Translate

Wednesday, August 17, 2022

🐍*కుండలినీ శక్తి - శ్రీ సుబ్రహ్మణ్య స్వామి🐍* (Kundalini- SubramnyaSwamy- Telugu NOtes)





🐍*కుండలినీ శక్తి - శ్రీ సుబ్రహ్మణ్య స్వామి🐍*

 

కుండలినీ = పాము వంటి ఆకారము గలది,

కుండలినీ = మూడున్నర చుట్లు చుట్టుకొని సర్పాకారమున నిద్రించునది.

 

 చెవులకు పెట్టుకునే ఆభరణాల్లో కుండలాలు ప్రధానమైనవి. అవి చూడటానికి మండలాకారంలో పాము చుట్ట వలె వుంటుంది.

 

 కాబట్టి - "కుండలము అంటారు. జీవశక్తి - మూలాధార చక్రం దగ్గర  మూడున్నర చుట్లు చుట్టుకొన్న పాములాగా, తోకచేత ముఖాన్ని కప్పుకొని ఉన్నట్టు వుంటుంది కుండలిని అందువలన ఈ జీవశక్తిని గూడా “కుండలినీ శక్తి” అన్నారు.

 

అమ్మవారు కుండలినీ అనే శక్తిరూపంలో మన శరీరంలో ఉంటుంది.కుండలాలు కలది కుండలిని. కుండలం అనగా చుట్ట.అమ్మవారు మూలాధారచక్రంలో గుండ్రంగా ఉండి,మూడున్నర చుట్టలు చుట్టుకొని, తోకను నోట కరిచిపట్టుకొని పడుకొని మంచి గాఢనిద్రపోతున్న పాములాగా ఉండే శక్తిస్వరూపిణి.

 

బాలా మంత్రంలోని మూడు బీజాక్షరాలే ముక్కోణాలనీ, అవి కలిస్తే కుండలిని అనీ, లేదా జ్ఞాన, ఇచ్ఛా, క్రియా శక్తుల కలయికే కుండలిని అని యోగినీ హృదయంలో చెప్పారు.

 

ఇడా,పింగళా మధ్యలో సుషుమ్నా అనబడే నాడి ఉంటుంది.ఈ నాడికి మధ్యలో ఉన్న శక్తిని కుండలినీ అంటారని యోగశాస్త్ర నిర్వచనం.

 

జీవశక్తిః కుండలాఖ్యా-అనగా జీవశక్తిని కుండలినీ అంటారు.మనస్సుని జీవింపజేస్తూ పుర్యష్టకం అనే పేరుతో చక్కని సంపంగి పూలవాసనతో ఉండే దివ్యశక్తి కుండలిని అని చెప్పబడింది.

 

ఈ కుండలినీ శక్తి సమస్త జ్ఞానానికి, సమస్త శక్తి మహిమలకు ఆధారభూతమైన కేంద్రము. దీని వినియోగము తెలియనంత కాలం - ఆది మూడున్నర చుట్లు చుట్టుకొని మూలాధారం దగ్గర  నిద్రావస్థలో వుంటుంది.

 

 వినియోగం తెలిసి, సాధన జరుగుచున్నపుడు - ఇది మేల్కాంచి, సుషుమ్నా మార్గం ద్వారా, ఊర్ద్వ గతిని చరించి, అన్నింటికన్న పైన వున్న సహస్రార కమలాన్ని చేరి, అక్కడ వున్న సదాశివునితో జేరి, సాధకునికి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది.

 

వ్యక్తిలోని కుండలినీ శక్తిని 'వృష్టి కుండలినీ' అంటారు. ఈ వ్యష్టి కుండలినికి - సర్వదేవత అయిన 'సుబ్రహ్మణ్యస్వామి' లేదా 'కుమారస్వామి'ని అధిపతిగా చెబుతారు.

 

 వలయాకారంలో వుండే ఈ కుండలినికి అధిపతి కాబట్టి వల్లీనాధునిగా సుబ్రహ్మణ్య స్వామిని సంకేతిస్తారు.

 

కుండలినీ శక్తి బుద్దికి జ్ఞానంకి కేంద్రం కుమారస్వామి జ్ఞానానికి అధిపది అలాగే ఏదైనా పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి అనుకూలించడం లేదు అని అనుకున్నప్పుడు ఈ సుబ్రహ్మణ్యం స్వామినే ఆరాధించమని చెప్తారు.

 

ఎందుకంటే ఈ కుమార స్వామి బుద్దిని తేజోవంతము చేసే కుండలినికి అధిపతి కనుక మనలో కుండలినీ శక్తిని మనకు ఉపయోగ పడేలా చేయమని వేడుకోవడం

అలాగే సంతానం కోసం గర్భం నిలవడం కోసం కూడా కుండలినికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యం స్వామినే ఆరాధిస్తారు.

 

 అందరూ గురు ముఖంగా చక్రాలు చేదించి ఉపయోగం పొందలేరు అటువంటి వారికి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన పద్ధతుల ద్వారా ఆ పదాల ఉచ్చారణ ద్వారా కుండలినీ లో కదలికలు మొదలై మూలాధారంలో జీవుడికి శక్తి ప్రసరిస్తుంది.

 

 మంత్రం అనేది మనలోని నాడులు మనలోని కుండలినీలో చలనం స్పందన కలిగించే విధంగా అమార్చబడి ఉంటాయి అందుకే ఏది ఎందుకోసమో తెలుసుకొని ఉచ్చారణ చేయాలి.

