Translate

Saturday, April 10, 2021

🍃 యోగానికి అర్హులు 🍃

🍃  యోగానికి అర్హులు 🍃

 మనోనిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము, తపస్సు, బాహ్యాభ్యంతర శుచి, ఓర్పు, కపటము లేకుండుట, శాస్త్రజ్ఞాన అనుభవము, దేవుని యందు, గురువునందు, శాస్త్రములందు విశ్వాసము. 

 మనపూర్వీక యోగుల కులమతములు: 

1. ఆదిబ్రహ్మ:- అదే ఆత్మ, సృష్టికి ఆదియైనవాడు, ఆదియందు అంతయు బీజాంకురములో ఉన్నది. 
2. ఆదిశక్తులు:- సృష్టికి మూల శక్తులు, కుల, మత, జాతి వర్ణ భేదములు లేనివారు. 
3. బ్రహ్మ:- విష్ణువు నాభి యందు పుట్టినవాడు. 
4. శ్రీకృష్ణుడు:- దేవకీదేవి గర్భమున పుట్టినవాడు. 
5. ఋష్యశృంగుడు:- లేడియందు జన్మించినవాడు. 
6. జంబుక ముని:- నక్కయందు పుట్టినవాడు. 
7. గౌతముడు:- కుందేలు నందు జన్మించినవాడు. 
8. మాండవ్యుడు:- కప్పయందు జన్మించినవాడు. 
9. సాంఖ్య ముని:- ఛండాల స్త్రీ కి జన్మించినవాడు. 
10. గార్గేయ మహాముని:- గాడిద యందు జన్మించినవాడు. 
11. శౌనక మహా ఋషి:- కుక్కయందు జన్మించినవాడు. 
12. విశ్వామిత్రుడు:- క్షత్రియుడు. 
13. వసిష్టుడు:- వేశ్యకు జన్మించినవాడు. 
14. వేదవ్యాసుడు:- సూతజాతివాడు. 
15. నారదుడు:- దాసి పుత్రుడు 
16. శ్రీ శుకులు:- అల్పజాతివాడే. శుకమైధునము చూచిన వ్యాసుని సంకల్పము వలన పుట్టినవాడు. 
17. వాల్మికి:- ఒక ఛండాలుడు18. హేతుజట:- కిరాతప్రభువు. 
19. అగస్త్యుడు:- భాండమందు జన్మించినవాడు. 
20. సత్యకాముడు:- వేశ్య, శూద్రజాతి స్త్రీ అయిన జాబాలికి జన్మించినవాడు. 
21. సంజయుడు:- సూతపుత్రుడు 
22. ధర్మవ్యాధుడు:- శూద్రుడు 
23. భరద్వాజుడు:- 'బృహస్పతి' 'మమత'ను కామించగా పుట్టినవాడు. 
24. శకుంతల:- అప్సరస మేనకకు, విశ్వామిత్రునికి జన్మించినది. 
25. బలరాముడు:- సర్పజాతివాడు. 
26. రాముడు:- క్షత్రియుడు. 
27. బుద్ధుడు:- క్షత్రియుడు. 
28. గజేంద్రుడు:- ఒక మృగము. 
29. ఆంజనేయుడు:- వానరుడు, మృగజాతి. 
30. జమదగ్ని:- బ్రాహ్మణుడు, భార్య అయిన రేణుక క్షత్రియ స్త్రీ. 
31. పరశురాముడు:- జమదగ్ని, రేణుకకు జన్మించినవాడు. 
32. భీష్ముడు:- శంతన మహారాజు, గంగా దేవికి జన్మించినవాడు. 
33. కర్ణుడు:- సూర్యుని వలన కుంతికి జన్మించినవాడు. 
34. సుభద్ర:- క్షత్రియుడైన అర్జునుని వివాహమాడెను. 
35. బృహస్పతి:- అంగీరసుని కుమారుడు. దేవగురువు.36. ప్రహ్లాదుడు:- అసురరాజు. 
37. శబరి:- భిల్లజాతి మహిళ. 
38. కుబేరుడు:- యక్ష రాక్షస రాజు. రావణ, కుంభకర్ణులకు సవతి సోదరుడు. 
39. భక్తకన్నప్ప:- వనవాసుడు, బోయవాడు. 
40. భగీరుడు:- కోసల రాజు. 
41. శిఖిద్వజుడు:- ఒక రాజర్షి 
42. విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మం:- ఒక కంసాలి. 
43. శిద్ధయ్య:- దూదేకులవాడు. 
44. శుక్రాచార్యులు:- అసుర గురువు. 
45. రంతిదేవుడు:- రాజుకుమారుడు 
46. బిళ్వమంగళుడు:- బ్రాహ్మణుడు, దురాచారుడు, వేశ్యాలోలుడు. 
47. నిషాదుడు:- నిషాద జాతివాడు. శ్రీరామునికి ఆతిధ్యమిచ్చినవాడు. 
48. కార్తికేయుడు:- శివుని కుమారుడు. 
49. సూర్యుడు:- కశ్యబ్రహ్మకు పుట్టినవాడు. 
50. చంద్రుడు:- అత్రిమహామునికి పుట్టినవాడు. 

