Translate

Wednesday, January 18, 2023

భైరవ మంత్రాలు (Bhairava Mantras in Telugu)

భైరవ మంత్రాలు 


వటుక భైరవ మంత్రము (సమస్త సిద్దికి)

అస్యశ్రీ వటుక భైరవ మంత్రస్య బృహదారణ్య ఋషిః అనుష్టుప్ ఛందః, వటుక భైరవో దేవతా వం బీజం, హ్రీం శక్తిః, ఓం కీలకమ్,  వటుక భైరవ ప్రీతయే జపే వినియోగః

 

ధ్యానం

కరకలిత కపాలః కుండలీ దండపాణిః

తరుణ తిమిర నీలోవ్యాల యజ్ఞోపవీతీ

ఋతుసమయ సపర్యావిఘ్న విచ్ఛేదహేతుః

జయతి వటుక నాథః సిద్దిదః సాధకానామ్

 

మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహ

 

కాలభైరవ సాధన చేసిన పద్ధతిలో ఈ సాధన చేయాలి

 

క్రోధభైరవ మంత్రము (శతృబాధ, దుష్టగ్రహ బాధ నివారణకు)

ధ్యానం

దంష్ట్రా కరాళవదనం భీమం భీషణగర్జనం

రుండమాలా సమాయుక్తం ధ్యాయేహాం క్రోధభైరవం

 

మంత్రం ఆం హ్రీం క్రోం క్రోధ భైరవాయ నమః

 

మహాభైరవ మంత్రము (సకల కోర్కెలు తీరుటకు)

 

ధ్యానం 

సంధ్యారుణజటాజూటం త్రినేత్రం రక్తవిగ్రహం

శూలం కపాలం పాశంచ డమరుం దధతం కరైః

భూతప్రేత పిశాచైశ్చ సంవృతం సేవితం సదా

ఇంద్రనీల నిభం వీరం మహాభైరవ మాశ్రయే

 

మంత్రం ఓం భం భైరవాయ నమః

 

స్వర్ణాకర్షణ భైరవ మంత్రము (ధనసిద్ధికి)

 

ధ్యానం 

స్వర్ణవర్ణం చతుర్భాహుం త్రినేత్రం పీతవాససం

స్వర్ణపాత్రధరం వందే స్వర్ణాకర్షణ భైరవం

 

మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం నమోభగవతే స్వర్ణాకర్షణ భైరవాయ మమ హిరణ్యం దాపయ దాపయ స్వాహ

 

రుద్రభైరవ మంత్రం (అప మృత్యు నివారణకు)

 

ధ్యానం

శ్మశాన వాసినంఘోరం భూతప్రేత సమన్వితం

మృత్యుమృత్యుంమహవీరం రుద్రభైరవమాశ్రయే

 

మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ మహాభైరవాయ భం జూం హూం ఫట్

 

భద్ర భైరవ మంత్రం (దివ్య దృష్టికి, నిధి నిక్షేపాలు)

 

ధ్యానం 

ఫణివరఫణినాధో దేవదేవాధినాధః

క్షితిపతివరనాధో వీర వేతాళనాధః

నిధిపతి నిధినాథో యోగినీ యోగనాథో

జయతిజయతి దేవోభైరవస్సిద్ధనాథః

 

మంత్రం భ్రాం భ్రీం భ్రూం భద్రభైరవాయ క్లాం క్లీం క్లూం వీరవేతాళాయ అదృశ్యం దృశ్యం కురుకురు ఇష్టం దర్శయ దర్శయ వదవద స్వాహ

 

భైరవ మాలా మంత్రాలు

1.సిద్ధ భైరవ మంత్రం

ఓం నమో భగవతే విజయ భైరవాయ, ప్రళయాంతకాయ మహాభైరవాయ సర్వవిఘ్ననివారణాయ శక్తిధరాయ చక్రపాణయే వటమూల నిషణ్ణాయ అఖిల గణనాయకాయ ఆపదుద్ధరణాయ ఆకర్షయ ఆకర్షయ ఆవేశయ ఆవేశయ మోహయ మోహయ భ్రామయ భ్రామయ భాషయ భాషయ శీఘ్రం భాషయ శీఘ్రం భాషయ హ్రాం హ్రీం త్రిపుర తాండవాయ అష్టభైరవాయ భాషయ స్వాహా

