు ముఖాలు, మరియు నాలుగు చేతులు. పృథ్వీ యోగం వల్ల మృత్యువును జయించే శక్తి లభిస్తుంది.

అపస్ ధారణ

మోకాలి నుండి మలద్వారం వరకు అపాస్ ప్రాంతం . అపాస్ చంద్రవంక రూపంలో మరియు తెలుపు రంగులో ఉంటుంది. బీజ  మంత్రం  వం . _ నాలుగు చేతులతో, కిరీటం మరియు పట్టు వస్త్రంతో ప్రకాశవంతమైన స్ఫటిక ఛాయతో ఉన్న నారాయణ భగవానుని ఐదు ఘటికాల  కాలం   పాటు బీజమంత్రంతో పాటు  ధ్యానం చేయడం ద్వారా అపస్  ప్రాంతంలో  ప్రాణాన్ని బలవంతం  చేయడం ద్వారా అపస్‌పై పట్టు  సాధించాలి . నీటి మీద పాండిత్యం అన్ని పాపాలను నాశనం చేస్తుంది మరియు నీటి కారణంగా మరణ భయం ఉండదు.

అగ్ని ధారణ

అగ్ని ప్రాంతంలో పాయువు నుండి గుండె వరకు . అగ్ని త్రిభుజాకారంలో మరియు ఎరుపు రంగులో ఉంటుంది. బీజ మంత్రం  రాముడు  . _ అగ్ని   ప్రాంతంలో  ప్రాణాన్ని బలవంతంగా  ప్రయోగించి, బీజమంత్రంతో ఐదు ఘటికాల  పాటు  ధ్యానం  చేయడం ద్వారా  అగ్నిపై పాండిత్యాన్ని పొందాలి - మూడు కళ్ళు మరియు అతని శరీరం పూర్తిగా బూడిదతో పూసిన సూర్యుని వంటి వర్ణపు రుద్రుడిని . అగ్నిపై పాండిత్యం కలిగి ఉండటం వల్ల  ,  అతడు అగ్నిలో ప్రవేశించినా కాల్చబడడు.

వాయు ధారణ

హృదయం నుండి కనుబొమ్మల మధ్య వరకు వాయు ప్రాంతం. వాయు సత్-కోన (  రెండు  సమద్విబాహు త్రిభుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి మరియు వాటి శిఖరాలు పైకి క్రిందికి సూచించబడతాయి) రూపంలో మరియు నలుపు. బీజ  మంత్రం  యమ్ . _ వాయు   ప్రాంతంలో  ప్రాణాన్ని  బలవంతంగా  ఉంచి, బీజమంత్రంతో పాటు అన్ని దిక్కులకు అభిముఖంగా సర్వజ్ఞుడైన ఈశ్వరుని  ఐదు  ఘటికాల పాటు ధ్యానం చేయడం ద్వారా  వాయుపై పట్టు సాధించాలి . వాయుపై పట్టు సాధించడం ద్వారా  ,  అతను ఈథర్‌లో గాలిలా కదలగలడు. అతను గాలి ద్వారా భయం లేదా మరణం అనుభవించడు.

ఆకాష్ ధారణ

కనుబొమ్మల మధ్య నుండి కిరీటం వరకు  ఈథర్ ప్రాంతం. ఈథర్ వృత్తాకారంలో ఉంటుంది మరియు పొగ రంగులో ఉంటుంది. బీజ  మంత్రం  హం . _ ఈథర్   ప్రాంతంలో  ప్రాణాన్ని బలవంతంగా  ఉంచి  , బీజమంత్రంతో పాటు  ఐదు  ఘటికాల  పాటు ధ్యానం చేయడం ద్వారా  ఈథర్‌పై పట్టు సాధించాలి - ఐదు ముఖాలు కలిగిన స్ఫటిక వర్ణపు సదాశివుడిని మూడు కళ్ళు మరియు పది మందితో తలపై నెలవంకను పట్టుకున్నారు. అన్ని ఆయుధాలతో కూడిన ఆయుధాలు మరియు శరీరంలోని సగం భాగాన్ని ఉమా దేవి పంచుకుంది. అన్ని కారణాలకు ప్రధాన కారణం మరియు వరాలను ఇచ్చేవాడు అని అతనిని ధ్యానించాలి. ఈథర్‌పై పట్టు సాధించడం ద్వారా  , అతను అంతరిక్షంలో ఏదైనా భాగాన్ని తరలించగలడు. అతను ఎక్కడ ఉన్నా, అతని చుట్టూ అపారమైన ఆనందం ఉంటుంది.

