Translate

Wednesday, September 15, 2021

Understanding consciousness- చైతన్యాన్ని అర్థం చేసుకోవడం

 🌹🌹🌹జాగ్రత్త.. స్వప్న  సుషుప్తి🙏🌹🌹🌹


జాగృదావస్త కన్నా స్వప్నావస్త మిన్న, 

దానికి కన్నా సుషుప్తావస్థ ఇంకాస్త మిన్న, 

దానికన్నా తురియావస్త అద్భుతః. 

అన్నిటికన్నా తురియాతీతవస్త అత్యంత అద్భుతః. 


ఎందుకంటే ఇందులో పరమాత్మ ఉంటారు కనక. కానీ మన ఖర్మ ఏంటి అంటే,  

మన జీవితంలో అధిక భాగం జాగృదావస్త లో, ఆ తరువాత మిగిలినదానిలో ఆదిక శాతము స్వప్నావస్త లో ఉంటాము. 

సుషుప్తి అవస్థలో చాలా తక్కువగా ఉంటాము. తురియా అవస్థలో అస్సలు ఉండము. 


ఇంక తుర్యాతీత అవస్థ ఎక్కడనుండి వస్తుంది మనకి.

ఏమంటారు అంటే..ఏమనరు లెండి, ఏంటో వీడి గోల ప్రొద్దునే అనుకుంటారు.


ఇంతకీ అవస్తాపంచకం ఆంటే వివరంగా కావాలా? అవస్థాపంచకము


పరమేశ్వరిని స్తుతిచేసేటప్పుడు జాగ్రస్వప్న సుషుప్తి నాం సాక్షిభూత్ర్యైనమో నమః అన్నారు. అంటే జాగ్రస్వప్న సుషుమ్నలనబడే మూడు అవస్థలకు ఆ పరమేశ్వరి సాక్షి కాని

అవస్థలు ఐదు.

1. జాగ్రదవస్థ 

2. స్వప్నావస్థ 

3. సుషుప్తి 

4. తురీయావస్థ 

5. తురీయాతీతము

1. జాగ్రదవస్థ : ఇది మేలుకొని ఉన్నటువంటి స్థితి. ఈ స్థితి ననుభవించేది స్థూలదేహము. ఈ స్థితిలో ఉండే పురుషుణ్ణి వైశ్వానరుడు అంటారు. విశ్వములోని

నరులకందరికీ ప్రతీక అయినవాడు. భోగాలు అనుభవించటానికి ఈ దేహమే ఆధారము. జీవి ఈ శరీరంతోనే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. స్థూలశరీరం ఎప్పుడూ జాగ్రదావస్థలోనే అనుభవం పొందుతుంది. అటువంటి స్థూలదేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. జాగ్రదావస్థ ఇతని సంచారస్థానము. ఇతడికి ఏడు అంగములు, పంథానిమిదినోళ్ళు ఉంటాయని

మాండూక్యోపనిషత్తు చెబుతోంది.


సప్తాంగాలు 

1. స్వరము - శిరస్సు

2. సూర్యుడు _ కన్ను

3. వాయువు - ప్రాణం

4, ఆకాశం - శరీరం

5. జలం - మూత్రస్థానం

6. భూమి పాదాలు

7.ఆహవనీయాగ్ని = నోరు


ఇతనికి ముఖాలు పంథొనిమిది. ఇక్కడ ముఖము అంటే శిరస్సు కాదు. అనుభవించే సాధనం అవి.


జ్ఞానేంద్రియాలు - 5

కర్మేంద్రియాలు - 5

ప్రాణాలు - 5

అంతఃకరణచతుష్టయం  -4

(మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము) 19


 

2. స్వప్నావస్థ : ఆత్మ యొక్క రెండవపాదం తైజసుడు. స్వప్నావస్థ ఇతని సంచారస్థానము. స్వప్నంలో ఇంద్రియాలన్నీ మనసులో లయం అయిపోతాయి. అప్పుడు మనసు అనేక విషయాలను అనుభవిస్తుంది. స్వప్నంలో లేనివన్నీ తనకుతానే సృష్టించుకుని

తనవితీరా అనుభవిస్తుంది.


స్వప్నం చూసే వాడికి అది నిజంగా జరుగుతోంది అనిపిస్తుంది. రకరకాల వస్తు సముదాయాన్ని పొందుతాడు. ఎనలేని ఆనందం అనుభవిస్తాడు. కొన్నిసార్లు భయపడతాడు. దుఃఖిస్తాడు. ఈ రకంగా జాగ్రదావస్థలో కలిగే అనుభవాలన్నీ స్వప్నావస్థలో కలుగుతాయి. ఇక్కడ తైజసుడు సూక్ష్మశరీరుడు. ఇతడికి కూడా వైశ్వానరుడుకి మల్లేనే ఏడు అంగాలు,

పంధొనిమిది ముఖాలు ఉన్నాయి.


౩. సుషుప్తి: నిద్రించినపుడు ఏ కోరికలులేని స్థితి. గాఢనిద్ర ఇక్కడ సంచారం చేసేవాడు ప్రాజ్ఞుడు. ఇక్కడ అనుభవాలన్నీ ఏకమైపోతాయి. అంటే జాగ్రస్వప్నవస్థలలోని అనుభవాలన్నీ కరిగిపోతాయి. అంతేగాని నశించవు. ఆ అనుభవాలకు ప్రత్యేకత ఏమీలేదు. చేతనాశక్తి - అంటే గ్రహణశక్తి అస్పష్టంగా నిలిచిపోతుంది. గతించిన అనుభవాలు ఎక్కడో లోపల నిలిచిపోతాయి. అసలు అతను బ్రతికి ఉన్నాడా ? లేదా ? అనిపిస్తుంది. ఆ స్థితిలో ఆనందమయుడై ఆనందం అనుభవిస్తాడు. ఈ ఆనందం స్తబ్దమైనది. తమోగుణ ప్రధానమైనది. ఈ ఆనందంలో 

1. అజ్ఞానము 

2. అహంభావము 

3. సుఖము ఉంటాయి.

ఈ ఆనందము, బ్రహ్మానందము ఒకటి కాదు.


4. తురీయావస్థ : యోగసాధనలో కుండలినీ శక్తిని సహస్రారానికి చేర్చిన అవస్థ. ఇక్కడ మనసు కూడా పనిచెయ్యదు. ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైనది.