 

ఇక బ్రహ్మాండానికి వుండే కుండలినీ శక్తిని సమిష్టి కుండలినీ' అంటారు. ఈ సమిష్టి కుండలినికి 'అనంతుడు' లేదా 'ఆదిశేషువు'ను అధిపతిగా చెబుతారు.

 

మనలో కుండలినీ శక్తిని ఎలా కుమారస్వామి అధిపతిగా ఉండి రక్షిస్తున్నాడో అలాగే సృష్టి యొక్క సమిష్టి కుండలినీని ఆదిశేషుడు రక్షణగా ఉంటూ కాపాడతాడు అంటే ఆయనకు అధిపతి అయిన మహా విష్ణువు రక్షణకుడిగా ఉంది కపాడుతుంటాడు సృష్టికి ఆపద వాటిల్లి నప్పుడు మహావిష్ణువు రక్షిస్తాడు.

 

కుండలినీ శక్తి సహజంగా వేడిగా అగ్నితత్వం కలిగినది. ఇడానాడి - చంద్రతత్త్వం, పింగళా నాడి  సూర్యతత్త్వం, సుషుమ్నానాడి అగ్నితత్వం కలిగినవి. ఈ మూడింటిని వరుసగా గంగ, యమున, సరస్వతీ నదులతో సమన్వయిస్తారు.

 

అంటే సరస్వతి  అగ్నితత్వం కలిగినదన్నమాట! దీనిని బట్టి సరస్వతి (వాగ్దేవత), కుండలినీశక్తి - ఒకే తత్వం కలిగినవి. కాబట్టి, కుండలినీ శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తి ఔతుంది.

 

ఈ వాక్కు కూడా జ్ఞానానికి సంబందించినది కుండలినీ సాధకులు యొక్క వాక్కు ఆమోగం వారి మాట వరంగా శాపంగా కూడా మారుతుంది ఎందుకంటే వాగ్దేవత వారికి సాధన ద్వారా వాకేసుద్ది ని ప్రసాధిస్తుంది.

 

 నిత్యం సంస్కృత శ్లోకాలు పఠించే వారికి కూడా వాకేసుద్ది లభిస్తుంది సంస్కృతం లోని ప్రతి అక్షరం బీజమే వాటికి అధిపది సరస్వతి రూపం లో ఉన్న అమ్మవారు ఈ సరస్వతి అగ్నితత్వం తో కుండలినిలో నివసిస్తుంది.

 

ఈ సంస్కృత శ్లోకాలు పఠనం వల్ల ఆ శక్తి మనలోని మలినాన్ని తొలగించి పాసిటివ్ ఎనర్జీ ని కాస్మిక్ ఎనర్జీ ని ఆకర్షిస్తుంది దానివల్ల పఠించే వారికి వాక్ శుద్ది పుష్కలంగా లభిస్తుంది.

 

ఓం నమః శివాయ:

ఈ వాక్కుకు సంబంధించిన బీజాక్షరం “ఐం', దీన్ని 'వాగ్భవబీజం' అంటారు. ఈ బీజాక్షరంలో వున్న అక్షరాలను విడదీస్తే 'ఐం=అ+ఏ+మ్' అవుతుంది. '' అనే అచ్బును మళ్ళీ విడదీస్తే 'ఏ=అ+ఇ' అవుతుంది.

 

కాబట్టి 'ఐం' లో ',,,మ్' అక్షరాలు వుంటాయి. వీటిలో మూడు అక్షరాలు పూర్తిగా వున్నాయి కాబట్టి - మూడు పూర్తి చుట్లను, చివరిదైన 'మ్' (మవర్ణము) సగమే వుంది కాబట్టి - సగం చుట్టును సూచిస్తుంది.

 

 'ఐం' అనే కుండలినీ శక్తిలో మూడున్నర చుట్లు వున్నాయి అనడంలో ఔచిత్యం ఇదే! ఇది మంత్ర శాస్త్రపరమైన సమన్వయం.

ఇట్లు మూడున్నర చుట్లు గలది "కుండలినీ" అగును. ఈ కుండలినీ శక్తికి, కుటిలాంగీ - భుజంగీ - శక్తి - ఈశ్వరీ - అరుంధతీ - కుండలీ అనే నామాంతరాలు కలవు.

 

జీవి మానవ జన్మను పొందకపూర్వం- ఖనిజస్థితి (Mineral state), వృక్షస్థితి (Plant state), జంతుస్థితి (Animal state)కి సంబంధించిన కక్ష్యలను - దాటడం జరిగింది.

 

 కాబట్టి మూడు పూర్తి కక్ష్యలు పూర్తయినట్లు లెక్క ఇక మానవ జన్మను పొందినందుకు మాత్రం సగం చుట్టు గూడా పూర్తవుతుంది. మానవ జన్మను పొందినంత మాత్రాన పూర్తి చుట్టు పూర్తవదు.

 

ఆ జన్మను పొంది, తన సాధన ద్వారా మిగిలిన సగం చుట్టును గూడా పూర్తి చేసుకుంటే - నాలుగు రకాల కక్ష్యలను దాటి జీవన్ముక్తుడౌతాడు. అంటే పూర్తికావలసిన సగం చుట్టు - యోగ సాధన ద్వారా పూర్తి కావాలి.