ఈ విధముగా అల్పజాతికి చెందినవారు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, కర్మాచరణచే శ్రేష్ఠత్వమును పొందిరి. పాపులు కూడా కర్మల ద్వారా పుణ్యత్వమును పొందిరి. ఈ విధముగా పరిశోధించి చూడగా కుల, మత, వర్ణ భేదములు సృష్ఠిరీత్య లేవని తెలియచున్నవి. ఇట్టి కుల, మత, జాతి భేదములు కేవలము మిథ్యావాదుల విరుద్ధవాదనలు మాత్రమేనని గ్రహించవలెను. కావున వర్ణములు అనిత్యము. ఆత్మయైన సచ్చిదానంద స్వరూపమే సత్యము. 

🌹సర్వయోగ సమన్వయము🌹
🌹 🌹 🌹 🌹 🌹

పదనాలుగు లోకాలు

పదనాలుగు లోకాలు 




మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.
 
 నాల్గొవదైన మహర్లోకం 
కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకంలొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదోవది అయిన జనలోకంలొ 
బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరొవదైన తపోలోకంలో 
దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.

 ఏడో లొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణ దర్మం లేని పుణ్య లొకం.
ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.

 ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.

 తొమ్మిదొవది అయిన వితలం లొ హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.

 పదోవది అయిన సుతలం లొ బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.

 పదకొండవధి అయిన తలాతలం లొ త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.

 పన్నెండో వది అయిన మహాతలం లొ 
కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .

 పదమూడవధి అయిన రసాతలం లొ 
"పణి " అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే .

 పదనాలుగోవ ది అయిన పాతాళ లొకం లో 
 శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తు ఉంటారు.
🙏🙏🙏🙏🙏

Friday, April 9, 2021

eekagrata rahsyam- ఏకాగ్రతా రహస్యం : NOtes

ఏకాగ్రతా రహస్యం :

ఏకాగ్రతే విజయరహస్యం. ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళు వివేకవంతులు. కేవలం యోగులకే ఏకాగ్రత అవసరమని అనుకోవడం శుద్ధ పొరపాటు. ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అత్యవసరం. ఎవరు ఏ పని చేస్తున్న ఏకాగ్రత అవసరం ఎందుకంటే ఏమరపాటుగా ఉంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి. ఉదాహరుణకు సుత్తితో కొడుతున్నప్పుడు కమ్మరి ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా, అతని చేతి మీద సుత్తి దెబ్బ పడే ప్రమాదం ఉంది, అదే విధంగా ప్రతి ఒక్కరికి వారి వారి పనివ్రుత్తులలో మరియు విద్యార్థుల చదువు విషయంలో అన్నిట్లో ఏకాగ్రత అందరికి అవసరం. కాబట్టి అందరూ ఎంతో అప్రమత్తంగా, తమ మనస్సును అదుపులో పెట్టుకొంటూ పని చేస్తుంటారు. దీనిని బట్టి చూస్తే అందరూ నిరంతరం వారి మనస్సును ప్రయత్నం ద్వార ఏకాగ్రతను సాధిస్తున్నారని మనకు అర్ధమవుతుంది.

భగవద్గీతలో అర్జునుడి ప్రశ్నకు సైతం భగవాన్ శ్రీకృష్ణుల వారు చెప్పిన సమాధానం :
అర్జునుడు : కృష్ణా! మనసు ఎంతో చంచలమైనది. అది నిరంతరం అవిశ్రాంతితో చరిస్తూ ఉంటుంది. అదే సమయంలో మనస్సు శక్తివంతమైనది కూడ! దానిని నియంత్రణలో ఉంచడం అంటే గాలిని పట్టి బందించడం లాంటిదే! మరి అలాంటి మనసును నియంత్రణలోకి తీసుకురావడం ఎలా?
శ్రీకృష్ణుడు : అర్జునా! నువ్వు చెబుతున్నది నిజమే. మనస్సు చంచలమైనది. దాన్ని నియంత్రించడం అంతా సులభమైన పని కాదన్నది నిజమే! అయితే అంతటి చంచలమైన మనసును సైతం నిరంతర సాధన ,అంటీ ముట్టని ధోరణి అనే బలం ద్వారా నియంత్రణలోకి తీసుకురావచ్చన్నది అంతే నిజం.

