Translate

Wednesday, April 7, 2021

ఆధ్యాత్మికత- Notes

 ఆధ్యాత్మిక జీవితం  అంటే  అన్ని పనులు వదిలేసి దైవ చింతనలో మునిగిపోవటం కాదు . గుళ్ళకి వెళ్లి ,తీర్థ యాత్రలు చేసి ,పురాణ ప్రవచనాలు విని , జపతపాలు చేసి మళ్ళీ మామూలుగా అన్ని రకాల ద్వంద భావాలతో ,రాగ ద్వేషాలతో జీవనం సాగించడం  ఆధ్యాత్మికత కానే కాదు .

వయో వృద్దులు ఒక్కరే చేసేది కాదు .

 ఆధ్యాత్మికత ఇహానికి ,పరానికి రెంటికీ పని కొచ్చే సూత్రం .

 నిజాన్ని నమ్మటం ,నిజమైన స్వ  ధర్మాన్ని తెలుసుకొని  త్రికరణ శుద్దిగా పాటించడం , వయస్సుకి ,స్థితికి అనువైన నాలుగు ఆశ్రమాల నియమాలను అమలు చేయడం ఆధ్యాత్మికత .

పుట్టిన పసివాడు తల్లిపాలు త్రాగటం ,20 గంటలు నిదుర పోవటం ఆధ్యాత్మికత .

బాల్య వయస్సు లో మంచి ఆహారం ,ఆట పాటలతో ఆహ్లాదంగా గడపటం    ఆధ్యాత్మికత  .


విద్యార్ధి దశలో -  శరీర శుభ్రత , వ్యాయామం ,మంచి పోషక ఆహారం తినుట ,

స్వచ్చమైన గాలిని ప్రాణాయామ పద్దతి లో శ్వాసించుట ,

తల్లితండ్రులను అతిధి అభ్యాగతులను పూజించుట ,

గురువుని దైవం వలే నమ్మి విద్య నేర్చు కొనుట ఆధ్యాత్మికత .


తోటి మనిషికి , ప్రకృతికి హాని చేయక చేతనైనంత సాయం చేయడం ,

వస్తూత్పత్తి చేసే వారిని  అనగా పంటలు పండించే రైతు ,పరిశ్రమలలో పనిచేసే కార్మికుడు , 

అలాగే మనలను రక్షించే వారిని,అనగా , సైనికులను , పోలీసులను , గౌరవించి ఆదరించడం ;

విజ్ఞానాన్ని పంచే గురువులను ,పరిశొధనలు చేసి కొత్త విషయాలు ఆవిష్కరించే శాస్త్రజ్ఞుల ను అనుసరించడం -ఆధ్యాత్మికత .

ప్రతి భాద్యత ,వృత్తి, ప్రవృత్తి  అన్నీ కర్తృత్వ భావన లేకుండా భగవత్ కైంకర్యంగా చేయడమే ఆధ్యాత్మికత .


మనషి  చిన్నప్పటి నుండి ఎలా ఆధ్యాత్మిక జీవనం సాగించాలో గీత చెబుతుంది .


సమాధి - వివిధ రకాల సమాధి స్థితులు - విశ్లేషణ: (Types of Samadhi in Telugu) Notes

సమాధి - వివిధ రకాల సమాధి స్థితులు - విశ్లేషణ:



మూలం : మహర్షి పతంజలి



        యోగ శాస్త్రంలో 8 రకములైన సమాధి స్థితుల వర్ణన కలదు. ఇవి 8 రకాలైన జ్ఞానోదయ పద్ధతులు కూడా. అయితే ఈ "సమాధి" స్థితిని వర్ణించడం  దుర్లభం కూడా. అయితే, ఈ సమాధి అనుభవం కూడా అంతే దుర్లభం.