 

ఈ విషయాన్ని తెలియచెయ్యడం కోసమే జీవశక్తి అయిన కుండలిని - మానవులందరిలో ‘మూడున్నర చుట్లు చుట్టుకొని వుంటుంది' అనడం. ఇది జీవపరిణామ శాస్త్రసమన్వయం.

 

కుండలినీ కి మరో పేర్లు

1. కుటిలాంగి

2. శక్తి

3. కుండలిని

4. కుండలి

5. భుజంగి

6. ఈశ్వరి

7. అరుంధతి.

ఈ ఏడు పేర్లు కుండలినికి నామాంతరాలు.

 

వివిధ పురాణాలలో కుండలినీ గురించి..

 

తంత్రరాజంలో కుండలిని గురించి ఈ విధంగా ఉంది.

 

మూలాధారంలో అగ్ని తేజస్సు మధ్యన ఉన్నదై జీవశక్తి తేజోరూపమైన ప్రాణాకారము కలది, సర్పాకారంలో మూడు చుట్టలు చుట్టుకుని నిద్రిస్తూ ఉంటుంది.

 

సుషుమ్న మధ్యలో మాయాశీర్షముపై నుండి బుసకొడుతూ ఉంటుంది. చెవులు మూసుకుని ఎవరు ఆ ధ్వనిని వినలేడో, అతడికి త్వరలో మృత్యువు ప్రాప్తిస్తుంది, అని ఉన్నది.

 

దేవీపురాణంలో కుండలినీ శక్తిని గురించి చెబుతూ

 

యత శృృంగాటకాకారా కుండలి న్యుచ్యతే తతః

 

అన్నారు అంటే - కుండలినీ శక్తి శృంగాటకాకారము గలది. శృంగాటకము అంటే త్రికోణము అని అర్ధం. ఇచ్చా జ్ఞానక్రియాశక్తులే శృంగాటకము అని యోగినీ

హృదయం చెబుతోంది.

 

మూలాధారంలో భుజంగాకారంలో చుట్టలు చుట్టుకుని తేజోరూపంలో ప్రకాశించేదే కుండలిని. పంచదశీ మంత్రానికి వాగ్బీజమే కుండలిని.

 

మేరుదండానికి చివర

మూలాధారానికి దగ్గరగా యోనికమునందు అగ్ని తేజస్సుతో ప్రకాశించే జీవశక్తికి కుండలిని అని పేరు. ఇది సర్వశక్తులకు, సమస్త జ్ఞానాలకు మూలమైనది. అజ్ఞానదశలో ఈ శక్తి నిద్రాణమై ఉంటుంది. జ్ఞానదశలో అది జాగృతమై సాధకుడికి సర్వశక్తులు ప్రసాదిస్తుంది.

సాధన ద్వారా ఈ శక్తిని సహస్రారానికి చేర్చాలి.

 

మూలాధారమందు ఆత్మ తేజస్సు వహ్నిరూపమై ఉండును.  ఆ తేజోమధ్యమందు కుండలమను జీవశక్తి గలదు. అది తేజోమయము, ప్రాణాధారము అయినది. మూడున్నర చుట్టలు చుట్టుకొని పరుండిన పామువలె ఉండి, మిక్కిలి కాంతిగలదై యుండును. దానికి మాయయే శిరస్సు. అది ఎల్లప్పుడు ధ్వనించుచుండును.కుండలినీ శక్తి సుషుమ్నా నాడీ మధ్యప్రదేశమందు  ఉండును.

 

రుద్రయామళంలో కుండలినీ స్తుతి చేస్తూ...

 

జన్మోద్ధార విరక్షిణీ హ తరుణీ వేదాది బీజాదిమా

నిత్యం చేతసి భావ్యతే భువి కదా సద్వాక్య సంచారిణీ

మాంపాతు ప్రియదాస భావకపదం సంఘాతయే శ్రీధరే

ధాత్రి ! త్వం స్వయ మాదిదేవవనితా దీనాతిదీనం పశుమ్‌ ॥

 

ఓ పరత్పరీ ! శివుని అర్థాంగి అయిన ఓ పార్వతీ ! నువ్వు సర్వకాల సర్వావస్థల యందు ఉపనిషద్వాక్యముల యందు సంచరిస్తుంటావు. నీవు నిత్యయవ్వనవు. మమ్ములను ఉద్ధరించటానికి సదా మెలకువతో ఉంటావు. అట్టి నిన్నునేను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తాను.

 

 

కుండలిని వ్యక్తిలోనిది కావడం చేత "వ్యష్టికుండలిని" అంటారు. ఈ వ్యష్టికుండలినికి అధిదేవత జగన్మాత.  

బ్రహ్మాండానికి ఉండే కుండలినీ శక్తిని "సమిష్టికుండలిని" అంటారు. దీనికి అధిదేవత ఆదిశేషువు లేదా అనంతుడు.

 

కుండలిని (సుబ్రహ్మణ్యేశ్వరుని స్వరూపం) సర్పాకారంలో మూలాధారంన ఉంటుంది. పృథ్వీతత్వము గలది. అధిదేవత గణపతి.

 

అమ్మ (కుండలినీ శక్తి) అక్కడకు వెళుతుంది. అయ్యవారితో ఉంటుంది, తన అగ్నితత్వంతో అక్కడ చల్లదనానికి ఘనీభవించిన సుధా ధారలను కరిగించి సాధకునిపై కురిపించి, సాధకుని జన్మచరితార్థము చేయుచున్నది.