ఇవి ఆచరించవలసిన ఐదు  ధారణలు . అతడు బలవంతుడవుతాడు మరియు బ్రహ్మతో విలీనమైనా మరణాన్ని ఎదుర్కోడు.

ధ్యాన

ఆ తర్వాత అతడు ఆరు ఘటికాలు   ధారణ సాధన చేయాలి  , వరాలను ఇచ్చే వ్యక్తిని గురించి ధ్యానం చేసి, ముందుగా సూచించిన పద్ధతిలో ఈథర్ ప్రాంతంలో  ప్రాణాన్ని బలవంతం చేయాలి. ఈ అభ్యాసం ద్వారా, అతను అనిమా  (అటెన్యుయేషన్) మరియు వంటి శక్తులను పొందుతాడు . దీనిని  సగుణ  ధ్యానం (ధ్యానం యొక్క వస్తువుతో ధ్యానం) అంటారు.

సమాధి

సమాధి  అంటే  ఆత్మ  మరియు  పరమాత్మ కలయిక . నిర్గుణ ధ్యానం ద్వారా  సమాధి లభిస్తుంది   . పన్నెండు రోజులలో అతను సమాధిని పొందుతాడు . ప్రాణాన్ని నిరోధించే యోగి  జీవన్ముక్తుడు  అవుతాడు  .

యోగి తన శరీరాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటే, అతను దానిని చేస్తాడు. కాకపోతే, అతను తన అటెన్యుయేషన్ మరియు ఇష్టపడే శక్తులతో ప్రపంచాలను దాటగలడు. అతను  తనకు నచ్చిన యక్షుడు  (డెమి-గాడ్) కావచ్చు లేదా అతను తనకు నచ్చిన పులి, సింహం, గుర్రం మరియు ఏనుగు కావచ్చు మరియు మహేశ్వర స్థితిని పొందవచ్చు. ఇది అభ్యాసం యొక్క వివిధ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది, కానీ ఫలితాలు ఒకే విధంగా ఉంటాయి.

బంధాలు మరియు ముద్రలు

మహా బంధ

యోగి ఎడమ పాదాన్ని ప్రీమియాన్ని నొక్కి ఉంచి, కుడి పాదాన్ని చాచి, రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ఛాతీపై గడ్డం ఉంచి, గాలిని లాగి, కుంభకాన్ని తన శక్తి మేరకు తయారు చేసి, ఊపిరి పీల్చుకోవాలి. ఎడమ వైపు ప్రాక్టీస్ చేసిన తరువాత, అతను కుడి వైపున సాధన చేయాలి. ఏ పాదం చాచినా దానిని మరో కాలు తొడపై ఎక్కించాలి. ఇది మహా బంధం మరియు దీనిని రెండు వైపులా ఆచరించాలి.

మహా వేదం

మహా బంధంలో ఉన్న యోగి, గాలిని పీల్చి,  కాంత ముద్రతో  ( జలంధర బంధ ) నిగ్రహించి, రెండు నాడిలను ( ఇడా  మరియు  పింగళ ) నింపే ప్రాణం సుసుమ్నాలోకి త్వరగా ప్రవేశిస్తుంది. ఇది  మహావేదం , ఇది ప్రవీణుడు నిరంతరం (మహా బంధ తర్వాత) అభ్యసిస్తారు.

కేచారి ముద్ర

కపాలపు కుహరంలోకి నాలుకను వెనక్కి తిప్పి, కనుబొమ్మల మధ్య వైపు చూపిస్తూ కళ్లను అక్కడ ఉంచి ఉంచడం కేచారి ముద్ర .

జలంధర బంధ

గొంతు కండరాలను సంకోచించడం మరియు ఛాతీపై గడ్డం ఉంచడం జలంధర బంధం. ఇది మృత్యువు ఏనుగుకు సింహం.