5. తురీయాతీతము : ఈ నాలుగు స్థితులకు అతీతమైనది. సాధకుడు తురీయాన్ని దాటితే అన్నింటినీ వదలివేస్తాడు. ఇది వ్యష్టి సమిష్ట్యాత్మకమైన స్థితి. ఈ స్థితి పొందినవాడు సాక్షాత్తూ పరమేశ్వరుడు. ఇక్కడ అన్ని కాలములయందు ఆనందమే ఉంటుంది.


ఈ అవస్థలలో ఆ పరమేశ్వరి సాక్షీభూతమై ఉంటుంది. అంటూ 256 నామం దగ్గరనుంచి 268 నామం దాకా అవస్థా పంచకాన్ని వివరిస్తున్నారు.


 విశ్వరూపా


సృష్టి ఏరకంగా జరిగిందో ముందు చూద్దాం. సృష్టి క్రమంలో ముందుగా ఆవిర్భవించింది తమస్సు. ఆ తరువాత మహసృష్టి జరిగింది. ఆ తరువాతనే అహంకారము వచ్చింది. దాని నుండి పరంచతన్మాత్రలు వచ్చినాయి. అవే శబ్దస్పర్శరూప రసగంధాలు.


ఇవి సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిలో ఐదు జ్ఞానశక్తులు, ఐదుక్రియాశక్తులు ఉన్నాయి. వీటిలో ఉన్న జ్ఞానశక్తులు జ్ఞానేంద్రియాలను ఏర్పరుస్తున్నాయి. అవి


శబ్దము - చెవి

స్పర్శ - చర్మము

రూపము - కన్ను

రసము - నాలుక

గంధము - నాసిక


సమిష్టిగా అంతఃకరణ ఏర్పడుతున్నది. ఆ తరువాత క్రియాశక్తులవల్ల కర్మేంద్రియాలు ఆవిర్భవిస్తున్నాయి. ఇవి సమిష్టిగా ప్రాణాలను పుట్టిస్తున్నాయి. తన్మాత్రలు పంచభూతాలను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు పంచభూతాలు, తన్మాత్రలు, కారణ ఉపాధులతో కూడిన చైతన్యము క్రమంగా విశ్వతైజసప్రాజ్ఞ అనబడుతున్నది. వాటితో కూడిన సమిష్టితత్వము వైశ్వానర, హిరణ్యగర్భ ఈశ్వరులవుతున్నారు. అంతఃకరణకు కారణమైన పరమాత్మే హిరణ్యగర్భుడు.

ప్రాణాకారంతో కూడినవాడు సూత్రాత్మ. వేరుగాని, విడిపోనటువంటి ఈ రెండు కారణాలను అనుసరించి కూడినటువంటివాడు అంతరాత్మ అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ మూడు అంటే 1. పరమాత్మ 2. సూత్రాత్మ 2. అంతరాత్మలే బ్రహ్మ విష్ణు రుద్రులు. వ్యష్టిగా విశ్వతైజసప్రాజ్ఞులకు, సమిష్టిగా వైశ్వానర, హిరణ్యగర్భసూత్రాత్మలకు భేదము

ఉపనిషత్తులననుసరించి చెప్పబడింది. ఉపనిషణ్మతములో జీవాత్మ, వపరమాత్మలకు

ప్రత్యేకంగా ఐదువిభాగాలు ఏర్పడుతున్నాయి. అవి సృష్టి స్థితి లయ జీవాత్మ పరమాత్మలు. కొంతమంది ఈ జగత్తుకు మూడే కారణాలు అంటారు. అవే సృష్టి స్థితి లయాలు. వీరిద్దరికీ తేడా లేదు. ఎందుచేతనంటే స్థూలకారణాలు మూడు. కాగా సూక్ష్మకారణాలు

ఐదు. వీటన్నింటినీ మాండూక్యోపనిషత్తులో వివరించారు.


సర్వంహ్యేతద్‌ బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, సో౭ యమాత్మా చతుప్పాత్‌


ఈ చరాచరజగత్తంతా బ్రహ్మమయమే. ఆత్మ కూడా పరబ్రహ్మమే. ఆత్మకు నాలుగుపాదాలున్నాయి.


జాగరితస్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ వికోనవింశతి


ముఖః స్థూలభుగ్‌ వైశ్వానరః ప్రథమపాదః

 

విశ్వములోని జీవులన్నింటి స్వరూపుడు అయినవాడు వైశ్వానరుడు. జాగ్రదవస్థ ఇతని సంచారస్థానం. అలాగే రెండవవాడు తైజసుడు. స్వప్నమే ఇతని సంచారస్థానం.

మూడవవాడు ప్రాజ్ఞుడు. సుషుప్తి అవస్థ ఇతని సంచారస్థానము. ఈ రకంగా ఉపనిషత్తు చెబుతుంది.


సుషుప్తిలో ప్రాజ్ఞుడికి బ్రహ్మభావం కలుగుతుంది. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకు సుషుప్తిని గురించి వివరిస్తాడు.


కుమారా ! గాఢనిద్రలో ఉన్నప్పుడు అతడు సుషుప్తిలో ఉన్నాడు అంటారు. ఆ స్థితిలో జీవుడు పరమసత్తను పొందుతాడు. అంటే తన నిజస్వరూపాన్ని పొందుతాడు. తన ఆత్మను తాను పొందుతాడు. కాబట్టి అతన్ని గురించి చెప్పేటప్పుడు అతను నిద్రిస్తున్నాడు అంటారు.


అద్దంలో చూసినప్పుడు మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. కాని అద్దం తియ్యగానే అది మాయమైపోతుంది. మన నిజరూపం మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా సుషుప్తావస్తలో మనస్సు ఇంద్రియాలు పనిచెయ్యటం మానేస్తాయి. అప్పుడు

మిగిలేది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ నిజరూపంలో మిగులుతుంది. ప్రతిబింబంలాంటి జీవభావంపోయి ఆత్మభావం మిగులుతుంది. ఆ స్థితిలో ఆత్మను 'స్వపితి” అంటారు. తన ఆత్మ తనలోనే ఉన్నాడని, నిద్రిస్తున్నాడని అంటారు. ఇంద్రియాలన్నీ అలసట చెంది

ఒక్కొక్కటి మనసులో లీనమైపోతాయి. మనసు ప్రాణంలో లీనమైపోతుంది. అంటే సుషుప్తావస్తలో ప్రాణం ఒక్కటే మేల్కొని ఉంటుంది. ఆ ప్రాణమే ఇంద్రియాల యొక్క మనసు యొక్క అలసటను తీరుస్తుంది. మనసుకు బంధనస్థానమైన ప్రాణమే పరదేవత.