     సమాధి స్థితిలో, ఏ లక్ష్యమూ లేకుండా చిత్తాన్ని ఉంచినపుడు జ్ఞాన స్వరూపమూ, శాశ్వతమూ, సర్వవ్యాప్తమై వెలిగే

స్వస్థితిని సాధకుడు పొందుతాడు. అంటే అర్ధం మాత్రమే భాసిస్తుంది. ఇదే యోగుల గమ్యమైన "సమాధిస్థితి"

సమాధులు 1. సంప్రజ్ఞాత సమాధి, 2.అసంప్రజ్ఞాత సమాధి 

3.సవితర్క సమాధి

4.నిర్వితర్క సమాధి

5.సబీజ సమాధి

6.నిర్బీజ సమాధి

7.ధర్మ మేఘ సమాధి అని 8. ప్రకృతి లయ సమాధి...అని రకములు.


     ఇంకనూ అనేక సమాధి స్థితులు ఉన్ననూ, ప్రస్తుతానికి ఇవి చాలును.


   

సంప్రజ్ఞాత సమాధి: 


     దీన్లో చిత్తవృత్తులు శాంతించే ఉంటాయి. కాని బీజరూపంలో సంస్కారాలు మిగిలి, సమయం వచ్చినపుడు తిరిగి మొలకెత్తడానికి అనువుగా ఉంటాయి. కాబట్టే దీన్ని "సబీజ సమాధి" అనికూడా అంటారు. ధ్యాన, ధారణా, సబీజ సమాధులను పొందిన యోగికి  సర్వశక్తులు, సర్వజ్ఞత్వము కలుగుతాయి గాని ముక్తుడు కాలేడు. ఇంకా పునర్జన్మను కలిగించే కర్మబీజాలు ఉంటాయి. అణిమాది సిద్ధులు కలుగుతాయి.


అసంప్రజ్ఞాత సమాధి :


      దీన్లో నేను అనే అహంకారం ఉండదు. బీజరూపంలో ఉండే చిత్త వృత్తులు నశిస్తాయి. కర్మబీజం దగ్ధమై ఉండటంవల్ల "నిర్బీజ సమాధి"అని అంటారు. దీన్లో వాసనలు నశించి, మనో నాశనము కూడ కలగటం వల్ల, యోగి పరమాత్మను తెలిసుకొని ముక్తిని పొందుతాడు.


      వితర్కం, విచారణం (యుక్తాయుక్త విచక్షణ) – ఆనందం, ఆస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధిస్థితిని సంప్రజ్ఞాత సమాధి అంటారు. సంప్రజ్ఞాత సమాధి మళ్ళీ నాలుగు రకాలు.


మొదటిది – సవితర్క సమాధి. ఇందులో మనసు ఒకానొక విషయాన్ని, తదితర విషయాల నుండి వేరు చేసి, దాన్నే పదే పదేధ్యానిస్తూ ఉంటుంది.


రెండవది – నిర్వితర్క సమాధి. దేశ కాలాల నుండి పృధివ్యాది భూతాలని వేరు చేసి, వాటిని వాస్తవ రూపంలో చింతన చేస్తే దానిని నిర్వితర్కమంటారు.


మూడవది... నిర్విచార సమాధి – పైన చెప్పిన ధ్యానంలో దేశ కాలాలని తొలగించి, సూక్ష్మ భూతాలను వాటి వాస్తవ రూపంలో చింతన చేస్తే ఆ ధ్యానాన్ని నిర్విచార సమాధి అంటారు.


నాల్గవది ..... ఆనంద సమాధి.  స్థూల, సూక్ష్మభూతాలను కూడా వదిలివేసి, అంతరింద్రియ మనసు ధ్యేయమై, అంతఃకరణం రజస్తమోగుణరహితమై ఉందని భావిస్తే దానిని ఆనంద సమాధి అంటారు. చిత్తవృత్తులనన్నింటినీ నిరాకరించే, నిరంతర అభ్యాసం ద్వారా లభించే, అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో శేషించి ఉండే మరొక సమాధి స్థితి ఉంది. ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ అయిన అసంప్రజ్ఞాత సమాధి. దీని వల్ల మోక్షం లభిస్తుంది. కానీ ప్రకృతి తత్వాలను దాటాలి కదా! ఇదే కదా, సాంఖ్యం చెబుతుంది.


     అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.

 క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ధ్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. "సమాపత్తి" అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.

శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు "సవితర్క సమాధి" అంటారు.

స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు "నిర్వితర్క సమాధి" కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే "నిర్వికల్పసమాధి" అంటారు. 


     సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు.


      నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే "ఋతంభర ప్రజ్ఞ".

 ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.


     ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. వేదాలనన్నింటినీ పఠించినా, మనకెట్టి సాక్షాత్కారం కలగదు. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల "అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి" పొందగలం అని ఈ సూత్రకారుడి (పతంజలి) అభిప్రాయం. అయితే పతంజలి... ఋషి కాబట్టి...ఆ మహితాత్ముడు చెప్పినది "ఆప్తవాక్యమే"... హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మ...... వంటి తత్త్వాలు బాహ్యేంద్రియగోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే...సమాధి వల్ల కలిగే సంస్కారం,  ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.


     చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.

ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.


     పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును, వృత్తులు అనే తరంగాలు ఆవరించిఉన్నంతకాలం పురుషుడిని దర్శించాలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. ఒకటే చిత్త వృత్తి మిగిలి ఉన్నప్పుడు దానిని నిరోధించడం సులభం. అప్పుడు కలిగే సమాధినే "నిర్భీజసమాధి" అంటారు.


     ఇలా వృత్తి నిరోధం సిద్ధించగానే, అద్వితీయ – కేవల – జననమరణరహిత – నిత్య – నిర్వికార – స్వయంజ్యోతి అయిన పురుషుడు సహజ వైభవంతో ప్రకాశిస్తాడు.-------మహర్షి పతంజలి


     అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.

 క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ద్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.

శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు "సవితర్క సమాధి" అంటారు.

 స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు నిర్వితర్క సమాధి కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే "నిర్వికల్ప సమాధి' అంటారు. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు.

నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే "ఋతంభర ప్రజ్ఞ".

 ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.


       ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి పొందగలం అని సూత్రకారుడి అభిప్రాయం. అయితే పతంజలి... ఋషి కాబట్టి...ఆ మహితాత్ముడు చెప్పినది "ఆప్తవాక్యమే"... హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మల వంటి తత్త్వాలు బాహ్యేంద్రియ గోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే...సమాధి వల్ల కలిగే సంస్కారం,  ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.


చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.

ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.


సమాధిని పొందిన వ్యక్తికి , ఇంకా సూక్ష్మ శరీర భావన ఉంటుంది. ముక్తిని పొందకుండా లయమయ్యే విదేహులను , ప్రకృతి లయులు అంటారు. ప్రకృతి లయుల యొక్క అత్యున్నత ధ్యాన దశను "ప్రకృతి లయ సమాధి" అంటారు.


    పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును వృత్తులు అనే తరంగాలు ఆవరించి ఉన్నంతకాలం పురుషుడిని దర్శించలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. : ఇక్కడ ధర్మ మేఘ సమాధి గూర్చి, సూత్రకారుడేం చెబుతున్నాడో చూద్దాం! సర్వ తత్వాలను, చక్కగా వివేచించే జ్ఞానాన్ని పొంది, ఫలాపేక్ష లేక ఉండేవానికి, అలాంటి పరిపూర్ణ వివేకికి "ధర్మ మేఘం" అనే సమాధి సిద్ధిస్తుంది. ఇలాంటి వివేకాన్ని పొందిన యోగికి, అణిమాది అష్ట సిద్ధులన్నీ కలుగుతాయి. కానీ నిజమైన యోగి వాటిని పరిత్యాగం చేస్తాడు. అలాంటి యోగికి, "ధర్మ మేఘం" అనే విచిత్ర, వికాస అపూర్వ జ్ఞానం కలుగుతుంది. అటువంటి యోగి సమస్త జ్ఞానం తననుండే కలుగుతుందని గ్రహిస్తాడు.