 

 అంతటితో ఆ సాధకుడు తనకు కావలసింది తనకు లభించిందని అన్ని ఆనందములకూ పరాకాష్ఠ అయిన బ్రహ్మానందాన్ని పొందుతాడు.

 

సిద్దార్థీ నిజదోషవిత్‌ స్థలగతి ర్వ్యాయీయతే విద్యయా

కుండల్యా కులమార్గ ముక్తనగరీ మాయా కుమార్గా శ్రియా

య ద్యేవం భజతి ప్రభాతసమయే మధ్యాహ్నకాలే థవా

నిత్యం యః కులకుండలీ జప పదాంభోజం స సిద్ధో భవేత్‌ ॥

 

దేవీ ! కుండలినీ శక్తిగా ఉన్న నీ పాదాలను త్రిసంధ్యలయందు ధ్యానించేవారు సిద్దులవుతారు.

 

పాము ఆకారము గలది. వాగ్భవ బీజ స్వరూపురాలు - అని ఈ నామానికి అర్ధాలు చెప్పుకోవచ్చును.

 

ఈ కుండలినియే ప్రాణశక్తి రూపిణియై సర్పాకారంగా సహస్రారం నుండి మూలాధారం వరకు అనగా యోని కందం వరకు తలక్రిందులుగా మూడున్నర మెలికలి తిరిగి ఉన్నది అనియు, సుబ్ధావస్థలో ఉన్నది అనియు, మేరు దండమును (వెన్నెముక) ఆశ్రయించి ఉన్నది అనియు మొదలైన విషయాలు వెనుక వివరింప బడినవి. "కుండలినీ” సిద్దులై శ్రీదేవి కరుణను పొంది తరింతురు గాక!

 

బిందువు కాంతితో ప్రకాశ అంశగా , సదాశివుడుగా,  కాంతి నాద అస్తిత్వమై , మిశ్రమ అవ్యక్త బిందువు వ్యక్త ప్రకృతిగా ప్రకటమైన ఆ తల్లి తిరిగి ఊర్ధ్వ ప్రయాణంలో సదాశివుడిని ఐక్యం చేసుకొని బిందువు గా మారుతున్నది. జీవితం అంతా శక్తి రూపాంతరమే అనే సత్యం తెలుసుకోకపోతే అంతా మాయగానే కనపడుతుంది.

 

ఆ తల్లి ఈ శరీరంలో జీవ శక్తిగా కుండలిని రూపంగా నాడు లలో ప్రవహిస్తూ నిత్యం మనను శాసిస్తూ ఉంది.

 

ఆ తల్లి ఒడిలో చేరితే సమస్త శక్తులు మన అధీనం లోనికి వస్తాయి. లేకపోతె అవే శక్తులు మనలను సాధిస్తాయి.

 

ఈ అంతర్యాగం లేకపోతె సదాశివునితో మొదలైన ఆమె ప్రకృతి వికృతిగా మారి విశ్వ పదార్థ పరిణామ చక్రంలో ప్రవేశిస్తుంది. ఇదే జీవికి మరణం. అది వచ్చే లోపు మనం సాధనతో ఆ తల్లి ఒడిలో చేరాలి.

 

మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కనుక మనం ఎప్పుడూ ఆ  తల్లి ఆరాధనలోనే ఉండాలి!

 

గోళాకారముగా సృష్టి నిర్మాణము గావించి, అందుండి అండాకారములుగా బ్రహ్మాండము నుండి పిండాండము వరకు సృష్టి నిర్మాణము చేయునది శ్రీలలిత అని అర్థము. మూలాధారమందలి అగ్ని తేజస్సు యందు ఉన్న జీవశక్తి కుండలినే.

 

తేజోరూపమైన ప్రాణాకారము కలిగి సర్పమువలె మూలమున స్థితిగొని యుండి, సుషుమ్న మార్గమున సహస్రారము వరకు వ్యాపింపగల తేజస్విని కుండలిని. ప్రాణుల యందలి జీవచైతన్యమే కుండలిని. ఈ కుండలినీ మార్గము సృష్టియందు సత్యలోకము నుండి భూలోకము వరకు తీగవలె చుట్టలు చుట్టలుగా వ్యాపించి యుండును.

 

భూమండలము, సూర్యమండలము, సవితృ మండలము, భర్గోదేవ మండలము వ్యాపించి సర్వమును నిర్వర్తించుచు నుండును. వాక్కు రూపమున ఉద్భవించునది కనుక వాగ్భవ అని కూడ కుండలినీ చైతన్యమును పిలుతురు. జీవ చైతన్యము ఏ లోకమున స్థితి గొనినదో ఆ లోకము వరకు వ్యాపించి కుండలిని యుండును.

 

మానవునియందు భౌతిక, ప్రాణమయ, మనోమయ కోశముల యందు వ్యాపించి, విజ్ఞానమయపు అంచుల వరకు కుండలినీ చైతన్యమున్నదని తెలుపుదురు. కారణము ఏమనగా మానవునికి భౌతికము, ప్రాణమయము, మనోమయము అగు లోకములు అవగతమై ఉండుటయే.

 

కొంత బుద్ధికూడ ప్రతిమానవునియందును ఉండుటచే, మూడున్నర చుట్టలుగా కుండలినీ చైతన్యమున్నదని అందురు. బుద్ధిలోకమున ప్రవేశించిన వారికి కుండలిని నాలుగు చుట్టలుగా ఉండును.