 

2. విజయ భైరవ మంత్రం

వీం రం హుం ఓం నమో భగవతే విజయ భైరవాయ సర్వ శత్రూణాం వినాశనాయ విధురితాధరాయ నర రుధిర మాంస భక్షణాయ దేవదత్త ముచ్చాటయోచ్చాటయ తాడయ తాడయ సంహార సంహార భస్మీ కురుకురు స్వాహా

 

 

 

మరికొన్ని ముఖ్య  భైరవ మంత్రాలు

 

1. ఉగ్రభైరవ మంత్రము

ఓం నమో భగవతే ఉగ్రభైరవాయ షర్వ విఘ్ననాశాయ ఠ ఠ స్వాహా

 

2. మహాభీమ భైరవ మంత్రం

హ్రీం నమో మహభీమ భైరవాయ సర్వలోక భయంకరాయ సర్వశత్రు సంహారకారణాయ హ్రుం హ్రుం దేవదత్తం ధ్వంసయ ధ్వంసయ స్వాహా

 

3. క్రోధ భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఋం క్రోధ భైరవాయ నమః

 

4. కపాల భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఏం కపాల భైరవాయ నమః

 

5. అఘోర భైరవ మంత్రం

హ్రీం రీం అఘోర భైరవాయ దేవదత్తం మోహయ మోహయ హుం ఫట్ స్వాహా

 

6. ఉన్మత్త భైరవ మంత్రం

ఓం ఐం ల్పుం ఉన్మత్త భైరవాయ నమః

 

7. చండ భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఉం చండ భైరవాయ నమః

 

8. రురు భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఇం రురు భైరవాయ నమః

 

9. అసితాంగ భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం అం అసితాంగ భైరవాయ నమః

 

10. క్షేత్రపాల భైరవ మంత్రం

క్షాం క్షేత్ర పాలాయ నమః

 

11. బడబానల భైరవ మంత్రం

పాం ఓం నమో భగవతే బడబానల భైరవాయ జ్వల జ్వల ప్రజ్వల వైరిలోకం దహదహ స్వాహా

 

12. మహాభైరవ మంత్రం

ఓం శ్రీం మం మహాభైరవాయ నమః

 

13. సంహార భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం అం సంహార భైరవాయ నమః

 

14. భీషణ భైరవ మంత్రం

ఓం ఐం హ్రీం ఊం భీషణ భైరవాయ నమః

 

15. మోహన భైరవ మంత్రం

ఓం శ్రీం మోం మోహన భైరవాయ నమః

 

16. వశీకరణ భైరవ మంత్రం

ఓం శ్రీం వం వశీకరణ భైరవాయ నమః

 

17. ధూమ్ర భైరవాయ నమః

ఓం శ్రీం ధూం ధూమ్ర భైరవాయ నమః

 

18. సింహ భైరవ మంత్రం

ఓం శ్రీం సిం సింహ భైరవాయ నమః

 

19. రక్త భైరవ మంత్రం

ఓం హ్రీం స్ర్ఫం రక్త భైరవాయ నవ శవ కపాల మాలాలంకృతాయ నవాంబుధ శ్యామలాయ ఏహి ఏహి శీఘ్రమేహి ఏం ఐం ఆగామి కార్యం వదవద అఖిలోపాధిం హరహర సౌభాగ్యం దేహి మే స్వాహా

 

 

 

దశమహా విద్యలు( గాయత్రి మంత్ర సహితం) (Dasamahavidya Gayatri Mantras)

 


దశమహా విద్యలు( గాయత్రి మంత్ర సహితం)