 ఇక్కడ, యోగికి వివేక ఖ్యాతి లభించినచో, దాని సహాయముతో, సర్వ భావాధిష్ఠాతృత్వాది సిద్ధులను, ఆశించినచో , ఆ యోగి "కుసీదుడు" అనబడును. (కుసీదుడు - సద్గురు మళయాళ స్వామి వచనం)


శివోహం శివోహం శివోహం🌹🙏🌹🙏🌹🙏

Tuesday, April 6, 2021

శివారాధన పద్ధతులు- -NOTEs


శివారాధన పద్ధతులు



 సత్సంగత్వే నిస్సంగత్వం.

శివారాధన పద్ధతులను తెలుపమని నేను ధర్మగుప్తులను కోరాను. వారిలా వివరించారు,  "అయ్యా! ఒక్కొక్క పూజా విధానంతో ఒక్కొక్క  దైవము సంతుష్టులు అవుతారు. సహస్ర నామ పఠన, అర్చనలతో విష్ణువు, మోదకాలతో గణపతి, నమస్కారంతో సూర్యుడు, అర్ఘ్యంతో చంద్రుడు, అభిషేకంతో శివుడు ప్రసన్నులు అవుతారు. నమకాలను చదువుతూ ఏకాదశ రుద్రాభిషేకం చేసినట్లయితే అప మృత్యుదోషాలు హరింపబడటమే కాకుండా ఏకాదశ తిథియొక్క పుణ్యబలం కూడా ప్రాప్తిస్తుంది. ఈవిధంగా ఏకాదశ రుద్రాభిషేకానికి ఏకాదశ తిథికి సన్నిహిత సంబంధము ఉండటంవల్ల శివ, కేశవులు అభిన్నులు అనేది నిర్వివాదాంశమే. కాగా శివారాధనలో శివ పంచాక్షరి అనుష్ఠానము మొదటి పద్ధతి, మహాన్యాస విధానము రెండవది, రుద్రాభిషేకము మూడవ పద్ధతి.


పంచతత్త్వారాధన


పంచాక్షరిలోని 5 అక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు, కాబట్టి 


భూతత్వానికి          చందనం, 

 జలతత్వానికి        కొబ్బరినీళ్ళు అర్పించాలి; 

అగ్నితత్వానికై      దీపారాధన, 

వాయుతత్వానికై     సాంబ్రాణి ధూపం, 

ఆకాశతత్వానికై        ఘంటారావం చేయాలి.


సంధ్యోపాసన


పంచాక్షరిని పంచతత్త్వాలతో సాధన చేసే సాధకుల కను బొమల మధ్యలో పంచతత్త్వాలు సంధ్యా సమయాన వివిధ రంగులతో రూపు దిద్దుకున్న ఆకాశంలా రజత, అరుణ, స్వర్ణ, నీల, శుద్ధ ధవళం మొదలైన వివిధ వర్ణాలతో ప్రకాశిస్తూ దివ్య జ్యోతుల్లా కనిపించుతాయి. అందువల్లనే ఋషీశ్వరులు పంచాక్షరీ పంచ తత్త్వ సాధనను సంధ్యోపాసన అని వర్ణిస్తారు. 


యంత్రం, మంత్రం, పంచతత్త్వ సాధన, యోగసాధన, ఆత్మ సమర్పణ అనే పద్ధతుల ద్వారా దేహ, ఆత్మబుద్ధి నశించి, దేహమే దేవాలయంగా, జీవుడే శివాత్మగా మారి మోక్షము లభిస్తుంది. ఈ స్థితిని పొందడానికి శివపంచాక్షరి జపం, మహా  న్యాస పూర్వక ఆరాధన, రుద్రాభిషేకం చేయాల్సి ఉంటుంది. 