 

అట్లే ఆనందమయ లోకమున ఐదుగను, అనుపాదక లోకమున ఆరుగను, ఆదిలోకమున ఏడుగను చుట్టలు గలిగి యుండును. ఏడు చుట్టల కుండలినీ చైతన్యము వ్యాపించినపుడు, సహస్రారమందలి శివతత్త్వముతో చేరినప్పుడు, సుస్థిరురాలై యుండును. కుండలినీ చైతన్యము ఊర్ధ్వగతి చెందుట యనగా జీవుడు పరిణతి చెందుటయే.

 

కుండలినీ పూర్తి సంపూర్ణ వివరణ:-

 

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది.

 

మూలాధారంలో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ.

 

 కుండలినీ యోగలో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.

 

శక్తి రెండు రకాలుగా ఉంటుంది....

 

 ఒకటి స్థితి శక్తి (Potential Energy),

 

రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy).

 

 శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది.

 

 

 

 

 

యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసుకోవచ్చును.

 

కామ,

క్రోధ,

లోభ,

మోహ,

మద,

మాత్సర్యాలనే  " అరిషడ్వర్గాలను " జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

 

కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు ....

è దేహ శుద్ధి (purification of body),

è నాడీ శుద్ధి (purification of nadis/nervous system),

è మనో శుద్ధి (purification of mind),

è బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి.

 

 నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు.

 

 

 

 

 

 

 

 

 

 

ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.

 

చక్రాలు :-

 

వెన్నెముక లో ఉండే చక్రాలు

ప్రధాన వ్యాసము : సప్తచక్రాలు

షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.

 

1)మూలాధార చక్రము (Mooladhara) :-

 

గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం "లం".

 

 మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

 

2)స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) :-

 

 లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం "వం".

 

3)మణిపూరక చక్రము (Manipura) :-

 

 నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.

 

4) అనాహత చక్రము (Anahatha) :-

 

హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం "యం".

 

5) విశుద్ధి చక్రము (Vishuddha) :-

 

కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం "హం".

 

6)ఆజ్ఞా చక్రము (Ajna) :-

 

భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం.

 

7) సహస్రార చక్రము (Sahasrara) :-

 

 బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. బీజాక్షరం "ఓం".

 

సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది.

దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

 

సప్తచక్రాలు :-

 

శ్రీ విద్య లోను, వివిధ తంత్రముల లోను చెప్పిన ప్రకారము మానవునియందు ఏడు చక్రము లుండును.

 

 మూలాధార చక్రము :-

**

 

పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది.

 

నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది.

 

 ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

 

మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది.

 

ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ “స” కార సంబంధముగా ఉంటాయి.

 

514 నుండి 519 వరకూ గల నామములు “సాకిన్యంబ”ను వర్ణిస్తాయి.

 

 నామములు :-

""'''''"'''''''''''''''''''''''''""

 మూలాధారామ్భుజారూఢ,

 పంచవక్తాృయ,

 ఆస్ధిసంసితాయ,

అంకుశాది ప్రహరణాయ,

 వరదాది నిషేవితాయ,

 ముద్గౌదనాసక్తాయ.

 మూలాధారస్ధపద్మే,

 శృతి దళలసితే,

 పంచవక్త్రాం త్రినేత్రాం,

 ధూమ్రాభా,

 మస్ది సంస్దాం

  సృణి మపి

 కమలం పుస్తకం

 జ్ఞానముద్రాం

 బిభ్రాణం   బాహుదండైస్సులలిత వరదా

 పూర్వ శక్త్యన్వితాoతం

ముద్గాన్నాసక్త చిత్తాం

 మధుమదముదితాం

సాకినీ భావయామి.

 

మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము.

 

ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది.

 

 ఈమెకు ఐదు ముఖములు....

 శబ్దము,

 స్పర్శ,

 రూపము,

 రసము,

 గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి.

 

గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది.

 

ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది.

 

 

 

 వజ్రేశ్వరి :-

""""""""""""""

ఈ దేవతకి నాలుగు చేతులు...

 అంకుశము,

 కమలం,

 పుస్తకము,

 జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.

 

సాకిన్యాంబ వరదాది దేవతలు  :-

 

 1. వరద

 2. శ్రియ

 3. షండా

 4. సరస్వతి

 

(  o, o, o, o అను మూలాక్షరాల ) దేవతలచే కొలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.

 

   స్వాధిష్ఠాన చక్రము :-

*

 

లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.

 

ఐం హ్రీం శ్రీం కాం సోహం స్వాధిష్టానదేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః

 

ఈ స్వాధిష్ఠాన కమలం ఆరు దళాలుగల జలతత్త్వం కలది. అధిదేవత "కాకిని".

 

    ఈమె బం, భం, మం, యం, రం, లం అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం మొసలి.

 

'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా  దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ  మేధో దాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి. 

స్వాధిష్టానం

 (స్వ + అధిష్టానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవమునకు తీసుకొచ్చే చక్రమిది.

 

జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రాణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు ప్రాణశక్తినిచ్చే చక్రమిదే.  జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది.

 

ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి తోడ్పడుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని విసర్జక వ్యవస్థతో సంబంధం.

 

 జ్ఞానేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది. పునరుత్పత్తి కి సహాయకారి.

 

    దీనిలోశక్తి  చైతన్య రూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది.

 

  మణిపూరక చక్రము :-

*

 

నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము.