మనస్సును నియంత్రణలోకి తీసుకురావడానికి అన్నిటికన్నా ముఖ్యంగా, మొట్టమొదట ఓ విషయం తెలుసుకోవాలి. తాము పోరాడదలచిన మనస్సు స్వభావాన్ని స్పష్టంగా అర్ధం చేసికోవాలి. మనస్సనేది కోతి లాగ చంచలమైనది. తప్పతాగి మత్తెక్కిన ఏనుగు లాగ చాల బలమైనది. అలాంటి మనసును నియంత్రించడమనేది అర్జునుడు చెప్పినట్లుగా, గాలిని పట్టుకోవడం లాంటిదే! కోతులను పట్టుకోవడంలోను, ఏనుగులకు శిక్షణ ఇవ్వడం లోను ఎలాంటి నైపుణ్యం అవసరమో – అంతా నేర్పు మనస్సును క్రమబద్దీకరించడానికి కావాలి.

భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికీ, ప్రతి వస్తువుకు ఓ విలక్షణమైన స్వభావం ఉంటుంది. ఉదాహరునకు వీయడమనేది గాలి స్వభావం. కాల్చడమనేది నిప్పు స్వభావం. పారడమనేది నీటి స్వభావం. అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం – ఇదీ మనస్సు స్వభావం. ఇటువంటి మనస్సును నియంత్రించగలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం. ఎలా నింత్రించాలి? ఆ పని ఎలా చేస్తాం? మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది.

కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం – ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో ‘దమం’ అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే ‘శమం’ అంటారు.

మనస్సు గురించి, దాని ఏకాగ్రత గురించి ఎన్నో వివరాలు తెలిసిన తరువాత, ‘అసలింతకీ, మనసును అదుపులో పెట్టాల్సిన అవసరం ఏమిటి?’ అని కొందరు అడుగవచ్చు. దీనికి సరైన సమాధానం తెలుసుకొని తీరాలి. దానికి సరైన జవాబు ఒక్కటే: మనస్సు గనక అదుపులో ఉంటె ఉన్నత లక్ష్యాలను సైతం సాధించాగాలుగుతాం. అదే మనస్సు అదుపులో లేనట్లయితే, అత్యంత సామాన్యమైన పనులు చేయడం కూడా సాధ్యం కావు. మనస్సుకు నిజంగానే అపారమైన రాక్షస బలం ఉంటుంది.

కొందరు కొన్ని సందర్భాలలో, మరికొందరు తమ జీవిత పర్యంతము దుర్భల మనష్కులుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారి మానసిక శక్తులన్నీ విచక్షణారహితంగా వేర్వేరు అంశాలపైన చెల్లచెదురై పోవడం వలన వారు అలా దుర్భల మనష్కులుగా కనిపిస్తుంటారు. అగ్నిని సృష్టించే శక్తి సూర్యకిరణాలకు ఉందని అందరికీ తెలియదు. వాళ్ళకు ఎందుకు తెలియదంటారా? సూర్యకిరణాలు నిప్పును పుట్టిస్తూ, వస్తువులను కాల్చి వేస్తుండడం వారు చూసి ఉండకపోవచ్చు! కానీ అవే సూర్యకిరణాలను ఓ కుంభాకార దర్పణం గుండా పోనిచ్చి, ఓ కాగితం ముక్క మీద పడేలా చేస్తే ,వారే ఆ కాగితాన్ని కాల్చవచ్చు. మరి , ఆ కిరాణాలకు ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? ఆ కిరాణాలను ఏక బిందుముఖంగా సాగేల చేసి, ఆ రకంగా వాటిని ‘ఎకాగ్రపరచడం’ వలన కలిగిన ఫలితమే ఆ కాగితం కాలడం! అంతకు ముందు, ఆ కిరణాలు వివిధ దిశల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. దాంతో, ఉష్ణాన్ని పుట్టించే శక్తి వాటికి ఉన్నప్పటికీ, అవి వేటిని కాల్చలేకపోయాయి. కానీ, వాటిని ఎకాగ్రపరచిన వెంటనే ప్రకాశవంతమైన నిప్పును పుట్టించాయి. ఈ రహస్యం మనం గ్రహించాలి.
ఇదే రకంగా, మన మనస్సుల్లో సహజసిద్దంగానే అసాధారణమైన శక్తి ఉంటుంది. అయితే, అవసరమైన, అవసరం లేని అన్ని రకాలైన అంశాల మీద ఈ శక్తిని మనం ఖర్చు చేస్తున్నాం. అందువల్లే మనం అత్యంత సాధారణమైన పనులు తప్ప మిగిలినవేవి చేయలేకపోతున్నాం. ఘనకార్యాలు సాధించాలంటే, చెల్లా చెదురుగా ఉన్న మానసిక శక్తులన్నిటిని క్రమబద్దీకరించాలి. మన మనస్సులు స్వాధీనంలో ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం.