రుద్రులు వేలకొలది సహస్ర సంఖ్యలో ఉన్నారు, అంటే గణానికి ముగ్గురు చొప్పున ఏకాదశ రుద్రులకు (11 x 3 x 10000000 = 330000000) 33 కోట్ల రుద్రగణాలు ఉన్నాయని, వాళ్ళే పంచభూతాలను, దేహ, ప్రాణ, మనస్సు లను ఆవరించి ఉంటారని వేదం చెప్తున్నది. గణపతి 33 కోట్ల రుద్రగణాలకు అధిదేవత. శ్రీపాదులు గణపతి తత్త్వంతో అవతరించినందువల్ల వారిని సేవించి అర్చించేవారికి 33 కోట్ల రుద్రగణాల అనుగ్రహం లభిస్తుంది. 


రుద్రాక్షధారణ


శివభక్తులు ఖచ్చితంగా రుద్రాక్షను ధరించి తీరాలి. మానవు లలో వర్ణాలు ఉన్నట్లే రుద్రాక్షలలో కూడా బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతి రుద్రాక్షలు ఉన్నాయి. తెల్లనివి బ్రహ్మ జాతివి. ఇవి దొరకడం చాలా అరుదు, వీటిని బ్రాహ్మణులు, ఎర్రని క్షత్రియ జాతి రుద్రాక్షలను క్షత్రియులు, చింతగింజ రంగు వైశ్య జాతి రుద్రాక్షలను వైశ్యులు, నల్లని శూద్రజాతి రుద్రాక్షలను శూద్రులు ధరించినట్లయితే వారి వారికి అను కూలంగా మంచి ఫలితాలు కలిగి పాపాలు నశించి సమస్త కోరికలు తీరుతాయి. లేతవి, బరువు లేని రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నిలిపి అడుగున చిన్నరాగి పాత్ర అంటే ఉద్ధరిణి, పంచపాత్ర మధ్య లో రుద్రాక్షను పెట్టినట్లయితే, అది కుడినుండి ఎడమకు ప్రదక్షిణ చేసినట్లయితే శ్రేష్ఠమైనవని, అపసవ్యంగా తిరిగితే మంచివి కావని తెలుసుకోవాలి. ఇటువంటి రుద్రాక్షలను ధరించిన గృహస్థులకు దారిద్ర్యం, భార్యావియోగం, అకారణ కుటుంబ కలహాలు కలుగుతాయి. సన్యాసులు వీటిని ధరించవచ్చు, బాధ లేదు.


రుద్రాక్షలు దేవతామూర్తులు


సాధారణంగా ఏకముఖినుండి ప్రారంభిస్తే 16ముఖాలవరకు ఉన్న రుద్రాక్షలు లభిస్తాయి. వివిధ రుద్రాక్షలకు వివిధ దేవతా స్వరూపాలతో సంబంధం ఉంటుంది. ఏకముఖి శివ స్వరూపం అయితే ద్విముఖి-అర్థనారీశ్వరుని, త్రిముఖి-అగ్ని, చతుర్ముఖి-బ్రహ్మ, పంచముఖి-కాలాగ్నిరుద్రుని, షణ్ముఖి-కార్తికేయుని, సప్తముఖి-మన్మధుని, అష్టముఖి-రుద్రభైరవుని, నవముఖి-కపిలముని, దశముఖి-విష్ణుని రూపాలు అయితే, ఏకాదశ ముఖి-సాక్షాత్తు రుద్రుని స్వరూ పము కాగా, ద్వాదశముఖి ద్వాదశాదిత్యుల స్వరూపం. ఇందులో నవముఖి రుద్రాక్ష దొరకడం చాలా కష్టం. దీనిలో విద్యా, జ్ఞాన, క్రియా మొదలైన నవ శక్తులు ఉండటంవల్ల ధరించిన వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి." ఇలా శివా రాధన, దానికి సంబంధించిన రుద్రాక్ష ధారణ వివరించిన తరువాత శ్రీపాదుల స్వరూపం గూర్చికూడా మాట్లాడుతూ శ్రీపాదులను శివస్వరూపులని భావిస్తే విష్ణువులా విష్ణువని తలచినట్లయితే శివునిలా కనిపించుతారని, భక్తులు వాళ్ళ మనసులోనుండి తర్క గుణాన్ని వదిలి వారిని శరణు వేడి నట్లయితే  యదార్థ రూపంతో కన్పించుతారు అని చెప్పారు.