శ మహావిద్యలలో మొదటిది కాళి రూపం. సమస్త విద్య లకు ఆదిరూపం మహాకాళి. ఆ దేవి విద్యామయ శక్తులనే మహావిద్యలని అంటారు. కృష్ణ వర్ణంలో ఉండటంవల్ల దేవికి కాళీ అనే నామ మేర్పడింది. అనేక సంవత్సరములకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాలలోనో, రోజుల్లోనో సాధించాలనుకొంటే కాళీ ఉపాసన చేస్తారు. కాని కాళీశక్తిని తమ శరీరంలోనికి ఆకర్షిం చుకొనేటప్పుడు అగ్నితో సమాన మైన మంటలని, భయంకరమైన బాధని యోగి అనుభ విస్తారు. రెండవది తారా రూపం. తరింప చేసే దేవి కాబట్టి తార అయ్యింది. ఈమెను నీలసరస్వతి అని కూడా అంటారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. మూడ వది ఛిన్నమస్త. పార్వతి తన సఖురాండ్రైన డాకినీ, వర్ణినీ లతో మందాకినీ నదికి స్నానానికై వెళ్ళింది. స్నానం చేసిన తరువాత వారిద్దరు ఆకలిగా ఉందని తమ ఆకలిని తీర్చ మని అడగటంతో దేవి ఖడ్గంతో తన శిరస్సుని ఖండించు కున్నది. ఖండిత శిరస్సును ఆమె తమ వామ హస్తంలో పట్టుకొన్నది. దానినుండి వెలువడ్డ మూడు ధారలను ముగ్గురు త్రాగి తమ ఆకలిని తీర్చుకున్నారు. అప్పటి నుండి ఆమె ఛిన్నమస్తాదేవిగా ప్రసిద్ధి పొందింది.
నాల్గవది షోడశీమహేశ్వరి. పార్వతీదేవి యొక్క ముగ్ధ మోహన మైన 16 సంవత్సరాల ప్రాయపు రూపమే షోడశీ మహేశ్వరి. ఈ తల్లిని ప్రసన్నం చేసుకోడానికి సాధకులు షోడశాక్షరీ (16 అక్షరాలుకల) మంత్రాన్ని జపిస్తారు. ఈ దేవిని ఆశ్రయించిన వారికి అన్ని విద్యలు అరచేతిలోనే ఉంటాయి. ఈ దేవి ఉపాసన వల్ల భోగము, మోక్షము రెండూ సిద్ధిస్తాయి. అయిదవ రూపం భువనేశ్వరీదేవి. ఈ దేవిని ఏడుకోట్ల మహా మంత్రాలు ఆరాధి స్తుంటాయి. ఈ విశ్వాన్ని సృష్టించాలనే అభిలాషతో బ్రహ్మ క్రియా శక్తిని ఆహ్వానిస్తూ తీవ్రమైన తపస్సు చేసారు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరి భూదేవి రూపంలో ప్రత్యక్షమైంది. విశ్వానికే అధిదేవత కాబట్టే భువనేశ్వరీ అని పిలుస్తారు. అవ్యక్తంనుండి వ్యక్తమైన బ్రహ్మాండరూపం, చైతన్య స్వరూ పమే భువనేశ్వరీదేవి. ఆరవది త్రిపురభైరవి రూపం. కొన్ని ప్రత్యేకమైన క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని రూపుమాపగల శక్తిని త్రిపురభైరవి అంటారు.ఈ శక్తిని నృసింహ భగవానుడి అభిన్నశక్తిగానూ, కాలభైరవుని అవ తారంగా కూడా పరిగణిస్తారు. ఏడవ రూపం ధూమావతి. ఈ దేవి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వల్ల విపత్తులు నాశనమై సంప దలు లభిస్తాయి. జీవుని ఆకలి, దప్పికల బాధలకు, కలహ- దారిద్ర్యాలకు ఈమె కర్త. ఈ తల్లి అనుగ్రహం ఉంటే సమస్యలన్ని దూరం అవుతాయి. బగళాముఖి ఎనిమిదవ రూపం. కుటుంబ పరంగాను, ఆధ్యాత్మికంగాను, దేశంలోను, సమాజంలోను వికాసానికి అడ్డంకులుగా ఉన్న అరిష్టాలను రూపుమాపడానికి, శత్రువులను అణగత్రోక్కడానికి ఈ మాతను ఆరాధిస్తారు. బ్రహ్మ, విష్ణు, పరశురాములు ఈ దేవి ఉపాసకులే. చాలాకాలంవరకు తిరుపతి వేంకటేశ్వరుని బగళాముఖిగా పూజించారు.
తొమ్మిదవ రూపమైన మాతంగి మతంగ మహాముని కుమార్తె. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసే శక్తి ఉంది. పదవరూపమైన కమలాలయ సమృద్ధికి ప్రతీక. ఈమె అనుగ్రహంవల్ల రాజభోగం, కీర్తి లభిస్తాయి.