ప్రాచీనకాలంలో మన ఋషులు నిరంతర ప్రయత్నాలతో మనస్సును తమ అదుపులోకి తెచ్చుకొని ,మానసిక సమతౌల్యాన్ని సాధించారు. అదే వారు చేసిన మొదటి పని. అలాంటి మనసును ఏకాగ్రపరిచినప్పుడు అద్భుతమైన యోగ రహస్యాలను వారు కనుగోనేలా అది (మనస్సు) చేసింది. అది వారికి దివ్య జ్ఞానాన్ని అందించింది.

స్వామి వివేకానంద చెప్పినట్లు, ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది ఆ సెర్చి దీపం.

సరే! మనస్సును ఏకాగ్రపరచాలన్న మాట నిజమే? కానీ, దాన్నీ ఏ వస్తువు మీద ఏకాగ్రపరచాలి? మనం అందరం యోగులం అవడానికి ప్రయత్నిస్తున్నాం కావున, మనం అందరం స్వయం ప్రకాశితమైన మన ఆత్మజ్యోతి మీద మన మనస్సును ఏకాగ్రపరచాలి.

మనం ప్రతి నిత్యం సాధన చేస్తూ మన మనస్సును ఆత్మ జ్యోతి మీద ద్రుష్టి నిలిపివుంటే, పరిసరాలనే కాకుండా చివరకు తన దేహాన్ని సైతం మర్చిపోయి పూర్తిగా మునిగిపోతే, అదే ఏకాగ్రతకు కచ్చితమైన సూచన!.

Wednesday, April 7, 2021

ఆధ్యాత్మికత- Notes

 ఆధ్యాత్మిక జీవితం  అంటే  అన్ని పనులు వదిలేసి దైవ చింతనలో మునిగిపోవటం కాదు . గుళ్ళకి వెళ్లి ,తీర్థ యాత్రలు చేసి ,పురాణ ప్రవచనాలు విని , జపతపాలు చేసి మళ్ళీ మామూలుగా అన్ని రకాల ద్వంద భావాలతో ,రాగ ద్వేషాలతో జీవనం సాగించడం  ఆధ్యాత్మికత కానే కాదు .

వయో వృద్దులు ఒక్కరే చేసేది కాదు .

 ఆధ్యాత్మికత ఇహానికి ,పరానికి రెంటికీ పని కొచ్చే సూత్రం .

 నిజాన్ని నమ్మటం ,నిజమైన స్వ  ధర్మాన్ని తెలుసుకొని  త్రికరణ శుద్దిగా పాటించడం , వయస్సుకి ,స్థితికి అనువైన నాలుగు ఆశ్రమాల నియమాలను అమలు చేయడం ఆధ్యాత్మికత .

పుట్టిన పసివాడు తల్లిపాలు త్రాగటం ,20 గంటలు నిదుర పోవటం ఆధ్యాత్మికత .

బాల్య వయస్సు లో మంచి ఆహారం ,ఆట పాటలతో ఆహ్లాదంగా గడపటం    ఆధ్యాత్మికత  .


విద్యార్ధి దశలో -  శరీర శుభ్రత , వ్యాయామం ,మంచి పోషక ఆహారం తినుట ,

స్వచ్చమైన గాలిని ప్రాణాయామ పద్దతి లో శ్వాసించుట ,

తల్లితండ్రులను అతిధి అభ్యాగతులను పూజించుట ,

గురువుని దైవం వలే నమ్మి విద్య నేర్చు కొనుట ఆధ్యాత్మికత .


తోటి మనిషికి , ప్రకృతికి హాని చేయక చేతనైనంత సాయం చేయడం ,

వస్తూత్పత్తి చేసే వారిని  అనగా పంటలు పండించే రైతు ,పరిశ్రమలలో పనిచేసే కార్మికుడు , 

అలాగే మనలను రక్షించే వారిని,అనగా , సైనికులను , పోలీసులను , గౌరవించి ఆదరించడం ;

విజ్ఞానాన్ని పంచే గురువులను ,పరిశొధనలు చేసి కొత్త విషయాలు ఆవిష్కరించే శాస్త్రజ్ఞుల ను అనుసరించడం -ఆధ్యాత్మికత .

ప్రతి భాద్యత ,వృత్తి, ప్రవృత్తి  అన్నీ కర్తృత్వ భావన లేకుండా భగవత్ కైంకర్యంగా చేయడమే ఆధ్యాత్మికత .


మనషి  చిన్నప్పటి నుండి ఎలా ఆధ్యాత్మిక జీవనం సాగించాలో గీత చెబుతుంది .


సమాధి - వివిధ రకాల సమాధి స్థితులు - విశ్లేషణ: (Types of Samadhi in Telugu) Notes

సమాధి - వివిధ రకాల సమాధి స్థితులు - విశ్లేషణ:



మూలం : మహర్షి పతంజలి



        యోగ శాస్త్రంలో 8 రకములైన సమాధి స్థితుల వర్ణన కలదు. ఇవి 8 రకాలైన జ్ఞానోదయ పద్ధతులు కూడా. అయితే ఈ "సమాధి" స్థితిని వర్ణించడం  దుర్లభం కూడా. అయితే, ఈ సమాధి అనుభవం కూడా అంతే దుర్లభం.