బృహదారణ్యకోపనిషత్తులో అజాతశత్రువు అనే రాజు బాలాకి అనే బ్రాహ్మణబాలుడికి సుషుప్తి గురించి వివరిస్తాడు.


సుషుప్తిలో జీవికి బ్రహ్మభావం కలుగుతుంది. అప్పుడు అతణ్ణి ప్రాజ్ఞుడు అంటారు. కాని జీవుడు అవిద్యతో కలిసి ఉంటాడు. అందుచేత అతడు పరమాత్మకాడు. అందుకని సుషుప్తి పొందిన జీవుణ్ణి కారణశరీరమని, తురీయావస్థ పొందిన జీవుణ్ణి మహాకారణ శరీరము అని అంటారు. తురీయావస్థ పైన ఉండేది తురీయాతీతము. ఇది ఐదవ అవస్థ. ఈ స్థితిలో జీవి శివతుల్యుడు అవుతాడు. ముండకోపనిషత్తులో “నిరంజనుడు

అంతకన్న పరమసామ్యము పొందుతాడు” అని చెబుతోంది. పరమసామ్యము అంటే - ఐక్యము. ఈ స్థితిలో పూర్ణజీవత్వము పూర్ణశివత్వాలు వేరుగా లేవు.

 

ఐదువిధాలయిన జీవోపాధులు పంచకోశాలుగా వ్యవహరించబడుతున్నాయి. పరమాత్మకు తిరోధానము అనుగ్రహము అనబడే బంధమోక్షాలు ఉపాధులు కావటం చేత బహిరున్మేషుడు (ప్రత్యక్షము అయ్యేవాడు - శివుడు) అవుతున్నాడు. సదాశివుడు నిమేషాంతుడు. అంటే - కొంత ప్రత్యక్షము, కొంత అప్రత్యక్షము. కాబట్టి తిరోదాన అనుగ్రహముల స్థితులు రుద్రుని కన్న వేరైనవి.


విశ్వ అంటే - జాగరిదావస్థ. స్థూలరూపం గల చైతన్యము గల జీవులు. ఆ జీవుల సమష్టిరూపమే వైశ్వానరుడు.


పరమేశ్వరి ధర్మాధర్మవివర్జితా అని చెప్పబడింది. కాబట్టి జగత్తుకు, దేవికి భేదం లేదు. అందుచేత పరమేశ్వరి రూపము విశ్వరూపము అవుతున్నది. ఈ విశ్వానికి ఆధారము ఆ దేవి. అందుచేత ధర్మిభూతమైన ఇంకొక శరీరము ఆమెకు లేదు.


విష్ణుపురాణంలో “అరటిచెట్టు ఆకులకన్న వేరుగా కనిపించినట్లుగానే, ఓ పరమేశ్వరీ! ఈ విశ్వమంతా నీ యందే ఉన్నది. విశ్వము నీకన్నవేరైనదికాదు” అని చెప్పబడింది. దేవీభాగవతంలో ఆ పరమేశ్వరి శ్రీ మహావిష్ణువుతో “ఈ సమస్తమునేనే. నాకన్న

సనాతనమైనది వేరేలేదు” అంటుంది.


విశ్వరూపము అని గ్రహించిన బ్రహ్మ యొక్క జీవభావము మిక్కిలి నీచ రూపము. అటువంటి నీచ రూపము ఎవరి మహిమవల్ల నాశనమవుతుందో ఆమె విశ్వరూప. ఆమె అనుగ్రహము వలననే నీచమైన సేవ వంటి అనుగ్రహము లభించును.


ఆ పరమేశ్వరి పదహారు కళల స్వరూపము. దర్శ నుండి పూర్ణిమ వరకు 15 కళలు కాగా 16వ కళ సచ్చిదానందరూపిణి అయి ఉన్నది. తిథేలే నిత్యాదేవతలు. నిత్యలే కళలు. ఈ నిత్యాదేవతలను 15వ నామం “అష్టమీచంద్రభిభ్రాజదలిక స్థలశోభితా”లో

వివరించటం జరిగింది. ఈ 15 తిథుల స్వరూవమే శ్రీవిద్య. 16వ కళయే మహాత్రిపురసుందరి. ఈ రకంగా తిథులే పంచదశీమంత్రము అని చెప్పటంవల్ల తిథులు,

పంచదశిమంత్రము, చంద్రమండలము, ఆ పరమేశ్వరి అంతా ఒకటే అవుతున్నారు. అందుకే ఆమె విశ్వరూపా.


తైత్తిరీయ బ్రాహ్మణంలో శుక్లపక్ష కృష్ణపక్ష తిథులను వివరించటం జరిగింది.


వీటిలో మళ్ళీ పగటి తిథులు వేరు రాత్రి తిథులు వేరు. ఆ వివరాలను ఇక్కడ ఇవ్వటం జరుగుతోంది. శుక్లపక్షపగటి పేర్లు.

 


సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతాత్‌

సంకల్పమానం ప్రసంకల్ప మానం ఉపకల్పమానము పక్షప్తం

క్షప్తం శ్రేయోవశీయ ఆయస్సంభూతం భూతం.