 

  లాకిన్యంబాస్వరూపిణి :-

"""""""""""""""""""""""""""

6 నామాములు / 3 వ చక్రము .

 

(495) నుండి (502) వరకూ నామములు :-

 

 మణిపూరాబ్జనిలయ,

 వదనత్రయసంయుతా,

 వజ్రాధికాయుధోపేతాయ,

 డామర్యాదిభిరావృతాయ,

 రక్తవర్ణాయ,

 మాంసనిష్టాయ,

 గుడాన్నప్రీతాయ,

 సమస్తభక్త సుఖదాయ ,

 దిక్పత్రే,

 నాభిపద్మే,

 త్రివదన విలస ద్దంష్ట్రిణీం,

 రక్తవర్ణాం,

 శక్తిం ,

 దంభోళి ,

 దండావ భయమపి,

 భుజైర్దారయంతీo ,

 మహోగ్రాం ,

 డామర్యాద్త్యై: ,

 పరీతాం ,

 పశుజన భయదాం,

 మాంసధాత్వేక నిష్టాం,

 గౌడన్నసక్త చిత్తాం ,

 సకల సుఖకరీం ,

 లాకినీమ్ ,

 భావయామి:

 

నాభిస్తానము వద్ద గల మణిపూరచక్రమున వసించునది.

 

పది దళముల పద్మము, బీజాక్షరాలు సంస్కృతములోని “డ” నుండి “ఫ” వరకు గల అక్షరాలు.

 

గర్భస్తశిశువు మూడవ మాసములో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగును.

 

మూడు ముఖములు కలది....

 గర్భస్ధ శిశువుకి నోరు, ముక్కు, కళ్ళు ఏర్పడతాయి.

 

నాలుగు చేతులు కలది.....

వజ్రం,

శక్తి,

దండము,

అభయ ముద్రలు ధరించింది.

 

 డామరము ఆది దేవతలచే పరివేష్టించబడింది. ఈ సమయములోనే శిశువు శబ్దాలకి ప్రతిస్పందన చూపిస్తాడు.

 

ఎరుపు వర్ణము కలది. మాంస ధాతువుని ఆశ్రయించేది. బెల్లంతో చేసిన పాయసం, చక్రపొంగలి లాటి వానిపై ఇష్టం కలది.

 

అన్నిరకముల భక్తులకీ సుఖసంతోషములు కలిగించేది ఈ లాకిన్యాంబ రూపిణి.

 

  మణిపూరక చక్రం మంత్రం :-

"""""""""""""""""""""""""""

 ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః”

 

  మణిపూరకచక్రం :-

"""'"""""""""""""""""""""""

 

ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత "లాకిని".

 

ఈమె .....

o, o, o, o, o, o, o, o, o, o అను యోగినులచే ఆరాధింపబడుచున్నది.

 

 వాహనం పొట్టేలు.

 

 'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి.

 

బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.

 

ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది.

 

ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం.

 

శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక.

 

పుట్టుట,

జీవించుట,

మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి.

 

అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది.

 

ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి.

 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే ...

 అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాధులుకు కారణమౌతుంది.

 

నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి.

 

 

తన గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం.

 

 తెరుచుకుంటే .....

 లక్ష్యసాధన,

 ఆశయసిద్ధి,

 వ్యవహార దక్షత,

 ఉత్సాహం,

 ధనాపేక్ష,

 తన్ను తాను గౌరవించుకోవడం,

 ఆత్మవిశ్వాసం కల్గివుండడం,

 జీవితంలో అన్నింటా ముందడుగు.

 

ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి  చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి.

 

మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.

 

లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి.

 

ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.

 

మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవడం?

 

ఈ చక్రమునకు "లాకిని" దేవత.

 

 సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి.

 

ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు.

 

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే అనుభూతులను  ( ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి.

 

దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. అలాగే ఈ చక్రానికి అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి.

 

 సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది.

 

అదే మాదిరిగా నవగ్రహాలలో ....

 

 గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వాన్ని అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.

 

శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలది.

 

తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా!

స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్!

తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్!

నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం!!

 

మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారాన్ని పోగొట్టు మెరుపుతో గూడినది.

 

 నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును.

 

 

అనాహత చక్రము  :-

**

 

హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము.

 

రాకిన్యాంబస్వరూపిణి

- (494) (9 నామములు) (4 వ చక్రము)

అనాహతాబ్జనిలయ, శ్యామాభాయ, వదనద్వయ, దంష్ట్రోజ్జ్వలాయ, అక్షమాలాదిధరాయ, రుధిరసంస్దితాయ, కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయ, స్నిగ్ధౌదనప్రియాయ, మహావీరేంద్రవరదాయ. (485 నుండి 493 వరకూ గల నామములు)

 

హృత్పద్మే, భానుపత్రే, ద్వివదన లసితాం, దంష్ట్రిణీం, శ్యామవర్ణామ్

చక్రం, శూలం, కపాలం, డమరుపి భుజైర్ధారయంతీ త్రినేత్రాం

రక్తస్దాం కాళరాత్రి ప్రభ్రుతి పరివృతాం, స్ధిగ్న భక్తైక సక్తాం

శ్రీమద్వీరేంద్ర వంద్యా మభిమత ఫలదాం, రాకినీ, భావయామః

 