తరువాత ఇద్దరం కురుంగడ్డకు వెళ్ళి, స్వామికి పాదనమ స్కారం చేసుకొని, కొంచెంసేపు ధ్యానస్థులం అయ్యాము. సాయంకాలం వారి ఆజ్ఞతో అవతలి ఒడ్డు చేరి జగత్ప్ర భువుల దివ్యలీలా ప్రసంగాలతో కాలం గడిపాము. సుదూరంగా ఎవరో యోగులు 'శ్రీపాద శ్రీవల్లభ దిగంబర' అంటూ సుశ్రావ్యంగా కీర్తిస్తున్న నామం చెవులకు అమృతంలా సోకుతుంటే ఆ మాధుర్యంలో మునకలు వేస్తూ మెల్లగా నిద్రలోకి జారాము.


శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

Monday, April 5, 2021

Adi Shankaracharya- bhrama ani telusu-భ్రమ అని తెలుసు

 https://www.youtube.com/watch?v=gQUrYvMb2qM



ఆఆఆఆఆ.. ఆఆఆ... భ్రమ అని తెలుసు భ్రమ అని తెలుసు బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు ఆఆఆ... కథ అని తెలుసు కథ అని తెలుసు కథలన్ని కంచికే చేరునని తెలుసు తెలుసు తెర తొలుగుతుందనీ తెలుసు తెల్లారుతుందనీ తెలుసు ఈ కట్టె పుట్టుక్కుమంటదనీ తెలుసు ఈ మట్టి మట్టిలోకలిపోతదనీ ఎన్ని తెలిసీ ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయ ఆఆఆ..మాయ మా..య... ఓఓఓఓ... ఓఓఓ వేదం తెలుసు! తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు శాస్త్రం తెలుసు! శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు తెలుసు ఇది నీటి మూటనీ తెలుసులే గాలి మేడని తెలుసు ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ తెలుసు ఉట్టి పై ఉన్నదంత ఉష్కాకియనీ అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు దేనికని మాయ మాయ మా.. య, ఓఓఓఓఓ... ఓఓఓఓఓ ఓఓఓఓఓ...తేలపోయింది తెలిసిపోయింది తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉందని మనసా..ఆఆ..ఓ.. ఓ.. ఓ తెలుసని ఎందరు చెబుతున్నా అది ఉందో లేదో తేలని హంస... కళ్ళు రెండు మూసేయాలంట మూడో కంటిని తెరవాలంటా... మిన్నూ మన్నూ మిట్టా పల్లెం ఒక్కటిగా కనకనిపంచాలంటా..... ఆడేవాడు ఆడించే వాడు ఏక పాత్రలని ఎరగాలంటా... ఆ ఎరుక వచ్చి రాగానే... ఆ ఎరుక వచ్చి రాగానే... ఆ ఎరుక వచ్చి రాగానే మాయం ఐపోతుందట మాయ...ఆ.. ఆ.. మాయ... మాయ... ఆఆఆ.. ఆఆఆఆ... ఆఆఆ

Wednesday, March 10, 2021

Why Bhel Patra

 


When people are on the spiritual path they are constantly looking for support in every possible way because it is unknown terrain. In Indian culture, every little thing that could support you was identified through observation and meditativeness. They did not leave out even flowers, fruits and leaves. Why is the vilva in particular considered sacred? It has always been said that the vilva is dear to Shiva. What does he care? It’s not that it is dear to Shiva. When we say it is dear to Shiva, we mean that in some way its reverberance is closest to what we refer to as Shiva.

We identified many things like this and only those things are offered because they become your means to get in touch. When you offer the vilva to Shiva, you are not going to leave the leaf with him. You are supposed to take it with you after it is offered because this particular leaf has the highest capability to absorb that reverberance. If you place it on the linga and take it, it has the ability to retain the reverberation for a long period of time. It stays with you. You can try this: offer the vilva leaf, put it in your chest pocket and walk around, it will make a difference for you in terms of your health, wellbeing, mental state – everything.