     సమాధి స్థితిలో, ఏ లక్ష్యమూ లేకుండా చిత్తాన్ని ఉంచినపుడు జ్ఞాన స్వరూపమూ, శాశ్వతమూ, సర్వవ్యాప్తమై వెలిగే

స్వస్థితిని సాధకుడు పొందుతాడు. అంటే అర్ధం మాత్రమే భాసిస్తుంది. ఇదే యోగుల గమ్యమైన "సమాధిస్థితి"

సమాధులు 1. సంప్రజ్ఞాత సమాధి, 2.అసంప్రజ్ఞాత సమాధి 

3.సవితర్క సమాధి

4.నిర్వితర్క సమాధి

5.సబీజ సమాధి

6.నిర్బీజ సమాధి

7.ధర్మ మేఘ సమాధి అని 8. ప్రకృతి లయ సమాధి...అని రకములు.


     ఇంకనూ అనేక సమాధి స్థితులు ఉన్ననూ, ప్రస్తుతానికి ఇవి చాలును.


   

సంప్రజ్ఞాత సమాధి: 


     దీన్లో చిత్తవృత్తులు శాంతించే ఉంటాయి. కాని బీజరూపంలో సంస్కారాలు మిగిలి, సమయం వచ్చినపుడు తిరిగి మొలకెత్తడానికి అనువుగా ఉంటాయి. కాబట్టే దీన్ని "సబీజ సమాధి" అనికూడా అంటారు. ధ్యాన, ధారణా, సబీజ సమాధులను పొందిన యోగికి  సర్వశక్తులు, సర్వజ్ఞత్వము కలుగుతాయి గాని ముక్తుడు కాలేడు. ఇంకా పునర్జన్మను కలిగించే కర్మబీజాలు ఉంటాయి. అణిమాది సిద్ధులు కలుగుతాయి.


అసంప్రజ్ఞాత సమాధి :


      దీన్లో నేను అనే అహంకారం ఉండదు. బీజరూపంలో ఉండే చిత్త వృత్తులు నశిస్తాయి. కర్మబీజం దగ్ధమై ఉండటంవల్ల "నిర్బీజ సమాధి"అని అంటారు. దీన్లో వాసనలు నశించి, మనో నాశనము కూడ కలగటం వల్ల, యోగి పరమాత్మను తెలిసుకొని ముక్తిని పొందుతాడు.


      వితర్కం, విచారణం (యుక్తాయుక్త విచక్షణ) – ఆనందం, ఆస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధిస్థితిని సంప్రజ్ఞాత సమాధి అంటారు. సంప్రజ్ఞాత సమాధి మళ్ళీ నాలుగు రకాలు.


మొదటిది – సవితర్క సమాధి. ఇందులో మనసు ఒకానొక విషయాన్ని, తదితర విషయాల నుండి వేరు చేసి, దాన్నే పదే పదేధ్యానిస్తూ ఉంటుంది.


రెండవది – నిర్వితర్క సమాధి. దేశ కాలాల నుండి పృధివ్యాది భూతాలని వేరు చేసి, వాటిని వాస్తవ రూపంలో చింతన చేస్తే దానిని నిర్వితర్కమంటారు.


మూడవది... నిర్విచార సమాధి – పైన చెప్పిన ధ్యానంలో దేశ కాలాలని తొలగించి, సూక్ష్మ భూతాలను వాటి వాస్తవ రూపంలో చింతన చేస్తే ఆ ధ్యానాన్ని నిర్విచార సమాధి అంటారు.


నాల్గవది ..... ఆనంద సమాధి.  స్థూల, సూక్ష్మభూతాలను కూడా వదిలివేసి, అంతరింద్రియ మనసు ధ్యేయమై, అంతఃకరణం రజస్తమోగుణరహితమై ఉందని భావిస్తే దానిని ఆనంద సమాధి అంటారు. చిత్తవృత్తులనన్నింటినీ నిరాకరించే, నిరంతర అభ్యాసం ద్వారా లభించే, అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో శేషించి ఉండే మరొక సమాధి స్థితి ఉంది. ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ అయిన అసంప్రజ్ఞాత సమాధి. దీని వల్ల మోక్షం లభిస్తుంది. కానీ ప్రకృతి తత్వాలను దాటాలి కదా! ఇదే కదా, సాంఖ్యం చెబుతుంది.


     అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.

 క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ధ్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. "సమాపత్తి" అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.

శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు "సవితర్క సమాధి" అంటారు.

స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు "నిర్వితర్క సమాధి" కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే "నిర్వికల్పసమాధి" అంటారు. 


     సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు.


      నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే "ఋతంభర ప్రజ్ఞ".

 ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.


     ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. వేదాలనన్నింటినీ పఠించినా, మనకెట్టి సాక్షాత్కారం కలగదు. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల "అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి" పొందగలం అని ఈ సూత్రకారుడి (పతంజలి) అభిప్రాయం. అయితే పతంజలి... ఋషి కాబట్టి...ఆ మహితాత్ముడు చెప్పినది "ఆప్తవాక్యమే"... హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మ...... వంటి తత్త్వాలు బాహ్యేంద్రియగోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే...సమాధి వల్ల కలిగే సంస్కారం,  ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.


     చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.

ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.


     పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును, వృత్తులు అనే తరంగాలు ఆవరించిఉన్నంతకాలం పురుషుడిని దర్శించాలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. ఒకటే చిత్త వృత్తి మిగిలి ఉన్నప్పుడు దానిని నిరోధించడం సులభం. అప్పుడు కలిగే సమాధినే "నిర్భీజసమాధి" అంటారు.


     ఇలా వృత్తి నిరోధం సిద్ధించగానే, అద్వితీయ – కేవల – జననమరణరహిత – నిత్య – నిర్వికార – స్వయంజ్యోతి అయిన పురుషుడు సహజ వైభవంతో ప్రకాశిస్తాడు.-------మహర్షి పతంజలి


     అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.

 క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ద్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.

శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు "సవితర్క సమాధి" అంటారు.

 స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు నిర్వితర్క సమాధి కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే "నిర్వికల్ప సమాధి' అంటారు. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు.

నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే "ఋతంభర ప్రజ్ఞ".

 ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.


       ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి పొందగలం అని సూత్రకారుడి అభిప్రాయం. అయితే పతంజలి... ఋషి కాబట్టి...ఆ మహితాత్ముడు చెప్పినది "ఆప్తవాక్యమే"... హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మల వంటి తత్త్వాలు బాహ్యేంద్రియ గోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే...సమాధి వల్ల కలిగే సంస్కారం,  ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.


చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.

ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.


సమాధిని పొందిన వ్యక్తికి , ఇంకా సూక్ష్మ శరీర భావన ఉంటుంది. ముక్తిని పొందకుండా లయమయ్యే విదేహులను , ప్రకృతి లయులు అంటారు. ప్రకృతి లయుల యొక్క అత్యున్నత ధ్యాన దశను "ప్రకృతి లయ సమాధి" అంటారు.


    పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును వృత్తులు అనే తరంగాలు ఆవరించి ఉన్నంతకాలం పురుషుడిని దర్శించలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. : ఇక్కడ ధర్మ మేఘ సమాధి గూర్చి, సూత్రకారుడేం చెబుతున్నాడో చూద్దాం! సర్వ తత్వాలను, చక్కగా వివేచించే జ్ఞానాన్ని పొంది, ఫలాపేక్ష లేక ఉండేవానికి, అలాంటి పరిపూర్ణ వివేకికి "ధర్మ మేఘం" అనే సమాధి సిద్ధిస్తుంది. ఇలాంటి వివేకాన్ని పొందిన యోగికి, అణిమాది అష్ట సిద్ధులన్నీ కలుగుతాయి. కానీ నిజమైన యోగి వాటిని పరిత్యాగం చేస్తాడు. అలాంటి యోగికి, "ధర్మ మేఘం" అనే విచిత్ర, వికాస అపూర్వ జ్ఞానం కలుగుతుంది. అటువంటి యోగి సమస్త జ్ఞానం తననుండే కలుగుతుందని గ్రహిస్తాడు.

 ఇక్కడ, యోగికి వివేక ఖ్యాతి లభించినచో, దాని సహాయముతో, సర్వ భావాధిష్ఠాతృత్వాది సిద్ధులను, ఆశించినచో , ఆ యోగి "కుసీదుడు" అనబడును. (కుసీదుడు - సద్గురు మళయాళ స్వామి వచనం)


శివోహం శివోహం శివోహం🌹🙏🌹🙏🌹🙏

Tuesday, April 6, 2021

శివారాధన పద్ధతులు- -NOTEs


శివారాధన పద్ధతులు



 సత్సంగత్వే నిస్సంగత్వం.

శివారాధన పద్ధతులను తెలుపమని నేను ధర్మగుప్తులను కోరాను. వారిలా వివరించారు,  "అయ్యా! ఒక్కొక్క పూజా విధానంతో ఒక్కొక్క  దైవము సంతుష్టులు అవుతారు. సహస్ర నామ పఠన, అర్చనలతో విష్ణువు, మోదకాలతో గణపతి, నమస్కారంతో సూర్యుడు, అర్ఘ్యంతో చంద్రుడు, అభిషేకంతో శివుడు ప్రసన్నులు అవుతారు. నమకాలను చదువుతూ ఏకాదశ రుద్రాభిషేకం చేసినట్లయితే అప మృత్యుదోషాలు హరింపబడటమే కాకుండా ఏకాదశ తిథియొక్క పుణ్యబలం కూడా ప్రాప్తిస్తుంది. ఈవిధంగా ఏకాదశ రుద్రాభిషేకానికి ఏకాదశ తిథికి సన్నిహిత సంబంధము ఉండటంవల్ల శివ, కేశవులు అభిన్నులు అనేది నిర్వివాదాంశమే. కాగా శివారాధనలో శివ పంచాక్షరి అనుష్ఠానము మొదటి పద్ధతి, మహాన్యాస విధానము రెండవది, రుద్రాభిషేకము మూడవ పద్ధతి.