######################################################################################

దశమహా విద్యలు – శ్రీకాళీదేవి ( తొలి మహా విద్య )
కాళీ గాయిత్రి: . ఓమ్ కాళికాయై చ విద్మహే స్మశాన వాసిన్యై ధీమహి తన్నో ఘోరా ప్రచోదయాత్!!
కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

దశ మహావిద్యలు – శ్రీతారాదేవి ( 2 వ మహా విద్య )
తారా గాయిత్రి: ఓమ్ తారాయైచ విద్మహే మహాగ్రాయైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

దశ మహావిద్యలు – శ్రీషోడశీదేవి (3 వ మహా విద్య
షోడసి ( త్రిపురసుందరి ) గాయిత్రి: ఓమ్ ఐం త్రిపురాదేవ్యై విద్మహే క్లీం కామేశ్వయై ధీమహి సౌ స్త న్త్రః క్లిన్నో ప్రచోదయాత్!!
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

దశ మహావిద్యలు - శ్రీ భువనేశ్వరీదేవి. ( 4 మహా విద్య )
భువనేశ్వరీ గాయిత్రి: ఓమ్ నారాయణైచ విద్మహే భువనేశ్వయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

దశ మహావిద్యలు - శ్రీ త్రిపుర భైరవీ దేవి (5వ మహా విద్య)
భైరవీ గాయిత్రి: ఓమ్ త్రిపురాయైచ విద్మహే భైరవ్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

 

దశ మహావిద్యలు - శ్రీ ఛిన్నమస్తాదేవి. (6వ మహా విద్య)
చిత్రమస్త గాయిత్రి: ఓమ్ వైరోచన్యైచ విద్మహే చిత్రమస్తాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది

దశ మహావిద్యలు - శ్రీ ధూమవతీ (7వ మహా విద్య)
ధూమవతీ గాయిత్రి: ఓమ్ ధూమవత్యైచ విద్మహే సంహారిణ్యైచ ధీమహి తన్నో ధూమ ప్రచోదయాత్!!

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

దశ మహా విద్యలు - శ్రీ బగళా ముఖి దేవి (8వ మహా విద్య)
భగళాముఖి గాయిత్రి: ఓమ్ భగళాముఖ్యైచ విద్మహే స్తంభిన్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా ముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

దశ మహావిద్యలు - శ్రీ మాతంగీదేవి. (9వ మహా విద్య)
మాతంగీ గాయిత్రి: ఓమ్ మాతంగ్యైచ విద్మహే ఉచ్ఛిష్ఠ ఛాండాళ్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

 

 



దశ మహావిద్యలు - శ్రీ కమలాత్మికాదేవి (10వ మహా విద్య)
1. ఓమ్ మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్!!
( మూలమంత్రం: ఓమ్ క్లీం శ్రీం లక్ష్మీదేవ్యై నమః )

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
శ్రీ మాత్రే నమః

Monday, January 9, 2023

కాళి దేవి మాలా మంత్రం - Telugu (Kaali Devi Mala Mantram In Telugu)

 




 ఓం నమో భగవతే మహాకల్ప ఏహి ఏహి శతౄన్ సంహారయ పతిమానసవాసినీ,

పరకృత్యాది భూతప్రేత పిశాచాది సర్వవిషమగ్రహాన్ నాశయ నాశయ సర్వ స్త్రీ పురుష వశంకరీ,

సహస్రకోటి కాలానల సమప్రభే జ్వాలా(మాలని)(కేళిని)

కాలకోటి రూపిణీమహాబలపరాక్రమే-ఓం పరమంత్రపరయంత్ర పరతంత్ర,పరక్రియా, పరవిద్యాచ్ఛేదన వివిధ ధ్వంసీనీ మహాదేహా వర్తమాన వర్తిష్యమాణ సకల క్షుద్రరోగాన్ మోచయ మోచయ- హ్రీం హ్రీం దక్షిణ కాళికేకరాళదంష్ట్రవదనే,