ఈమె నలుపురంగులో ఉన్నది, రెండు వదనములు ఉన్నాయి. ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది. శిశువు 2 వ మాసములో రెండవ రంధ్రము ఏర్పడుతుంది. రెండు కోరలతో ప్రకాశించునది. ‘అ’ కారాది, ‘క్ష’ కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది. నాలుగు చేతులలో అక్షమాలా, శూలము, కపాలము, డమరుకము, దరించునది. అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఆమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. అనాహతమునకు 12 దళములు. వీటిని ‘క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలచే కొలవబడింది. కాళరాత్రి మొదలగు దేవతలు. నేతితో తడిసిన అన్నము అనిన ప్రీతి కలది. మహావీరుల కోరికలు తీర్చేది. రాకిణీ దేవత సంబంది బీజాక్షరములు, కీలక, న్యాస మంత్రములు అన్నీ ‘ర’ కారము సంబంధమైనవి.

 

క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలు "ద్వాదశ శక్తులు". అవి...

o,o,o, o,o, o,o,జం'ఝం'ఞం'o,o.

 

1. కాళరాత్రి

2. ఖాతీత,

3. గాయత్రి

4. ఘంటాధారిణి

5. జామిని

6. చంద్రా

7. ఛాయా

8. జయా

9. ఝుంకారి

10. జ్ఞానరూప

11. టంకహస్తా

12. ఠంకారిణి

 

   విశుద్ధి చక్రము :-

*

 

కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము.

 

  డాకినేశ్వరి :-

""""""""""""""""""

 (5 వ చక్రము) విశుద్ధి చక్ర అధిష్టానదేవత “డాకిని”.

 

(475 నుండి 483 వరకూ డాకిని దేవత లక్షణాలు వర్ణించబడినవి.)

 

 ఆరక్తవర్ణాయ,

 త్రిలోచనాయ,

 ఖట్వాంగాది ప్రహరణాయ,

 వదనైకసమన్వితాయ,

 పాయసాన్నప్రియాయ,

 త్వక్ స్ధాయ,

 పశులోకభయంకరాయ,

 అమృతాధి ,

మహాశక్తిసంవృతాయ.

(8 నామములు)

 

గ్రీవాకూపే,

విశుద్దే,

నృపదళకమలే,

శ్వేతరక్తాం,

త్రినేత్రాం

 

హస్తే :-

"""""""""

ఖట్వాంగ,

ఖడ్గౌ,

త్రిశిఖమపి,

మహాచర్మ

సంధారయంతీమ్

వక్త్రేణేకేనయుక్తాం,

 పశుజనభయదాం,

 పాయసాన్యైక సక్తాం

త్వక్ద్సా వందేహమృతాద్యై:

 పరివృతవపుషాం,

డాకినీo,

వీరవంద్యామ్.

 

డాకినీ దేవత బీజాక్షరాలు, కీలక, న్యాస మంత్రాలు అన్నీ “డ” కార సంభందమైనవి.

 

 డాకినీ వర్ణము ఎఱుపు.ఈమె ఎఱ్ఱని ఎఱుపు కాదు. తెలుపు కలసిన ఎరుపు.

 

జీవి పిండ దశలో ‘శుక్ల + రక్త “ సమ్మేళనంతో బిందురూపముగా ఉండును. పదిహేను రోజుల పిదప బుడగ రూపము చెంది, నెలాఖరుకి గట్టిపడి, 45 రోజులకి పిండాకృతి పొందుతుంది.

 

ఈ పిండ స్థితి డాకినీ స్థితి. ఈమె త్రిలోచన .....

భూత,

భవిష్యత్,

వర్తమానాలు చూడగలది.

 

 ఖట్వాంగము,

ఖడ్గము,

త్రిశూలము,

చర్మము ఆయుధములుగా గల దేవత.

 

  బీజాక్షరములు :-

"""""""""""""""""""""""

అం,ఆం,ఇం,ఈం,ఉం,ఊం,ఋం,ౠం,ఎం,ఏం,ఐం,ఒం,ఓం,ఔం,అం,అఃం....

 

హాకినీరూపధారిణి :-

""""""""""""""""""""""""""""

 6 నామములు / 6 వ చక్రము...

 

 521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి.

 

 ఆజ్ఞాచక్రాబ్జనిలయా,

శుక్లవర్ణా,

షడాననా,

మజ్జాసంస్దాయ,

హంసవతీ

ముఖ్యశక్తి

సమన్విత,

హరిద్రాన్నైకరసిక.

భ్రూమధ్యే

బిందుపద్మే

దళయుగ కలితే,

శుక్లవర్ణాం,

కరాబ్జైమ్

విభ్రాణాo

జ్ఞానముద్రాం,

డమరుకమలా,

మక్షమాలాం,

కపాలం

షట్చక్రాధారమధ్యామ్,

 త్రినయన లసితాం,

 హంస వత్యాది యుక్తాం,

హరిద్రాన్త్యైక సక్తాం,

 సకలశుభకరీం,

 హాకినీం భావయామః

 

  ఆజ్ఞా చక్రము :-

*

 

 భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము.

 

దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని.

 

 ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే.

 

ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది.

 

    ఆజ్ఞా చక్రము  :-

"""""""""""""""""""""""""

 

భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము.

 

హాకినీరూపధారిణి :-

""'""""""""""""""""""""""""""""

6 నామములు / 6 వ చక్రము....

 

521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి.