ఉద్దీయన బంధ

ప్రాణం సుసుమ్నాలోకి ప్రవేశించే బంధాన్ని యోగులు ఉద్దీయన బంధ అంటారు. (ఇది యోగా తత్త్వ ఉపనిషత్తులో స్పష్టంగా ప్రస్తావించబడలేదు. ఇది దిగువ ఉదర కండరాలను సంకోచించడం ద్వారా నిర్వహించబడుతుంది).

యోని బంధ

మడమల ద్వారా నొక్కడం మరియు మలద్వారం ముడుచుకోవడం వలన అపాన పైకి బలవంతంగా ఉంటుంది. ఇది యోని బంధ.

అందుకే నిధి

మూల బంధంలో ప్రాణ, అపాన, నాద, బిందు ఏకమై ఉన్నాయి. ఇది యోగికి అతని పురోగతిలో విజయాన్ని ఇస్తుంది, దాని గురించి ఎటువంటి సందేహం లేదు.

విపరీత కరణీ ముద్ర

తలలు క్రిందికి మరియు అడుగుల పైకి, అతను మొదటి రోజు ఒక నిమిషం పాటు ఉండాలి. క్రమంగా నిమిషానికి నిమిషానికి సమయాన్ని కలుపుతూ అతను విపరీత కరణాన్ని అభ్యసించాలి. మూడు నెలల్లో ముడతలు మరియు నెరిసిన జుట్టు పోతుంది. మృత్యువు నుండి విముక్తి పొందాలనుకునే వారు ఒక యమ (144 నిమిషాలు) దీనిని ఆచరించాలి. శరీరం మరియు మనస్సు యొక్క అన్ని వ్యాధులు నశిస్తాయి. జాతరగ్ని (ఆహారాన్ని లేదా జీర్ణ శక్తిని జీర్ణం చేసే అగ్ని) పెరుగుతుంది. అన్ని రకాల ఆహారాల సంఖ్యను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే అగ్ని శరీరాన్ని తినేస్తుంది.

వజ్రోలి ముద్ర

వజ్రోలీని ఆచరించేవాడు  మానసిక శక్తులను పొందటానికి అర్హుడు.  యోగ సిద్ధి (యోగాలో విజయం) మరియు కేచారి ముద్ర (ప్రత్యామ్నాయంగా గాలిలో కదిలే శక్తి అని అర్థం) అతని చేతిలో ఉన్నాయి. అతనికి గతం మరియు భవిష్యత్తు తెలుసు. (ఉపనిషత్తు ఆచరణను వివరించలేదు).  ఇది స్త్రీ యొక్క జననేంద్రియ అవయవం నుండి స్రోనితతో పాటు  ఆమె ద్వారా విడుదల చేయబడిన వీర్యం యొక్క డ్రాయింగ్. ఒక కప్పులోంచి ఆవు పాలను పదే పదే తీసి అందులో వదలడం ద్వారా ఈ  ముద్రలో పట్టు  సాధించవచ్చు. శ్రీకృష్ణుడు వజ్రోలిపై పట్టు సాధించాడని చెబుతారు).

అమరోలి ముద్ర

ఉదయం విడుదలయ్యే మొదటి మూత్రంలో, మొదటి ప్రవాహంలో నాలుగో వంతును మరియు చివరి ప్రవాహంలో నాలుగో వంతును విడిచిపెట్టి, నాసికా డౌచే కోసం నాల్గవ వంతును పక్కన పెట్టుకుని నాల్గవ వంతు త్రాగాలి. ఇది వజ్రోలితో  పాటే ఆచరిస్తే అమరోలి. ( వజ్రోలి, అమరోలి మరియు  సహజోళిని సాధారణంగా ఓలి ముద్రలు అంటారు. సాధారణంగా ఓలి ముద్రలు అశ్లీల స్వభావం కారణంగా గ్రంధాలలో పునశ్చరణ మరియు రౌండ్అబౌట్ పద్ధతిలో ఇవ్వబడ్డాయి. సహజోలి ఇక్కడ ప్రస్తావించబడలేదు.  పానీయం మరియు  డౌచీ  లేని అమరోలిని సహజోలి అంటారు ) .