కాళరాత్రి విభూషితే నిఖిలాలయేషు మమ శీర్షాది పాదపర్యంతం రక్ష రక్ష వాగాది సర్వేంద్రియ వ్యాపారక జీవచైతన్యం వర్ధయ వర్ధయ మోదయ మోదయ హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహా


Wednesday, January 4, 2023

స్థూల, సూక్ష్మ ,కారణ శరీరం (Stula , sukshma,kaarana sareeram/body- Telugu notes



 ప్రతి మనిషికి

1. స్థూలశరీరం లయం

2. సూక్ష్మ శరీరం లయం

3. కారణ శరీర లయం

4. మహా కారణ శరీరం


స్థూల శరీరము కర్మజమగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల దేహము క్షీణించును.  స్థూల శరీరము ఎలా పుట్టింది​? ఎందుకు పుట్టింది​? అది జడం కదా. పంచభూతాలు ఎందుకు పంచీకరణ అయి స్థూల శరీరంగా మారింది? అన్నము వలన శుక్లశోణితాల వలన  పిండం ఎందుకు వచ్చింది? పిండం వచ్చి, బిడ్డ పుట్టి పెరిగి చచ్చేదాకా అనేక సుఖదుఖాలు పొందుతున్నాడు కదా! ఈ స్థూల దేహం దానికే ఉపయోగిస్తోందా. దీనిని ఎవరు తెచ్చుకున్నారు​? కర్మ చేయడానికి ఈ పనిముట్టు కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కూడా ఈ పనిముట్టు. ఈ పనిముట్టు అవసరం ఎవరికి వుంది? ఏ సూక్ష్మ శరీరం అయితే మంచి చెడు కర్మలు చేసిందో ఆ చేసిన పనే మళ్ళీ చేయడానికి ఈ పనిముట్టు కావలసి వచ్చింది. ఇంకొక జన్మ, ఆ జన్మలో కూడా తృప్తిపడకుండా వున్నది. శరీరాన్ని విడిచి వుండలేకుండా వున్నది. ఏదో చేయాలని చేయలేకుండా వున్నది. ఇప్పుడు చేద్దాం అనేటటువంటి సంస్కారము​, వాసన ఏదైతే ఆ సూక్ష్మ శరీరంమీద ముద్రించబడిందో ఆ సూక్ష్మ శరీరమే తను ఇవన్నీ చేయడానికి ఫలితాలు పొందటానికి​, మరల ఈ పనిముట్టును తెచ్చుకుంది. అంటే స్థూల శరీరం రావడానికి కారణం సూక్ష్మ శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం అలా వుండటానికి కారణం కారణ శరీరం, వాసనలు. వాసనా క్షయం అయితే లింగదేహం భంగమవుతుంది. కారణ శరీరం వున్నంత వరకు వాసనలు వున్నంత వరకు లింగ శరీరం సూక్ష్మ శరీరంగా వున్నంత వరకు సూక్ష్మ శరీరం స్థూల శరీరమును పనిముట్టుగా తెచ్చుకుంటుంది. స్థూల శరీరము కర్మజ మగుట వలన కర్మము క్షీణించెనేని స్థూల శరీరము కూడా క్షీణించును. వాసనా క్షయం అయితే స్థూల శరీరం వుండదు.