There are many materials like this which are recognized sacred tools that people use. This is not about gods, this is about you and your ability to access something.

- Sadgugu Notes 

It is said to be a symbol of the three qualities (Satva Rajasthamo qualities), the three eyes of Lord Shiva, the one who removes the sin of three births. These bill papers can be used in pooja even if they are dry


Another Source:

According to Hindu scriptures, the Bilva is Triguna which is connected to the three Gunas or components of natural characteristics of the tree. In Hindu philosophy, the three Gunas are Sattva, Rajas & Tamas with Sattva being the pure most while Tamas normally is to do with darkness & ignorance.
 
The Sattvic component is believed to be more centred within the bilva patra and therefore the high capacity to absorb and emit Sattvic frequencies. This has various effects on the environment as well as on anyone who even touches the leaf. One of them is the reduction of Rajasic-Tamasic atoms present in the atmosphere & more importantly within the human body. A Sattvic leaf -the bilva patra, when brought in proximity of a person suffering from negative energies such as distress and anxiety is believed to medically reduce these energies within the human body. People with negative outlook towards life and their environment normally do not realise they have negative energies building up within their body and are at a risk of subconsciously harpering destructive thoughts also. Whenever such people come into contact with a Sattvic atmosphere, what they fail to realise is their negative energies try to fight the positivity of a Sattva predominant environment. This struggle can build up at various levels and can vary from the human mind thinking negatively and can result sudden bursts of anger to destruction of things


Oneday Thinking

Monday, March 1, 2021

కుండలిని శక్తి (kundalini telugu) Notes- Part- 1

 యోగ శాస్త్రం లో ( కుండలి శక్తి ) అనేది 






ఒక అనిర్వచనీయమైన శక్తి అని సవివరము గా విశదీకరించింది. 

మానవ శరీరంలోవెన్నెముక లో 

సప్తచక్రాలు ఉంటాయి. కుండలిని శక్తిమానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది.


మూలాధారం లో దాగివున్న ఈ కుండలిని శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలిని యోగ. ఈ కుండలిని యోగ ద్వార గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాటే వీలున్నది.


కుండలిని యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది.యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయవచ్చు.

 1

 

అరిషడ్వర్గాలను జయించినప్పుడే...

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి, నాడీ శుద్ధి, మనో శుద్ధి మరియు బుద్ధి శుద్ధి ఎలా జరగాలో బోధిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవక్తిమై అనేక రూపాలలో కర్మసిద్ధంతం విసదీకరించారు. కర్మఅంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసినది.

 2

అవన్నీ కర్మ ఫలాలే

ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము విద్యుక్త ధర్మాన్ని వదిలి వేయడం పాపంగానే పరిగణించ బడుతుంన్నది .


 3

 

కర్మ ఫలం మీద అధికారం లేదు..

కర్మచేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది. కాని కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు.అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే.కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవింగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది.కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి.మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి! పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ చేసే ప్రతి పని కర్మయే.

 4

కర్మ అంటే ఏమిటి.

నిద్రించడం, శ్వాసించడం, ధ్యానింనించడం, తపస్సు, మౌనం, భుజించడం, ఉపవసించడం కర్మయే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేరు. మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు.పాపం నశించే వరకూ ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మఫలితమైన పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడు.

 5

కర్మ పల్లే పాపపుణ్యాలు

జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకు వెడాతాడని వివరిస్తుంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. అంటే. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు.లోక హితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం.


భగవంతుని ఆధీనంలో కర్మఫలం

మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి . భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని యోగ శాస్త్రం బోధిస్తుంది. మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది ఆద్యాత్మిక దృష్టితో యోగ శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని యోగ శాస్త్రాలు బోధిస్తుంది.

      శివోహః శివోహః శివోహః..