శుక్లపక్షరాత్రుల పేర్లు


దర్శాదృష్టా దర్శితా విశ్వరూపా సుదర్శనా


ఆప్యాయమానా ప్యాయమానా ప్యాయా సూనృతా ఇరా

అపూర్వమాణా పూర్వమాణా పూరయంతీ పూర్ణాపూర్ణమాసి


 

సంఖ్య తిది నిత్యతిది పగటి తిధి రాత్రి తిధి


1. పాడ్యమి కామేశ్వరి సంజ్ఞానం దర్శ


2. విదియ భగమాలిని విజ్ఞానం దృష్టా


3. తదియ నిత్యక్లిన్నా ప్రజ్ఞానం దర్శతా


4.చవితి భేరుండా జానత్‌ విశ్వరూపా


5. పంచమి వహ్నివాసిని అభిజానత్‌ సుదర్శనా


6. షష్టి మహావజ్రేశ్వరి సంకల్పమానం ఆప్యాయమానా


7. సప్తమి శివదూతి ప్రకల్పమానం ఆప్యాయమానా


8. అష్టమి త్వరిత ఉపకల్పమానం ఆప్యాయా


9. నవమి కులసుందరి ఉపక్షప్తం సూనృతా


10. దశమి నిత్యా క్షప్తం ఇరా


11. ఏకాదశి నీలపతాక శ్రేయః అపూర్వమాణా


12. ద్వాదశి విజయా వశీయః పూర్వమాణా

13. త్రయోదశి | సర్వమంగళా | ఆయత్‌ పూరయంతే


14. చతుర్దశి జ్వాలామాలిని | సంభూతం పూర్ణా


15. పూర్ణిమ చిత్రా భూతం పూర్ణమాసీ


కృష్ణ పక్ష పగటి తిధులు పట్టిక లో చూడండి


ప్రష్టుతం విష్ణుతగిం సంస్తుతం కల్యాణం విశ్వరూపం

శుక్ర మమృతం తేజస్వి తేజ స్సమిద్ధం

అరుణం భాను త్మరీచీ మదభితపస్తపస్విదితి


  


పంచదశీ మహామంత్రము మూడుఖండములు గల మంత్రము మొదటిఖండంలో 5, రెండవఖండంలో 6, మూడవఖండంలో 4 బీజాక్షరాలుంటాయి. తిథులను కూడా మూడుభాగాలుగా చేయటం జరిగింది.


మొదటి భాగంలో 5, రెండవభాగంలో దశమి, ఏకాదశి రెండూ ఒకటిగానే పరిగణస్తారు కాబట్టి 6. మూడవభాగంలో ద్వాదశి నుంచి 4 తిథులుంటాయి. అయితే

 

ఇంకొక మతం ప్రకారము మూడు ఖండాలలోను ఐదు చొప్పున 15 తిథులు ఉంటాయి. ఈ తిథులే పంచదశి మంత్రంలోని బీజాక్షరాలు.


ఈ రకంగాచూస్తే శుక్లపక్షపు నాల్గవనాటిరాత్రి పేరు విశ్వరూపా. ఇది వాగ్భావకూటమిలోని నాల్గవఅక్షరము, పరమేశ్వరిని విశ్వరూపా అనటం ఈ రాత్రిపేరున చెప్పటముకాక వేరుకాదు.


దేవీభాగవతంలోని సప్తమస్కంధంలోని 81వ అధ్యాయంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా ఆ పరమేశ్వరిని ప్రార్ధిస్తారు. అప్పుడు ఆమె వారికి సాక్షాత్కరించింది. హిమవంతుడు. “తల్లీ ! నీ విశ్వరూపం చూడాలని కోరికగా ఉన్నది. దేవతలంతా కూడా ఇదే కోరుతున్నారు. ఒకసారి మాకు చూపవలసినది. అని అడుగుతాడు. అప్పుడు ఆ

పరమేశ్వరి తన విరాడ్రూపం వారికి చూపింది.


ద్యౌ ర్మస్తకం భవే ద్యస్య చంద్రసూర్యౌ చ చక్షుషీ


దిశః శ్రోత్రో వచో వేదాః ప్రాణోవాయుః ప్రకీర్తితాః


విశ్వం హృదయమిత్యాహుః పృథివీజఘనం స్మృతమ్‌ 1


నభస్తలం నాభిసరో జ్యోతిశ్చక్ర మురః స్థలమ్‌


మహర్లోకస్తు (గ్రీవాస్యా జ్ఞనోలోకో ముఖంస్కృతమ్‌ ॥


తపోలోకో లలాటస్తు సత్యలోకాదధః స్థితః


ఇంద్రాదయో బాహవః స్యు శబ్ధః శోత్రం మహేశితుః ॥


నాసత్య దస్రా నాసేస్తో గంధో ఘ్రాణం స్మృతోబుదైః


ముఖమగ్నిః సమాఖ్యాతో దివారాత్రీ చ పక్ష్మణీ ॥


బ్రహ్మస్థానం భ్రూవిజృంభోల ప్యాపస్తాలుః ప్రకీర్తితా


రసోజిహ్వాసమాఖ్యాతా యమోదంప్రాః ప్రకీర్తితా ॥


దంతాః స్నేహకలా యస్య హాసోమాయా ప్రకీర్తితా


సర్గ స్త్వపాంగమోక్షః స్యాద్రీడోర్ట్వోష్థా మబేశితుః ॥


లోభః స్యాదధరోష్టోల_ స్యా ధర్మమార్గ స్తు పృష్టభూః


ప్రజాపతి శ్చ మేడ్రం స్యాదః స్రష్టా జగతీతలే ॥


కుక్షిః సముద్రా గిరయోల_ స్టీని దేవ్యా మహేశితుః

నద్యోనాడ్యః సమాఖ్యాతా వృక్షౌః కేశాః ప్రకీర్తితాః ॥


అంటూ దేవి విశ్వరూపాన్ని వర్ణిస్తారు.

 

 

అనేక బాహువులు, వేలతలలు, నానారకాల ఆయుధాలు ధరించి కోట్లకొలది సూర్యులకాంతితో ప్రకాశిస్తున్నది ఆ పరమేశ్వరి.


శ్రీమద్భాగవతంలోకూడా శ్రీ మహా విష్ణువును ఈ రకంగానే వర్ణించటం జరిగింది.


బ్రహ్మావాచ

వాచాం వషే ర్ముఖం క్షేత్రం ఛందసాం సప్తధాతవః !

హవ్యకవ్యామృతాన్నానాంజిహ్వా సర్వరసస్య చ ॥

సర్వాసూనాంచ వాయోశ్చ తన్నాసే పరమాయనే ॥

అశ్వినోరోషధీనాంచ కఘ్రాణోమోద ప్రమోదయోః ॥

రూపాణాం తేజసాం చక్షుర్దివః సూర్యస్య చాక్షిణీ |

కర్ణౌదిశాంచతీర్థానాం శ్రోత్రమాకాశ శబ్దయోః ॥

తద్గాత్రం వస్తు సారాణాం సౌభగ్యస్య చ భాజనం ॥

త్వగస్య స్పర్శవాయోశ్చ సర్వమేధస్య చైవ హి!