సూక్ష్మ దేహము సహజమగుట వలన కత్తుల చేత నరకబడక జలముచేత నానక అగ్నిచేత దహింపబడక వాయువు చేత శోషింపబడక, ఉంటూనే ఉంటుంది. ఏమిటీ అత్మకున్న లక్షణాలు సూక్ష్మ శరీరానికి కూడా వున్నాయి​? సూక్ష్మ శరీరం కూడా కత్తుల చేత నరకబడదు. నీళ్ళలో నానదు. అగ్నిచేత కాలదు. వాయువుచేత శోషింపబడదు.       వృత్తి ప్రళయము, నిత్య ప్రళయము, దేహ ప్రళయము, మను ప్రళయము, బ్రహ ప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదాశివ ప్రళయము, విరాట్‌ పురుష ప్రళయము ఇవన్నీ దశ విధ ప్రళయాలు. దశవిధ ప్రళయాలయందు కూడా ఈ సూక్ష్మ శరీరము చెడక వుంటుంది. ఇది విదేహ ముక్తి పర్యంతము వుంటుంది. జీవన్ముక్తుడికి కూడా సూక్ష్మ శరీరం వుంటుంది. విదేహ ముక్తుడికి స్థూల శరీరం పడిపోతుంది. లింగ శరీరము భంగమవుతుంది. అంతవరకూ ఈ సూక్ష్మ శరీరం ఉంటూనే వుంటుంది.


ముక్తి కోరువారు ముందుగా సూక్ష్మ శరీరమును చెరపగోరక కారణ శరీరమును చెరపవలెను. మోక్షం కావాలంటే సూక్ష్మ శరీరమును చెడగొట్టడంవల్ల అది పోదు. ఒక రాక్షసుడు చంపితే వాడినుంచి చిందిన ప్రతి బొట్టు ఒక రాక్షసుడు అయింది. అలాగే సూక్ష్మ శరీరాన్ని ముక్కలు చేస్తే కొన్ని వేల ముక్కలు అవుతుంది. వేల ముక్కలు వేల స్థూల శరీరాలను తెచ్చుకుంటుంది. అందుకే ఒక తండ్రికి పదిమంది కుమారులు కూడా, తండ్రే కుమారుడయ్యాడు. దాని అంతరార్ధం అది. ఆ రాక్షసుడు ప్రతి చుక్క కూడా రాక్షసుడయ్యాడు. ఒక కారణ శరీరం పది విభాగాలు అయినప్పుడు​, తండ్రి యొక్క కర్మ కొడుక్కి పంచబడ్డప్పుడు తండ్రీ కొడుకూ ఒక్కడే. తండ్రి తన శరీరము ద్వారా అనుభవించాల్సినది తృప్తి చెందక తన శుక్లముతో పాటుగ తన సంచిత కర్మలో కొంత భాగాన్ని కూడా కుమారులకు పంచుతాడు. వారు తయారవుతారు. తండ్రి తన భార్య గర్భములో శుక్ల రూపంలో ప్రవేశించి​, ఆ తండ్రే ఆ భార్యకు కొడుకు అయ్యాడు. కాబట్టి తండ్రి తనయొక్క భార్యనుండి తానే కొడుకై వచ్చాడు. శుక్లరూపంలోనే కాకుండా సంస్కార రూపంలో వచ్చాడు. నలుగురు కొడుకుల రూపంలో వచ్చినా కూడా నలుగురు బిడ్డలూ కూడా ఆ తండ్రే. ఆ రకంగా సూక్ష్మ శరీరం కూడా ఎన్నైనా విభాగాలు కావచ్చు, కారణ శరీరం కూడా కొన్ని వాసనల కుప్పని ఎన్నైనా విభాగాలు చేయవచ్చు. అయితే ఎప్పుడూ అలా వుండదు. దీనికి కూడా ఒక అవకాశముగా గుర్తు పెట్టుకోండి.


జనాభా పెరగడానికి కారణము ఒక్కొక్క కారణ శరీరము అనేక కారణ శరీరాలుగా విభాగమవ్వడమే. ఎందుకంటే మనం ముందు ఎవరమూ లేము. మహాకారణం నుండి కొన్ని కారణాలు విడిపోయాక​, ప్రతి ఒక్క కారణ శరీరానికి సూక్ష్మ, స్థూల శరీరాలు వచ్చి చేరితే మనము ఉన్నాము. జన్మముందా​? కర్మముందా​? అంటే ఈ విధముగా కర్మేముందు అవుతుంది.