రాజయోగ సిద్ధి

అప్పుడు రాజయోగంలో సిద్ధి పొందుతాడు. ఆ తర్వాత అతనికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. అతను వస్తువుల పట్ల వివక్ష మరియు ఉదాసీనతను పొందుతాడు. మహా యోగి, జ్ఞాని, భక్తుడు అయిన పరమ విష్ణువు యోగ మార్గంలో దారి చూపుతాడు.

వస్తువుల పట్ల వివక్ష మరియు ఉదాసీనత

అతను నొక్కిన మరియు ఆనందాన్ని పొందే అతని భార్య యొక్క రొమ్ము, అతను పూర్వ జన్మలలో పాలిచ్చిన అతని తల్లికి అదే ఒకటి. అతను ఆనందించే జననేంద్రియ అవయవం అతను ఇంతకు ముందు జన్మించినది. ఇప్పుడు అతని భార్యగా ఉన్న ఆమె ఒకప్పుడు అతని తల్లి మరియు ఇప్పుడు అతని తల్లి అయిన ఆమె ఒకప్పుడు అతని భార్య. ఇప్పుడు తన తండ్రిగా ఉన్న వాడు మళ్లీ తన కొడుకు అవుతాడు మరియు ఇప్పుడు తన కొడుకు అయిన వాడు మళ్లీ తండ్రి అవుతాడు. అలా గర్భంలో జీవన్మరణ చక్రం తిరుగుతుంది-బావి చక్రంలో కుండలాగా.

ప్రణవ ఆరాధన

ప్రపంచాలు మూడు సంఖ్యలో ఉన్నాయి: భూర్, భువర్ మరియు సువర్. వేదాలు  మూడు సంఖ్యలో ఉన్నాయి: ఋగ్ , యజుర్ మరియు సామ. సంధ్య -లు మూడు: డాన్, నూన్ మరియు ట్విలైట్. మంటలు మూడు.  గుణ -లు మూడు. ఇవన్నీ ప్రణవానికి చెందిన మూడు అక్షరాలపై ఆధారపడి ఉన్నాయి: అ, , మరియు ఎమ్. ఈ రహస్యాన్ని  అర్ధమాత్రంతో పాటు తన గురువు  నోటి నుండి   తెలుసుకున్నవాడు సార్వత్రిక స్పృహ కలిగిన బ్రాహ్మణుడు  తప్ప మరెవరో కాదు  . ఓం తత్ సత్: అది ఒక్కటే నిజం. అది సమస్త అస్తిత్వానికీ వ్యాపిస్తుంది.

పువ్వులో సువాసన ఉన్నట్లే, పాలలో నెయ్యి ఉన్నట్లే నువ్వులలో నూనె నివసిస్తుంది, క్వార్ట్జ్‌లో బంగారం మరియు గుండె ప్రాంతంలో కమలం ఉంటుంది. దాని కొమ్మ పైకి మరియు రేకులు క్రిందికి ఉన్నాయి.

కమలం యొక్క దిగువ భాగంలో బిందు ఉంది. బిందువు మధ్యలో చైతన్యం ఉంటుంది. A అక్షరంతో, కమలం పైకి కదులుతుంది. ఇది B అక్షరంతో వికసిస్తుంది. M అక్షరంతో నాద వ్యక్తమవుతుంది మరియు అర్ధ మాత్రతో చలనం లేకుండా ఉంటుంది. యోగి విడదీయరాని బ్రహ్మ స్థితిని పొందుతాడు మరియు అన్ని పాపాలు నశిస్తాయి.

తాబేలు తన శరీరం లోపల చేతులు, కాళ్ళు మరియు తలను లాగినట్లు, యోగి శరీరంలోని తొమ్మిది రంధ్రాలను అరికట్టాలి మరియు ప్రాణాన్ని పీల్చి ఆ తర్వాత ఊపిరి పీల్చుకోవాలి. తొమ్మిది ద్వారములు నిగ్రహించబడినప్పుడు, ప్రాణము కుండలో పెట్టిన దీపము వలె మూలాధారమున సుషుమ్న తలుపును తెరుస్తుంది. తొమ్మిది ద్వారములు మూసి ఉంచి కుంభకము చేయుట వలన యోగి ఆత్మ ఒక్కడే మిగిలి విదేహ ముక్తిని పొందుతాడు.

ఇలా యోగ తత్త్వ ఉపనిషత్తు ముగుస్తుంది.