రోమాణ్యు ద్భి జ్ఞజాతీనాం యైర్వాయజ్ఞస్తు సంభృతః ॥

కేశ శ్మశ్రు నఖాన్యస్య శిలా లోహాథ్రవిద్యుతామ్‌ ।

బాహవో లోకపాలానాం ప్రాయశః క్షేమకర్మణాం ॥

విక్రమో భూర్భువః స్వశ్చక్షేమస్య శరణస్య చ।

సర్వకామ వరస్యాపి హరేశ్చరణ ఆస్పదమ్‌ ॥

అపాం వీర్యస్య సర్గస్య పర్జన్యస్య ప్రజాపతేః ।

పుంసః శిశ్చ ఉపస్థస్తు ప్రజాత్వానంద నిర్వృతేః 1

పాయుర్యమస్య మిత్రస్య పరిమోక్షస్య నారద ।

హింసాయా నిర్రుతేర్మ ఛఎత్యోర్నిరయస్య గుదః స్మృతః ॥

పరాభూతేరధర్మస్య తమసశ్చాపి పశ్చిమః ।

నాడ్యోనదనదీనాం తు గోత్రాణామాస్థి సంహతిః ॥

అవ్యక్త రస సింధూనాం భూతానాం నిధనస్యచ ।

ఉదరం విదితం పుంసో హృదయం మనసః పదమ్‌ ॥

ధర్మస్య మమ తుభ్యం చ కుమారాణాం భవస్యచ ।

విజ్ఞానస్యచ సత్త్వస్య పరస్యాత్మా పరాయణమ్‌ ॥

అహం భవాన్‌ భవశ్చెవ త ఇమే మునయోల గ్రజాః !

సురాసురనరా నాగాః ఖగా మృగ సరీసృపాః ॥

 

గంధర్వాప్సరసో యక్షా రక్షోభూతగణోరగాః ।


పశవః పితరః సిద్ధా విద్యాథ్రా శ్చారణా ద్రుమాః ॥


అన్యేచ వివిధా జీవా జలస్థలనభౌకసః ॥


గ్రహరకేతవస్తారా స్తడితః స్తనయిత్చవః ॥


సర్వం పురుష ఏ వేదం భూతం భవ్యం భవశ్చయత్‌ ।

తేవేదమావృతం విశ్వం వితస్తిమధి తిష్టతి ॥


స్వధిష్ట్యం ప్రతపన్‌ ప్రాణో బహిశ్చ ప్రతపత్యసౌ


ఏవం విరాజం ప్రతపంస్తపత్యన్తర్భహిః పుమాన్‌ ॥


సోల మృ తస్యాభ యస్యే శో మర్త్యమన్నం యదత్యగాత్‌ ।

మహిమైష తతోబ్రహ్మన్‌ పురుషస్య దురత్యయః ॥


పాదేషు సర్వభూతాని పుంసః స్థితిపదోవిదుః ॥


అమృతం క్షేమమభయం త్రిమూర్శోోలి. ధాయి మూర్ధసు 

పాదాస్త్రయో బహిశ్చాసన్న ప్రజానాం య ఆశ్రమాః ।


అంత స్రిలోక్యాస్త్వ స్త౧పరో గృహమేధోవ ౨ బృహద్ర్వతః (

సృతీ విచక్రమే విప్ప్వజ సాశనానశనే ఉభౌ ।


యదవిద్యా చ విద్యాచ పురుష స్తూభయాశ్రయః ॥

యస్మాదండం విరాడ్‌ జజ్లే భూతేంద్రియ గుణాత్మకః ।

తద్‌ ద్రవ్యమత్యగాద్‌ విశ్వం గోభిః సూర్యయివాతపన్‌ ॥

 

 నీలకంధరునకు, నీకు నాకు సనత్కు

మారముఖ్య సుతసమాజమునకు

ధర్మసత్వబుద్ధి తత్త్వములకు నీశ్వ

రాత్మవినుము పరమమైన నెలవు ॥


నరసురాసుర పితృనాగకుంజర మృగ, గంధర్వ యక్షరాక్షస మహీజ

సిద్ధ విద్యాధర జీమూతచారణ గ్రహ తారకాప్సరోగణ విహంగ

భూతతటిద్వసు పుంజంబులును, నీవు ముక్కుంటియును, మహామునులు, 

సలిలనభస్థ్థలచరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల

విష్ణుమూర్తిమయము పుత్ర | వేయేల, బ్రహ్మాండ


మతని జేనలోన నడగియుండు

బుద్ధినెరుగరాదు; భూతభవద్భవ్య

లోకమెల్ల విష్ణులోన నుండు ॥

మండలములోన భాస్కరుం 

డుండి జంగబులకు దీప్తి నొసంగెడి క్రియ బ్ర

హ్యాండములోపల నచ్యుతుం

డుండుచు బహిరంతరముల నొగి వెలింగించున్‌

 

భగవద్గీతలోని 11వ అధ్యాయంలో 15 నుంచి 28 వరకు శ్లోకాలలో శ్రీకృష్ణుని


విశ్వరూపాన్ని వర్ణించాడు అర్జునుడు.


పశ్యామి దేవాన్‌ తవ దేవ ! దేహే

సర్వాన్‌ తథా భూతవిశేష సంఘాన్‌ ।

బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం

బుషీన్‌ చ సర్వానురగాన్‌ చ దివ్యాన్‌ 11


శ్రీకృష్ణా ! నీ శరీరమునందు సకల దేవతలను, సమస్త ప్రాణి సమూహములను,


చతుర్ముఖ బ్రహ్మను, బ్రహ్మ ఆజ్ఞానువర్తియగు రుద్రుని, సకల బుషిపుంగవులను, ప్రకాశించు వాసుకి మొదలగు సర్పరాజములను చూచుచున్నాను.


అనేక బాహూదర వక్రనేత్రం

పశ్యామిత్వాం సర్వతోల_ నంతరూపం ।

నాంతం న మధ్యం న పునస్తవాదిం

పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ! ॥


ప్రపంచమునకు నాథుడవగు ఓ విశ్వరూపధరా ! నిన్ననేక భుజములు, కడుపులు, ముఖములు, కన్నులు కలిగి ఇంతింతనరాని యాకారములు కలవానినిగా నంతటను చూచుచున్నాను. పైగా నీయాది మధ్యాంతములు నాకు గోచరించుటలేదు.