పునర్జన్మలలో తిరిగేవారికైతే మరణానంతరము సూక్ష్మ శరీరము తన అధిష్ఠాన దేవతయైన పితృ దేవతలలోనికి లయమవుతుది. ఇంద్రియాలన్నీ వాటి అధిష్ఠాన దేవతలలో లయమవుతాయి. కారణ శరీరం అవ్యక్తంగా ఉంటుంది. పునర్జన్మలో​, స్థూల శరీరం పంచభూతాల పదార్థముగా తయారవుతుంది. గోళకాలు ఏర్పడగానే ఇంద్రియాలు​, వాటివాటి అధిష్ఠాన దేవతలనుండి వచ్చి ఆ గోళకాలలో చేరి ఉంటాయి. పితృ లోకమునుండి ప్రేతాత్మ అనబడేటటువంటి సూక్ష్మ శరీరం స్థూలంలోకి వచ్చి చేరుతుంది. కారణము సమయానుకూలముగా కార్యరూపములోకి వచ్చి అనుభవాలను కలుగచేస్తుంది.


       ముక్తి కోరువారు సూక్ష్మ శరీరమును భంగపరచాలని చూడక, ముందుగా కారణము శరీరమును సున్నా చేసే ప్రయత్నము చేయవలెను. ఈ రెండు శరీరాలు కూడా మొదట ఎక్కడనుండి ఉనికిలోకి వచ్చాయో, మళ్ళీ అక్కడికే వెళ్ళి లయం కావాలి. అప్పుడే ముక్తి.


       ముక్తి కోరేవారిలో సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమందు వాటియొక్క అధిష్ఠానములందు లయమవుతాయి. ఈ సూక్ష్మ కారణ శరీరాల అధిష్ఠానం ఎవరండి? ఎవరు వారు? పంచ అధిదేవతలు. సదాశివ ఈశ్వర బ్రహ్మ విష్ణు రుద్ర ప్రత్యగాత్మ ప్రకాశరూపముగా వున్న పంచబ్రహ్మలే పంచకర్తలు. ఈ సూక్ష్మ కారణ శరీరాలకే కాకుండా స్థూల శరీరము పంచీకరణము ద్వారా ఏర్పడటానికి కూడా శుక్లశోణితాలలో వున్నటువంటి జీన్స్‌ కూడా ఈ పంచ అధిదేవతలే. అధిదేవతలే అక్కడ జీన్స్‌ రూపంలో స్థూల శరీరోత్పత్తికి అక్కడికక్కడే కారణ భూతంగా వున్నారు. వాళ్ళు ఎక్కడో ఏదో లోకంలో వుండి సృష్టి చెయ్యడం లేదు. ఎక్కడ సృష్టి జరుగుతుందో అక్కడే ఆ  ప్రజాపతి బ్రహ్మ వున్నాడు.  సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమున వాటి అధిష్ఠాన దేవతలయందు లయింపచేయవలెను. పంచబ్రహ్మలయందు లయింపచేయాలి. అంటే అష్టప్రకృతులు లయంలో ఎక్కడిదాకా చెప్పాం. అవ్యక్తం దాకా చెప్పాం. అవ్యక్తంలో ఎవరున్నారు​? ఆ పంచబ్రహ్మలు వున్నారు. కనుక అష్ట ప్రకృతి లయము ద్వారా ఇంద్రియ లయము చేసుకొని అవ్యక్తములో వున్న పంచబ్రహ్మలలోకి సఛ్ఛిష్యునియొక్క సూక్ష్మ కారణ శరీరములు అక్కడ లయపరచుకోవాలి. అదే విదేహ ముక్తి. లేనిచో అన్యోన్యాశ్రయముగా సూక్ష్మము వుంటేనేమో కారణ ముంటుంది. కారణము వుండటంవల్ల సూక్ష్మము వుంటుంది. ఇద్దరూ కలిసే వుంటారు.