పంచతత్త్వారాధన


పంచాక్షరిలోని 5 అక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు, కాబట్టి 


భూతత్వానికి          చందనం, 

 జలతత్వానికి        కొబ్బరినీళ్ళు అర్పించాలి; 

అగ్నితత్వానికై      దీపారాధన, 

వాయుతత్వానికై     సాంబ్రాణి ధూపం, 

ఆకాశతత్వానికై        ఘంటారావం చేయాలి.


సంధ్యోపాసన


పంచాక్షరిని పంచతత్త్వాలతో సాధన చేసే సాధకుల కను బొమల మధ్యలో పంచతత్త్వాలు సంధ్యా సమయాన వివిధ రంగులతో రూపు దిద్దుకున్న ఆకాశంలా రజత, అరుణ, స్వర్ణ, నీల, శుద్ధ ధవళం మొదలైన వివిధ వర్ణాలతో ప్రకాశిస్తూ దివ్య జ్యోతుల్లా కనిపించుతాయి. అందువల్లనే ఋషీశ్వరులు పంచాక్షరీ పంచ తత్త్వ సాధనను సంధ్యోపాసన అని వర్ణిస్తారు. 


యంత్రం, మంత్రం, పంచతత్త్వ సాధన, యోగసాధన, ఆత్మ సమర్పణ అనే పద్ధతుల ద్వారా దేహ, ఆత్మబుద్ధి నశించి, దేహమే దేవాలయంగా, జీవుడే శివాత్మగా మారి మోక్షము లభిస్తుంది. ఈ స్థితిని పొందడానికి శివపంచాక్షరి జపం, మహా  న్యాస పూర్వక ఆరాధన, రుద్రాభిషేకం చేయాల్సి ఉంటుంది. 


రుద్రులు వేలకొలది సహస్ర సంఖ్యలో ఉన్నారు, అంటే గణానికి ముగ్గురు చొప్పున ఏకాదశ రుద్రులకు (11 x 3 x 10000000 = 330000000) 33 కోట్ల రుద్రగణాలు ఉన్నాయని, వాళ్ళే పంచభూతాలను, దేహ, ప్రాణ, మనస్సు లను ఆవరించి ఉంటారని వేదం చెప్తున్నది. గణపతి 33 కోట్ల రుద్రగణాలకు అధిదేవత. శ్రీపాదులు గణపతి తత్త్వంతో అవతరించినందువల్ల వారిని సేవించి అర్చించేవారికి 33 కోట్ల రుద్రగణాల అనుగ్రహం లభిస్తుంది. 


రుద్రాక్షధారణ


శివభక్తులు ఖచ్చితంగా రుద్రాక్షను ధరించి తీరాలి. మానవు లలో వర్ణాలు ఉన్నట్లే రుద్రాక్షలలో కూడా బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతి రుద్రాక్షలు ఉన్నాయి. తెల్లనివి బ్రహ్మ జాతివి. ఇవి దొరకడం చాలా అరుదు, వీటిని బ్రాహ్మణులు, ఎర్రని క్షత్రియ జాతి రుద్రాక్షలను క్షత్రియులు, చింతగింజ రంగు వైశ్య జాతి రుద్రాక్షలను వైశ్యులు, నల్లని శూద్రజాతి రుద్రాక్షలను శూద్రులు ధరించినట్లయితే వారి వారికి అను కూలంగా మంచి ఫలితాలు కలిగి పాపాలు నశించి సమస్త కోరికలు తీరుతాయి. లేతవి, బరువు లేని రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నిలిపి అడుగున చిన్నరాగి పాత్ర అంటే ఉద్ధరిణి, పంచపాత్ర మధ్య లో రుద్రాక్షను పెట్టినట్లయితే, అది కుడినుండి ఎడమకు ప్రదక్షిణ చేసినట్లయితే శ్రేష్ఠమైనవని, అపసవ్యంగా తిరిగితే మంచివి కావని తెలుసుకోవాలి. ఇటువంటి రుద్రాక్షలను ధరించిన గృహస్థులకు దారిద్ర్యం, భార్యావియోగం, అకారణ కుటుంబ కలహాలు కలుగుతాయి. సన్యాసులు వీటిని ధరించవచ్చు, బాధ లేదు.