 

 ఆజ్ఞాచక్రాబ్జనిలయా,

శుక్లవర్ణా,

షడాననా,

మజ్జాసంస్దాయ,

హంసవతీ

ముఖ్యశక్తి

సమన్విత,

హరిద్రాన్నైకరసిక.

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే,

శుక్లవర్ణాం,

కరాబ్జైమ్ ,

విభ్రాణాo జ్ఞానముద్రాం,

 డమరుకమలా,

మక్షమాలాం,

కపాలం

షట్చక్రాధారమధ్యామ్,

 త్రినయన లసితాం,

హంస వత్యాది యుక్తాం,

హరిద్రాన్త్యైక సక్తాం,

 సకలశుభకరీం,

హాకినీం భావయామః

 

ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది.

 

ఇది రెండు దళముల పద్మము.

 

   బీజాక్షరములు :-

"""""""""""""""'""""""""""

 o’ ‘క్షo’ .

 

 హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మము ని ఆశ్రయించారు.

పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.

 

 సహస్రార చక్రము :-

*

 

బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. బీజాక్షరం "ఓం ".

 

సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు.

 

 ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

 

  యాకిన్యంబస్వరూపిణి :-

"""""""""""""""""""""""""""""""""""""

 

 6 నామములు / 7 వ చక్రము ...

 

528 నుండి 533 వరకూ నామములు ఈమెను తెలెయ చేస్తాయి.

 

(సహస్త్రదళ పద్మస్ద, స్వర్ణవర్ణోపశోభిత, సర్వాయుధధర, శుక్లసంస్దితా, సర్వతోముఖ, సర్వోదనపీతిచిత్తాయ)

 

ముండవ్యోమస్ధ పద్మే దశశతదళకే కర్ణికా చంద్రసంస్దామ్

రేతో నిష్టాం, సమస్తాయుధ కలితకరాం, సర్వతోవక్త్రపద్మాం

ఆది క్షాన్తార్ణశక్తి ప్రకట పరివృతామ్ స్వర్ణవర్ణాం భవానీం

సర్వాన్నాసక్తచిత్తామ్, పరశివరసికాం యాకినీ భావయామః!!

 

శిరస్సు మధ్యభాగములో సహస్త్రాకార చక్రము ఉంటుంది. ఇది వేయి దళములు కలది.

 

 యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత.

 

7వ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల....

 వర్ణములు,

 రంగులు,

 అక్షరములు,

 విద్యలు,

 ధ్వనులు,

 బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది.

 

 ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది.

 

 ఈమె సర్వతోముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది.

 

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు.

ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు.

 

ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే "అద్వైతస్థితి".

 

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ...,

 

అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ...,

 

 స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును... వ్యక్తం చేయును.

 

తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే.

 

రజస్సు వలన శరీరం లోని వివిధ అవయములు పనిచేయుచున్నవి.

 

సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును.

 

ఈ మూడును మూడు లోకములుగా అంటే .....

భూలోకం (తమస్సు),

భువర్లోకం (రజస్సు),

సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.

 

  సహస్రారచక్రం :-

"""""""""""""""""""""""

 

సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ!!

 

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది.

అధిదేవత యాకిని.

 

అ కారాది క్ష కారంత వర్ణమాల యోగినీ గణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి.

 

మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం "విశ్వాత్మ" నివాస స్థానం. "పరమాత్మ స్థానం".

 

ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మ సాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం.

 

ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం.

 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - షట్చక్రాలు బలహీనపడతాయి.

గ్రహణశక్తి లోపిస్తుంది.

భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు.

 కష్టదుఃఖాలు పొందుతుంటారు.

పునర్జన్మలు తప్పవు.

 

  ఈ చక్ర మానసిక స్వభావం :-

"""""""""""""""""""""""""""

 ఈ చక్రం జాగృతయితే....

 

సాధకుడు అమరుడౌతాడు.

పరమాత్మగా వ్యక్తమౌతాడు.

తనను తాను తెలుసుకుంటాడు.

ఇది ఈశ్వరీయత స్థితి. "ఈశ్వరత్వం" పొందుతారు.

 

ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే :-

 

తలపు,

మాట,

చేత యోగ్యంగా త్రికరణ శుద్ధి వుండాలి.

 

క్రమశిక్షణ,

ఆచరణ,

విశ్వాసం కలిగియుండాలి.

 

ధ్యానం,

బ్రహ్మతత్త్వజ్ఞానం,

స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం)

ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి.

 

ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు ఆనంద నందనవనములు అవుతాయి.

 

ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి.

 

 అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్ని చక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి.

 

క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం.

 

 కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్థించాలి.

 

ప్రార్థన అంటే... దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును "ఇహం" నుండి "పరం" వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధం చేసుకొని, "దేహమే దేవాలయమని", "అంతరాన్నే అంతర్యామి" కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్థన, సాధనలు చేయాలి.

 

ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించు కోగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

 

ఈ కుండలిని సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు "'అహంబ్రహ్మాస్మి'" అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును.

 

అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. ఈవిధంగా సరైన రీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేస్తే సాధనతో... స్థూలం నుండి సూక్ష్మము, ప్రజ్ఞామయం వరకు పయనించి '"అహం బ్రహ్మస్మి"' అన్న స్థితిని పొందడమే మానవ జీవన పరమావధి.

 

(సేకరణ..ఆదిత్యనారాయణ...తిప్పానా)


No comments:

Post a Comment