       ఈ కారణ శరీరము భ్రాంతిజమగుట వలన అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము చేత భ్రాంతి నశింపజేసెనేని భ్రాంతి వలన కలిగిన కారణ శరీరము నశించును. మొదట్లో మనకు ఎక్కడ భ్రాంతి ప్రారంభిస్తుందో అక్కడే సూక్ష్మ శరీర నిర్మాణం జరిగిపోయింది. ఒకే జన్మ ఒకే మరణం. వాడు ఎన్ని లక్షల జన్మలైనా ఎత్తనీ - పశుపక్ష్యాదులు​, క్రిమికీటకాదులు​, మానవ పునర్జన్మలు ఎన్నైనా పొందనీ సూక్ష్మ శరీరము కంటిన్యూ అవుతోంది. స్థూల శరీరాలే మారుతున్నాయి. స్థూల ఉపాధులు మారుతున్నాయి. సూక్ష్మ శరీరము సూక్ష్మ ఉపాధి అలాగే కొనసాగుతుంది. ఎప్పుడైతే విదేహ ముక్తుడయ్యాడో​, ఎప్పుడైతే వాసనా క్షయం అయిందో, ఎప్పుడైతే కారణ శరీరం సున్నా అయిందో, అప్పుడే లింగ శరీరం భంగమయింది. ఇది ఆ సూక్ష్మ శరీరం యొక్క మరణం. ఒకే జన్మ ఒకే మరణం అంటే ఎప్పుడు భ్రాంతి మొదలయిందో అది జన్మ. ఎప్పుడు భ్రాంతి రహితమయిందో అది మరణం.


       భ్రాంతి విడిచినప్పుడు​, సర్వము మిథ్య అని తోచును. భ్రాంతిలోనే అన్నీ వున్నాయి అని తోచును. భ్రాంతి పోతే ఏదీ లేదు, నువ్వూ లేవు.  నిజంగా నీవు కూడా లేవు. భ్రాంతి పోగానే అన్నీ పోయినాయి. లేనివే లేకుండా పోయినాయి. ముందుగా వున్నవాటికి లేవనే భావంతో మిథ్యగా చూశావు. తరువాత భ్రాంతి రహితం కాగానే మిథ్యగా చూడటం కూడా పోయి, అసలు అవి తోచుటయే లేవు. ఈ ఉపాధి కాని, నీవు కాని, నీ చుట్టూ వున్న దృశ్యమాన ప్రపంచం గాని ఏమీ తోచుట లేదు. ప్రపంచము, జీవోపాధులు మొదలే లేవు. వాటి వాసన లేదు, వాటి వృత్తీ లేదు, వాటి ఎరుకే లేదు. ఒకప్పుడు చూసి ఇప్పుడు చూడకపోతే వాటి జ్ఞాపకం వుంటుంది. అవి ఉన్నాయనే ఎరుక లేకుంటే, ఎలా జ్ఞాపకం ఉంటుంది? అందువలన వాసనలను, జ్ఞాపకాలను​, గుర్తులను​, వాటన్నింటికీ మూలమై ఎరుకను, ఎరిగే ఎరుకను లేకుండా చేసుకుంటే భ్రాంతి వదిలింది. అట్టితరి కర్మ వాసనలుండవు. మరియు జ్ఞానాజ్ఞానములుండవు. లింగ శరీరము భంగమై, ప్రకృతియందు లయమవుతుంది. అంటే విలయమవుతుంది. మాయ వలన వచ్చింది, కనుక, తిరిగి మాయలోనే విలీనమవుతుంది. కారణ మహాకారణాలు అవ్యక్తము లేక మూల ప్రకృతిలో లయం..


సహజత్వమే దివ్యత్వం!!


సృష్టిలో దాక్కుని ఏ ఒక్క రహస్యం లేదుగాక లేదు, వున్నదంతా సహజత్వమే,

కానీ ఒక్క మనిషి మాత్రమే తెలివి పేరు చెప్పుకుంటూ అహంకారంతో అసహజత్వం ముసుగుగా వేసుకున్నాడు కాబట్టి నిజంగా సహజంగా వున్న తత్త్వం రహస్యంగా కనిపిస్తుంది, రహస్యం సహజంగా కనిపించాలి అంటే మొదట మనషి తన సహజస్థిని తెలుసుకొని అందులో జీవించగలగాలి,

మనషి సహజస్థితి మానవత్వంతో మనిషిగా ఉండటం,

అలా మనిషిగా ఉంటే

తన సహజస్థితిలో ఉంటే అప్పుడు అతడు రహస్యం అనుకుంటున్న సహజత్వమైన దైవత్వస్థితిలోకి తనకు తెలీకుండానే వెళతాడు!!...