రుద్రాక్షలు దేవతామూర్తులు


సాధారణంగా ఏకముఖినుండి ప్రారంభిస్తే 16ముఖాలవరకు ఉన్న రుద్రాక్షలు లభిస్తాయి. వివిధ రుద్రాక్షలకు వివిధ దేవతా స్వరూపాలతో సంబంధం ఉంటుంది. ఏకముఖి శివ స్వరూపం అయితే ద్విముఖి-అర్థనారీశ్వరుని, త్రిముఖి-అగ్ని, చతుర్ముఖి-బ్రహ్మ, పంచముఖి-కాలాగ్నిరుద్రుని, షణ్ముఖి-కార్తికేయుని, సప్తముఖి-మన్మధుని, అష్టముఖి-రుద్రభైరవుని, నవముఖి-కపిలముని, దశముఖి-విష్ణుని రూపాలు అయితే, ఏకాదశ ముఖి-సాక్షాత్తు రుద్రుని స్వరూ పము కాగా, ద్వాదశముఖి ద్వాదశాదిత్యుల స్వరూపం. ఇందులో నవముఖి రుద్రాక్ష దొరకడం చాలా కష్టం. దీనిలో విద్యా, జ్ఞాన, క్రియా మొదలైన నవ శక్తులు ఉండటంవల్ల ధరించిన వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి." ఇలా శివా రాధన, దానికి సంబంధించిన రుద్రాక్ష ధారణ వివరించిన తరువాత శ్రీపాదుల స్వరూపం గూర్చికూడా మాట్లాడుతూ శ్రీపాదులను శివస్వరూపులని భావిస్తే విష్ణువులా విష్ణువని తలచినట్లయితే శివునిలా కనిపించుతారని, భక్తులు వాళ్ళ మనసులోనుండి తర్క గుణాన్ని వదిలి వారిని శరణు వేడి నట్లయితే  యదార్థ రూపంతో కన్పించుతారు అని చెప్పారు.


తరువాత ఇద్దరం కురుంగడ్డకు వెళ్ళి, స్వామికి పాదనమ స్కారం చేసుకొని, కొంచెంసేపు ధ్యానస్థులం అయ్యాము. సాయంకాలం వారి ఆజ్ఞతో అవతలి ఒడ్డు చేరి జగత్ప్ర భువుల దివ్యలీలా ప్రసంగాలతో కాలం గడిపాము. సుదూరంగా ఎవరో యోగులు 'శ్రీపాద శ్రీవల్లభ దిగంబర' అంటూ సుశ్రావ్యంగా కీర్తిస్తున్న నామం చెవులకు అమృతంలా సోకుతుంటే ఆ మాధుర్యంలో మునకలు వేస్తూ మెల్లగా నిద్రలోకి జారాము.


శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

Monday, April 5, 2021

Adi Shankaracharya- bhrama ani telusu-భ్రమ అని తెలుసు

 https://www.youtube.com/watch?v=gQUrYvMb2qM



ఆఆఆఆఆ.. ఆఆఆ... భ్రమ అని తెలుసు భ్రమ అని తెలుసు బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు ఆఆఆ... కథ అని తెలుసు కథ అని తెలుసు కథలన్ని కంచికే చేరునని తెలుసు తెలుసు తెర తొలుగుతుందనీ తెలుసు తెల్లారుతుందనీ తెలుసు ఈ కట్టె పుట్టుక్కుమంటదనీ తెలుసు ఈ మట్టి మట్టిలోకలిపోతదనీ ఎన్ని తెలిసీ ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయ ఆఆఆ..మాయ మా..య... ఓఓఓఓ... ఓఓఓ వేదం తెలుసు! తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు శాస్త్రం తెలుసు! శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు తెలుసు ఇది నీటి మూటనీ తెలుసులే గాలి మేడని తెలుసు ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ తెలుసు ఉట్టి పై ఉన్నదంత ఉష్కాకియనీ అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు దేనికని మాయ మాయ మా.. య, ఓఓఓఓఓ... ఓఓఓఓఓ ఓఓఓఓఓ...తేలపోయింది తెలిసిపోయింది తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉందని మనసా..ఆఆ..ఓ.. ఓ.. ఓ తెలుసని ఎందరు చెబుతున్నా అది ఉందో లేదో తేలని హంస... కళ్ళు రెండు మూసేయాలంట మూడో కంటిని తెరవాలంటా... మిన్నూ మన్నూ మిట్టా పల్లెం ఒక్కటిగా కనకనిపంచాలంటా..... ఆడేవాడు ఆడించే వాడు ఏక పాత్రలని ఎరగాలంటా... ఆ ఎరుక వచ్చి రాగానే... ఆ ఎరుక వచ్చి రాగానే... ఆ ఎరుక వచ్చి రాగానే మాయం ఐపోతుందట మాయ...ఆ.. ఆ.. మాయ... మాయ... ఆఆఆ.. ఆఆఆఆ... ఆఆఆ