కిరీటినం గదినం చక్రిణం చ

తేజోరాశిం సర్వతో దీప్తిమంతం ॥

పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్‌

దీప్తానలార్మద్యుతిం అప్రమేయమ్‌ ॥


కాంతిపుంజమై యంతటను నిండిన కాంతివలన చూడశక్యముగాక మండుచున్న నిప్పు, సూర్యుల కాంతివంటి కాంతి గలిగి యముంతయని హద్దుగా చెప్పదగని నిన్ను కిరీటాది భూషణములను చక్రగదాద్యాయుధములను ధరించియున్నట్లు దర్శించుచున్నాను.


త్వమక్షరం పరమం వేదితవ్యం

త్వమస్య విశ్వస్య పరం నిధానం !

త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా

సనాతనస్త్వం పురుషో మతో మే ॥

 

ముండకాది ఉపనిషత్తులలో తెలియదగినదిగా నిర్దేశింపబడిన పరమైన అక్షరము

నీవే. ఈ జగత్తునకు సర్వోత్కృష్టమైన ఆధారము నీవే, స్వరూపాదుల యందెల్లప్పుడు

నొక్క రూపముతో నుండువాడవు నీవే. నిత్యమైన ధర్మములను కాపాడువాడవు నీవే,

పురాణపురుషుడవు నీవే యని నాకిప్పుడు తెలిసినది.


అనాది మధ్యాంతం అనంతవీర్యం

అనంతబాహుం శశిసూర్యనేత్రం ॥

పశ్యామి త్వాం దీప్రహుతాశవక్రం

స్వతేజసా విశ్వమిదం తపంతమ్‌ ॥


ఆది మధ్యాంతములు లేనట్టియు, అపరిమిత పరాక్రమము కలిగి యునృట్టియు,

లెక్కలేనన్ని చేతులు కలిగియున్చట్టియు, చంద్రునివలె చల్లగను, సూర్యునివలె తీవ్రముగా

నుండు కండ్లు కలిగినట్టియు, కాలాగ్సివలె మండుచున్న ముఖము కలిగినట్టి నీ తేజస్సుచేత

ఈ ప్రపంచమును తపింపజేయుచున్న నిన్ను జూచుచున్నాను.ద్యావాపృథివ్యోః ఇదమంతరం హి


వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |

దృష్ట్వా ద్భుతం రూపముగ్రం తవేదం

లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్‌ ! ॥

భూమి ఆకాశముల మధ్యభాగమంతయును అన్ని దిక్కులను నీవే వ్యాపించి

యున్నావు. మహాత్మా! బ్రహ్మాది దేవతావర్ణములో అనుకూలురు - ప్రతికూలురు మధ్యస్థులు

అనెడు మూడు విధముల వారును అత్యద్భుతమై అతి భయంకరమైయుండు నీ రూపమును

జూచి భయపడుచున్నారు. (అర్జునునకు తన ఐశ్వర్యమును జూపుటకై భగవానుడు

వీరందరికిని దివ్యదృష్టి నొసంగెను.)


అమీ హిత్వాం సురసంఘా విశంతి

కేచిత్‌ భీతాః ప్రాంజలయో గృణంతి ॥

స్వస్తీ త్యుక్వా మహర్షి సిద్ధసంఘాః

స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ॥

 ఈ గొప్ప దేవతా సమూహము నీ సమీపమునకు వచ్చుచున్నది. కొందరు భయపడి చేతులు జోడించి స్తోత్రము చేయుచున్నారు. భృగువు మొదలగు మహర్షులు, సనకాది సిద్ధులును నీకు మంగళాశాసనమును గావించి నీకు తగిన సంపూర్ణస్తోత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.


రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః

విశ్వేల శ్వినౌ మరుతశ్చ ఊప్మపాశ్చ ॥

గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః

వీక్షంతే త్వాం విస్మితాశ్రైవ సర్వే 1!


ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సకల సాధ్యులును,

విశ్వేదేవతలును, ఇద్దరశ్వినీదేవతలును, సప్తమరుత్తులును, పితృదేవతలును, గంధర్వ యక్ష

రాక్షస సిద్ధసమూహములున్ను, అందరును ఆశ్చర్యమును పొంది నిన్ను చూచుచున్నారు.


రూపం మహత్తే బహువక్రనేత్రం

మహాబాహో ! బహుబాహూరుపాదం ॥

బహూదరం బహుదం ప్రాకరాళం

దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాల హమ్‌ ॥॥


శ్రీకృష్ణా ! అనేక ముఖములను, లెఖ్ఖలేని కన్నులును పరిమితిలేని భుజములును, పెక్కుతొడలును, బహుపాదములును, అనేకములగు కడుపులును, పెక్కు కోరలచేత అతిభయంకరమగు నీ యిట్టి గొప్ప ఆకారమును జూచి జనులందరును అతిభయముతో

వణుకుచున్నారు, అట్లే నేనును భయపడుచున్నాను.


వేదంలోని పురుషసూక్తంలో


సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌ .....

పద్భ్యాంభూమిః దిశశ్రోత్రాత్‌ తథా లోకాగ్‌ం అకల్పయన్‌ అని చెప్పబడింది.

ఈ రకంగా విశ్వమంతా ఆమెలో నిండి ఉన్నది కాబట్టే విశ్వరూపా అనబడింది.

అలాగే “విశ్వరూపం” అనేది కృష్ణపక్షంలో పంచపమితిథి పగటిపేరు. అంటే తిధులస్వరూపం గలది ఆ దేవి. ఈ రకంగా కృష్ణపక్షంలో పగటితిథులు, రాత్రి తిథులు

కూడా ఆ దేవతాస్వరూపమే. 


సమయ మతస్తులు శుక్లపక్ష రాత్రులందు చివరిభాగంలో మాత్రమే ఉపాసన చేస్తారు గౌడపాదులవారు తమ సుభగోదయస్తుతిలోని 31వ శ్లోకంలో

అతః శుక్లేపక్షే ప్రతిదిన మిహ త్వాం భగవతీం

నిశాయాంసేవంతే నిశి చరమభాగే సమయినః

అన్నారు. శుక్లపక్షరాత్రులందు మాత్రమే కుండలినీ ప్రబోధం జరుగుతుంది.


శంకరభగవత్పాదులవారు కూడా తమ సౌందర్య లహరిలోని 87వ శ్లోకంలో ఇ మాటను చెప్పారు.

హిమానీ హన్తవ్యం హిమగిరి నివాసైక చతురౌ

నిశాయాం నిద్రాణాం నిశి చరమభాగే చ విశదౌ


కాబట్టి శుక్లపక్ష తిథులన్నీ పరమేశ్వరి స్వరూపమే. ఈ రకంగా తిథులు, కాలమానమ అంతా పరమేశ్వరి స్వరూపమే కాబట్టి ఆ దేవిని “విశ్వరూపా” అన్నారు.


శుక్లపక్షరాత్రులు మధుకృతులు. పగళ్ళు మధువృషులు అని వేదం చెబుతోందిఈ విషయాన్ని తెలుసుకున్నవాడి శరీరంలో 'బ్రహ్మరంధ్రము నుంచి మధువు వర్శిస్తుంది

అతనికి ఇష్టా పూర్తి కలిగిస్తుంది. ఈ విషయం తెలియని వాడికి మధువు స్రవించదు అతని కర్మలు సఫలంకావు.


విశ్వము అంటే ప్రపంచం. పరమేశ్వరి ప్రపంచమంతా ఆవరించి ఉన్నది కాబట్టి విశ్వరూపా అనబడుతోంది.


బ్రహ్మాండము-విరాడ్రూపము. పిండాండము-జీవుని శరీరము. ఈ రెండింటికీ తేడా ఏమీలేదు. ఇక్కడ విశ్వరూపా అంటే పరమేశ్వరికి ఈ జగత్తుకూ భేదము లేదని భావము


ఈ కారణాలచేత పరమేశ్వరి విశ్వరూపా అనబడుతోంది.


 జాగరిణీ


జాగ్రదవస్థ అందరికీ ప్రసిద్ధమైనది. సర్వేంద్రియ గోచరమైనది. ప్రభోధాత్మకమైన సర్వేంద్రియజ్ఞానము గల విశ్వుడు అనే జీవుని అవస్థ జాగరము. అటువంటి జాగ్రదావస్థ గలది ఆ పరమేశ్వరి.

 జాగ్రదవస్థలో స్థూలశరీరాభిమాని అయిన దేవి విశ్వునిరూపంలో ఉంటుంది. అందుచేత జాగరిణీ అనబడుతోంది. మాండూక్యోపనిషత్తులో

సోయమాత్మాచతుప్పాత్‌ ఆత్మకు నాలుగుపాదాలు ఉన్నాయి. అందులో మొదటిది

జాగరితస్థానో బహిః  ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి

ముఖః ! స్థూల భుగ్‌ వైశ్వానరో ప్రథమపాదః ॥

ఆత్మ యొక్క మొదటిపాదం వైశ్వానరుడు. ఇతడు విశ్వంలోని నరులందరికీ ప్రతినిధి. స్థూల శరీరమున్నవారందరికీ ప్రతినిధి. భోగాలు అనుభవించటానికి ఈ దేహమే ఆధారం. జీవి ఈ శరీరంతోనే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు.


గృహస్తుకు గృహంలాగా జీవికి దేహం ఆధారమై ఉన్నది. జగత్తులో ఇటువంటి దేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. జాగ్రదవస్థ ఇతని సంచారస్థానము. ఆ రూపంలో ఉన్నది కాబట్టే పరమేశ్వరి జాగరిణీ అనబడుతోంది.


స్వపంతీ


నిద్రావస్థాయామంతః ప్రజ్ఞామాత్రేణ ప్రపంచానుభవో వాసనారూపేణ సః స్వప్నః


నిద్రావస్థయందలి మానసికమగు ప్రపంచానుభవము స్వప్నము అని తెలియబడును. స్వప్నమనేది సూక్ష్మశరీర సంబంధమైన వ్యవహారము. జాగ్రదవస్థలో ప్రపంచానుభవాలన్నీ బీజం రూపంలో ఉండి, స్వప్నకాలంలో మనసుకు కనిపిస్తాయి. ఇవి అన్నీ ఈ జన్మలోని అనుబంధాలే అవనవసరంలేదు. ఆ అనుభూతులు గతజన్మలకు సంబంధించినవి కూడా

కావచ్చు. ఈ దశలో శరీరంలోని ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. మనస్సు మేల్కొని ఉంటుంది. ఈ మనస్సే ఇంద్రియధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది.

జాగ్రదవస్థలో ఇంద్రియజ్ఞానము స్థిరము. స్వప్నావస్థలో ఇంద్రియజ్ఞానము స్థిరము కాదు. మనసే ఇంద్రియాల పనులన్నీ చేస్తుంటుంది. స్వప్నమనేది కేవలము మానసిక సంబంధము. నిద్రాసమయంలో విషయాలు తెలుస్తాయి. మెలకువరాగానే అవన్నీ

మాయమవుతాయి. ఈ రకంగా సూక్ష్మశరీరంతో మానవుడు పొందే అనుభూతికి ఆ పరమేశ్వరియే సాక్షీభూతంగా ఉన్నది. అందుకే ఆమె స్వపంతీ అనబడుతుంది.

 

 తైజసాత్మికా

స్వప్నస్థానము పొందిన సూక్ష్మదేహాభిమాని అయిన జీవుల సమిష్టిరూపుడైన తైజసుడను హిరణ్యగర్భుని యొక్క ఆత్మ గలది.


స్వప్నము సూక్ష్మదేహము యొక్క వ్యవహారము. ఈ స్థితిలో వ్యష్టిదేహాభిమాని తైజసుడు. సమిష్టిగా అతడు హిరణ్యగర్భుడు. సూక్ష్మదేహంతో చేసే కర్మలన్నింటికీ సాక్షి ఆ పరమేశ్వరి. ఆమె తైజసుని రూపంలో ఉంటుంది. కాబట్టి తైజసాత్మికా అనబడుతున్నది.

మాండుక్యోపనిషత్తులో స్వప్నస్థానాన్ని వివరిస్తూ


స్వప్నస్థానోల. ౦తః ప్రజ్ఞః ! సప్తాంగ ఏకోనవింశతిముఖః


ప్రవివిక్త భుక్‌ తైజసో ద్వితీయ పాదః ॥


ఆత్మ యొక్క రెండవపాదము తైజసుడు. అదే మానసికస్థితి. ఈ మానసికస్థితికి హిరణ్యగర్భుడని పేరు. ఇతడు అంతర్ముఖమైన చేతన కలవాడు. స్వప్నంలో జరిగే విషయాలను మాత్రమే గ్రహించగలడు.


ఆ తైజసుని ఆత్మ గల పరమేశ్వరి తైజసాత్మికా అనబడుతుంది.


సుప్తా

సుప్తా అంటే ఇంద్రియవ్యాపారము నశించిన నిద్రావస్థ. శివసూత్రాలలో ఇది మాయ, అజ్ఞానము సౌషుప్తము అని ఉన్నది. బాహ్య వస్తువులను గురించిన జ్ఞానము ఏ

మాత్రము ఉండదు. అందుకే నేను సుఖంగా నిద్రపోయాను నాకేం తెలియదు అంటాడు. ఇలా చెప్పటంవల్ల అవిద్యావృత్తులు మూడు ప్రస్ఫుటమవుతున్నాయి. 1. అజ్ఞానము 2. అహంభావము 3. సుఖము. ఈ మూడు వృత్తులు కలది సుషుప్తావస్థ. ఈ అవస్థకు అభిమాని ప్రాజ్ఞుడు.


నిర్వికార స్వరూపస్థితినే సుషుప్తి అంటారు. ఈ అవస్థను సంప్రసాదావస్థ అని కూడా అంటారు. మనస్సు, బుద్ధి కూడా హృదయంలో లీనమయ్యే స్థితి అది.


ఈ స్థితిలో ఇంద్రియాలు, బుద్ధి ముఖ్య ప్రాణంలో కలిసిపోతాయి. ఈ రకంగా మనసు, బుద్ధి కూడా లయమయినప్పటికీ, మెలకువరాగానే తాను సుఖంగా నిద్రించాను అని తెలుస్తోంది. అంటే జ్ఞానము మాత్రము ఉన్నది. ఇక్కడ ఆనందాన్ని పొందుతుంది. కాబట్టి పరమేశ్వరి సుప్తా అనబడింది.


ప్రాజ్ఞాత్మికా

సుషుప్తిలో ఆనందము పొందిన జీవులయొక్క సమిష్టిరూపము కలది ఆ పరమేశ్వరి. ఈ స్థితిలో జీవుడు వ్యష్టిగా ప్రాజ్ఞుడు, సమిష్టిగా ఈశ్వరుడు. ప్రాజ్ఞుడిరూపంలో ఉన్నది కాబట్టి ఆ దేవి ప్రాజ్ఞాత్మికా అనబడుతుంది. మాండూక్యోపనిషత్తులో


నిద్రించినపుడు ఏ కోరికలు, కలలు లేని స్థితి సుషుప్తి. గాఢనిద్ర. ప్రాజ్ఞుడు సుషుప్తిలో సంచారం చేస్తాడు. ఇక్కడ అతని అనుభవాలన్నీ ఏకమైపోతాయి. చేతనాశక్తి అంటే గ్రహణశక్తి అస్పష్టంగా నిలచిపోతుంది. అసలు అతను చేతనుడా ? కాదా ? అని కూడా అనిపిస్తుంది. అటువంటి ప్రాజ్ఞుని ఆత్మగా కలది కాబట్టి ప్రాజ్ఞాత్మికా అనబడుతుంది ఆ పరమేశ్వరి.

 

తుర్యా


ఇది యోగంలో సాధించే స్థితి. మనస్సు, బుద్ధి రెండూ బ్రహ్మరంధ్రం చేరినప్పుడు కలిగే స్థితి, ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైనది. మనస్సు, బుద్దుల

యొక్క మార్పులను బట్టి అవస్థలు మారతాయి.


మనసు బుద్ధి కళ్ళను ఆశ్రయిస్తే - జాగ్రదవస్థ

మనసు బుద్ది మనోగతమైతే -  స్వప్నావస్థ

అవి హృదయగతమైతే - సుషుప్తావస్థ

అవి సహస్రారం చేరితే - తురీయావస్థ


సాధకుడు యోగసాధనలో తురీయస్థితి చేరటము గతంలో వివరించటం జరిగింది. ఈ రకంగా మూడు అవస్థలలోనూ ఉంటూ అన్నింటికీ సాక్షీభూతమైనది కాబట్టే ఆ పరమేశ్వరి తుర్యా అనబడింది.


అందుకే లలితా అష్టోత్తరంలో జాగ్రస్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యైనమోనమః అని చెప్పబడింది.

          

సర్వావస్థావివర్జితా


జాగ్రస్వప్న సుషుప్తులు మూడు అవస్థలు నాల్గవది తురీయావస్థ. ఇక ఐదవ అవస్థ తురీయాతీతము. తురీయాన్ని దాటిన తరువాత సాధకుడు అన్నింటినీ వదలివేస్తాడు.

వివర్జిత - వర్జించినది. విడిచినది. ఒక దాని నుంచి వేరొక దానికి రాలేనిది. పునరావృత్తి లేనిది. ఈ అవస్థ వ్యష్టి సమష్ట్యాత్మకమైనది. తురీయాన్ని గనక గట్టిగాసాధిస్తే,

తురీయాతీతము లభిస్తుంది. ఇదే పరమపదము. తుర్యాతీతము పొందినవాడు శివునితో సమానమగును. ఏ మాత్రము ద్వైతభావము లేనిస్థితి. ఇక్కడ కాలభేదముండదు. అన్ని కాలాలయందు ఆనందమే స్వరూపము. ఇటువంటి సాధకుడు జీవన్యుక్తుడు. దేహేంద్రియాలు ఉన్నప్పటికీ అతడు కర్మలు చెయ్యడు. మాడిపోయి మొలకెత్తటానికి

పనికిరాని విత్తనము వంటివాడు.


అతడు జీవించి ఉన్నప్పటికీ కర్మలు చేయడు. లోకంతో అతనికి సంబంధం లేదు. అతడు పరమేశ్వర స్వరూపుడు.

ఈ రకంగా జీవి యొక్క ఐదు అవస్థలను వివరించటం జరిగింది.

No comments:

Post a Comment